-
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం) : రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ అన్నపూర్ణకానీలో నివాసం ఉంటున్న కందుల రమేశ్(53) శుక్రవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే జీవితంపై విరక్తి చెందిన రమేశ్.. తన ఇంటి ఎదుటల గల పశువుల కొట్టలో కర్రకు నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు అయ్యాయి. కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రైల్వే ఉద్యోగి..రామగుండం: స్థానిక రైల్వే ఓవర్ హాలింగ్షెడ్లో సీనియర్ టెక్నీషియన్ సిమ్మని శ్రీనివా స్(57) శుక్రవారం ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవా రం రైల్వేకాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై సతీ శ్ కథనం ప్రకారం.. శ్రీనివాస్ తన పిల్లలను ఉ న్నత చదువులు చదివించేందుకు, వ్యక్తిగత ఖ ర్చులకు కొంత అప్పు చేశాడు. వడ్డీ చెల్లించలేకపోవడం, అవసరాల కోసం మరికొంత అప్పు చేయడంతో చెల్లించే దారిలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈనేపథ్యంలో భార్య అరుణతో తరచూ అప్పు విషయం చెబుతూ బాధపడే వాడు. ఈక్రమంలో శుక్రవారం తన బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన భార్య.. ఇరుగుపొరుగు వారిని పిలిపించి కిందకు దింపి చూడగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు అభిరామ్, కూతురు శ్రీజ ఉన్నారు. పిల్లలు ఇద్దరూ అవివాహితులు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
గూడ్స్రైలు నుంచి బియ్యం చోరీ
రామగుండం: రైల్వేస్టేషన్లో నిలిపి ఉంచిన గూడ్స్వ్యాగన్లోంచి బియ్యం చోరీ కేసులో గుమ్మల భీమయ్య(తిర్యాణి), జనగామ దినేశ్(మంచిర్యాల), కున్సోతు వెంకటేశ్, (మంచిర్యాల), అన్నెల వంశీ(మంచిర్యాల)ని రైల్టే ప్రొటక్షన్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ సీఐ సురేశ్గౌడ్ కథనం ప్రకారం.. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇటీవల మంచిర్యాల రైల్వేస్టేషన్లో నిలిపి ఉంచిన గూడ్సు రైలు వ్యాగన్లోని బియ్యం బస్తాలు చోరీ చేశారు. వాటిని ఆటోల్లో మంచిర్యాల మార్కెట్లో విక్రయించేందుకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ నిందితులను పట్టుకున్నారు. నిందితులతోపాటు 23 బియ్యం బస్తాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రైల్వే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. కేసు చేధించిన ఆర్పీఎఫ్ శేఖర్రెడ్డి (ఏఎస్ఐ), ఐలయ్య (హెడ్కానిస్టేబుల్), సుమన్ (కానిస్టేబుల్) తదితరులను సీఐ అభినందించారు. -
దురుసుగా ప్రర్తిస్తున్నారు..
ప్రసూతి, ఇతర అత్యవసర కేసులను జీజీహెచ్కు తీసుకొస్తే పట్టించుకోవడం లేదని, పైగా కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పేషెంట్లను తీసుకొచ్చిన తాము ఎవరిని కలువాలో కూడా అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బంది ఆడవారు అనికూడా చూడకుండా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గర్భిణులకు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక బుక్లెట్ను కాదని, జీజీహెచ్లో డాక్టర్లు నోట్బుక్లో పరీక్షల వివరాలు నమోదు చేయడం ద్వారా అయోమయం నెలకొంటోందని డీఎంహెచ్తోపాటు మెడికల్ ఆఫీసర్లు ఆరోపించారు. యూపీహెచ్సీల నుంచి కేసును రెఫర్ చేస్తే పేషెంట్ సంబంధీకులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సులభంగా ఎవరిని కలువాలో తెలిపేందుకు ప్రత్యేకంగా ఒక నోడల్ పర్సన్ను ఏర్పాటు చేయాలని, అలాగే ఏఏ విభాగాల్లో ఏ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉంటాడో తెలుసుకోవడానికి ఓపీ విభాగాల నంబర్లను విడుదల చేయాలని కోరారు. స్పందించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్.. వెంటనే చర్యలు తీసుకుంటామని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల కోసం జీజీహెచ్లో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఒక్కో స్పెషలిస్టు డాక్టర్ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కృపాబాయితోపాటు ఆర్ఎంవోలు, హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ షాక్తో విద్యార్థి
మంథని: మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడలో బుద్దార్థి వర్షిత్(18) అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి శుక్రవారం కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నవీన్ కుమారుడు వర్షిత్. ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. నవీన్ ఇటీవల తన ఇంటి ఎదుట ఒక గది నిర్మించాడు. లోపలి కరెంట్ మీటర్ను బయట అమర్చేందుకు ఓ ఎలక్ట్రీషియన్తో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో కరెంట్ మీటర్ సర్వీస్ వైరు ఇంటి గోడ మధ్యలో ఉంది. దానిని వర్షిత్ బయటకు లాగేస్తున్నాడు. నవీన్ ఇంట్లో నుంచి బయటకు ఈ వైర్ తోస్తున్నాడు. ఈక్రమంలో వైరు తెగి హర్షిత్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వర్షిత్ను స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నవీన్ ఏకై క కుమారుడు కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
