-
T20 WC 2024: చెలరేగిన డికాక్, మిల్లర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. ప్రోటీస్ బ్యాటర్లలో వీరిద్దరి మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మార్క్రమ్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, రషీద్ తలా వికెట్ సాధించారు. -
బంగ్లాదేశ్తో మ్యాచ్.. టీమిండియాలోకి విధ్వంసకర ఓపెనర్!?
టీ20 వరల్డ్కప్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. అఫ్గానిస్తాన్పై గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియా అదే జోరును బంగ్లాపై కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి సూపర్-8 మ్యాచ్లో విఫలమైన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే వైపు జట్టు మెనెజ్మెంట్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అంటిగ్వా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన జడ్డూ స్ధానంలో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్కు బంగ్లాతో మ్యాచ్లో ఆడించాలని మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ జట్టులోకి జైశ్వాల్ వస్తే రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశముంది. అప్పుడు విరాట్ కోహ్లి ఫస్ట్డౌన్లో రానునున్నాడు. ఒకవేళ దూబే స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్కు అవకాశమివ్వాలని మెనెజ్మెంట్ భావిస్తే సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.మనదే పై చేయి...కాగా టీ20ల్లో బంగ్లాదేశ్పై భారత్కు ఘనమైన రికార్డు ఉంది. భారత్ - బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలవగా.. 12 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది.బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
ఇంగ్లండ్-సౌతాఫ్రికా సూపర్-8 పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.స్పిన్నర్ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8 రౌండ్లో చెరో విజయం సాధించాయి. తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా.. మళ్లీ పాక్ తరపున ఆడుతా: మాలిక్
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూపు స్టేజిలోనే పాక్ నిష్కమ్రించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్ల్లో గెలిచినప్పటకి అవి చెప్పుకోదగ్గ విజయాలు కావు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో గ్రూపు స్టేజి నుంచి పాక్ నిష్క్రమించడం ఇదే మొదటి సారి. అంతకుముందు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ది ఇదే పరిస్థితి.దారుణ ప్రదర్శన కనబరిచి వన్డే ప్రపంచకప్లో సైతం గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్కప్ జట్టులో చోటివ్వడాన్ని తప్పుబడుతున్నారు. వారి స్ధానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది మాజీలు అభిప్రాయపడుతున్నారు.ఇక వరుసగా రెండు వరల్డ్కప్లలో నిరాశపరిచిన పాకిస్తాన్.. వచ్చే ఏడాది తమ స్వదేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్కు ప్రాతినిథ్యం వహించాలన్న తన కోరికను మాలిక్ వ్యక్తం చేశాడు. కాగా మాలిక్ 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆ తర్వాత టీ20ల్లో మాత్రమే 42 ఏళ్ల మాలిక్ కొనసాగాడు. టీ20ల్లో కూడా పెద్దగా పాక్ తరపున ఆడే అవకాశం రాలేదు. పాకిస్తాన్ తరపున మాలిక్ చివరగా 2021లో బంగ్లాదేశ్పై ఆడాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న మాలిక్.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో మాత్రమే కొనసాగుతున్నాడు."నేను మళ్లీ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను.రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను. నాలో ఇంకా ఫిట్నెస్ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదు. నా దేశం కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నాను.పాకిస్తాన్కు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందించేందుకు నా వంతు కృషి చేయాలని భావిస్తున్నానని" పీఎన్ఎన్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. -
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన పాక్ బోర్డు!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై వస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. బాబర్ ఆజం బృందాన్ని ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.పీసీబీ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్థానికి మీడియా పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమిపాలైన బాబర్ బృందం.. కెనడా, ఐర్లాండ్లపై గెలిచింది.అయితే, అప్పటికే గ్రూప్-ఏ నుంచి టీమిండియా, అమెరికా సూపర్-8కు చేరగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంటాబయటా పాక్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన సీనియర్ జర్నలిస్టు ముబాషిర్ లుక్మాన్ బాబర్ ఆజంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పాక్ కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు.ఈ క్రమంలో పీసీబీ వర్గాలు స్పందించాయి. ‘‘విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అదుపులో ఉన్నంత వరకు విమర్శకుల పట్ల మాకెలాంటి అభ్యంతరం లేదు.అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తూనే ఉన్నాం.ఆటగాళ్ల విషయంలో పీసీబీకి ఎలాంటి సందేహాలు లేవు. అలాంటపుడు విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు ఆధారాలతో సహా ముందుకు రావాలి.ఒకవేళ అందులో గనుక విఫలమైతే మేము పరువునష్టం దావా వేయడానికి కూడా వెనుకాడం. ఇందుకు సంబంధించి ఓ కొత్త చట్టం తీసుకురాబోతున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. కాగా వరల్డ్కప్ టోర్నీ నుంచి నిష్క్రమణ తర్వాత పాక్ ఆటగాళ్లు విదేశాల్లో సెలవులను ఆస్వాదించడం విశేషం. -
బంగ్లాతో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!?
