-
‘అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వం’
గరిడేపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో కాలం వెళ్లదీస్తుందని బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ ఆరోపించారు. గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందని, ప్రజలు తీరా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే అధికారులు అలాంటివి ఏమి లేవని చెబుతున్నారని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో మార్పులకు ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
శిథిలావస్థలో కల్వర్టు
ప్రమాదాలు జరుగుతున్నాయి గానుగుబండ అడ్డరోడ్డు వద్ద మైనర్ కాలువ కట్ట కోతకు గురై కల్వర్టు పూర్తిగా శిథిలమైంది. ఈ విషయాన్ని ఆర్అండ్బీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కల్వర్టు వద్ద రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి నూతన కల్వర్టు నిర్మించారు. – సురభి సైదులు, గారకుంటతండా●గరిడేపల్లి : మండలంలోని గరిడేపల్లి – కల్మలచెరువు రోడ్డులో గారకుంటతండా అడ్డ రోడ్డు వద్ద సాగర్ ఎడమకాల్వకు అనుసంధానంగా ఉన్న మైనర్ కాల్వపై ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. కల్వర్టు వద్ద కాల్వ కట్ట, ఇరుపక్కల గల రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు గాయాల పాలవుతున్నారు. రెండు సంవత్సరాలుగా కల్వర్టు ప్రమాదకరంగా ఉన్నా ఎన్ఎస్పీ, ఆర్అండ్బీ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని అంటున్నారు. ఈ రోడ్డు గుండా నిత్యం గానుగబండ, కల్మల చెరువు, రాఘవపురం, గుండ్లపాడు, జాన్పహాడ్తోపాటు పలు ప్రాంతాలకు లారీలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలలో ప్రజలు వెళ్తుంటారు. కల్వర్టు విషయాన్ని ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి ప్రజలు, ప్రజాప్రతినిధులు పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ స్పందన కరువైందని వారు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆర్అండ్బీ అధికారుల పరిధిలో ఉందని.. ఆర్అండ్బీ అధికారులు ఇరిగేషన్ పరిధిలో ఉందని దాటవేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న కల్వ ర్టుకు తొలగించి నూతన కల్వర్టు నిర్మించాలని, కోతకు గురైన కాలువ కట్టకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. కల్వర్టు వద్ద రాత్రి సమయంలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు పట్టించుకోని అధికారులు -
రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి
తుంగతుర్తి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ అన్నారు. గురువారం అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు నిర్మలకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. రైతులకు సరిపడ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధరను ముందే ప్రకటించాలని అన్నారు. అన్ని రకాల పంటలపై రూ.500ల బోనస్ను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్, తడకమల్ల సంజీవ, చిప్పలపల్లి మధు, జిలకరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
నాగారం : నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్పామ్ తోటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని పతంజలి ఆయిల్పామ్ కంపెనీ తుంగతుర్తి డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ పి.అశోక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు చీమల వెంకన్నయాదవ్ వ్యవసాయ క్షేత్రంలో నూతనంగా ఆయిల్పామ్ మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆయిల్పామ్ తోటలను సాగుచేయాలని సూచించారు. ఆయిల్పాం పంటకు కూలీల ఖర్చులు ఉండవని తెలిపారు. కోతుల బెడద కూడా ఉండదని పేర్కొన్నారు. ఆయిల్పాం పంట నాటు కుంటే 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. పంట నాటిన నాలుగవ సంవత్సరం నుంచి పంట కోత మొదలై ప్రతి నెలా 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. ఆయిల్పామ్ పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రభుత్వం నియమించిన కంపెనీ వారే కొనుగోలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్పామ్ కంపెనీ క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలు
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం హుజూర్నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్లో కాంగ్రెస్ ఎస్టీ సెల్, ఎస్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపు 40 మంది రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ ఫౌండేషన్ చైర్మన్ కుక్కల వెంకన్న, ఎస్టీ సెల్ నాయకుడు తేజావత్ సైదులు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, నాయకులు మంజూనాయక్, శ్రవణ్కుమార్, ఆదెర్ల శ్రీనివాస్రెడ్డి, జక్కుల శంబయ్య, జక్కుల వీరన్న, గణేష్, మల్లయ్య, రవినాయక్, హరిబాబు, అమర్నాథ్రెడ్డి, రాయల వెంకటేశ్వర్లు, రామ్రెడ్డి, జ్ఞానయ్య, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. అన్నదానం.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని హుజూర్నగర్ పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వద్ద మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు యరగాని నాగన్న, గెల్లి రవి, కోతి సంపత్రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో దొంతగాని పద్మ, దొంగరి మంగమ్మ, అరుణ్ కుమార్, హరిబాబు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, సీహెచ్.రాము, టి.రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. కోదాడరూరల్ : భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను కోదాడ మండలంలోని గుడిబండలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్రెడ్డి మాట్లాడారు. కోదాడ పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గణవపరం, కాపుగల్లు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. ఎంపీపీ మల్లెల రాణిబ్రహ్మయ్య, జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారిశేషు, ఇర్ల సీతారాంరెడ్డి, రేవూరి వెంకటాచారి, బుడిగం నరేష్, నర్సింహారెడ్డి, కుక్కడపు నాగరాజు, ఇర్ల నారపరెడ్డి, రఫీ, ఎరగాని లక్ష్మయ్య, రాజారావు, ప్రసాద్, సత్యనారాయణ, కాసాని శ్రీను, కొండా నర్సింహారావు, బండి కోటయ్య తదితరులు ఉన్నారు. కోదాడ : పట్టణంలో మంత్రి ఉత్తమ్కుమారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. హుజూర్నగర్ రోడ్డులో మాజీ సర్పంచ్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, మున్సిపల్ కార్యాలయంలో, కాశీనాథం ఫంక్షన్ హాల్లో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, పీసీసీ డెలిగేట్ సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, కందుల కోటేశ్వరరావు, నెమ్మాది ప్రకాష్బాబు, దేవమణి, బాగ్దాద్, వంటిపులి శ్రీను, గోవిందు, నవీన్, నరేష్, కౌన్సిలర్లు ఉన్నారు. పాలకవీడు : మండల వ్యాప్తంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భూక్యా గోపాల్, జెడ్పీటీసీ మాళోతు బుజ్జి మోతీలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎన్వి.సుబ్బారావులు తమ అనుచరులతో కలిసి జాన్పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డిగూడెంలో 220 మంది కేజీబీవీ విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి నీమానాయక్, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్రావు, బూషిపల్లి వెంకట్రెడ్డి, భాస్కర్రెడ్డి, సైదులు, నాగరాజు, నాగయ్య, సుబ్బుగౌడ్, నాగేశ్వరరావు, సందీప్, రాము, మధు, శేషు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు ఫర్నీచర్ బహూకరణ
మునగాల : వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవేటి వెంకటగురుమూర్తి పుట్టినరోజు సందర్భంగా గురువారం మునగాల మండలంలోని గణపవరంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాసవీ క్లబ్ మునగాల శాఖ ఆధ్వర్యంలో ఫర్నీచర్ (ఆఫీసు టేబుల్, ఛైర్), స్టేషనరీతో పాటు విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు తల్లాడ ఉపేందర్ మాట్లాడుతూ వాసవీ క్లబ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం వెంకటగురుమూర్తిని ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామపెద్దలు కొండపల్లి నరసింహారావు, వాసవీ క్లబ్ అధ్యక్షుడు కాపర్తి మణికంఠకుమార్, క్లబ్ జిల్లా బాధ్యులు పీవీడీ.ప్రసాద్, జిగిని ప్రసాద్, జెడ్సీ బెలిదీభరత్, షేక్ రమేష్, చిల్లంచర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ధర్నాను విజయవంతం చేయాలి
కోదాడరూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28 గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఎల్పీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాణోతు బాబునాయక్ పిలుపునిచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో ఆయన ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన తండాలను, గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామాలు గుర్తించాలని, మైదాన ప్రాంత ఎస్టీ గిరిజనుల కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని గిరిజనులు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములను శాశ్వత పట్టాలు ఇవ్వడంతో పాటు పలు డిమాండ్లతో ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, ఎస్ఎస్రావు, పంది తిరపయ్య, గంగధరరావు, వీరస్వామి, రహీం తదితరులు ఉన్నారు. -
నడిగూడెం డిప్యూటీ తహసీల్దార్గా హేమలత
నడిగూడెం : నడిగూడెం డిప్యూటీ తహసీల్దార్గా హేమలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. మునగాలకు డిప్యూటేషన్పై వచ్చి విధులు నిర్వహిస్తున్న హేమలత నడిగూడెంకు బదిలీపై వచ్చినట్లు నడిగూడెం తహసీల్దార్ హేమామాలిని విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని వినతిమోతె : మోతె మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజు గురువారం మోతె మండల కేంద్రంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం అందజేశారు. మోతె మండలంలో 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, ఇంటర్ కాళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోతె మండలానికి ఇంటర్ కళాశాలతో పాటు వసతి గృహం కూడా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్– 2, ఎల్–3 కాలువలకు సీసీ లైనింగ్ నిర్మించాలిచిలుకూరు : మండలంలోని ముక్త్యాల కాలువకు అనుసంధానంగా ఉన్న ఎల్– 2 ఎల్– 3 మైనర్ కాలువులకు సీసీ లైనింగ్ నిర్మించాలని స్థానిక టీడీపీ నాయకులు బుధవారం రాత్రి చిలుకూరుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువల పరిధిలో 600 మంది రైతులు 2000 ఎకరాల భూమి సాగు చేస్తున్నారని, కాలువలకు సీసీ లైనింగ్ నిర్మిస్తే చివరి భూములకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా సోమయ్య, కొల్లు సత్యనారాయణ, మస్తాన్, సురేష్, నాయకులు పాల్గొన్నారు. ఆలయ భూమి కౌలు వేలంగరిడేపల్లి : మండలంలోని పొనుగోడు గ్రామంలో గల శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన 3 ఎకరాల 33 గుంటల వ్యవసాయ భూమి కౌలు వేలం పాటను గురువారం ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారి రమేష్, ఆలయ మేనేజర్ కొంకపాక మృత్యుంజయ శాస్త్రిలు మాట్లాడారు.. ఆలయ భూములు రెండు సంవత్సరాలు కౌలు చేసుకునేందుకు వేలం పాట నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేలం పాటను గ్రామానికి చెందిన మంగ ప్రభాకర్ రూ. లక్ష 75 వేల 900లకు దక్కించుకున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం పంటల ప్రణాళిక ప్రకటించాలిమోతె : ప్రభుత్వం పంటల ప్రణాళిక ప్రకటించాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల సైదులు కోరారు. ఈమేరకు గురువారం మోతె తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రుతుపవనాలు వస్తున్నందున విత్తనాల కోసం రైతులు పడికాపులు కాస్తున్నారన్నారు. విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలని కోరారు. అన్ని పంటలకు ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట ఏఐకేఎంఎస్ నాయకులు కొమ్ము వెంకన్న, ఆవుల యలమంచి, బాలాజీ, లింగ ఉన్నారు. కూరగాయల ధరలను నియంత్రించాలినేరేడుచర్ల : కూరగాయల ధరలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనుంజయనాయుడు అన్నారు. ప్రభుత్వం కూరగాయల ధరలను నియంత్రించకపోవడంపై గురువారం నేరేడుచర్లలో నిరసన తెలిసి మాట్లాడారు. కూరగాయలు ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే లాట్ మార్కెట్ ధరలపై చర్యలు తీసుకొని సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. నాయకులు వెంకట్, శ్రీను, నాగేశ్వర్రావు, రామస్వామి, మట్టయ్య, సైదానాయక్, గోర్యానాయక్ ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత నేరేడుచర్ల : మున్సిపాలిటీ పరిధిలో జాన్పహాడ్ రోడ్డు విస్తరణలో భాగంగా ఎల్టీ లైన్ కరెంటు తీగల మరమ్మతులు చేపడుతున్నందు న శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరాఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ పందిరి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ
చిలుకూరు : మండల వ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థులకు గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ గిరిబాబు మాత్రల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు కరుణాకర్రెడ్డి, గుజ్జుల నర్సిరెడ్డి, డాక్టర్ ప్రియాంక, సీహెచ్ఓ వినోద్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నడిగూడెం : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం తహసీల్దార్ హేమామాలిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్డి.ఇమామ్, త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లక్ష్మీప్రసన్న, స్థానిక పల్లె దవాఖానా వైద్యుడు హరినాథ్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది కళావతి, కృష్ణమూర్తి, రాధ, మహేశ్వరి, అధ్యాపకులు ఉష పాల్గొన్నారు. నులిపురుగుల నిర్మూలనకు సహకరించాలిహుజూర్నగర్ : పిల్లల్లో ఎదుగుదలకు అవరోధంగా నిలిచే నులిపురుగుల నిర్మూలనకు అందరూ సహకరించాలని మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా గురువారం హుజూర్నగర్లోని ఏవీఎం పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, ఇందిరాల రామకృష్ణ, లలిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించొచ్చు నేరేడుచర్ల : విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించవచ్చని మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్ అన్నారు. గురువారం నేరేడుచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జయ, మున్సిపల్ కమిషనర్ అశోక్రెడ్డి, కౌన్సిలర్ నాగయ్య, పీహెసీ వైద్యాధికారిని నాగిని, సూపర్వైజర్లు శ్రీనివాస్, శ్యాంసుందర్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు సైదా, సునిత, ఆశా వర్కర్లు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో..మున్సిపాలిటీలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. హెచ్ఎం అనసూర్య, లయన్స్క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకరెడ్డి, ఉపాధ్యాయురాలు మజిదాబేగం, లయన్స్క్లబ్ సభ్యులు రామస్వామి, సైదులు, శ్రీను ఉన్నారు. మఠంపల్లి : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మఠంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఎంపీడీఓ జానకిరాములు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్నాయక్లు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. భీల్యానాయక్తండాలోని పాఠశాలలో జెడ్పీటీసీ బానోతు జగన్నాయక్ పిల్లలకు మాత్రలు వేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రాము, ఎంఎన్ఓ వేణు, ఉపాధ్యాయులు మస్తాన్, వైద్య, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వలంటీర్లు పాల్గొన్నారు. మునగాల : మండలంలోని మునగాల, రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, విద్యార్థులకు గురువారం ఆల్బెండజోల్ మా త్రలు పంపిణీ చేశారు. ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, మండల వైద్యాధికారి పోలేపల్లి రవీందర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సి బ్బంది, ఆశావర్కర్లు, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు. -
‘మోతె’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
మోతె : ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో మోతె మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. గురువారం మోతె మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ ముప్పాని ఆశ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయా.. లేదా అనే విషయంపై రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. మండలంలో పెండింగ్ పనుల వివరాలు తనకు తెలపాలన్నారు. మండలంలో రోడ్ల అభివృద్ధికి రూ.5 కోట్లను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మంజూరు చేసినట్లు తెలిపారు. నామవరంలో పశువైద్య ఉప కేంద్రం నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి నివేదిక అందించాలన్నారు. విద్యుత్ ఏఈ రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, మరోసారి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని ఏఈని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. మండంలో ప్రజల నుంచి వచ్చిన ప్రజా సమస్యల ధరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎంపీటీసీలు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సూర్యాపేట జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, జెడ్పీటీసీ పుల్లారావు, ఆర్డీఓ, తహసీల్దార్ సంఘమిత్ర, ఎంపీడీఓ హరిసింగ్నాయక్, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్రెడ్డి, మైనంపాటి గుర్వారెడ్డి, మధుసుదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట కోదాడరూరల్ : మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో రూ.25 లక్షల మంత్రి నిధులతో చేపట్టిన ఖబరస్తాన్ ప్రహరీ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న ఇమామ్, మౌజమ్ల గౌరవ వేతనాన్ని ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. పనుల్లో అలసత్వం వహించకుండా నాణ్యత ప్రమాణాలతో వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టీపీసీసీ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎంఏ జబ్బార్, కౌన్సిలర్లు నెమ్మాది వీరబాబు, మామిడి పద్మావతి, సంపెట రవి, మామిడి రామారావు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు మునగాల : మండలంలోని బరాఖత్గూడెంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు గురువారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల ఇంద్రారెడ్డి, ముదిరెడ్డి, కనికిరెడ్డి, దొంతిరెడ్డి రామనర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలె సామియేలు, నాయకులు రెణబోతు వీరారెడ్డి, చేగొండి శ్రీనివాస్ యాదవ్, అలుగుబెల్లి కరుణాకర్రెడ్డి, గోవింద రామారావు, షేక్ పాషా పాల్గొన్నారు. జానకమ్మ మృతి బాధాకరంమునగాల : కలకోవకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జూకూరి గుర్వయ్య భార్య జానకమ్మ (72) మృతి బాధాకరమని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుధవారం అనారోగ్యంతో జానకమ్మ మృతిచెందారు. గురువారం కలకోవలో జరిగిన ఆమె అంత్యక్రియలకు పద్మావతి హాజరై నివాళులర్పించారు. అనంతరం గురవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పనస విజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పనస శంకర్, సీనియర్ నాయకులు దొంగరి అప్పారావు, పనస సింహాద్రి, పనస చిన్న శ్రీను, మాజీ సర్పంచ్ చిర్రా శ్రీనివాస్, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి -
సీపీఎం నాయకుడు మృతి
హుజూర్నగర్రూరల్ : మండలంలోని గోపాలపురంలో సీపీఎం నాయకుడు గరిడేపల్లి వెంకన్న (62) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఎంపీటీసీ చీకూరి రాజారావు, మాజీ సర్పంచ్ శాసనాల నాగసైదయ్య, న్యాయవాది కాల్వ శ్రీనివాసరావులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు భావితరాల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం పాలకవీడు : భావితరాల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీఓ దయాకర్ అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పాలకవీడు మండలంలోని అన్ని పాఠశాలల్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి నల్వరి శ్రీనివాస్, ఎంఎల్హెచ్పీ రమ్య, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మాత్రల పంపిణీని జయప్రదం చేయాలిహుజూర్నగర్రూరల్ : ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. గురువారం మండలంలోని లింగగిరిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం పి.శ్రీనివాసరావుతో కలిసి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి మాట్లాడారు. కార్యక్రమంలో కార్యదర్శి సోనార్, సీహెచ్ఓ పద్మ, ఏఎన్ఎం అలివేలుమంగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు మంచి స్పందన
అర్వపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మండల విద్యాశాఖ అధికారి బి.బాలునాయక్ చెప్పారు. జాజిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ కుంభం ఉషారాణినాగరాజు కుమార్తె మోక్షను గురువారం గ్రామ జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు కొత్తగా 33 అడ్మిషన్లు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుంభం ఉషారాణినాగరాజు, ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, యోగాచార్య డాక్టర్ పగిళ్ల సైదులు, మంజుల, ఇందిర, ఉమ, ప్రసన్నకుమారి, రాజ్యలక్ష్మి, రజని, పీడీ సోమయ్య, యాదగిరి, వెంకటేశ్వర్లు, లింగస్వామి, వీరప్రసాద్, వెంకట్, చంద్రకళ, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆల్బెండజోల్ మాత్రలతో పిల్లల్లో ఎదుగుదల
నాగారం : విద్యార్థులలో శారీరక, మానసిక ఎదుగుదలకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ మాత్రలను 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వి.మల్లయ్య, మండల వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్, ఏఎన్ఎం నాగమ్మ, ఉపాధ్యాయులు వెంకటమల్లు, వీరేష్, ఆశకార్యకర్తలు రేణుక, రోజా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి : ప్రతి ఆరు నెలలకు ఒకసారి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పి.వెంకటరమణ అన్నారు. గురువారం తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని మల్లెల వందన, సీహెచ్ఓ బిచ్చునాయక్, నర్సింహారెడ్డి, విజయ్ పాల్గొన్నారు. అనంతారం మోడల్ స్కూల్లో.. 1–19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ శాగంటి అనసూయ రాములు అన్నారు. శనివారం అనంతారం మోడల్ స్కూల్లో, తొండ ప్రాథమిక పాఠశాలలో వైద్య శాఖ ఆధ్వర్యంలో మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత, వైద్యాధికారిని మల్లెల వందన, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మండల విద్యాధికారి శాంతయ్య, సీహెచ్ఓ బిచ్చునా యక్, ఉపాధ్యాయులు అశోక్రెడ్డి, సూపర్వైజర్ స్వ రూపాకుమారి, ప్రిన్సిపాల్ బాలరాజు పాల్గొన్నారు. జిల్లాలో 2,13,215మంది పిల్లలకు..అర్వపల్లి : నులి పురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 2,13,215 మంది పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ చెప్పారు. అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో గురువారం నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యాసంస్థలతో పాటు ఇంటింటికీ తిరిగి ఈ నెల 27 వరకు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సీహెచ్.