-
నేడు కృత్రిమ మేధపై ప్రత్యేక శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జూమ్ వర్చువల్ వేదికగా ‘డిజిటల్ యుగంలో ఏఐ, తెలుగు భాషాభివృద్ధి–ఆవశ్యకత–అవకాశాలు’ అంశాలపైన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథి ప్రసంగం చేస్తారని, ప్రాజెక్ట్ ఇండిక్ వికీ ప్రోగ్రామ్ మేనేజర్ కశ్యప్, సీఐఎస్–ఏ2కే ప్రోగ్రామ్ మేనేజర్పవన్ సంతోష్ ప్రధాన వక్తులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. డిజిటల్ యుగంలో ఏఐ, తెలుగు భాషాభివృద్ధి తదితర అంశాలపైన ఆసక్తిగల వారు ఈ వర్చువల్ కార్యక్రమంలో ‘జూమ్ మీటింగ్ ఐడీ 99981156774, పాస్వర్డ్ 747591’తో పాల్గొనవచ్చని తెలిపారు. ఇళ్ల వద్దకే వచ్చి తీసుకెళ్తారు.. సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని భవనాల నిర్మాణ, కూల్చివేతల (సీఅండ్డీ) వ్యర్థాలను జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన ఏజెన్సీలు ప్రజల ఇళ్ల వద్దకే వచ్చి తీసుకెళ్తాయని కమిషనర్ రోనాల్డ్రాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత టోల్ఫ్రీ పోన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లతో పాటు జీహెచ్ఎంసీ వెబ్సైట్, మై జీహెచ్ఎంసీ యాప్ల ద్వారా కూడా నిర్ణీత ఫీజు చెల్లించి ఈ సేవలు పొందవచ్చునని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ సీఅండ్డీ వ్యర్థాలు వేయకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాల ఆటకట్టు
గచ్చిబౌలి: సైబరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం మోపుతున్నారు. సోమవారం ఒకే సారి ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు మియాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి, జీడిమెట్ల, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కూకట్పల్లికి చెందిన పొందూరి సురేష్ ఐపీఎల్ మ్యాచ్లపై ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా సురేష్తో పాటు వికారాబాద్కు చెందిన ఫంటర్ మోత్కుపల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేశారు. రామంజనేయులు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రధాన నిర్వాహకుడు రామంజనేయులు 350 మంది పంటర్ల ద్వారా రూ.4.5 కోట్లు బెట్టింగ్లు స్వీకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.30,07,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకుల్లో రూ.49,92,539 సీజ్ చేశారు. నాలుగు స్మార్ట్ ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. మల్లంపేటలో.. దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్లో లచ్చుపతుల చిన్న బాబు, చెన్నంశెట్టి కరిముల్లా షేకదారి, పనమటి వెంకటేష్, దొండ రమేష్ అనే వ్యక్తులు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శంషాబాద్ పోలీసులు దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,19 లక్షలు సీజ్ చేసి, రూ.2,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. గోకుల్ప్లాట్స్లో.. గోకుల్ప్లాట్స్లోని ఎస్ఆర్ఎస్ డైమండ్ అపార్ట్మెంట్స్లో దాడులు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కుందూరు వీర శంకర చారి, భూమిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు పబ్బతి మురళి, ఉపాసి వంశీకృష్ణలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకులు బెంగళూర్కు చెందిన రాజేష్ రెడ్డి, గచ్చిబౌలికి చెందిన సురేష్ రెడ్డి , అనంతపూర్కు చెందిన నాగార్జున రెడ్డి, కూకట్పల్లికి చెందిన సిద్ధిఖీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.87 వేల నగదు స్వాధీనం చేసుకుని, నాలుగు బ్యాంకుల్లో రూ.1.44 కోట్లు సీజ్ చేశారు. 29 కీ ప్యాడ్ మోబైల్స్, 7 స్మార్ట్ ఫోన్లు, బెంజ్కారు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పరిధిలో.. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు గుంటూరుకు చెందిన ఎర్రమంచు అజయ్, వైజాగ్కు చెందిన మహేష్ కుమార్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73 వేల నగదు, యూపీఐ ద్వార సేకరించిన రూ.21 వేలు సీజ్ చేశారు. రెండు స్మార్ట్ ఫోన్లు, కీ ప్యాడ్ మొబైల్స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పీఎస్ పరిధిలో.. బాచుపల్లి పీఎస్ పరిధిలో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మొర్తాల శ్రీకాంత్ రెడ్డి, అలీ లోకేష్(, జి.వెంకన్న సునీల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి నాలుగు బ్యాంకుల్లో రూ.13.30 లక్షల నగదు సీజ్ చేశారు. ఆరు స్మార్ట్ ఫోన్లు, మూడు ల్యాప్టాప్లు, 16 మొబైల్ కీ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. నితేష్, బుడ్డా రెడ్డి అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 9490617444 నెంబర్కు సమాచారం అందించాలని సీపీ సూచించారు.సైబరాబాద్ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో దాడులు రూ.33.30 లక్షల నగదు స్వాధీనం 57 బ్యాంకుల్లో రూ.2.07 కోట్లు సీజ్ 15 మంది అరెస్ట్ -
రామలింగేశ్వరుడి సేవలో ఏపీ సీఎస్, ఐజీ
కీసర: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామిని సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి, ఐజి నాగిరెడ్డిలు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన వీరికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో కొలువైన శ్రీరామలింగేశ్వరుడికి అభిషేక పూజ అనంతరం పండితులు ఆశీర్వదించి మహాప్రసాదాన్ని అందజేశారు. ఆర్డీవో వెంకట ఉపేందర్, ఆలయ చైర్మన్ తటాకం నాగలింగం, ఈఓ నరేందర్, తహసీల్దార్ అశోక్ కుమార్, ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు తటాకం నారాయణ, తటాకం వెంకటేష్, తటాకం ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. అపోలో–లీసెస్టర్ వర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం సాక్షి, సిటీబ్యూరో: యూకే, భారత్ దేశాల మధ్య విద్య, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ (లీసెస్టర్), అపోలో గ్రూప్లో భాగమైన అపోలో యూనివర్సిటీ (టీఏయూ) ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఆయా సంస్థలు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ చాన్స్లర్ ప్రొ.హెన్రిట్టా ఓకానర్ మాట్లాడుతూ లీసెస్టర్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థులు చిత్తూరు జిల్లాలోని టీఏయూలో రెండేళ్ల చదువును అర్హతగా పరిగణిస్తామన్నారు. మొదటి విడతలో భాగంగా రెండు సంస్థల ఆధ్వర్యంలో ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి 120 మంది విద్యార్థులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా డిప్లొమాలో 50 శాతం పైగా మార్కులతో పాస్ అయిన వారు ఇందుకు అర్హులని అపోలో యూనివర్సిటీ వీసీ ప్రొ. వినోద్ భట్ తెలిపారు. ఈ సందర్భంగా భాగస్వామ్య ఒప్పంద పత్రాలపై వారు సంతకాలు చేశారు. -
ఘనంగా ఉమియా మాతాజీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