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్ చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్లో అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ను భారత్ ఢీకొట్టనుంది.ఈ మ్యాచ్లో గెలిచి తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తుంటే.. బంగ్లాదేశ్ సైతం భారత్ను ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. శనివారం మ్యాచ్ జరిగే అంటిగ్వాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్.కామ్ ప్రకారం.. వర్షం పడటానికి 40 శాతం చాన్స్ ఉంది.శనివారం ఉదయం నుంచే తేలికిపాటి జల్లులు కురిసే అవకాశముంది అక్యూ వెదర్ తెలిపింది. కాగా కరేబియన్ దీవుల కాలమానం ప్రకారం భారత్-బంగ్లా మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరోపాయింట్ లభిస్తోంది.చదవండి: IND vs AFG: ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్! -
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలో నిరాశపరిచిన కింగ్ కోహ్లి.. ఇప్పుడు సూపర్-8లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.సూపర్-8లో భాగంగా బార్బోడస్ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. సరిగ్గా 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఇక ఈ మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ పరంగానే కాకుండా ఫీల్డింగ్లో కూడా నిరాశపరిచాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కోహ్లి జారవిడిచాడు. ఎన్నో సంచలన క్యాచ్లు అందుకున్న కింగ్ కోహ్లి.. ఈ మ్యాచ్లో సునాయస క్యాచ్ను జారవిడిచడంతో అంతా ఆశ్చ్యర్యపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతులు తలపై పెట్టుకుని షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లి విడిచిపెట్టిన క్యాచ్ పెద్ద కాస్ట్లీగా మారలేదు. ఎందకుంటే ఆ తర్వాతి ఓవరే జద్రాన్(8) అక్షర్పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.pic.twitter.com/MkAFbNakRq— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) June 20, 2024 -
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యార్క్షైర్కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్స్ట్రైకర్ జోరూట్ రన్కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్వికెట్ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024 -
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే
భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖారారైంది. ఈ ఏడాది నవంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ మెరకు భారత క్రికెట్ బోర్డు(BCCI), దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(CSA)లు సంయుక్తంగా శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశాయి. ఈ టూర్లో భాగంగా సఫారీ గడ్డపై భారత్ నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ ఛైర్పర్సన్ లాసన్ నైడూ మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికా క్రికెట్కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్న బీసీసీఐకు దన్యవాదాలు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్ జరిగిన అది అభిమానులకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. ఈ రెండు క్రికెట్ బోర్డుల మధ్య స్నేహ బంధం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య టీ20 సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని" పేర్కొన్నారు. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్పై బీసీసీఐ క్యార్యదర్శి జైషా సైతం భారత్- దక్షిణాఫ్రికా మధ్య సిరీస్పై సంతోషం వ్యక్తం చేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ఇరు జట్ల మద్య పోటీ ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంటుందని జైషా తెలిపారు. కాగా 2024-2025 హోం సీజన్కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో ముగియనుంది.టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్ ఇదే..