మణిదీప్, హెచ్ఎం ఎం.విజయలక్ష్మి, ఏఎన్ఎం జ్యోతి, చిగుర్ల నర్సయ్య, ఎంపీహెచ్ఏ వీరయ్య, పీఈటీ లింగాల రవి, ఆశా కార్యకర్త ఎం.స్వరూప తదితరులు పాల్గొన్నారు. అర్వపల్లిలోని కేజీబీవీలో..జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా గురువారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వపల్లిలోని కేజీబీవీలో బాలికలకు మండల వైద్యాధికారి డాక్టర్ చిలుకూరి మణిదీప్ మాత్రలు వేశారు. ఈ నెల 27 వరకు మాత్రల పంపిణీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి నాగరాణి, ఏఎన్ఎం జ్యోతి, ఆశా కార్యకర్త స్వరూప, సీఆర్టీలు పాల్గొన్నారు. పెన్పహాడ్ : పౌష్టికాహారం తీసుకున్నట్లయితే నులిపురుగులను అరికట్టవచ్చని మండల వైద్యాధికారి స్రవంతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నకిరేకంటి రవి, ఎంపీఓ నరేష్, ఎస్ఓ ఆసియా భేగం, పీహెచ్ఎన్ అనంతలక్ష్మి, హెచ్ఈఓ చంద్రశేఖరరాజు, పంచాయతీ కార్యదర్శి శివ, ఏఎన్ఎం వీరమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి : ిపల్లల ఎదుగుదలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని ఎంఈఓ బోయిని లింగయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, ఎంపీఓ భీంసింగ్, హెచ్ఈఓలు సముద్రాల సూరి, రవి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ సురేష్కుమార్, పీహెచ్ఎన్ సైదమ్మ, జానకమ్మ, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎస్) : విద్యార్థులలో నులిపురుగుల నివారణతో రక్త హీనతను అరికట్టవచ్చునని డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ చంద్రశేఖర్ అన్నారు. గురువారం నెమ్మికల్లులో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వీరేంద్రనాఽథ్, సూపర్వైజర్ రంగమ్మ, పూలమ్మ, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చివ్వెంల : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, వైద్యాధికారి జి.భవాని, హెచ్ఎం కళారాణి, హెల్త్ సూపర్వైజర్ శిరోమణి, ఏఎన్ఎం భిక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. నూతనకల్లు : విద్యార్థులలో నులిపురుగుల నివారణతో రక్త హీనతను అరికట్టవచ్చని ఎంపీటీసీ పన్నా ల రమామల్లారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, ఎంఈఓ రాములు నాయక్, మండల వైద్యాధికారి అశ్రితారెడ్డి, ఎంపీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు. మద్దిరాల : నులిపురుగుల కారణంగా పిల్లలలో శారీరక ఎదుగుదల మందగిస్తుందని జెడ్పీటీసీ కన్న సురాంభ వీరన్నగౌడ్ అన్నారు. గురువారం జి.కొత్తపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నగేష్, ఏఎన్ఎం పల్లవి, వైద్యసిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గృహజ్యోతి లబ్ధి కొందరికేనా..
అర్వపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అర్హులందరికీ అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ సందర్భంగా జరిగిన తప్పిదాలు అర్హులపాలిట శాపంగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని అర్హతలు ఉన్నా 200యూనిట్ల లోపు విద్యుత్ను ఉచితంగా పొందే అవకాశం చాలామంది కోల్పాయారు. ఆరు గ్యారంటీల పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గతేడాది డిసెంబర్ 8 నుంచి ఈఏడాది జనవరి 6 వరకు గ్రామ గ్రామాన ప్రజాపాలన సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. అయితే దరఖాస్తు పత్రాల్లో పథకాల లబ్ధి కోసం కేవలం టిక్ పెడితే చాలు అని చెప్పడంతో దరఖాస్తుదారులు అదే పని చేశారు. కాగా డేటా ఎంట్రీ నమోదులో కొన్ని పొరపాట్లను సరిచేసేందుకు నాట్ మ్యాచింగ్ ఆప్షన్ ఇవ్వడంతో సరిచేయగలుగుతున్నారు. అయితే నాట్ అప్లయ్ సమస్యతో అర్హత కోల్పోయిన దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సమస్యతో లబ్ధిపొందలేక పోయిన వారికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎంపీడీఓ కార్యాలయాల్లో సిబ్బంది ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాగా ఎడిట్ ఆప్షన్ ఇస్తే తప్ప తామేమి చేయలేమని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఇలా..జాజిరెడ్డిగూడెం మండలంలో సుమారు 6,700 వరకు గృహవిద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే వీటిలో 4వేల వరకు కనెక్షన్లకు గృహజ్యోతి పథకం వర్తించింది. కాగా పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి గృహజ్యోతి పథకం వర్తించని కొందరు అర్హులు కూడా తప్పని పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ముగియడంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి నిత్యం అనేక మంది గృహజ్యోతి పథకం కోసం వచ్చిపోతున్నారు. కాగా నాట్ మ్యాచింగ్ ఆప్షన్ వాటికి మాత్రమే సరిచేస్తున్నారు. అనేక మంది అర్హులు తమకెందుకు ఈ పథకం వర్తించడం లేదని కార్యాలయ సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో అర్హులైన వారికి ఏమి చెప్పాలో అర్థం కాక కార్యాలయ ఇబ్బంది పడుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలో 6,700 గృహ కనెక్షన్లకు గాను 4 వేలకే వర్తింపు ఎడిట్ ఆప్షన్ సమస్యతో పథకానికి దూరమవుతున్న లబ్ధిదారులు అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని ప్రజల వేడుకోలుగృహజ్యోతి వర్తించలేదు ప్రజాపాలనలో దరఖాస్తు చేశాను. రశీదు కూడా ఇచ్చారు. అయితే ఇంతవరకు గృహజ్యోతి పథకం వర్తించలేదు. ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే నాట్ అప్లయ్ అని చెబుతున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ప్రతినెలా 100 యూనిట్లకు మించి విద్యుత్ను వాడుకోవడంలేదు. – బండారి సోమశేఖర్, జాజిరెడ్డిగూడెంమీటర్ నంబర్ వేయలేదంటున్నారుప్రజాపాలనలో ఉచిత కరెంట్ కోసం దరఖాస్తు చేశాను. అయితే రశీదు కూడా ఇచ్చారు. కానీ విద్యుత్ మీటర్ నంబర్ వేయలేదు. దీంతో కరెంట్ బిల్లు నెల నెలా వస్తోంది. అయితే అర్వపల్లిలో ఆఫీసుకు వెళ్లగా ఇంకా పైనుంచి దీనిపై మాకు ఏమిచెప్పడం లేదని అంటున్నారు. పథకం కోసం రోజుల తరబడి పని వదులుకొని తిరగాల్సి వస్తోంది. – సైదుల మంగమ్మ, జాజిరెడ్డిగూడెం -