మేడ్చల్రూరల్: మండల పరిధిలోని పూడూర్ గ్రామ పంచాయతీ, గోసాయిగూడలోని ఉమియదాంలో శ్రీ కచ్ కడ్వ పటిదర్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ ఉమియా మాతాజీ ఆలయంలో సోమవారం మాతాజీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లకు ఆలయ నిర్వాహకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు గవర్నర్, స్పీకర్ లకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, పూడూర్ గ్రామ మాజీ సర్పంచ్ బాబుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. యూఎస్ మిలటరీ అధికారి పేరుతో టోకరా హిమాయత్నగర్: అమెరికాకు చెందిన మిలిటరీ అధికారి పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్కు సైబర్ నేరగాళ్లు భారీగా టోకరా వేశారు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్కు వాట్సాప్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి తనను మిక్ బ్రౌన్గా పరిచయం చేసుకున్నాడు. తాను యూఎన్ మిలిటరీ సెక్యూరిటీ పీస్ కీపింగ్ ఫోర్స్లో సిరియాలో పని చేస్తున్నట్లు తెలిపాడు. సిరియాలో విప్లవకారులు పెద్ద మొత్తంలో డాలర్లను పోగొట్టుకున్నారని, అవి తన వద్ద ఉన్నాయని చెప్పి, ఆ డబ్బులో ముప్పై శాతం ఇస్తానని నమ్మించి, బాధితుడి అడ్రస్, ఇతర వివరాలు సేకరించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసిన అతను తనను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తనను విడిపించుకునేందుకు తన వద్ద నగదు ఉందని, అయితే కస్టమ్స్ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. వారు చెప్పినట్లుగా బాధితుడు రూ. 23,59,200 అతను చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత వారు స్పందిచకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. టిప్పర్ ఢీకొని వృద్ధురాలి మృతి మైలార్దేవ్పల్లి: టిప్పర్ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బృందావన్ కాలనీకి చెందిన జమునబాయి (78) ఉస్మాన్గంజ్లోని ఓ ఇంటిలో వంట మనిషిగా పని చేస్తోంది. సోమవారం ఉదయం పని చేసేందుకు వెళుతుండగా దుర్గానగర్ సమీపంలో కాటేదాన్ నుంచి టాటానగర్ వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు అదుపుతప్పి బీటెక్ విద్యార్థి దుర్మరణం దుండిగల్: వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి విగ్రహాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండకు చెందిన న్యాయవాది అనిల్ కుమారుడు మేఘాంశ్(20) అల్వాల్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బహదూర్పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి అతను తన కారులో స్నేహితులు ఆర్నవ్, సాయి మానస్, శ్రీచరణ్రెడ్డితో కలిసి దుండిగల్ నుంచి నాగులూరు వైపు వెళుతుండగా అతివేగం కారణంగా కారు అదుపుతప్పి దుండిగల్ చౌరస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మేఘాంశ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆర్ణవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో సాయి మానస్ కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి అనీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాల్గొన్న గవర్నర్, స్పీకర్ మరో ముగ్గురికి గాయాలు రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి రూ.23 లక్షలు వసూలు -
ఎ‘లక్ష’ణంగా..!
నియోజకవర్గాల వారీగా దరఖాస్తులిలా అసెంబ్లీ నమోదుకు తొలగింపు మార్పులు ముషీరాబాద్ 5338 16402 15210 మలక్పేట 3672 3702 4389 అంబర్పేట 4302 7812 7000 ఖైరతాబాద్ 5067 5097 5807 జూబ్లీహిల్స్ 8138 14979 7622 సనత్నగర్ 4439 6123 4001 నాంపల్లి 5575 5992 5509 కార్వాన్ 6144 10707 4266 గోషామహల్ 5231 4626 2087 చార్మినార్ 3769 2857 2661 చాంద్రాయణగుట్ట 6535 16435 16620 యాకుత్పురా 8158 5336 6807 బహదూర్పురా 5863 9473 6543 సికింద్రాబాద్ 4422 9167 6180 కంటోన్మెంట్ 7897 5922 3097 ● ఓటరుగా నమోదు కోసం లక్ష దరఖాస్తులు ● చిరునామా, తదితర మార్పుల కోసం సైతం.. ● తొలగింపులకు ఇంకా ఎక్కువే.. సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర పౌరులు ఉత్సాహం చూపుతున్నారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకోగా, చిరునామా మార్పులు, పొరపాట్ల సవరణలు, తదితరమైన వాటి కోసం మరో లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు తుది జాబితా అనంతరం గత జనవరి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ మేరకు దరఖాస్తులందాయి. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే అర్హులైన ఓటర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకు ఎన్నికల సంఘం గడువునిచ్చింది. సోమవారం అర్ధరాత్రి వరకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడవుండగా, సాయంత్రం వరకు పేరు నమోదు కోసం దాదాపు 85 వేల దరఖాస్తులందగా, చిరునామా మార్పులు, సవరణలు తదితరమైన వాటికోసం 97 వేల దరఖాస్తులందాయి. గడువు ముగిసేలోగా రెండు విభాగాల్లోనూ దరఖాస్తులు లక్ష దాటవచ్చునని అంచనా. తొలగింపులధికం.. కొత్తగా ఓటరు నమోదు..చిరునామా మార్పు, పొరపాట్ల సవరణల కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు లక్ష మంది వంతున ఉండగా, తొలగింపుల కోసం అందిన అభ్యంతరాలు ఇంకా అధికంగా ఉండటం విశేషం. వీటికోసం గత నెల 15వ తేదీ వరకు దాదాపు 1.25 లక్షల దరఖాస్తులందాయి. వాటిల్లో దాదాపు 1.20 లక్షల దరఖాస్తుల్ని పరిష్కరించారు. -
Drunk and Drive: సాప్ట్వేర్ ఇంజినీర్ క్రాంతి కుమార్ @550
హైదరాబాద్: తప్ప తాగిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కారులో దూసుకెళుతూ గంట వ్యవధిలోనే నాలుగు ప్రాంతాల్లో ప్రమాదాలు చేయడమేగాక ఒకరి మృతికి కారకుడయ్యాడు. ఆయా ఘటనల్లో తొమ్మిది మందికి గాయాలు కావడమే కాకుండా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట్లో నివాసం ఉంటున్న క్రాంతి కుమార్ సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన అతను కారులో వెళుతూ ఐకియా సమీపంలో ఓ కారును ఢీ కొట్టాడు. అనంతరం శిల్పా ఫ్లైఓవర్ వద్ద మూడు బైక్లను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి వెళుతూ సైబరాబాద్ కమిషనరేట్ సమీపంలోని పిస్తా హౌస్ వద్ద గుర్తు తెలియని పాదచారిని ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మల్కం చెరువు సమీపంలోని షేక్పేట్ ఫ్లై ఓవర్పై ఆటోను ఢీ కొట్టగా, కారు టైరు పేలి పోవడంతో పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా 550బీఏసీగా నమోదైంది. ఆయా ప్రమాదాల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కారు, ఆటోతో పాటు మూడు బైక్లు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
మియాపూర్: రోడ్డు పక్కన నడిచి వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్కు చెందిన ఆంజనేయులు(63) జేసీబీ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. సోమవారం అతను సమీపంలో జేసీబీని రిపేర్ చేసేందుకు మియాపూర్ వచచ్చాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు అతను బొల్లారం రోడ్డులో న్యూ కాలనీ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు అతను అదే సమయంలో రోడ్డుపై వెళుతున్న మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాల అతడి తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చరణ్ తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ స్థాయిలో ర్యాంకులు అభినందనీయం