వరకట్నం వేధింపులతోనే ఆత్మహత్య
సుల్తానాబాద్రూరల్: నీరుకుల్ల గ్రామానికి చెందిన చిక్కులపల్లి నిర్మల ఈనెల 19న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్ట్మార్టం చేశాక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఏసీపీ ఆస్పత్రిలో విచారణ జరిపారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బపూర్ గ్రామానికి చెందిన నిర్మలను సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన తిరుపతిరావు ఇచ్చి నాలుగేళ్లక్రితం వివాహం జరిపించారని ఏసీపీ తెలిపారు. రెండేళ్లపాటు వీరి సంపారం బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదనంగా కట్నం కావాలని భర్త శారీరకంగా వేధించడంతో తల్లిగారు రూ.20లక్షలు ఇచ్చారు. మరో రూ.4లక్షలు కావాలని మళ్లీ వేధించేవాడు. ఈక్రమంలో మానస్తాపం చెందిన నిర్మల వ్యవసాయ బావిలో దూకి అత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న బాపురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త తిరుపతిరావు, బావ చందర్రావు, తొడికోడలు పద్మ, ఆడపడచు రజితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరిచారు. తహసీల్దార్ మధుసూదన్రెడ్డి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. వివాహిత బలవన్మరణం ఘటనలో నలుగురిపై కేసు -
రూ.కోటిన్నరతో వ్యాపారి పరార్
సిరిసిల్ల: స్థానిక మార్కెట్ప్రాంతంలో టీవీల షోరూం వ్యాపారి రూ.కోటిన్నరతో ఉడాయించాడు. నమ్మకంగా వ్యాపారం చేసిన సదరు వ్యాపారి రూ.కోటిన్నర వరకు తెలిసిన వారి వద్ద, సమీప బంధువల వద్ద అప్పుగా తీసుకున్నాడు. 15 కిందటే దుకాణానికి, ఇంటికి తా ళం వేసి కుటుంబ సభ్యులతో సహా ఊరి విడిచి వెళ్లాడు. అతనికి డబ్బులు ఇచ్చిన వారు షాపు వద్దకు వెళ్లి ఆరా తీస్తే 15రోజులుగా రావడం లేదని తెలిసింది. అనేకమంది రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. సదరు వ్యాపారి పొరుగు రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లు భావిస్తున్నారు. దొంగల హల్చల్తంగళ్లపల్లి(సిరిసిల్ల): మల్లాపూర్, దేశాయిపల్లె గ్రామాల్లో రెండిళ్లలో గురువారం రాత్రి దొంగ లు చోరీకి పాల్పడ్డారు. మల్లాపూర్కు చెందిన బాస ఎల్లవ్వ ఆరుబయట నిద్రపోతుండా బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. అదే గ్రామానికి చెందిన తాటిపల్లి బాలకిషన్, ఎడ్ల రమేశ్లకు చెందిన రూ.30వే ల విలువైన రెండు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. దే శాయిపల్లెలో తేల్ల పర్శరాములు ఇంట్లో రూ.4వేలు ఎత్తుకెళ్లారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ పరిశీలించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం దుకాణంలో చోరీమల్యాల(చొప్పదండి): మల్యాల మండలం ముత్యంపేట గ్రామం దిగువ కొండగట్టులోని మద్యం దుకాణంలో గురువారం రాత్రి దొంగలు చొరబడి రూ.35వేల నగదు ఎత్తుకెళ్లారు. మల్యాల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపిన వివరాల ప్రకారం.. దిగువ కొండగట్టులోని ఆర్ఆర్ఆర్ వైన్స్ను నిర్వాహకులు గురువారం రాత్రి మూసి ఇంటికెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం రేకులను పగులగొట్టి లోనికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణ నిర్వాహకులు శుక్రవారం ఉదయం తెరిచేందుకు రాగా రేకులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి కౌంటర్ను పరిశీలించగా రూ.35 వేలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుకాణదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల: సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అభివృద్ధి అధికారి సాయిబాబా తెలిపారు. జిల్లాలో డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు జూలై 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జూలై 7న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ప్రవేశం పొందితే లాడ్జింగ్, భోజనం, రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5వేలు ఇవ్వడం జరుగుతుందని, బుక్ఫండ్ నిమిత్తం మరో రూ.5 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. -
ఆర్టీసీ బస్సులో సైకో మహిళ వీరంగం
వేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్లో వేములవాడ నుంచి సిద్దిపేటకు వెళ్లే బస్సులో సైకో మహిళ వీరంగం సృష్టించింది. ఆ మహిళ నుంచి దుర్వాసతన రావడం, అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురిచేసింది. దీంతో ప్రయాణీకులు కండక్టర్కు ఫిర్యాదు చేశారు. మహిళను మందలించిన కండక్టర్, బస్సు డ్రైవర్పై అమె తీవ్ర పదజాలంతో మాటల దాడిచేసింది. విసిగిపోయిన ప్రయాణికులు డయల్ 100కు ఫోన్చేశారు. వేములవాడ బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సును డిపో ముందు గంట సేపు నిలిపారు. అక్కడికి చేరుకున్న బ్లూకోర్టు సిబ్బందిపై ఆ మహిళ కత్తి చూపిస్తూ వీరంగం సృష్టించింది. వెంటనే మహిళ పోలీసులు వచ్చి అమెను బస్సు నుంచి దింపి పంపించారు. అనంతరం అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయింది. దాడి సంఘటనలో ముగ్గురిపై కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటకు చెందిన కులేరి దీప్తికుమార్పై శుక్రవారం అకారణంగా దాడిచేసిన సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కిషన్రావు తెలిపారు. దీప్తికుమార్ తన ఇంటికి వెళ్తుండగా.. జనావాసాల్లో రోడ్డు పక్కన చింతకింది భాను, నిఖిల్ మరో యువకుడు మూత్ర విసర్జన చేస్తున్నారు. దానిపై ప్రశ్నించిన దీప్తికుమార్పై ముగ్గురు కలిసి బీరు సీసాతో దాడి చేశారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి బీభత్సం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. 22 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్జగిత్యాల: ఈనెల 22, 23, 24, 25 తేదీల్లో పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని పాలిసెట్ జిల్లా కన్వీనర్, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ తెలిపారు. పాలిసెట్ విద్యార్థులు తమ సర్టిఫికెట్స్ను వారికి కేటాయించిన స్లాట్కు ఒక అరగంట ముందు కళాశాలకు చేరుకోవాలని అన్నారు. స్టడీ సర్టిఫికెట్లు, ఎస్సెస్సీ మెమో, టీసీ, ర్యాంక్కార్డు, హాల్టికెట్, ఆధార్, కులధ్రువీకరణ పత్రం, రెసిడెన్సీ, ఆదాయం సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. -
వ్యక్తి అదృశ్యం
మల్యాల: దైవ దర్శనానికి కు టుంబసభ్యులతో వచ్చిన మ తిస్థితిమితం లేని వ్యక్తి అదృశ్యమైన సంఘటన మల్యాల మండలంలో చోటుచేసుకుంది. ఎ స్సై కుమారస్వామి కథనం ప్ర కారం.. ఆత్మకూర్ మండలం కామారానికి చెందిన నర్మెట రంజిత్(25) కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చి, ఇక్కడే ఉంటున్నారు. ఈనెల 10 న బహిర్భూమికి వెళ్లిన ఇతను తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లి కవిత శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుక్తొన్నట్లు ఎస్సై తెలిపారు. యోగా మహిళ కోల్సిటీ(రామగుండం): ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని రమేశ్నగర్లో శుక్రవారం మహిళలు ప్రదర్శించిన యోగాసనాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నామని, మానసిక ప్రశాంతత లభిస్తోందని సరిత, శైలజ, మాధవి, మానస, సంధ్య, కె.స్వరూప, అంజలి తదితరులు తెలిపారు. -
అల్ఫోర్స్లో యోగా ఉత్సవ్
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతీఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే యోగా సాధన చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఎన్సీసీ కెడెట్లు పూజశ్రీ, సూర్యప్రకాశ్, యోగా శిక్షకులు లక్ష్మణ్ పాల్గొన్నారు. పారమిత హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పద్మనగర్, మంకమ్మతోటలోని పారమిత విద్యా సంస్థల్లో ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా యోగాసనాలు వేసిన పారమిత విద్యా సంస్థల చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు, తెలంగాణ పోలీస్ యోగా శిక్షకుడు ఉదయ్ కిరణ్రెడ్డి యోగా ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు యోగాసనాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల డైరెక్టర్లు అనూకర్రావు, రమణ, వినోద్ రావు, వీయూఎం.ప్రసాద్, హనుమంతరావు పాల్గొన్నారు. సెయింట్ జార్జ్లో కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్స వం సందర్భంగా విద్యార్థులతో ఆసనాలు వేయించారు. యోగా ప్రాముఖ్యతను శిక్షకుడు ప్రవీణ్ కుమార్ వివరించారు. ఆరోగ్యంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు యోగా దోహదపడుతుందని పాఠశాల చైర్మన్ డా.పి.ఫాతిమారెడ్డి తెలిపారు. ప్రిన్సిపాల్స్ భార్గవ్, నిరంజన్ పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీ
పాలకుర్తి/రామగుండం: రామగుండం, అంతర్గాం, పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల పనితీరు, సిబ్బంది వివరాలు, వివిధ సమస్యలపై అధికారులకు అందించిన అర్జీలు, రికార్డు రూం తదితర అంశాలపై ఆరా తీశారు. మట్టి, ఇసుక అక్రమ తరలింపుపై నిఘా పెట్టాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పాలకుర్తి జెడ్పీ హైస్కూల్ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యాచరణతో విద్యాబోధన చేయాలని సూచించారు. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి తహసీల్దార్లు, ఆర్ఐలు కుమారస్వామి, తిరుపతి, రామ్మోహన్రావు, శ్రీధర్, జ్యోతి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యం
రామగుండం: శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యతని, నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా పెడతామని గోదావరిఖని ఏసీపీ రమేశ్ అన్నారు. స్థానిక హౌసిగ్బోర్డు కాలనీలో శుక్రవారం వేకువజామున కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం(కార్డెన్ సెర్చ్) నిర్వహించారు. పోలీసు బలగాలు ఒక్కసారిగా కాలనీలోకి ప్రవేశించి తనిఖీలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంటింటా సోదాలు చేసిన పోలీసులు.. ధ్రువీకరణ పత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్చేసి సాచారం ఇవ్వాలని కోరారు. సీఐ అజయ్బాబు, ఎస్సై సతీశ్ తదితరులు కాలనీవాసులు పలు అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. స్వీయ రక్షణ కోసం కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
గోదావరిఖనిటౌన్: యోగా సాధనతో సంపూర్ణ ఆ రోగ్యంగా ఉంటారని, ఆయుష్సు పెరుగుతుందని జిల్లా అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక జిల్లా అదనపు కోర్టులో ఆ యన అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా గురువు గణేశ్ యోగా సాధన, ప్రాణాయామం తదితర అంశాల పై వివరించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మంజుల, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ దుర్వ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్ -
ప్రభుత్వ ఆస్పత్రికే రెఫర్ చేయాలి
● పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా సహకరించండి ● కేసులు బయటకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోండి ● సమన్వయంతో పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందిద్దాం ● డీఎంహెచ్ ప్రమోద్కుమార్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్ ● జీజీహెచ్లో కనీస మర్యాద లేదని సిబ్బంది ఆవేదన కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ సింగరేణి మెడికల్ కాలేజీ(సిమ్స్)కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ బోధన ఆస్పత్రి(జీజీహెచ్) లో అన్నిరకాల నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని, పేషెంట్లను బయటి ఆస్పత్రులకు కాకుండా జీజీహెచ్కే రెఫర్ చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్సింగ్ కోరారు. జీజీహెచ్లో ఓపీ కేసులతోపాటు ఇన్పేషెంట్ల సంఖ్య పెంచడంపై మెడికల్ కాలుజీలో శుక్రవారం సన్వయ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో కృపాబాయి హాజరయ్యారు. నగరంలోని ఆరు యూపీహెచ్సీలు, ఒక పీహెచ్సీ, రెండు బస్తీదవాఖాలు, రెండు సబ్సెంటర్ల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పిల్లలు, ప్రసూతి, జనరల్ సర్జరీ, మానసిక వైద్యం, ఈఎన్టీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, ఆర్థో, యూరాలజీ, న్యూరాలజీ తదితర ప్రత్యేక వైద్యులు ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తునఆనరని వారు వివరించారు. ఆయా ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్ల సమస్యను బట్టి జీజీహెచ్కు రెఫర్ చేస్తే.. అవసరమైన నాణ్యమైన వైద్యచికిత్సలు అందిస్తారని తెలిపారు. జీజీహెచ్లో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారనే విషయం ప్రజలకు తెలియకపోవడంతోనే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని వెల్లడించారు. ఔట్ పేషెంట్ల సంఖ్యతోపాటు ఇన్పేషెంట్ల సంఖ్య(బెడ్ ఆక్యూపెన్సీ) పెంచడానికి మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సహకరించాలని వారు కోరారు. -
పోగొట్టుకున్న రూ.7లక్షల ఆభరణాలు అప్పగింత
గోదావరిఖనిటౌన్: ఓదెల మండలం కొలనూర్కు చెందిన తోట లక్ష్మి ఈనెల 19న సుల్తానాబాద్ వద్ద గోదావరిఖని డిపో బస్సులో పోగట్టుకున్న 89 గ్రాముల బంగారు ఆభరణాలను స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం అప్పగించినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. లక్ష్మి తన కుమారుడి వైద్యం కోసం నగలు తనఖా పెట్టడానికి సికింద్రాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తున్న ఇదే డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణం చేసిందని తెలిపారు. ఈక్రమంలో సుల్తానాబాద్ వద్ద రూ.7లక్షల విలువైన 89 గ్రాముల బంగారు ఆభరణాలు గల బ్యాగు పోగట్టుకుందన్నారు. గుర్తించిన కండక్టర్ కె.శ్రీనివాస్ నిజాయతీగా డిపోలో అందించారని వివరించారు. సమాచారం అందుకున్న లక్ష్మి కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని డిపోకు చేరుకుని తనను సంప్రదించారన్నారు. ఆధారాలు చూపించగా... ఆభరణల బ్యాగు అందదించామని చెప్పారు. కండక్టర్ కె.శ్రీనివాస్ను పలువురు అభినందించారు. -
పైసలా.. బియ్యమా..!
ఈనెల 6న గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లికి చెందిన రేషన్షాపును తనిఖీ చేసి 6.20 క్వింటాళ్లు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు డీలర్పై కేసు నమోదు చేశారు. ఇలా అధికారుల తనిఖీల్లో రేషన్ దుకాణాల్లో కేటాయించిన కోటాలో రిజిస్ట్రర్లో ఉన్న వాటికి వ్యత్యాసాలు ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం సదరు బియ్యాన్ని పక్కదారి పట్టించడమే కారణం. ఈనెల 13న సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ చౌకధరల దుకాణంలో రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా 105 బస్తాలు అనగా 52.50 క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసం ఉంది. దీంతో ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.ఈనెల 11న ధర్మారం మండలం రామాయపల్లి గ్రామ చౌక ధరల దుకాణంలో తనిఖీలు నిర్వహించగా.. రికార్డుల ప్రకారం దుకాణంలో రెండు క్వింటాళ్ల 42 కిలోల బియ్యం తక్కువ స్టాక్ ఉండడంతో డీలర్పై 6ఏ కేసు నమోదు చేశారు. -
No Headline
సాక్షి, పెద్దపల్లి: నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం కొందరు అక్రమార్కుల వల్ల పక్కదారి పడుతోంది. పలు రేషన్ దుకాణాల్లో బియ్యం కావాలా? బియ్యంకు సరిపోయే డబ్బులు కావాలా అడుగుతూ డబ్బులిచ్చి బియ్యాన్ని తమ వద్దే ఉంచుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. రేషన్ దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకే అక్రమాలు చోటు చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరటం లేదు. వేలిముద్రలు వేసుకొని.. జిల్లాలో 413 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 6,464 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇక్కడే రేషన్ దందా మొదలవుతుంది. బియ్యం తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో కొందరు డీలర్లు బియ్యం కావాలా? బియ్యంకు సరిపోయే డబ్బులు కావాలా (కిలోకు రూ.10నుంచి 12) అంటూ.. వేలిముద్రలు తీసుకొని పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని తమ వద్దే ఉంచుకుంటున్నారు. డీలర్లు అలా సేకరించిన బియ్యాన్ని ప్రధానంగా మిల్లులకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా.. మరికొందరు వ్యాపారులకు రూ.25 నుంచి 30కి అమ్ముకుంటున్నారు. లబ్థిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారు. ఇలా సేకరించిన బియ్యం మిల్లుల్లో పట్టుబడిన సంఘటనలు ఉన్నా.. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంకో ఏజెంట్.. డీలర్ల దగ్గర బియ్యం తీసుకున్న లబ్ధిదారుల నుంచి ఇంటింటికీ వెళ్లి సేకరించేందుకు వ్యాపారులు మండలంకో ఏజెంట్ను నియమించుకున్నారు. వీరు టూవీలర్, ఆటోల ద్వారా గ్రామాల్లో తిరుగుతూ బియ్యాన్ని సేకరిస్తున్నారు. వాటిని రైళ్లల్లో లేదా ఆటోల్లో మంచిర్యాలకు తరలించి అక్కడి నుంచి లారీల్లో మహరాష్ట్రకు తరలిస్తున్నారు. గ్రామాల్లో సేకరిస్తున్న సమయాల్లో కట్టడిచేయాల్సిన పోలీస్, పౌరసరఫరా శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన రైల్వే, పౌరసరఫరాల అధికారులు, పోలీసుశాఖల మధ్య సమన్వయం లేకపోవటం అక్రమార్కులకు కలిసివస్తోంది. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం ఉంటే అక్రమ రవాణా చేయటం సాధ్యంకాదని అంటున్నారు. నెలలో కనీసం రెండుసార్లు రేషన్ దుకాణాల్లో తనిఖీలు మరిచిపోయారు. కొందరు డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ–పాస్ విధానం అమల్లోకి వచ్చాక పర్యవేక్షణ గాడితప్పింది. నిజానికి ప్రతీ మూడు మండలాలకు ఒక డిప్యూటీ తహసీల్దార్ చొప్పున పనిచేయాలి. కానీ పౌరసరఫరాల శాఖలో మొత్తం నలుగురు డీటీలే పనిచేస్తున్నారు. అందులో ఒక్కరు సస్పెండ్ కాగా, మరొకరు డిప్యుటేషన్ మీద కలెక్టర్ వద్ద పని చేస్తున్నారు. దీంతో ఇద్దరు డీటీలతోనే నడిపిస్తున్నారు. ప్రతినెలా ప్రజాపంపిణీ విధానాన్ని తహసీల్దార్లు, ఆర్ఐలు పర్యవేక్షించాలి. నిబంధనల ప్రకారం ప్రతీ తహసీల్దార్ నెలలో కనీసం రెండు, ఆర్ఐ పది దుకాణాలు తనిఖీ చేయాలి. సరుకుల వివరాలు, పంపిణీ విధానం, నిల్వలను ఆయా దుకాణాల్లోని రిజిస్టర్ల్లో నమోదు చేయాలి. లబ్ధిదారులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ జిల్లాలో సిబ్బంది కొరతతో చూసీచూడనట్లు ఉంటున్నారు. పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పడంతో కొందరు డీలర్లు దోపిడీకి తెరలేపుతున్నారు. లబ్ధిదారులను నేరుగా అడుగుతున్న కొందరు డీలర్లు రేషన్ దుకాణాలపై పర్యవేక్షణ లేకే అక్రమాలు పలువురు డీలర్ల నుంచి నేరుగా రైస్మిల్లులకు బియ్యం తరలింపు -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీఈఓ మాధవితో కలిసి సమీక్షించారు. జిల్లాలో 535 ప్రభుత్వ పాఠశాలుండగా 453 పాఠశాలల్లో పనులు చేపట్టి పూర్తి చేశామని అధికారులు వివరించారు. పూర్తి చేసిన పనుల నాణ్యతను పరిశీలించి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు నివేదిక ఇవ్వాలని సూచించారు. పనుల వివరాలను ఎంబీ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఎంపీడీవోల నివేదికలు అందిన తర్వాతే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. అదనంగా పనులు అవసరముంటే నిధులు కేటాయిస్తామని, విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా పనులు పూర్తికావాలన్నారు. ఇక మిషన్భగీరథ పనుల విషయాలను ప్రస్తావిస్తూ ఇంటింటికీ తాగునీరందించేలా ప్రభుత్వం చేపట్టిన పధకం అమలు తీరుపై సాగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీపీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ గిరీష్బాబు, జెడ్పీ సీఈఓ నరేందర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలతో పాటు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రోజూ రెండుగంటలు ప్రజల కోసమే.. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంతో పాటు మంగళవారం నుంచి శనివారం వరకు రోజూ రెండు గంటలు (సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు) అందుబాటులో ఉంటూ సమస్యలు వింటానని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా ప్రజలు తనను పనిదినాల్లో కలవొచ్చన్నారు. సమస్యలు, ఫిర్యాదులు అందించేందుకు వచ్చేవారు ఆ సమయాల్లో కలెక్టరేట్కు రావాలని, ముందస్తుగా వచ్చి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ‘ధరణి’ సమస్యలు పెండింగ్ ఉండొద్దు జిల్లాలో ధరణి సమస్యలపై అందిన దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దని, వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులను సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి గడువు నిర్ధేశించుకుని తప్పనిసరిగా పరిష్కరించాలని తహసీల్దార్లకును ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఆర్డీఓలు గంగయ్య, హనుమానాయక్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. ఆకస్మిక సందర్శన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కోయ శ్రీహర్ష కలెక్టరేట్ ఆవరణలోని ఇన్వార్డు, ఔట్వార్డుతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు పరిశీలించి మనకు అందే ప్రతీ దరఖాస్తు వివరాలను ఇన్వార్డు, ఔట్వార్డు రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలన్నారు. ఆయా ఆఫీసుల ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడి వివరాలపై ఆరా తీశారు. వసతులకల్పన, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటిస్తూ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఏవో శ్రీనివాస్ తదితరులున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్పెద్దపల్లిరూరల్: జిల్లా జడ్జి హేమంత్కుమార్ను గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్స్టేషన్లు
మంథని: పోలీస్స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. గురువారం మంథని లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల మ హదేవపూర్ పోలీస్స్టేషన్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ భర్త నృత్యం చేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే పోలీసు అధికారులకు మాత్రమే ఇక్కడ పోస్టింగ్లు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి సన్నిధిలోని పోలీస్స్టేషన్లో ఎస్సై ఓ మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడటాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని తెలిపారు. నీట్ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలిజ్యోతినగర్: అక్రమాలు చోటు చేసుకున్న నీట్–2024ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ గురువారం ఎన్టీపీసీ రామగుండం మేడిపల్లి సెంటర్లో సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షకు ముందే గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకేజీ చేసిన ముఠాలు లక్షలాది రూపాయలు వసూలు చేశారని అన్నారు. న్యాయవిచారణ జరిపించి నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి, భిక్షపతి, శంకర్, నాగలక్ష్మీ, సంపత్, సాంబయ్య, హుస్సేన్ రెడ్డి, ఉదయ్, నారాయణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనవద్దుగోదావరిఖని: బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రియాజ్అహ్మద్, నాయకులు ఐ.కృష్ణ, నేరటి రాజన్న, రాములు అన్నారు. గు రువారం హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన జేఏసీ సమావేశంలో వారు మాట్లాడారు. బొగ్గుబ్లాకుల వేలంలో సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. తక్షణమే ఈనిర్ణయాన్ని ఉపసంహరించుకోవా లని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈనెల 21న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం మైనింగ్ పాలనీ తీసుకొచ్చి గనులను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడాన్ని పదేళ్ల నుంచి చూస్తున్నామని అన్నారు. గుజరాత్లో ఏవిధానమైతే అమలు జరుగుతుందో తెలంగాణలో కూడా అదే జరగాలని దానికి కావల్సిన చర్యలు చేపట్టాలని అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వేలం ప్రక్రియను తిప్పి కొట్టాలన్నారు. కార్మికులంతా ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. క్యూఐఎస్ను పటిష్టంగా అమలు చేయాలిగోదావరిఖని: సింగరేణి క్వార్టర్లు అన్యాక్రాంతం కాకుండా క్యూఐఎస్(క్వార్టర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం)ను పటిష్టంగా అమలు చేయాలని కా ర్పొరేట్ ఏజీఎం శ్రీనివాస్ అన్నారు. గురువారం అన్ని ఏరియాల పర్సనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. క్వార్టర్లకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈవిధానం ద్వారా ముందుకు సాగాలన్నారు. వెకేషన్, అలాట్మెంట్, క్వార్టర్కు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయటం వల్ల వివరాలను సులువుగా, ఖచ్చి తంగా భద్రపర్చవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పర్సనల్ మేనేజర్ కిరణ్బాబు, ఎస్ఈ సివిల్ వరప్రసాద్, ఎస్టేట్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
నులిపురుగు నివారణతోనే ఆరోగ్యం
పెద్దపల్లిరూరల్: నులిపురుగు నివారణతోనే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం పెద్దపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోన్ మాత్రలు పంపిణీ చేశారు. టీనేజీ పిల్లలు రక్తహీనతను నియంత్రించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు నులిపురుగు నివారణకు అల్బెండజోన్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని అన్నారు. వయస్సు నిర్ధారతను బట్టి మందుల డోస్చేరేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, డీఎంహెచ్ఓ ప్రమోద్కుమార్, మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి, కమిషనర్ వెంకటేశ్తో పాటు జిల్లా అధికారులు కల్పన, రవుఫ్ఖాన్, రంగారెడ్డి, మెరాజ్మహమ్మద్, ఎంఈఓ సురేందర్, హెచ్ఎం అరుణ, వైద్యాధికారి మమత, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల పరిశీలన గోదావరిఖనిటౌన్: గోదావరిఖనిలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులను గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. -
No Headline
జిల్లాలో రేషన్ దుకాణాలపై నమోదు చేసిన కేసులు 17పట్టుబడ్డ బియ్యం 428 క్వింటాళ్లు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ కేసులు 28పట్టుకున్న బియ్యం 761 క్వింటాళ్లుపక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తే చర్యలుంటాయి. ప్రతినెలా క్రమం తప్పకుండా రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. డీలర్లు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. – ప్రేమ్కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ప్రారంభానికి మోక్షం కలిగేనా?
రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామ అడుగులో నిర్మించిన ఎల్లంపల్లి (శ్రీపాద) ప్రాజెక్టుకు రెండు దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేయగా దశాబ్దం క్రితం పూర్తిస్థాయి విని యోగంలోకి వచ్చినా ప్రారంభోత్సవానికి మాత్రం నోచుకోవడం లేదు. దీంతో రెండు దశాబ్దాల క్రితం ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన పైలాన్ ఉత్సవ విగ్రహంగా మారింది. కాగా శుక్రవారం రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల అంశాలపై సుదీర్ఘ చర్చ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినందున ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి యుద్ధప్రాతిపదికన నిర్ణయం తీసుకోనుందా? అనే ఆశలు రేకెత్తుతున్నాయి. దశాబ్దం క్రితం పూర్తిస్థాయి వినియోగంలోకి.. అంతర్గాం మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామ అడుగులో నిర్మించిన ఎల్లంపల్లి (శ్రీపాద) ప్రాజెక్టుకు రెండు దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేయగా దశాబ్దం క్రితం నుంచి నీటి నిల్వలతో పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ ఉమ్మడి రాష్ట్ర హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉధృతంగా ఉద్యమాలు కొనసాగుతున్న క్రమంలో 2012 జూన్లో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రారంభోత్సవం చేసేందుకు హడావిడిగా ముహూర్తం నిర్ణయించారు. దీనిపై అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించినప్పటికీ సీఎం పట్టుసడలనివ్వకుండా నేరుగా చార్టర్ ఫ్లైట్లో వచ్చి ప్రారంభోత్సవం చేస్తానని స్పష్టం చేయడంతో గాల్లోనే ఫ్లైట్ను పేల్చేస్తామంటూ పొన్నం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ అధికారం కోల్పోయి టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. గడిచిన పదేళ్ల కాలంలో ఏనాడూ ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయాలనే ఆలోచన మాజీ సీఎం కేసీఆర్కు రాకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం. ఆరేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టును లక్షలాది కోట్ల నిధులతో యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన మూడేళ్ల వ్యవధిలోనే అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతలకు అనుకూలంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఎల్లంపల్లి ప్రాజెక్టును వినియోగించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్వపరాలు ● జలయజ్ఞంలో భాగంగా జనహృదయ నేత, దివంగత ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జూలై 28, 2004న శ్రీపాద(ఎల్లంపల్లి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ● తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2744 కోట్లు కేటాయించారు. ● ప్రాజెక్టును స్టేజ్–1, స్టేజ్–2గా విభజించారు. ● ఫేజ్–1లో ప్రాజెక్టు(డ్యాం) నిర్మాణం, ఫేజ్–2లో 6.5 టీఎంసీల నీటిని ఎన్టీపీసీకి పైపులైన్లతో నీటి సరఫరా చేయడం. ● 36 నెలల్లోగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఒప్పందం ఉన్నప్పటికీ వరదల కారణంగా పూర్తయ్యేందుకు దశాబ్దకాలం పట్టింది. ● పదేళ్ల క్రితం నుంచి పూర్తిస్థాయి వినియోగంలో కి రాగా ప్రాజెక్టు సామర్ధ్యం మేరకు నీటి నిల్వ తోపాటు నీటి కేటాయింపులను ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ● ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల దృష్ట్యా ఎన్టీపీసీకి 6.5 టీఎంసీ నీటి సరఫరా. ● మంథని ఎత్తిపోతల పథకం ద్వారా కమాన్పూర్, మంథని నియోజకవర్గ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు. ● ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ భాగంలో కడెం ఎత్తిపోతల పథకం కింద 3టీఎంసీల నీటిని 30వేల ఎకరాలు స్థిరీకరించుట. ● కరీంనగర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని 19 మండలాలకు చెందిన 206 గ్రామాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు. ఇందుకు వేంనూర్లో 12 టీఎంసీలను పంపింగ్ చేసేందుకు పంప్హౌస్ నిర్మాణం. ● 160 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల భారీ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగపడుతుంది. ● అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకంలో భాగంగా 10 టీఎంసీల నీటిని గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి అవసరాల నిమిత్తం పైపులైన్ల ద్వారా సరఫరా. ● ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిఽధిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకంలో ప్రాజెక్టును హ్యాబిటేషన్గా గుర్తించి నీటిని సరఫరా చేస్తున్నారు. ● ప్రాజెక్టులో పూడిక తొలగింపుకు ఆధునిక పరిజ్ఞానం. ● శ్రీపాద ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ (నీటి చుక్క లేకుండా) నీటిని బయటకు పంపించే అవకాశం ఉంది. ఫలితంగా నిల్వ నీటిలో పేరుకుపోయిన మట్టి, పూడిక అంతా వరదలో కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించే వీలుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో ‘ఎల్లంపల్లి’ ప్రారంభోత్సవంపై ఆశలు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టుకు శిలాఫలకం ప్రాజెక్టును గుర్తించని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవంపై నేటి కేబినెట్లో చర్చ? -
మూసివేత దిశగా రామగుండం బీ– థర్మల్ విద్యుత్ కేంద్రం?