వన నర్సరీలో మొక్కల పరిశీలన
అర్వపల్లి : తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఉపాధిహామీ పథకం ఏపీఓ చిలుక ఉపేందర్ కోరారు. గురువారం మండల పరిధిలోని అడివెంల గ్రామ వననర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ విడత హరితహారంలో జాజిరెడ్డిగూడెం మండలంలో 1,42,744 మొక్కలను నాటాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించారని చెప్పా రు. వర్షాలు సమృద్ధిగా పడగానే మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీ నగేష్, ఫీల్డ్ అసిస్టెంట్ చెరుకు గంగ, మేట్లు, కూలీలు పాల్గొన్నారు. -
హరితహారానికి మొక్కలు సిద్ధం
● వరుణుడి కోసం ఎదురుచూపు ● చివ్వెంల మండలంలోని 31 జీపీల్లో 3.10 లక్షల మొక్కల పెంపకంచివ్వెంల : గత ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హరితహారంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున నర్సరీని ఏర్పాటు ిచేసి వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం అన్ని గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైతే ఈ నెలాఖరు వరకు లేదా జూలైలో మొక్కలు నాటేందుకు ఆయా గ్రామ పంచాయతీల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో నర్సరీలో 10 వేల మొక్కలు..చివ్వెంల మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామ పంచాయతీలో 10 వేల మొక్కల చొప్పున మొత్తం 3.10 లక్షల మొక్కలను పెంచారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా బోర్ల ద్వారా, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నీటిని అందించారు. మొక్కలు ఎండకు ఎండిపోకుండా గ్రీన్ నెట్ ఏర్పాటు చేశారు. పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వివిధ రకాల మొక్కలు..ఆయా గ్రామపంచాయతీ పరిధిల్లోని నర్సరీల్లో పండ్ల, పూల మొక్కలు, అటవీ మొక్కలు పెంచుతున్నారు. జామ, ఉసిరి, అల్లనేరేడు, చింత, మామిడి, సీతాఫలం, దానిమ్మ, వంటి మొక్కలతోపాటు గులాబీ, మందారం, మల్లె పూల మొక్కలను పెంచుతున్నారు. వాటితోపాటు రోడ్లకు ఇరువైపులా నాటేందుకు వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంతో పోల్చితే ఈ సారి ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.వర్షాలు పడితే మొక్కలు నాటుతాం మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. వాటిల్లో ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచాం. అన్ని నర్సరీల్లో ప్రస్తుతం మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఇరుగు నాగయ్య, ఏపీఓ, చివ్వెంల -
మద్దతు ధర పెంపు హర్షణీయం
తుంగతుర్తి : కేంద్ర ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధర పెంచడం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపాక సాయిబాబా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం రాకముందు వరికి క్వింటా ధర రూ.1400 ఉంటే మోదీ రాకతో నేడు రూ. 2300లకు చేరిందని అన్నారు. రైతులకు ఇచ్చి న మాట ప్రకారం రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మహేందర్, ఉప్పుల లింగయ్య, కత్తుల నరేష్ తదితరులు ఉన్నారు. నేడు మున్సిపల్ సమావేశంతిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపల్ కౌన్సి ల్ సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్ హాజరవుతారని తెలిపారు. బాదె రాముకు నివాళిఅర్వపల్లి : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యుడు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బాదె రాము 5వ వర్ధంతిని బుధవారం రాత్రి జాజిరెడ్డిగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాము చిత్ర పటానికి పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల సమస్యల సాధనకై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి రాము అని అన్నారు. అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడని తెలిపారు. రాము ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఎల్సీ నాయకుడు పోలెబోయిన పెదలింగయ్య, వడకాల బయ్యన్న, మధుకర్, సురేష్, విజయ్, వీరేష్, కృష్ణమూర్తి, రంగు వీరేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ కుల గణన చేపట్టాలిఅర్వపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ కులగణన చేపట్టాలని ఫూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపకుడు ఈదు రు వీరపాపయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అర్వపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకోవాలని కోరారు. బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయమై ఇప్పటి వరకు లెక్కలు తేల్చకపోవడం శోచనీయమన్నారు. కులగణన చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్కల సురేందర్, బి.తిరుపతి, గుండెబోయిన ఆంజనేయులు, రాంబాబు, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభ్యాస దీపిక పుస్తకాల పంపిణీఅర్వపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే అభ్యాస దీపిక పుస్తకాలను సద్విని యోగం చేసుకోవాలని ఎంఈఓ బి. బాలు నాయక్ కోరారు. మండల పరిధిలోని తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్లో గురువారం 43 మంది పదవ తరగతి విద్యార్థులకు అభ్యాస దీపిక పుస్తకాలను అందజేశారు. గైడుల మాదిరిగా ఈ పుస్తకాలు పిల్లలకు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం వర్ధెల్లి కృష్ణయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరపత్రం ఆవిష్కరణకోదాడరూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఎల్పీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాణోతు బాబునాయక్ పిలుపునిచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన తండాలను, గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని అన్నారు. మైదాన ప్రాంత ఎస్టీ గిరిజనుల కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజనులు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, ఎస్ఎస్రావు, పంది తిరపయ్య, గంగధరరావు, వీరస్వామి, రహీం తదితరులు పాల్గొన్నారు. -