నాగోలు: ప్రతి సంవత్సరం రేయాన్ సైనిక్ స్కూల్ నుంచి జాతీయ స్థాయిలో సైనిక్, నవోదయ, ఆర్.ఎమ్.ఎస్లో మొదటి ర్యాంకులు సాధించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్ అన్నారు. గత 24 సంవత్సరాలు దేశానికి ఎంతో మంది డాక్టర్లను, సివిల్ సర్వెంట్లను, ఇంజనీర్లు అందించిన ఘనత రేయాన్ సైనిక్ స్కూల్కు దక్కడం అభినందనీయమని చెప్పారు. 2024, 25 సంవత్సరాల్లో ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపి సైనిక్, నవోదయ 6 వతరగతి, 9వ తరగతి ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థుల అభినందన సభను ఆదివారం నాగోలు బండ్లగూడలోని రేయాన్ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దిలీప్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ, నిబద్ధతతో కూడిన విద్యనందిస్తూ జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేస్తున్న కోచింగ్ సెంటర్ యజమాన్యాన్ని అభినందించారు. రేయాన్ సైనిక్ స్కూల్స్ చైర్మన్ జి.జనార్దన్రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్యూల్స్కి అత్యధిక మార్కులు 286, 284 లాంటి టాప్ మార్కులతో పాటు 81 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం తమ సంస్థ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆర్ఐఎంసీకి తెలంగాణ నుండి గల ఏకై క సీటు తమ సంస్థ విద్యార్థులే దక్కించుకోవడం గర్వకారణమని తెలిపారు. డైరెక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ మ్యాథ్స్లో ఆరుగురు విద్యార్థులు 150/150 మార్కులు సాధించడం తమకే సాధ్యమయిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఉత్తమ ర్యాంకులు సాధించేలా బోధించి ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రేయాన్ సైనిక్ స్కూల్, నవోదయ విద్యార్థుల సక్సెస్ మీట్లో మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్ -
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాదిగల ద్రోహి
కవాడిగూడ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పట్ల ఏమాత్రం గౌరవం లేదని మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం ఆయన లోయర్ ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉదయం 8గంటల్లోగా అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొనేవారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉదయం 11.40 వరకు అంబేడ్కర్కు నివాళులర్పించకపోవడం ఆయనకు అంబేడ్కర్ పై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి మాదిగలను చిన్నచూపు చూస్తూ వారు రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని మందకృష్ణ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం మాదిగలపై కాంగ్రెస్ పార్టీ వివక్షకు నిదర్శనమన్నారు. -
చదువుతోనే బడుగులకు గుర్తింపు
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మలక్పేట: బడుగు, బలహీన వర్గాలకు చదువుతోనే గుర్తింపు వస్తుందని, బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆకాంక్షించారు. మహనీయుల ఆశయాల సాధనకు యువత ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేశ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మూసారంబాగ్లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే, సావిత్రి బాయిపూలే, డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కాన్షీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి దిల్సుఖ్నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్కుమార్, గ్రేటర్ ఇన్చార్జి ప్రవీణ్, నాయకులు యశ్వంత్, శ్రీకాంత్, మహేశ్, చంద్రకళ, సత్యనారాయణ, మమత, సరిత, లావణ్య, మానస తదితరులు పాల్గొన్నారు. వ్యాపారవేత్త కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం బంజారాహిల్స్: వ్యాపారవేత్త వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసు దర్యాప్తును జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. క్రియా హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో షేర్లు, యాజమాన్య మార్పడి కోసమే కిడ్నాప్ జరిగిందన్న విషయం విదితమే. 2018 నవంబర్లో వేణుమాధవ్ను కిడ్నాప్ చేసి, సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించిన అప్పటి అధికారులు బెదిరింపులకు గురిచేసి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుసహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ఓ మీడియా సంస్థలో పనిచేసిన కృష్ణారావు, వ్యాపారవేత్తలు చంద్రశేఖర్ వేగే, నవీన్ ఎర్నేని, రాజశేఖర్ తలశిల, సూరెడ్డి గోపాలకృష్ణ, రవికుమార్ మండలపు, బాలాజీ ఉన్నారు. అయితే పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నవీన్ ఎర్నేని మైత్రీ మూవీస్ పేరుతో సినీనిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వేణుమాధవ్కు, చంద్రశేఖర్ వేగేకు మధ్య గతంలో ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2018, 2021లో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో వేణుమాధవ్ మీద రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలో చంద్రశేఖర్ వేగే మీద సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడం, దాన్ని అడ్వయిజరీ బోర్డు తిరస్కరించడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య జరిగిన లావాదేవీలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. కాగా, 2018 నాటి వ్యవహారంలో తాజాగా దర్యాప్తు జరుగుతుండటంతో పోలీసువర్గాలు, జూబ్లీహిల్స్కు చెందిన పలువురు వ్యాపారవేత్తల్లో ఆందోళన ప్రారంభమైందని సమాచారం. కిడ్నాప్ కేసులో కీలక ఆధారాల సేకరణపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం – జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సాక్షి,సిటీబ్యూరో: అగ్నిప్రమాదాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నివారణకు ముందు జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అగ్నిమాపక శాఖ నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలు, గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గోదాములు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల సముదాయాలు, పాఠశాలలు తదితర భవనాలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు పాటించాలన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, సహాయ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి.శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆదర్శప్రాయుడు – కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సాక్షి, సిటీబ్యూరో: నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతరం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆ మహానీయుడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.కదిరవన్, డీఆర్ఓ వెంకటాచారి, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్న ప్రత్యేక బృందాలురాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నెక్లెస్రోడ్డు ఎన్టీఆర్ మార్గ్లోని అంబేడ్కర్ స్మృతి వనం వద్ద ఆదివారం సందర్శకుల సందడి కన్పించింది. సాధారణ జనం అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. సెల్ఫీలు, ఫోటోలు దిగారు. కాగా అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటైన ఈ స్మృతివనంలో అధికారికంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. విగ్రహానికి కనీసం ఓ పూలదండ కూడా వేయలేదని పలువురు అంబేడ్కర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఆ సెక్షన్తో సీరియస్ యాక్షన్!