రామగుండం: నిర్వహణ భారం..జీవితకాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వారంరోజులు క్రితం 38 మంది ఇంజనీర్లు, ఐదుగురు సబ్ ఇంజనీర్లు, ఒకరు సీనియర్ కెమిస్ట్, నలుగురు కెమిస్ట్లను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు డిప్యుటేషన్ పేరిట బదిలీ చేశారు. దీంతో మూసివేత తప్పదనే ప్రచారం జరుగుతోంది. యూనిట్ ట్రిప్ అయినా... ఈ నెల 4వ తేదీన యూనిట్లోని మిల్స్ విభాగంలో సాంకేతిక సమస్యతో తలెత్తింది. దీంతో యూనిట్ ట్రిప్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు. పదిరోజులుగా ఖాళీగా ఉంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులను యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ తదితర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 1965లో ప్లాంట్ ప్రారంభం » అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహా్మనందరెడ్డి 1965 జూలై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తితోపాటు పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధిస్తూ రికార్డులు నమోదు చేసింది. అయితే విద్యుత్ కేంద్రం స్థాపించి ఆరు దశాబ్దాలు కావడంతో నిర్వహణ భారంగా మారింది. » బాయిలర్, టర్బయిన్, మిల్స్, ట్రాన్స్ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. » ఈ జనవరి నుంచి సమస్య మరింత జటిలమైంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడిభాగాల లభ్యత లేదు. పాతవాటితోనే సర్దుబాటు చేసి విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకొస్తున్నారు. » సాంకేతిక సమస్యలతో మళ్లీమళ్లీ ట్రిప్పవుతూనే ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతోంది. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండడంతో మూసివేతే పరిష్కారమని భావిస్తున్నట్టు సమాచారం. ∙వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 25 ఏళ్లే. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జీవితకాలం ఎప్పుడో ముగిసిపోయింది. కొత్త ప్లాంటు ఏర్పాటు తప్పనిసరిరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 800 మెగావాట్ల సామర్ధ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం స్థాపిస్తాం. అప్పటివరకు పాత విద్యుత్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎనర్జీ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్లను కలిసి విన్నవించా. అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉండడంతో కొందరిని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలకు డిప్యుటేషన్పై బదిలీ చేస్తున్నారు. – మక్కాన్సింగ్ ఠాకూర్, రామగుండం, ఎమ్మెల్యే -
చినుకు రాలింది..
చెలక రమ్మంది వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావస్తోంది.. అప్పట్నుంచి ఎదురుచూస్తున్న రైతులను ఎట్టకేలకు చినుకమ్మ మంగళవారం రాత్రి పలుకరించింది.. దీంతో బుధవారం ఉదయమే పలువురు అన్నదాతలు.. జోడెడ్లతో బండి కట్టుకుని చేను, చెలక బాట పట్టారు. రైతులు దుక్కి దుక్కిదున్నుతుంటే.. అడుగులోఅడుగేస్తూ మహిళా రైతులు, కూలీలు నాగలిసాలులో విత్తనాలు పోస్తూ ముందుకు సాగారు. వానదేవుడు కరుణించి వర్షాలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాక్షించారు. పెద్దపల్లి పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో కనిపించిన దృశ్యాలు ఇవి.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పురపాలనలో మార్పు అనివార్యం
● మంథని అవినీతి రహితంగా ఉండాలి ● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథని: బల్దియాలో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పురపాలక కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమతో కలిసి మంత్రి మాట్లాడారు. ప్రజలు ఆశించిన మార్పును చేసి చూపించాలన్నారు. ఇందుకోసం మూడురెట్లు శ్రమించాలని సూచించారు. మంథని మున్సిపాలిటీని అవినీతి రహితంగా, పారదర్శకంగా తీర్చి దిద్దాలని చెప్పారు. దేశంలో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీస్ను ఇక్కడ అమలు చేయాలని, దీనికోసం స్టడీ టూర్కు అన్నీ సిద్ధం చేయాలని కలెక్టర్కు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్లైన్ అందుబాటులోకి తేవాలని, డంపింగ్ యార్డుకు వెంటనే ప్రత్యామ్నాయ స్థలం గుర్తించాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్లోని రోడ్డు, డ్రైనేజీ పనుల కోసం ప్రభుత్వం టీయూఎఫ్ఐడీ నుంచి ప్రత్యేకంగా రూ.38 కోట్లు కేటాయించిందని, పదిరోజుల్లోగా ప్రతిపాదనలు రూపొందించుకోవాలని సూచించారు. 15 రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మున్సిపల్ వార్డుల వారీగా సమస్యల గురించి కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజనల అధికారి హనుమా నాయక్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి తదితరులు పాల్గొన్నారు.