మోతె మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
మోతె : ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో మోతె మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. గురువారం మోతె మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ ముప్పాని ఆశ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయా.. లేదా అనే విషయంపై రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. మండలంలో పెండింగ్ పనుల వివరాలు తనకు తెలపాలన్నారు. మండలంలో రోడ్ల అభివృద్ధికి రూ.5 కోట్లను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మంజూరు చేసినట్లు తెలిపారు. నామవరంలో శిథిలావస్థలో ఉన్న పశువైద్య ఉప కేంద్రం నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి నివేదిక అందించాలన్నారు. విద్యుత్ ఏఈ రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, మరోసారి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని ఏఈని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీటీసీలు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, జెడ్పీటీసీ పుల్లారావు, ఆర్డీఓ, తహసీల్దార్ సంఘమిత్ర, ఎంపీడీఓ హరిసింగ్నాయక్, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్రెడ్డి, మైనంపాటి గుర్వారెడ్డి, మధుసూదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీలపై దాడులను నివారించాలి
భానుపురి : గ్రామీణ వైద్యులపై జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తున్న దాడులను నివారించాలని సూర్యాపేట జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనర్సయ్య, జనరల్ సెక్రటరీ పొలిశెట్టి రాజేందర్ అన్నారు. గురువారం సూర్యాపేటకు వచ్చిన నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలాంటి నోటీసులు లేకుండా దాడులు నిర్వహిస్తూ గ్రామీణ వైద్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని, ఈ విషయమై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వైద్యులకు 1273 జీఓ ద్వారా శిక్షణ ఇచ్చినప్పటికీ నేటి వరకు సర్టిఫికెట్లు అందజేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొప్పుల వేణా రెడ్డి, ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రహమతుల్లా, ఎల్లె వెంకటేశ్వర్లు, చిలువేరు చంద్రయ్య, జరిపోతుల లక్ష్మణగౌడ్, రాజబాబు, ఎస్.కె నాగుల్మీరా, వెంకన్న, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి మృతి
నాగారం : మండల పరిధిలోని ఫణిగిరి గ్రామ జూని యర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన జోగునూరి జిందగిరి(41) గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. జిందగిరి ఇటీవల గుండెపోటుకు గురి కావడంతో పెరాలసిస్ వచ్చింది. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మృతి చెందాడు. జిందగిరి మృతిపట్ల ఎంపీపీ కూరం మణివెంకన్న, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, ఎంపీడీఓ ధార శ్రీనివాస్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సంతాపం వ్యక్తం చేశారు. ఫణిగిరి జీపీ సిబ్బంది ఆధ్వర్యంలో మృతుడి స్వగ్రామమైన రావులపల్లిలో మృతుడి చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో పంచాయతీ కార్యదర్శులు వీరేందర్, జీపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
23న తొట్ల మల్సూర్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ
పెన్పహాడ్: ఈనెల 23న నూతనకల్లో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తొట్ల మల్సూర్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ ఉంటుందని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం పెన్పహాడ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనకల్ సాయిరాం ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అబ్బగాని భిక్షం, తుమ్మల సైదయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఉయ్యాల నగేష్, పులుసు సత్యం, శిగ వెంకన్న, శ్రీను, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
7న మాదిగల ఆత్మగౌరవ కవాతు
కోదాడరూరల్ : వచ్చే 7న వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహించనున్నట్లు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఉప కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పంపిణీ చేయాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని ప్రారంభించి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు ఏపూరి రాజుమాదిగ, వడ్డెపల్లి కోటేష్ మాదిగ, సత్యరాజు మాదిగ, మిట్టగణుపుల మోషయ్య మాదిగ, కుక్కల కృష్ణ, నవీన్కుమార్, ఏసోబు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య కోరారు. గురువారం సూర్యాపేటలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు నవీన్ అధ్యక్షతన నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని, వారి సమస్యలను విస్మరించిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మూడోదఫా అధికారంలోకి రాగానే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తామని ప్రకటించడాన్ని ఐఎఫ్టీయూ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కామల్ల నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, కామల్ల శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి వి. నరసింహా రావు, జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
ఫిట్నెస్పై కేర్లెస్!