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: సంపన్నవర్గాలు ఉండే వెస్ట్జోన్ పరిధిలోని అనేక ప్రాంతాలు ర్యాష్ డ్రైవింగ్కు కేరాఫ్ అడ్రస్లు. ఖరీదైన కార్లలో వచ్చే బడాబాబుల పిల్లల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా రోడ్లు, బారికేడ్లు, డివైడర్లు ధ్వంసం కావడమూ సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ధోరణికి చెక్ చెప్పడానికి ఈ తరహా కేసుల్లో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)తోపాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ రెండు ఉదంతాల్లో వర్తింపు... ఫిల్మ్నగర్, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ల పరిధిలో శనివారంరాత్రి, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదాల కేసుల్లో పోలీ సులు పీడీపీపీ యాక్ట్ జోడించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.92లో వెర్నా కారు(ఏపీ 29 బీయూ 5078) డివైడర్ను ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హోంగార్డు లింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు నడుపు తున్న వ్యక్తిపై ఐపీసీలోని సెక్షన్ 279తోపాటు పీడీపీపీ యాక్ట్లోని సెక్షన్ 3 కింద కేసులు పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బెంజ్ కారు (ఏపీ10 ఆర్ 0055) అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం కుప్పకూలిపోగా వైర్లు తెగిపడి కేబుళ్లు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విద్యుత్ శాఖ ఏడీఈ పి.వేణుమాధవ్ ఫిర్యా దు మేరకు కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ సెక్షనన్ 279, 336లతోపాటు పీడీపీపీ యాక్ట్లోని సెక్షన్ 3 కిందా కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించి.. ఇప్పటివరకు ఈ తరహా యాక్సిడెంట్ కేసులను కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్గా పరిగణిస్తూ ఐపీసీలోని 279, 336 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేవారు. వీటిలో గరిష్టంగా ఆరు, మూడు నెలల జైలు శిక్షలతోపాటు నామమాత్రపు జరిమానా మాత్రమే ఉంది. అయితే పలు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆస్తులు దెబ్బతింటుండటంతో కారకులపై పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసుల నమోదుకు పోలీసులు పూనుకున్నారు. ఈ సెక్షన్ ప్రకారం నిందితులు దోషులుగా తేలితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ప్రతి ప్రమాదంలోనూ ఈ సెక్షన్ జోడించకుండా దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. -
అందరి వాడు అంబేడ్కర్
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శంషాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేడ్కర్ అందరివాడని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పి. సంజయ్యాదవ్, సీనియర్ నాయకులు మైలారం సులోచన తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ మార్గం అనుసరణీయంకేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కాచిగూడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మార్గం అనుసరణీమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ సమగ్రత, భద్రతను దృష్టిలో పెట్టుకుని అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ¯]l*™èl¯]l ´ëÆý‡Ï-Ððl$…sŒæ ¿ýæÐ]l-¯é-°MìS ˘A…»ôæ-yýlPÆŠ‡ õ³Æý‡$ ò³sêtÍ హిమాయత్నగర్: ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే నూతన పార్లమెంటు భవనానికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. జలమండలిలో .. సాక్షి,సిటీబ్యూరో: రాజ్యాంగాన్ని రచించడం డా.బీఆర్ అంబేడ్కర్ దేశానికి చేసిన గొప్ప సేవల్లో ఒకటని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో డా.బీఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్లే అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ సమన్వయకర్త, సీజీఎం పద్మజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్. ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్–2 డైరెక్టర్ స్వామి, సీజీఎంలు, జీఎంలు, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ, జలమండలి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు విశ్వనాథ్, శంకర్ ప్రసాద్, శ్రీనివాస్, అశోక్, నర్సింగ్ రావు, రామ్ చందర్, కష్ణ, రాజు, సీతయ్య నాయక్, దేవేందర్, ఉదయ్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్పై దాడి అమానుషం అంబర్పేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి అమానుషమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబోలు నర్సింహరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు దాడులు చేయించడం దారుణమన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కోన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రసంగాలతోనే టీడీపీ నేతలు జగన్పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు తెరలేపిందని ఆయన పేర్కొన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలి సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగ సంస్థల అభివృద్ధి కోసం, వచ్చే వేసవి విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం జూబ్లిహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్(వీఏఓఏ) ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. కరెంట్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వొద్దని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంలో అధికారులు సహకరించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య, పరమేష్, తదితర ప్రతినిధులు ఉన్నారు. కాపులు అన్ని రంగాల్లో రాణించాలి రాంగోపాల్పేట్: కాపులు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని సప్తగిరి హోటల్లో ఆల్ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావుతో పాటు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సీఏ కోటెల శ్రీహరి, పీ వినాయక స్వామి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్వీరావు, ఉదయ్భాస్కర్, దాసరి రాము, రామ్మోహన్, సామల వేణుకు కాపు రత్న అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలు, అతిథులు మాట్లాడుతూ 20 శాతం జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారం కోసం సంఘటితం కావాలన్నారు. 1959 సంవత్సరంలో స్థాపించిన సంఘం ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబుకు బెస్ట్ జర్నలిస్టు అవార్డుతో పాటు ఆయా రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు. -
వీడో సూడో!