తొలి టీ20(డర్బన్)-నవంబర్ 8రెండో టీ20(సెయింట్ జార్జ్ పార్క్)- నవంబర్ 10మూడో టీ20(సెంచూరియన్)- నవంబర్ 13నాలుగో టీ20(జోహన్స్బర్గ్)- నవంబర్ 15 CSA AND BCCI ANNOUNCE UPCOMING SERIESCricket South Africa (CSA) and the Board of Control for Cricket in India (BCCI) are delighted to confirm the scheduling of yet another thrilling KFC T20 International (T20I) series, which will see India traveling to South Africa in November… pic.twitter.com/6xn8AkpK51— Proteas Men (@ProteasMenCSA) June 21, 2024 -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్కప్ (వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తంజిద్ హసన్ వికెట్ తీసిన స్టార్క్.. లంక దిగ్గజం లసిత్ మలింగకు అధిగమించి వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్ల్లో) పడగొట్టగా.. స్టార్క్ 95 వికెట్లు (52 మ్యాచ్ల్లో) తీశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (77 మ్యాచ్ల్లో 92 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (47 మ్యాచ్ల్లో 87 వికెట్లు), మురళీథరన్ (49 మ్యాచ్ల్లో 79 వికెట్లు) ఉన్నారు. స్టార్క్ ఖాతాలో ఉన్న 95 వరల్డ్కప్ వికెట్లలో 30 టీ20 వరల్డ్కప్ వికెట్లు.. 65 వన్డే వరల్డ్కప్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్కప్ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్కప్ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాట్ కమిన్స్ (4-0-29-3) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్కు అంతరాయం కలిగించి, డక్వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్తో (31) కలిసి ఆసీస్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
వాళ్లిద్దరు సూపర్.. జట్టులో మార్పులకు సిద్ధం: రోహిత్ శర్మ
వెస్టిండీస్లో పిచ్ల గురించి తమకు అవగాహన ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గత రెండేళ్లుగా విండీస్లో అనేక టీ20 మ్యాచ్లు ఆడామని.. ఆ అనుభవం ఇప్పుడు అక్కరకు వస్తోందని తెలిపాడు.తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందని.. అందుకే అఫ్గనిస్తాన్పై అలవోకగా విజయం సాధించామని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో తమ తొలి మ్యాచ్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 32) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 181 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ భారత బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 47 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.కాగా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ అఫ్గన్పై విజయానికి బౌలర్లే కారణమంటూ వారికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘మా బౌలింగ్ విభాగంలో టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ విధిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు.వారిపై మాకు నమ్మకం ఉంది. ఇక బుమ్రా ఏం చేయగలడో మా అందరికీ తెలుసు. అతడి సేవలను మరింత తెలివిగా ఉపయోగించుకోవడం ముఖ్యం.అతడు జట్టులో ఉన్నాడంటే కచ్చితంగా తన వంతు బాధ్యత పూర్తి చేస్తాడు. ఇక సూర్య, హార్దిక్ భాగస్వామ్యం వల్లే మేము మెరుగైన స్కోరు చేయగలిగాం. తదుపరి మ్యాచ్లలో ప్రత్యర్థి జట్టు బలాబలాలకు అనుగుణంగా అవసరమైతే మా తుదిజట్టులో మార్పులు చేసుకుంటాం. ఏదేమైనా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే మంచిదని భావిస్తున్నాం.ఒకవేళ అత్యవసరమైతే ముగ్గురు సీమర్లతో వెళ్లడానికి కూడా నేను సిద్ధమే’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తదుపరి బంగ్లాదేశ్తో శనివారం మ్యాచ్ ఆడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 వరల్డ్కప్లో నేటి (జూన్ 21) మ్యాచ్.. ఇంగ్లండ్తో సౌతాఫ్రికా 'ఢీ'
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్పై, సౌతాఫ్రికా.. యూఎస్ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్లో విండీస్పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్లో (2022) ఇంగ్లండ్దే పైచేయిగా నిలిచింది.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్లో ఉన్నారు.వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.తుది జట్లు (అంచనా).. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ -
మరీ ఓవర్ చేయకు: పంత్ క్యాచ్.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమెరికా వేదికగా లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగుక ముందుకు సాగిన రోహిత్ సేన.. వెస్టిండీస్లో జరుగుతున్న సూపర్-8లోనూ శుభారంభం చేసింది.గ్రూప్-1లో భాగంగా అఫ్గనిస్తాన్ గురువారం నాటి మ్యాచ్లో జయభేరి మోగించింది. అఫ్గన్ జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ ఇన్నింగ్స్లో పంత్- రోహిత్ క్యాచ్ల విషయంలో పోటాపోటీగా తలపడ్డారు.బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో జరిగిన ఈ మ్యాచ్లో పంత్ మొత్తంగా మూడు క్యాచ్లు అందుకోగా.. రోహిత్ శర్మ రెండు క్యాచ్లు పట్టాడు. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్ను కుల్దీప్ యాదవ్ వేశాడు.ఈ క్రమంలో రెండో బంతిని అఫ్గన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో పంత్ పరిగెత్తుకు వెళ్లి బంతిని అందుకున్నాడు.ఆ సమయంలో రోహిత్ కూడా పంత్కు సమీపంలోనే ఉండగా.. ఎగ్జైట్మెంట్లో పంత్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సంతోషం పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఈ క్యాచ్ నీదేలే.. నేనేమీ అడ్డుపడను’’ అన్నట్లుగా రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్గా మారింది.కాగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో పంత్.. రహ్మనుల్లా గుర్బాజ్(11), గుల్బదిన్ నయీబ్(17), నవీన్ ఉల్ హక్(0) క్యాచ్లు అందుకోగా.. రోహిత్ శర్మ ఇబ్రహీం జద్రాన్(8), నూర్ అహ్మద్(12) ఇచ్చిన క్యాచ్లను ఒడిసిపట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. పొట్టి క్రికెట్లో బెస్ట్ క్యాచ్గా జేజేలు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024లో అత్యుత్తమ క్యాచ్లు నమోదవుతున్నాయి. ఈ ఎడిషన్లో ఇప్పటికే ఐదారు కళ్లు చెదిరే క్యాచ్లు ఫ్యాన్స్కు మతి పోగొట్టాయి. తాజాగా అలాంటి క్యాచే మరొకటి నమోదైంది. కార్డిఫ్ వేదికగా గ్లోసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో గ్లామోర్గన్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మెరుపు క్యాచ్ అందుకున్నాడు.మేసన్ క్రేన్ బౌలింగ్లో బెన్ ఛార్లెస్వర్త్ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్ను లబూషేన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్గా మలిచాడు. ఓ మోస్తరు ఎత్తులో వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ క్యాచ్కు చూసిన వారు పొట్టి క్రికెట్లో అత్యుత్తమ క్యాచ్ అని జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్ను పట్టిన లబూషేన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.MARNUS LABUSCHAGNE WITH A BLINDER. 🤯💯- One of the greatest catches ever! pic.twitter.com/ssDsUdg2aU— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024కాగా, గ్లామోర్గన్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్లోసెస్టర్షైర్ గెలుపుకు చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. జోష్ షా ఆండీ గోర్విన్ బౌలింగ్ సిక్సర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగా.. గ్లోసెస్టర్షైర్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. గ్లామోర్గన్ ఇన్నింగ్స్లో సామ్ నార్త్ఈస్ట్ (46 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. గ్లోసెస్టర్షైర్ ఇన్నింగ్స్లో జాక్ టేలర్ (70) అత్యధిక పరుగులు సాధించాడు. -
షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి
భారత క్రీడా రంగంలో సానియా మీర్జా, మహ్మద్ షమీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్ననాటి నుంచే టెన్నిస్పై మక్కువ పెంచుకున్న సానియా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిల్స్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.మరోవైపు.. టీమిండియా ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన మహ్మద్ షమీ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు.ఇద్దరికీ చేదు అనుభవమేఅయితే, సానియా- షమీ వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. హసీన్ జహాన్ అనే మోడల్ను పెళ్లాడిన షమీకి ఒక కూతురు ఉంది.కొన్నాళ్లపాటు సజావుగా సాగిన షమీ కాపురం.. హసీన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో విచ్ఛిన్నమైంది. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జాకు కూడా చేదు అనుభవమే మిగిలింది.సానియా కెరీరీర్లో బిజీగా ఉన్న సమయంలో షోయబ్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని పాక్ మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమనగా.. నటి సనా జావెద్ను పెళ్లాడి.. సానియాతో తన బంధం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పాడు షోయబ్.ఇవన్నీ అబద్దాలుకాగా సానియా కుటుంబం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్కు పూర్తి సమయం కేటాయించి అతడి ఆలనాపాలనా చూసుకుంటూనే వృత్తిపరంగానూ బిజీ అయ్యారు.ఇదిలా ఉంటే.. సానియా మీర్జా- మహ్మద్ షమీ గురించి కొన్నాళ్ల క్రితం వదంతులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది.ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇవన్నీ అబద్దాలు. ఆమె కనీసం అతడిని నేరుగా ఒక్కసారి కూడా కలవనే లేదు’’ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు.కాగా సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన మహ్మద్ షమీ చీలమండ గాయానికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.చదవండి: రూ. 2 కోట్ల కారు.. బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు -
కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.కమిన్స్ హ్యాట్రిక్ఈ మ్యాచ్లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్లో నమోదైంది. ఆ ఎడిషన్లో బ్రెట్ లీ బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.వార్నర్ మెరుపు అర్ధ శతకం141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్కు అంతరాయం కలిగించి, డక్వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్తో (31) కలిసి ఆసీస్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీ20 వరల్డ్కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదు
టీ20 వరల్డ్కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కమిన్స్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024బంగ్లాదేశ్తో మ్యాచ్లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన బుమ్రా.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ది బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 24 బంతులు వేసిన బుమ్రా ఏకంగా 20 డాట్ బాల్స్ సంధించి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మెరుపు ప్రదర్శనతో విరుచుకుపడటంతో భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత ప్రపంచకప్లో బుమ్రా చెలరేగడం ఇది తొలిసారి కాదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. గ్రూప్ దశలో ఐర్లాండ్పై 2/6, పాకిస్తాన్పై 3/14 మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి రెండు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మరింత డోస్ పెంచిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవలేదు కానీ.. జట్టు గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. బుమ్రాకు జతగా బ్యాటింగ్లో సూర్యకుమార్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. ఓవరాల్గా ఆఫ్ఘన్పై గెలుపులో అందరూ తలో చేయి వేసి టీమిండియాకు సూపర్ విక్టరీ అందించారు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32).. బౌలింగ్లో అర్ష్దీప్ (4-0-36-3), కుల్దీప్ (4-0-32-2), అక్షర్ పటేల్ (3-1-15-1), రవీంద్ర జడేజా (3-0-20-1) భారత్ గెలుపుకు దోహదపడ్డారు. -
కోహ్లికి 121 మ్యాచ్లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
T20 World Cup 2024 Super 8: అఫ్గాన్పై అలవోకగా...