నిబంధనలు పాటించకపోతే కేసులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కచ్చితంగా తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. జిల్లాలో ఇంకా 149 వరకు ఫిట్నెస్కు రాని బస్సులు ఉన్నాయి. వారు వెంటనే వచ్చి బస్సులకు ఫిట్నెస్ చేయించుకొని అర్హత సర్టిఫికెట్ పొందాలి. ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిప్పితే కేసులు నమోదు చేసి బస్సు సీజ్ చేస్తాం. 15ఏళ్లు దాటిన బస్సులను పాఠశాల విద్యార్థుల కోసం తిప్పవద్దు. – ఎస్.జయప్రకాష్రెడ్డి, ఇన్చార్జి, డీటీఓ, సూర్యాపేట సూర్యాపేటటౌన్ : ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫిట్నెట్ లేకుండా బస్సులు నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నాయి. స్కూళ్లు తెరిచి 10రోజులు కావొస్తున్నా జిల్లాలో ఇంకా 149 బస్సులకు ఫిట్నెట్ పరీక్షలు చేయించలేదు. జిల్లాలో 515 స్కూల్ బస్సులు జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు 515 ఉన్నాయి. వీటిలో విద్యాసంస్థల యాజమాన్యాలు ఇప్పటి వరకు 366 బస్సులకు మరమ్మతులు చేయించి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొని వచ్చాయి. కాగా అధికారులు బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, వాహన కండీషన్, టైర్లు, సీట్లు, ఫుట్బోర్డు, లైట్లు, రేడియం, ఇంజిన్ కండీషన్, బ్రేకుల కండీషన్ ఇవన్నీ తనిఖీ చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఇంకా 149 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంది. అయితే ఇందులో 15ఏళ్లు దాటిన బస్సులు ఉండొచ్చని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. 15ఏళ్లు దాటితే స్కూల్ బస్సులకు అనుమతి ఉండదని, వాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయబోమని అధికారులు పేర్కొంటున్నారు. 12 బస్సులపై కేసు నమోదు జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి రోజూ అధికారులు సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రైవేట్ స్కూళ్ల బస్సులు ఫిట్నెస్ లేకుండా పిల్లలను తీసుకెళ్తే తనిఖీ చేసి కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్టు తెలిపారు. ఫ బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించడంలో ప్రైవేట్ స్కూళ్ల నిర్లక్ష్యం ఫ ఎన్నిసార్లు చెప్పినా పట్టింపులేని తనం ఫ ఫిట్నెస్ పరీక్షలు చేయించని బస్సులు 149 ఫ తనిఖీలు ముమ్మరం చేసిన ఆర్డీఏ అధికారులు ఫ ఇప్పటి వరకు 12 బస్సులు సీజ్ -
జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
నడిగూడెం : జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జానపాటి కృష్ణయ్య కోరారు. గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేసి, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ప్రిన్స్పాల్ పిచ్చిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు . మట్టపల్లిలో నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో గురువారం విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చన, నిత్యహోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు పూర్తిగావించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశానంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి సూర్యాపేటటౌన్ : పోలీస్ సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు సూచించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన చట్టాలపై పోలీస్ సిబ్బందికి ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉంటే కోర్టుల్లో కూడా కేసులను సులభంగా గెలవవచ్చని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ నిబంధనలు పాటించని, అనుమతులు లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(పీడీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఎఫ్ నాయకులు ఎం.వినయ్కుమార్, ఎస్.నవీన్, ఉదయ్, అరుణ్ పాల్గొన్నారు. పారాఫిట్ దీపాల పునరుద్ధరణ యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని పారాఫిట్ వాల్పై విద్యుత్ దీపాల పునరుద్ధరణకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలు కొనుగోలు చేసి పారాఫిట్ వాల్పై ఏర్పాటు చేశారు. కాగా నిర్వహణ లేక రెండేళ్లకే మూలనపడ్డాయి. దీనిపై ‘మూలనపడ్డ పారాఫిట్ లైట్లు’ శీర్షికతో గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాడైపోయిన విద్యుత్ దీపాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎలక్ట్రీషియన్లు కొన్ని లైట్లను బిగించారు. మిగతావి త్వరలో వినియోగంలోకి తెస్తామని అధికారులు తెలిపారు.