హైదరాబాద్: సాయుధ బలగాల్లో ప్రవేశించాలనే ప్రయత్నం శిక్షణ స్థాయిలోనే విఫలం కావడం... పోలీసు ఉద్యోగానికి ఎంపిక కాకపోవడం... యూనిఫాంపై మక్కువ తీరకపోవడం... వెరసి ఓ వ్యక్తిని సూడో పోలీసుగా మార్చింది. నకిలీ ఎస్సై అవతారం ఎత్తిన అతగాడు పోలీసు విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి రూ.లక్షల్లో కాజేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ ఎస్.రష్మి పెరుమాల్ ఆదివారం వెల్లడించారు. వనపర్తి జిల్లా దొంతికుంట తండాకు చెందిన కడావత్ సోమ్లానాయక్ బంజారాహిల్స్లోని ఉదయ్నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. నగరంలోని ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడు. సోల్జర్గా (జనరల్ డ్యూటీ) ఎంపికై ఆరు నెలలపాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. తర్వాత అనివార్య కారణాల నేపథ్యంలో శిక్షణ కేంద్రం నుంచి పారిపోయి వచ్చేశాడు. ఆ తర్వాత 2004లో అస్సోం రైఫిల్స్ విభాగంలోనూ సోల్జర్గా ఎంపికయ్యాడు. అయితే శిక్షణ పూర్తి కాకుండానే అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చేశాడు. నగరానికి తిరిగి వచ్చిన సోమ్లానాయక్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఎంపిక కాలేదు. దీంతో బతుకుదెరువు కోసం కారు డ్రైవర్గా మారాడు. అయితే పోలీసు యూనిఫాంపై మక్కువతో 2012లో సూడో సబ్–ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తాడు. స్వగ్రామంతోపాటు మరికొన్ని చోట్ల జరిగే కార్యక్రమాలు, శుభకార్యాలకు ఇతడు ఎస్సై లేదా కానిస్టేబుల్ యూనిఫాంలోనే వెళ్లేవాడు. ఇలా అందరూ తాను పోలీసు అని నమ్మేలా చేశాడు. ఆపై తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి అదే విభాగంలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఈవిధంగా బంజారాహిల్స్కు చెందిన గౌరీశంకర్తోపాటు మరికొందరి నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. గౌరీశంకర్ ఫిర్యాదుతో మాసబ్ట్యాంక్ ఠాణాలో సోమ్లానాయక్పై కేసు నమోదైంది. అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.నాగార్జున తన బృందంతో వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. ఇతడి నుంచి ఫోను, ద్విచక్ర వాహనం, పోలీసు యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మాసబ్ట్యాంక్ పోలీసులకు అప్పగించారు. -
క్లినికల్ సైకాలజిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
సాక్షి, సిటీ బ్యూరో: తెలంగాణ క్లినికల్ సైకాలజిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని రెయిన్బో ఆస్పత్రి వేదికగా జరిగిన ఈ ఎన్నికలో అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా డా. సరోజ్ ఆర్య, జనరల్ సెక్రటరీగా శిల్ప పన్నాల్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రానున్న రెండేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాల మేనిఫెస్టోను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు విడుదల చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కొన్ని ప్రాజెక్టులపై చర్చించారు. కార్యక్రమంలో కమిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సభ్యులు పాల్గొన్నారు. లాసెట్ దరఖాస్తుల స్వీకరణకు నేటి వరకే గడువు ఉస్మానియా యూనివర్సిటీ: ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్–2024, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు ఎల్ఎల్ఎంసెట్–2024 దరఖాస్తుల స్వీకరణకు నేటి(15వ తేదీ)తో గడువు ముగుస్తుందని కన్వీనర్ ప్రొ.విజయలక్ష్మీ ఆదివారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మరో 10 రోజుల వరకు గడువు పొడిగించనున్నట్లు చెప్పారు. జూన్ 3న జరిగే ప్రవేశ పరీక్షకు ఇప్పటివరకు 27,500 దరఖాస్తులు అందినట్లు వివరించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదన్నారు. -
‘పొలిటికల్’ ఆతిథ్యం!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 28 రోజులే మిగిలి ఉంది. ఓటింగ్ సమయం దగ్గరపడుతోంది. గ్రేటర్ జిల్లాల పరిధిలోని మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒక వైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ..మరో వైపు వీలైనంత త్వరగా ఓటర్లను చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఉదయం ఇతర పార్టీల కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ, వారికి కండువా కప్పడం, మధ్యాహ్నంబూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలతో ఆత్మీయ సభలు, సమావేశాలు నిర్వహించి, ఎన్నికల్లో గెలుపు కోసం సమాలోచనలు చేయడం, సాయంత్రం ఏడు తర్వాత ముఖ్య అనుచరుల నివాసాలు, గెస్ట్ హౌసులు, ఆఫీసులు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫాం హౌసుల్లో గెట్ టు గెదర్ పార్టీలు ఏర్పాటు చేయడం నిత్యకృత్యమైంది. కాలనీ, అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. వివిధ రకాల మాంసాహార వంటకాలతో పాటు ఖరీదైన మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. ఒక వైపు అభ్యర్థి గెలుపునకు ఏ విధంగా కృషి చేయాలనే అంశంపై చర్చిస్తూనే..మరో వైపు ‘సుక్క..ముక్క’తో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దావత్లు షురూ.. ఒకే చోట ఎక్కువ మంది కూడితే ఎన్నికల కమిషన్కు అనుమానం వస్తుందని భావించి, పోలింగ్ బూత్ల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గమనార్హం. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పుట్టిన రోజు వేడుకల బ్యానర్లను, కేకు, పుష్పగుచ్ఛాలను ఆ ప్రదేశంలో రెడీగా ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ప్రచారం కోసం బంధువులు, స్వగ్రామాలకు చెందిన వారిని కూడా నియోజకవర్గానికి రప్పించి, వారితో మంతనాలు జరుపుతున్నారు. స్థానికంగా స్థిరపడిన వారి బంధువుల ఓట్లు తమకే పడేలా ప్లాన్ చేస్తున్నారు. కనీసం ఏ ఒక్క రోజు కూడా పలకరించని నేతలు ఏకంగా ఇంటికి, గెస్ట్హౌస్కు, హోటల్కు, క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని విజయం కోసం పాటు పడాల్సిందిగా వేడుకుంటున్నారు. లీడర్లు కూడా దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ముందు అనేక ప్రతిపాదనలను పెడుతున్నారు. సామాజిక వర్గం, హోదా, సంస్థాగతంగా ప్రజల్లో తనకు ఉన్న పలుకు బడికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులు కూడా వారి డిమాండ్లకు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి లీడర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వారు అడిగినంత ఇచ్చి వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలిసింది. మద్యం షాపులతో ఒప్పందం ఎన్నికల్లో మద్యం పంపిణీని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ గట్టి చర్యలే చేపట్టింది. గెట్ టు గెదర్ పార్టీలకు నేరుగా మద్యం సరఫరా చేస్తే పోలీసులు పట్టుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఎవరికీ అనుమానం రాకుండా ముందే తమ అనుచరులు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వైన్స్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ప్రత్యేకంగా టోకెన్లును కూడా ముద్రించి ఇస్తున్నారు. అభ్యర్థి వెంట రోజంతా తిరిగిన ముఖ్య అనుచరులతో పాటు ఇతర నిర్వాహకులకు సాయంత్రం వేళ టోకెన్లు జారీ చేస్తున్నారు. వీరు ఆయా వైన్సుల వద్దకు వెళ్లి..కావాల్సినంత మద్యాన్ని వెంట తీసుకెళ్తున్నారు. ఆత్మీయ సభలు, సమావేశాలకు హాజరయ్యే వారికి కూడా ఇదే విధంగా పంపిణీ చేస్తున్నారు. ఎకై ్సజ్శాఖ జిల్లాలోని వైన్స్షాపుల్లోని నిల్వలను ఏ రోజుకారోజు లెక్కిస్తున్నప్పటికీ..వీరి లెక్కకు ఏమాత్రం కూడా చిక్కకుండా వ్యవహరిస్తుండటం విశేషం. అంతేకాదు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్య ంలో ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరయిన సభ్యులను బట్టి బాటిళ్లను, బిర్యానీ పొట్లాలను పంపిణీ చేస్తుండటం గమనార్హం. -
నేటి నుంచి వీసీల సదస్సు
శామీర్పేట్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ) ఆధ్వంర్యంలో జాతీయ స్థాయి వైస్ చాన్స్లర్ల సదస్సు శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో నిర్వహించనున్నట్లు ఏఐయూ అధ్యక్షుడు జీడి శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం ఇప్పటివరకు ఉన్నత విద్యలో సాధించిన అభివృద్ధి, భవిష్యత్తులో సాధించాల్సిన పురోగతిపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. సదస్సులో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారన్నారు. అనంతరం మూడు రోజులు పాటు జరిగే సదస్సు కార్యక్రమాల ప్రాస్పెక్టస్, ఏఐయూ హ్యాండ్ బుక్ లను ఆవిస్కరించారు. కార్యక్రమంలో ఏఐయూ ఉపాధ్యక్షుడు వినయ్కుమార్ పాఠక్, సెక్రెటరీ పంకజ్ మిట్టల్, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసీ ఎల్ ఎస్ గణేష్, మాజీ వైస్ ఛాన్స్లర్లు మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
నీటి కోసం... నిరీక్షణ!
సాక్షి,హైదరాబాద్: జలమండలి ట్యాంకర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ట్యాంకర్లు బుక్చేసిన తర్వాత 48 నుంచి 62 గంటలు గడిస్తే తప్ప..డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్య పెంచినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. తాగు నీటి సరఫరాపై ఎప్పటికప్పుడు ఉన్న తాధికారులు సమీక్ష సమావేశాలు నిర్వ హిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఆచరణ అమలు సాధ్యం కానీ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భూగర్భజలాలు అడుగంటి బోర్డు ఎండిపోయిన ప్రాంతాల్లో తాగునీటి కంటే ఇతర అవసరాల కోసం ట్యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. బహుళ అంతస్తుల సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటాయి. పైప్లైన్ నెట్ వర్క్ గల ప్రాంతాలకు నల్లా నీరు సరాఫరా అవుతున్నా ఇతర అవసరాలకు మాత్రమే సమస్య ఏర్పడింది. మురికివాడల్లో తగ్గిన నల్లా నీటి సరఫరా సమయం, లోప్రెషర్తో తాగునీరు కొరత నెలకొంది. ఉచిత నీటి ట్యాంకర్ల సరఫరా అంతంత మాత్రంగా కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. 31 ప్రాంతాల్లోనే డిమాండ్ నగరంలోని భూ గర్భజలాలు అడుగంటిన 31 ప్రాంతాల్లోనే ట్యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఆరు డివిజన్ల నుంచి 73 శాతం పైగా ట్యాంకర్ల కోసం బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, పటాన్చెరువు తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. మొత్తం మీద 44 శాతం వ్యక్తిగత గృహాలు, 46 శాతం ఎంఎస్బీ, బల్క్, 10 శాతం నాన్ డొమెస్టిక్ బుకింగ్లు జరుగుతున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిమాండ్ దృష్ట్యా రాత్రి, పగటి వేళల్ల్లో సైతం ట్యాంకర్ల నీటి సరఫరా జరిగే విధంగా జలమండలి చర్యలు చేపట్టినా..ట్యాంకర్ బుకింగ్..డెలివరీకి మధ్య సమయం మాత్రం తగ్గని పరిస్థితి నెలకొంది. ఆమ్యామ్యాలు సమర్పిస్తేనే... ట్యాంకర్ల డెలివరీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. సిఫార్సులుంటే కానీ త్వరగా ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ట్యాంకర్ బుకింగ్చేస్తే మూడు రోజులకు గానీ డెలివరీ కావడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే జలమండలి ఉన్నతాధికారులు మాత్రం ట్యాంకర్ డెలివరీ టైమింగ్స్ తగ్గించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. డెలివరీ సమయాన్ని 12 గంటలకు తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళికల తయారీకి సిద్ధమయ్యారు. మరోవైపు ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలకు జలమండలి ఉపక్రమించింది. మొత్తం దినసరి 7 వేల ట్రిప్పులను సరఫరా చేస్తున్నట్లు జలమండలి పేర్కొంటుంది. -
చిట్టిచేతుల మీదుగా గట్టి పుస్తకాలు
లక్డీకాపూల్: చిన్న వయసులోనే ఇద్దరు యువ రచయిత్రులు రాసిన పుస్తకాలు అమోఘంగా ఉన్నాయని సైయెంట్ చైర్మన్, పద్మశ్రీ బీవీకే మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లోని హోటల్ రాడిసన్ బ్లూలో రూపాలి కిరణ్ యదుగిరి రచించిన ‘అతిథి దేవోభవ’, దీప్షిక యదుగిరి రచించిన ‘యంగ్ బ్లడ్ ఎథీనా’ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుచిర్ ఇండియా గ్రూపు వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ వై. కిరణ్ కుమార్తెలు రూపాలి, దీప్షిక చిన్న వయసులోనే తమ సాహితీ అభిలాషను నెరవేర్చుకోవడం అభినందనీయన్నారు. ఒక సాధారణ మనిషి సంపూర్ణ మానవుడిగా మారాలంటే అందుకు సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంతోమంది కవులు, రచయితలు, గ్రంథకర్తలు మనకు అందించిన అద్భుతమైన సంపద పుస్తకాలేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రచయిత్రి ఒకరైన రూపాలి కిరణ్ యదుగిరి మాట్లాడుతూ, ఆతిథ్య పరిశ్రమపై తాను రాసిన శ్రీఅతిథి దేవో భవ్ఙ పుస్తకంపై అందరూ తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. తన సోదరి దీప్షిక యాదగిరిని ఆమె పరిచయం చేశారు. ఒక మనిషి వ్యక్తిగత ఎదుగుదలకు, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడే పుస్తకం ఆమె రాసిన ‘యంగ్ బ్లడ్ ఎథీనా’ అన్నారు. కార్యక్రమంలో సుచిరిండియా చైర్మన్ వై. కిరణ్, ఐపీఎస్ అధికారి సుధీర్, మాజీ రీజినల్ పాస్పోర్ట్ అధికారి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి చిక్కడపల్లి: రాజ్యాంగాన్ని కాపాడుకోవడమంటే అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించడమేనని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర సూచించిన సూత్రాలకు పాలకులు తూట్లు పొడిచారన్నారు. దేశ సంపద కేవలం 162 మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని, సామాజికన్యాయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలయ్యాయన్నారు.కార్యక్రమంలో టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, ఐఏఎస్ పోటీపరీక్షల నిపుణులు బాలలత, పునిరెడ్డి, జైపాల్రెడ్డి, బస్తీ నేతలు ఉమేష్, పరశురామ్ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో మాదిగలకు తీరని అన్యాయం’ మన్సూరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మాదిగలను మోసం చేస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్లో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు, మాలలకు సమన్యాయం చేసిందని, జనరల్ స్థానమైన మల్కాజిగిరిని తనకు కేటాయించగా లక్షకు పైగా మెజార్టీతో గెలుపొంది. కేంద్రమంత్రి పదనిని నిర్వహించానని గుర్తుచేశారు. సమర్థత కల్గిన మాదిగ నాయకులపై ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. నడమంత్రపుసిరితో రాష్ట్ర నేతలు కుట్రలు చేస్తున్నారని, వరంగల్ పార్లమెంట్ టికెట్ను కడియం కావ్యకు ఏ ప్రాతిపదికన కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి ఎస్సీనా, బీసీనా తెలియాల్సి ఉందని, కడియం కావ్య మైనార్టీ వ్యక్తిని పెళ్లిచేసుకుందని, వరంగల్ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలని కోరారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, తెలంగాణ ఏర్పడ్డాక వర్గీకరణపై దృష్టి సారించాలని అప్పటి యుపీఏ ప్రభుత్వం ఆలోచన చేసిందని తెలిపారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రధాని మోదీ వర్గీకరణపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జోగు రాములు, చామకూర రాజు, కేవిగౌడ్, ఆడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలోనైనా మిద్దెతోటే ఆధారం!
ప్రముఖ మిద్దెతోట రైతు, రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి మేడ్చల్ జిల్లా నారపల్లిలో తన ఇంటిపైన 1,242 చదరపు అడుగుల్లో మిద్దెతోటను ఏర్పాటు చేసుకున్నారు. తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను మిద్దైపెనే పండించుకొని తింటున్నారు. 2010 నుంచి మార్కెట్లో కొనటం మానేశారు. వేసవిలోనూ కొరత లేకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల దిగుబడి వచ్చేలా ఆయన ప్రణాళిక ప్రకారం మిద్దెతోటను ఇటుకలతో ఎత్తు మడులను నిర్మించుకోవటం విశేషం. ప్రతి 3 మడుల్లో రెండింటిలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు.. ఒక మడిలో మండ్ల మొక్కలు పెంచుతున్నారు. రెండు, మూడేళ్లకు పండ్ల మొక్కలు పెద్దవైన తర్వాత ఆ చెట్ల నీడ ఇతర మడుల్లో కూరగాయలు, ఆకుకూరల మొక్కలను వేసవిలో కాపాడుతుంది. వేసవిలో రోజూ ఉదయం, సాయంత్రం 2,3 నిమిషాల పాటు మిద్దెతోట మొక్కలన్నిటిపై నీటి జల్లు కురిపించటం రఘోత్తమరెడ్డి ప్రత్యేకత. ఆ విధంగా మడులు, కుండీల్లో మట్టి, మొక్కలు కూడా రోజుకు రెండు సార్లు చెమ్మగిల్లుతాయి. కాబట్టి వేసవి తాపాన్ని షేడ్నెట్ అవసరం లేకుండానే తట్టుకొని కూరగాయలు, పండ్లను అందిస్తున్నాయని రఘోత్తమరెడ్డి వివరించారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలున్నా తమ ఇల్లు చల్లగా ఉంటుందని, మిద్దెతోట చెక్కుచెదరకుండా ఉందన్నారు. ప్రస్తుతం వాటర్ ఆపిల్ రెండు రకాలు, అరటి, సపోటా పండ్లతో పాటు వంగ, టొమాటో, మునగ, బీర, అలసంద, కాకర.. తోటకూర, పాలకూర, చుక్క కూర, పొన్నగంటి, చెన్నంగి, బచ్చలి వంటి ఆకుకూరలు మిద్దెతోట తమకు అందిస్తోందన్నారు. తమ మిద్దెతోట ఇప్పుడు సహజ అడవిరూపాన్ని సంతరించుకొందని చెబుతూ.. విత్తనాలు వేయనవసరం లేదు.. పంట మొక్కల నుంచి రాలిన విత్తనాలే తిరిగి మొలుస్తున్నాయ్నారు. వేసవికి ముందు ఫిబ్రవరి ఆఖరు నాటికి మిద్దెతోటలో ఉండే మొక్కలన్నీ కనీసం నెల వయసువి ఉండేలా చూసుకుంటే మొక్కలు వేసవిని తట్టుకొని దిగుబడిని అందిస్తాయని ఆయన సూచించారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి -
అనంత లోకాలకు
హెల్త్ చెకప్కు వెళ్తూ.. నాగోలు: హాస్పిటల్లో హెల్త్ చెకప్ కోసం వెళ్తుండగా ఆగిఉన్న లారీని క్యాబ్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఎల్బీనగర్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిల్కూర్ బేతవోలుకు చెందిన సాదె వీరయ్య (78), ఇదే ప్రాంతానికి చెందిన సుంకరి మొగ్గయ్య (60) నగర శివారు హయత్నగర్ సూర్యనగర్ కాలనీలో నివాసం ఉండే సాదె జగదీష్ వద్దకు శుక్రవారం వచ్చారు. శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో సాదె వీరయ్య హెల్త్ చెకప్నకు వెళ్లేందుకు ఓలా క్యాబ్ను బుక్ చేసుకున్నారు. కారులో డ్రైవర్తో పాటు వీరయ్య, మొగ్గయ్య, జగదీష్లు కలిసి హయత్నగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. ఎల్బీనగర్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వద్ద రోడ్డు మధ్యలో నిలిపి ఉన్న లారీని వెనక నుంచి క్యాబ్ ఢీకొంది. కారులో ఉన్న నలుగురిలో మొగ్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వీరయ్యను ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ తరలించారు. తలకు తీవ్రగాయాలైన జగదీష్, కారు డ్రైవర్ కిరణ్కుమార్లను కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్కు తరలించారు. కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరయ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు.. హస్తినాపురం: గుర్రంగూడ చౌరస్తా విపాసన ధ్యాన కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీఎన్రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారును మర్రిగూడ నుంచి నగరానికి వస్తున్న క్రెటా కారు అతివేగంతో ఢీకొంది. దీంతో స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న వనస్థలిపురం ఎస్కేడీ నగర్కు చెందిన రవి (29), మీర్పేట నంది హిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రణయ్ (29)లు అక్కడికక్కడే మృతి చెందారు. క్రీటా కారు డ్రైవర్ దస్రుకు గాయాల కావడంతో ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్యాబ్ ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు ఎల్బీనగర్లో ఘటన -
తాగు నీటి సరఫరాకు ఆటంకం కల్పిస్తే చర్యలు
సమీక్ష సమావేశంలో మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్సాక్షి, సిటీబ్యూరో: తాగునీటి సరఫరాలో ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ హెచ్చరించారు. వేసవిలో తాగునీరు, ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో శనివారం జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ, లైన్మెన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్ మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లైన్మెన్లు ఉద్దేశ పూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. జలమండలి రూపొందించిన నాణ్యత యాప్లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలని చెప్పారు. సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే.. అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు. 20 ఎంఎల్డీల అదనపు జలాలు నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీరు వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దానకిశోర్ వెల్లడించారు. నాగార్జున సాగర్లో నీటిమట్టం డెడ్స్టోరేజీకి పడిపోతుండటంతో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15 తర్వాత ఏ క్షణమైనా పంపింగ్ చేసే అవకాశముందని వివరించారు. అదనపు మినీ ట్యాంకర్లు వేసవిలో డిమాండ్ ఎదుర్కొనేందుకు అదనంగా 5 కేఎల్ సామర్థ్యం కలిగిన వంద ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు దానకిశోర్ తెలిపారు. కాలనీలు, బస్తీలు, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు 2.5 కేఎల్ సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకర్ డెలివరీ టైమింగ్స్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దానకిశోర్ ఆదేశించారు. ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్స్, ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఈడీ డా. సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొనారు. -
No Headline
‘నేను వనస్థలిపురంలో సొంత ఇంటిపైన మిద్దెతోటను ఐదేళ్లుగా సాగు చేసుకుంటూ మా కుటుంబంలోని ముగ్గురికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేసుకుంటున్నాను. చుట్టాలొస్తే తప్ప బయట కొనాల్సిన అవసరం లేదు. సుమారు 400 కుండీలు ఉన్నాయి. పెరుగు బకెట్లు, లీటరు ప్లాస్టిక్ సీసాలు వంటి వాటిలోనే పెద్దగా ఖర్చు లేని పద్ధతిలో మిద్దెతోటను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం వంగ, బెండ, టొమాటో, మిర్చి, ఆకుకూరలు పండిస్తున్నా. ప్రణాళిక ప్రకారం మొక్కల్ని, విత్తనాలను నాటుకుంటూ ఉంటే వేసవిలోనూ ఇబ్బంది లేకుండా కూరగాయలు పండించుకోవచ్చు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కుండీల్లో ఎండాకులతో మల్చింగ్ చేస్తున్నాను. పది రోజులకోసారి కొంచెం మట్టి తీసేసి ఎరువు వేస్తుంటే.. దిగుబడికి ఏ ఢోకా ఉండదు. నేను ఏ రోజూ ఖాళీగా ఉండను. మిద్దెతోట పనిలోనే నిమగ్నం అవుతూ ఉంటాను’ అన్నారు 64 ఏళ్ల శివపార్వతి. -
హస్తం గూటికి ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్
ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్యయాదవ్ దంపతులు, కౌన్సిలర్ నాగజ్యోతి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరివర్థన్రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి వారికి కండువాకప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ సర్పంచులు యాదగిరి యాదవ్, వెంకటేశ్ ముదిరాజ్, కౌన్సిలర్లు శశికళ, సంగీత, నరేశ్మాదవ్, మల్లేశ్, రవీందర్ నాయకులు దేవేందర్ ముదిరాజ్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
వచ్చి ఓటేయండి !
ఇక్కడి ఓటర్లు.. అక్కడికెళ్లేలా ● ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న పార్టీలు ● మేము సిద్ధం పేరిట సమావేశాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఎందరెందరికో ఉపాధి కల్పిస్తున్న నగరం. వివిధ రాష్ట్రాల వారు వృత్తి వ్యాపారాలు నిర్వహిస్తున్న నగరం. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న మహానగరం. ముఖ్యంగా రాష్ట్రం వేరు పడ్డప్పటికీ ఇక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చిన ఏపీ ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామందికి తమ స్వస్థలాల్లోనే ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలతో మద్దతు కూడగట్టే దిశగా వ్యూహారచన చేస్తున్నాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, తదితర నియోజకవర్గాల్లో ఆంధ్రా ఓటర్లు ఎక్కువసంఖ్యలో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లోని వారితో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టారు. రవాణా ఏర్పాట్లు, తదితరమైన వాటికి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా వచ్చి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పార్టీకి మనం ఓటేయాలని వివరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు తమ నియోజకవర్గానికి చెందిన ప్రజలు హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువగా ఉన్నారో గుర్తించి వారున్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈ నెలలో ఇంకా ఎక్కువగా జరగనున్నాయి. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ ఉండటంతో మే మొదటి వారం వరకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగనున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం గత ఫిబ్రవరి 25న ఎల్బీనగర్లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్లో నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి తదితర నేతలు పలువురు పాల్గొన్నారు. అలాగే నరేన్గార్డెన్లో జరిగిన మరో సమావేశంలో సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావు పేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రచార నినాదం ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆదివారం నరసరావుపేట నియోజకవర్గ నేతలు, వైఎస్సార్సీపీ అభిమానులు, తదితరులు నిజాంపేటలోని కొలను రాఘవరెడ్డి ఫంక్షన్ గార్డెన్స్లో సమావేశం నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన పలువురు అభ్యర్థులతో ఇక్కడి పార్టీ అభిమానులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎం.గురుమూర్తి, వై శివరామిరెడ్డి, కాకాని గోవర్ధన్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, అనంత వెంకటరామిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మెరిగ మురళీధర్, బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి, మెరుగ నాగార్జున తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల గాలి హైదరాబాద్లోనూ వీస్తోందని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఫైర్ సర్వీసెస్ వీక్ జరగనుంది. ఈమేరకు ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.