టి20 ప్రపంచ కప్ ‘సూపర్–8’ దశలో భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ చక్కటి బౌలింగ్తో టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఆపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఈ ఫార్మాట్లో తన నంబర్వన్ హోదాకు న్యాయం చేస్తూ, తనేంటూ నిరూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్గాన్ టీమ్ ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. టీమిండియా పదునైన బౌలింగ్ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ను సమర్పించుకుంది. ఇక మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్తో శనివారం భారత్ తర్వాతి సమరానికి సిద్ధమైంది. బ్రిడ్జ్టౌన్: వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరే దిశగా భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. సూపర్–8 గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. రషీద్ ఖాన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. బుమ్రా (3/7), అర్‡్షదీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కీలక భాగస్వామ్యం... ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 8; 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రషీద్ రెండు వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. నబీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించిన రిషభ్ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోగా...రషీద్ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) అవుటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్తో స్కోరు వేగంగా సాగింది. రషీద్ ఓవర్లో సూర్య ఫోర్, సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో మరో ఎండ్లో శివమ్ దూబే (7 బంతుల్లో 10; 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో సూర్యకు పాండ్యా జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు మెరుగైన స్థితికి చేరింది. నూర్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 6 కొట్టగా... ఫజల్ ఓవర్లో సూర్య వరుసగా 6, 4 బాది 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, మరుసటి ఓవర్లో పాండ్యా ఆట ముగిసింది. జడేజా (5 బంతుల్లో 7; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (6 బంతుల్లో 12; 2 ఫోర్లు) కీలక పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో జట్టు 79 పరుగులు చేయగా, తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మరోవైపు గురువారం మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్కు నివాళిగా మన ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా తొలి ఓవర్లో అనవసర షాట్కు ప్రయత్నించి గుర్బాజ్ (11; 1 ఫోర్, 1 సిక్స్) అవుట్ కావడంతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. ఎవరు కూడా భారత బౌలింగ్ ముందు పట్టుదలగా నిలవలేకపోయారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ వనరులు ఉన్నా ...ఎప్పటిలాగే బ్యాటర్ల వైఫల్యం దెబ్బ తీసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్ 8; కోహ్లి (సి) నబీ (బి) రషీద్ 24; పంత్ (ఎల్బీ) (బి) రషీద్ 20; సూర్యకుమార్ (సి) నబీ (బి) ఫజల్ 53; దూబే (ఎల్బీ) (బి) రషీద్ 10; పాండ్యా (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32; జడేజా (సి) గుల్బదిన్ (బి) ఫజల్ 7; అక్షర్ (రనౌట్) 12; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–62, 4–90, 5–150, 6–159, 7–165, 8–181. బౌలింగ్: ఫజల్ హక్ 4–0–33–3, నబీ 3–0–24–0, నవీన్ ఉల్ హక్ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–26–3, నూర్ అహ్మద్ 3–0–30–0, అజ్మతుల్లా 2–0–23–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 11; హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8; గుల్బదిన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17; అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26; నజీబుల్లా (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 19; నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; రషీద్ (సి) జడేజా (బి) అర్ష్ దీప్ 2; నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; నవీన్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 0; ఫజల్హక్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–23, 4–67, 5–71, 6–102, 7–114, 8–121, 9–121, 10–134. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–36–3, బుమ్రా 4–1–7–3, అక్షర్ పటేల్ 3–1–15–1, హార్దిక్ పాండ్యా 2–0–13–0, కుల్దీప్ 4–0–32–2, జడేజా 3–0–20–1. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా X బంగ్లాదేశ్వేదిక: నార్త్సౌండ్; ఉదయం గం. 6 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికావేదిక: గ్రాస్ఐలెట్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
భారత మహిళల క్రికెట్ జట్టులో షబ్నమ్
విశాఖ స్పోర్ట్స్: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ సిరీస్లో పాల్గొంటున్న భారత జట్టులో అదనంగా మరో ప్లేయర్ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మీడియం పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ను తొలిసారి భారత సీనియర్ జట్టులోకి ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్లలోని (వన్డే, టెస్టు, టి20) టీమిండియాలో షబ్నమ్కు చోటు దక్కడం విశేషం.విశాఖపట్నంకు చెందిన షబ్నమ్ గత ఏడాది జనవరిలో జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ తరఫున నాలుగు మ్యాచ్లు ఆడిన షబ్నమ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న సిరీస్లో బెంగళూరు వేదికగా జరిగిన తొలి రెండు వన్డేల్లో భారత జట్టు గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులోనే జరుగుతుంది. -
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి
బనశంకరి: భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కనకశ్రీ లేఔట్ ఎస్ఎల్వీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడటంతో తీవ్ర గాయాలై మరణించారు. గురువారం ఉదయం గం. 11:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. 1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్లో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో జాన్సన్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు సాధించాడు. -
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.స్కై మెరుపులు..టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు.