-
నులి పురుగుల నివారణకు పాటుపడాలి
ములుగు రూరల్: నులి పురుగుల నివారణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19ఏళ్లు కలిగిన విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. నులి పురుగుల ప్రభావంతో ఆకలి మందగించడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనబడతాయని తెలిపారు. అనంతరం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్ మాట్లాడుతూ జిల్లాలో 640 అంగన్వాడీ కేంద్రాలలో 13,349 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 73,544 మంది అర్హులు ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రసాద్, మల్లికార్జున్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య -
డ్రా పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడానికి ఐటీడీఏ ద్వా రా బెస్ట్ అవైలబుల్ స్కీం దరఖాస్తులను కోరగా 244 మంది దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో డ్రా పద్ధతిలో 32మంది విద్యార్థులను ఎంపిక చేశారు. 3, 5, 8వ తరగతికి చెందిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి అలాట్ చే సిన స్కూల్స్కు కేటాయించారు. వారి వద్ద ఉన్న ఒ రిజినల్ సర్టిఫికెట్స్తో వెళ్లి వారికి కేటాయించిన స్కూళ్లలో అడ్మిషన్లు పొందాలని ఐటీడీఏ డీడీ పోచం తెలిపారు. ఏటీడీఓ దేశిరాం, ఏసీఎంఓ రవీందర్, ఏఏసీఎంఓ వాగ్యా పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
ఏటూరునాగారం: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో సంబంధిత వార్డెన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సూచించారు. మండల పరిధిలోని ఆకులవారి గణపురంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, ఏయూపీఎస్ పాఠశాలను పీఓ గురువారం పంచాయతీ స్పెషల్ అధికారి దామోదర్స్వామితో కలిసి వెళ్లి సందర్శించారు. అదేవిధంగా చిన్నబోయినపల్లి బాలల ఆశ్రమ ఉన్నత పాఠశాల, మల్యాలలోని ఏయూపీఎస్ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మరుగుదొడ్ల పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసి ఉపాధ్యాయులు, సిబ్బందిని మందలించారు. భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వార్డెన్లు గమనించాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
అంగన్వాడీ విద్యార్థులకు
శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2024ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలను తీసుకు వస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు ఫ్రీ ప్రైమరీ విద్యాబోధన చేపట్టనున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో 8,786 మంది.. జిల్లాలోని 9మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను నాలుగు ప్రాజెక్టులుగా విభజించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలలో 0నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులు 7,714 మంది ఉండగా 3 నుంచి 6 సంవత్సరాల లోపు 8,786 మంది విద్యార్థులను గుర్తించి ఐసీడీఎస్ అధికారులు నివేదికలు అందజేశారు. గతంలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా అందించేది. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చే క్రమంలో 3 నుంచి 6ఏళ్ల లోపు ఉన్న వారికి ఉచిత యూనిఫాం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అవసరమయ్యే వస్త్రాలను జిల్లా సంక్షేమాధికారులకు అందించింది. మహిళా శక్తి సంఘాలకు అప్పగింత అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు యూనిఫాం కుట్టి అందించే విధంగా మహిళా శక్తి సంఘాలకు బాధ్యతలను అప్పగించారు. యూనిఫాంకు సంబంధించిన డిజైన్లను ఎంపిక చేసి ీఅందించారు. మగపిల్లలకు నిక్కర్, షర్ట్, ఆడ పిల్లలకు ప్రాగ్ కుట్టాలని సీ్త్ర–శిశు సంక్షేమశాఖ అధికారులు, డీఆర్డీఏ అధికారులు (సెర్ప్) మహిళా శక్తి సంఘాలకు యూనిఫాం క్లాత్ అందించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన కొలతలను సంవత్సరాల వారీగా నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు యూనిఫాం కుట్టించి ఇవ్వడంతో మహిళా సంఘాలకు ఆర్ధిక భరోసా కలిగినట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి జూలై మొదటి వారంలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అంగన్వాడీ విద్యార్థుల యూనిఫాం డిజైన్లున్యూస్రీల్ప్రాజెక్టుల వారీగా కేంద్రాలు, విద్యార్థుల వివరాలుప్రాజెక్టు కేంద్రాలు 3–6ఏళ్ల విద్యార్థులు ములుగు 142 2,820 తాడ్వాయి 124 1,514 ఏటూరునాగారం 206 2,715 వెంకటాపురం(కె) 168 1,737 మొత్తం కేంద్రాలు 640 8786 ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ జిల్లాలో 3 నుంచి 6ఏళ్ల లోపు చిన్నారులు 8,786 మహిళా శక్తి సంఘాలకు యూనిఫాం తయారీ అప్పగింతవచ్చే నెల మొదటి వారంలో అందిస్తాం.. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు యూనిఫాంను కుట్టించేందుకు మహిళా సంఘాలకు అప్పగించాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంలు కుడుతుండడంతో కొంత ఆలస్యం అవుతుంది. సంఘాలకు యూనిఫాం క్లాత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే నెల మొదటి వారంలో చిన్నారులకు యూనిఫాం పంపిణీ చేస్తాం. – స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమాధికారి -
రెండు క్రీడా అకాడమీలు
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు శుభవార్త ప్రకటించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో మూడు క్రీడల అకాడమీలు కొనసాగుతున్నాయి. వీటికి తోడుగా మరో రెండు క్రీడలను కొనసాగించేలా కొత్త అకాడమీలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా మంజూరైన అకాడమీల్లో క్రీడాకారుల ప్రవేశాల ఎంపిక ప్రక్రియను సైతం చేపట్టనుంది. ఇందులో అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధీనంలో జేఎన్ స్టేడియంలో ప్రస్తుతం అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్ అకాడమీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారులు స్టేడియంలోని వసతిగృహంలో ఉంటూ డీఎస్ఏ కోచ్ల పర్యవేక్షణలో ఆయా క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెజ్లింగ్, స్విమ్మింగ్ అకాడమీలను మంజూరు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆ రెండు క్రీడల క్రీడాకారులు డీఎస్ఏ నిర్వహించే ఎంపికలో పాల్గొని అర్హత సాధించినట్లయితే అకాడమీలో శిక్షణ పొందుతారు. ప్రస్తుతం 118మంది క్రీడాకారులు.. స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ఇప్పటివరకు ఉన్న మూడు క్రీడల్లో 118 మంది క్రీడాకారులకు వసతి కల్పిస్తోంది. అందులో జిమ్నాస్టిక్స్లో బాలురు– 30, బాలికలు 20, హ్యాండ్బాల్లో 16మంది బాలురు, అథ్లెటిక్స్లో బాలురు 27 మంది, 25మంది బాలికలు అడ్మిషన్లు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రీడాకారుల సంఖ్య 118 మంది దాటకుండా కొత్తగా మంజూరైన రెండు అకాడమీలు, ఇప్పటికే కొనసాగుతున్న మూడు క్రీడలకు క్రీడాకారులకు అడ్మిషన్లు కల్పించాలని పేర్కొంది. అందులో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ క్రీడాకారులకు కోత విధించి రెజ్లింగ్లో బాలురు 17 మంది, స్విమ్మింగ్లో బాలబాలికలు 18 మంది క్రీడాకారులకు అడ్మిషన్లు కల్పించాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. కాగా, పదేళ్ల క్రితం వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో స్విమ్మింగ్ అకాడమీ కొనసాగింది. అనుకున్న స్థాయిలో అడ్మిషన్లు, ఆశించిన ఫలితాలు లేకపోవడంతో అకాడమీని ఇక్కడినుంచి తరలించారు. పదేళ్ల తర్వాత జిల్లాకు స్విమ్మింగ్, రెజ్లింగ్ అకాడమీలు మంజూరు కావడం విశేషం.ఉత్తర్వులు జారీ చేసిన సాట్ హనుమకొండలో రెజ్లింగ్, స్విమ్మింగ్ అకాడమీల మంజూరు ఇప్పటికే ఉన్న అకాడమీల్లో క్రీడాకారుల కుదింపు? పదేళ్ల క్రితం తరలిన స్విమ్మింగ్ అకాడమీ తిరిగి ఏర్పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చన్న డీవైఎస్ఓఎంపికలో పాల్గొనాలి.. వచ్చే నెల 3,4 తేదీల్లో వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ జీ.అశోక్ తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే ఎంపికలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలురు రెజ్లింగ్ ఎంపికలో పాల్గొనవచ్చన్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికలు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. క్రీడాకారులు ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫొటోలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు ఒక జిరాక్స్ సెట్తోపాటు స్పోర్ట్స్ డ్రెస్, రన్నింగ్ షూతో రావాలని డీఎస్ఏ రెజ్లింగ్ కోచ్ రాజు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. -
రెండు రోజుల్లో సర్వే పూర్తిచేయాలి
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి, రాంనగర్ గ్రామాల్లో గురువారం అదనపు కలెక్టర్ శ్రీజ మిషన్ భగీరథ నల్లాలపై చేస్తున్న సర్వేను పరిశీలించారు. రెండు రోజుల్లో సర్వేను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నేడు యోగా శిక్షణ ములుగు: ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నేడు(శుక్రవారం) నెహ్రూ యువజన కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో ఉదయం 6గంటలకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా క్రీడల అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరకట్టకు తాత్కాలిక ఇసుక బస్తాలు ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకట్ట గతేడాది గోదావరి వరద ముంపునకు గురైంది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా కరకట్ట మరింత కోతకు గురికాకుండా ఉండేందుకు గురువారం ఇసుక బస్తాలను నింపి కరకట్ట కోతకు గురైన ప్రాంతాల్లో వేయించారు. ఇసుక బస్తాలతో కొంత మేర మట్టి కొట్టుకుపోకుండా చూడొచ్చని ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. ప్రసాద్కు డాక్టరేట్వాజేడు: ఏజెన్సీలో నిరుపేద కుటుంబంలో పుట్టి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన ముత్యాల ప్రసాద్. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసాద్కు డాక్టరేట్ను గురువారం ప్రదానం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పేరూరుకు చెందిన ముత్యాల స్వామి, ఉదయ దంపతుల కుమారుడు ప్రసాద్. 1నుంచి 10వ తరగతి వరకు పేరూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఇంటర్, డిగ్రీ భద్రాచలంలోని ప్రభుత్వ కళాశాలలో చదివి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జియోఫిజిక్స్ పూర్తి చేశాడు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పరిశోధనను మొదలు పెట్టారు. రెండేళ్ల తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ తిరువనంతపురంలో ప్రాజెక్ట్ అసోసియేట్గా చేరి దక్షిణ భారత భూపొరలలో గల షియ ర్ జోన్స్, వాటి స్వభావం, స్థానికత వంటి అంశాలపై జియోఫిజికల్ డేటా ఆధారంగా సమగ్ర పరిశోధన చేశారు. ఈ పరిశోధనలకు గాను కొచ్చిన్ యూ నివర్శిటీ ప్రసాద్కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రస్తుతం ప్రసాద్ సీజీడబ్ల్యూబీలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘నీట్’పై సమగ్ర విచారణ జరిపించాలిములుగు రూరల్: నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో పాట్నాలో ఒక్కో విద్యార్ధి నుంచి రూ.30లక్షలు వసూలు చేసి పేపర్ లీకేజీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. నీట్ పరీక్షల్లో 69 మంది విద్యార్థులకు వందశాతం మార్కులు రావడం అనుమానాలను రెకెత్తిస్తున్నాయన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని వెంటనే న్యాయ మూర్తితో విచారణ జరిపించాలన్నారు. -
అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
గోవిందరావుపేట: అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఎస్పీ శబరీశ్ గొత్తికోయలకు సూచించారు. మండల పరిధిలోని బూడిదగడ్డ గొత్తికోయ గుంపును ఎస్పీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గొత్తికోయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రధానంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా ఎస్పీకి వివరించారు. తాగునీటి సమస్యను తీర్చేలా చర్యలు చేపడుతామని, వర్షాకాలంలో వచ్చే మలేరియా, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమయ్యే మందులు, సోలార్ లైట్లతో పాటుగా పలు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతామని వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం అసాంఘిక శక్తులు గొత్తికోయగూడేల్లోని ప్రజలకు మాయమాటలు చెప్పి బలి చేస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని గమనించి కొత్త వ్యక్తులు గూడేలకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లను పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా ఎస్సై కమలాకర్, ఆర్ఎస్సై రాకేష్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ శబరీశ్ -
వరదలతో నష్టం జరగకుండా చూడాలి
ములుగు: అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వర్షాకాలంలో వచ్చే వరదలతో ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ టీఎస్. దివాకర అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, సీహెచ్.మహేందర్జీ, డీఎఫ్ఓ రాహుల్కిషన్ జాదవ్లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. మూడేళ్లుగా ముంపునకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి నివేదికలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వరదలు సంభవిస్తే వెంటనే చర్యలు చేపట్టేవిధంగా ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీలు అందుబాటులో ఉండాలని వారితో పాటు మొబైల్ టీంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు, రేషన్ డీలర్లు, యువత, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. గ్రామాల వారీగా కుంటలు, మత్తళ్ల వద్ద అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు గ్రామాలను గుర్తించి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తలించే విధంగా చూడాలన్నారు. పొంగుతున్న వాగులను దాటకుండా పోలీసు శాఖ తరఫున బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. అనుమతి లేకుండా అటవీ ప్రాంతాల్లోని వాటర్ ఫాల్స్కు వెళ్తే కేసు నమోదు చేయాలన్నారు. వరదలు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాక్టర్లు, జేసీబీల సహాయం తీసుకోవాలన్నారు. వరదల సమయంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల సరిపడా మందులను ముందుగానే అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కరకట్ట నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి మంగపేట: మండల కేంద్రంలోని కరకట్ట నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని గోదావరి తీరం వెంట కరకట్ట నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ మాట్లాడి నిర్మాణం పనుల వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చాలా కాలం అవుతున్నా పనుల్లో జాప్యానికి గల కారణాలు ఏమిటని ఇరిగేషన్ శాఖ ఈఈ జగదీశ్ని అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని దొంగలఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు 2.5 కిలోమీటర్ల వరకు కరకట్ట నిర్మాణం పనులు చేపట్టేందుకు 2022లో ప్రభుత్వం రూ.1.09 కోట్లు, భూసేకరణకు రూ.27 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్కు జగదీశ్ వివరించారు. కరకట్ట నిర్మాణం డిజైనింగ్ అనుమతి వారం రోజుల క్రితమే వచ్చిందని కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు వీలుగా స్లోబ్ లెవలింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం కలెక్టర్ కరకట్ట నిర్మాణానికి సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. కాంట్రాక్టర్ కరకట్ట నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ను దిగుమతి చేసుకుని పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరస్వామి, ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్ మహ్మద్ పాల్గొన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలన వెంకటాపురం(కె): మండల పరిధిలోని ముంపు ప్రాంతాలైన బల్లకట్టు, కుక్కతోగు వాగు, కంకలవాగులను కలెక్టర్ టీఎస్. దివాకర పరిశీలించారు. గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలెం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం వీఆర్కే పురంలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ సర్వే పనులను పరిశీలించారు. వరదల సమయంలో అధికారులు, పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి కలెక్టర్ టీఎస్.దివాకరఎన్హెచ్పై భారీ వృక్షం.. కలెక్టర్ ఆదేశాలతో తొలగింపు ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రం దాటిన తర్వాత కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై అడ్డంగా భారీ వృక్షం గురువారం పడింది. దీంతో హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వచ్చి వెళ్లే వాహనాలు అరగంట సేపు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి ములుగు వస్తున్న కలెక్టర్ టీఎస్.దివాకర్ రోడ్డుపై చెట్టుపడి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది మాట్లాడి తొలగించాలని ఆదేశించారు. దీంతో వెంటనే స్పందించిన తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి రోడ్డుపై పడిన వృక్షాన్ని ట్రాక్టర్ డోజర్తో తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
దేవాదుల–3వ దశకు మరో రూ.550కోట్లు
హసన్పర్తి: మరో రూ.550కోట్లు విడుదల చేస్తే దేవాదుల ప్రాజెక్టు–3వ దశ పనులు పూర్తవుతాయని ఇరిగేషన్ అధికారులు.. రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సారెీస్పీ, దేవాదుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమావేశం హైదరాబాద్లో జలసౌధలో మంగళవారం రాత్రి జరిగింది. సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దేవాదుల ప్రాజెక్టు–3పై జరిగిన చర్చ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు–3దశ పనులు 90శాతం పూర్తయినట్లు మంత్రి ఉత్తమ్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కాంక్రీట్తోపాటు ఇతర పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు నిధులు మంజూరు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. డిస్ట్రిబ్యూటరీ, కాల్వలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. 1.5లక్షల ఎకరాలకు నీరు అందించగలమని అధికారులు మంత్రికి వివరించారు. ఈ అంశంపై ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి సూచించారు. రెండున్నర నెలల్లోనే దేవాదుల–3 దశ ద్వారా నీరు అందించాలని ఆదేశించారు. నీటి కేటాయింపుల్లో కుదింపు చర్చ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడారు. గతంలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 60 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందన్నారు. ప్రస్తుతం దాన్ని 38.15 టీఎంసీలకు కుదించారని తెలిపారు. దేవాదుల–1, 2, 3 దశల్లో నీటిని లిఫ్ట్ చేయడానికి 38.16 టీఎంసీలు సరిపోవన్నారు. కేటాయింపులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు–2లో భాగంగా స్టేషన్ ఘన్ఫూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు 31 కిలోమీటర్ల వరకు ప్రధాన కాల్వ మంజూరైనట్లు వివరించారు. దీనిద్వారా స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ కింద 28,.800ఎకరాలు, చెన్నూరు రిజర్వాయర్ కింద 25,200 ఎకరాలు, నవాబుపేట రిజర్వాయర్ కింద 53,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లోని 1,07,400 ఎకరాలకు సాగునీరు అందించడానికి శాశ్వత ప్రాతిపదికన ప్రధాన కాల్వలకు ఇరువైపులా లైనింగ్, పూడిక తొలగింపు, జంగిల్ క్లియరెన్స్, ఓటీలు, డీఎల్ఆర్ బిల్లు, తూములు, షట్టర్ల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాత పద్ధతి ప్రకారమే మైనర్, మేజర్ ఇరిగేషన్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. రైతులకు కూడా తగిన విధంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. నాలాల అభివృద్ధికి రూ.140 కోట్లు గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో నాలాల అభివృద్ధికి రూ.140 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలంలో నగరంలోని కాలనీలు ము ంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రకాళి చెరువుతోపాటు ఇతర చెరువుల నాలా లను అభివృద్ధి చేయాల్సిన అవసర ఉందన్నారు. అవసరమని మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు రెండున్నర నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం వేర్వేరుగా మైనర్, మేజర్ ఇరిగేషన్ చేయాలన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నగరంలో ముంపునకు గురి కాకుండా నాలాల అభివృద్ధికి దిశానిర్దేశం నీటిపారుదలపై హైదరాబాద్లో సమీక్ష సమావేశం కాల్వల పనులు చేపట్టాలి పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ–2 ప్రాజెక్టులోని పలు ప్రాంతాల్లో ప్రధాన కాల్వలు, ఉపకాల్వలు దెబ్బతిన్నాయని మంత్రి చెప్పా రు. మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. గతేడాది దెబ్బతిన్న కాల్వలు, చెరువుల నివేదికను వెంటనే అందించాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రాంచందర్నాయక్, మురళీనాయక్, ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయ క్, ఈఎన్సీలు నాగేందర్, అనిల్కుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నీటిపారుదలశాఖ ఉన్నతాఽధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా..
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి సమీపంలోని జంపన్నవాగుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలు ఈ ఐరన్ బ్రిడ్జి నుంచి నడిచేందుకు కావాల్సిన నిర్మాణం పనులను మొదలు పెట్టారు. మంత్రి సీతక్క చొరవతో ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు ఊపందుకున్నాయి. మంత్రి చొరవతోనే పనులు మండలంలోని కొండాయి – దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై 2015లో రూ.5కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి గతేడాది కురిసిన వర్షాలు, వరదల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం గ్రామాల ప్రజలకు రాకపోకలు కష్టంగా మారడంతో అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.25 లక్షలతో ఆర్అండ్బీశాఖ ద్వారా తాత్కాలికంగా వాగుపై సిమెంట్ పైపులు వేసి మట్టిరోడ్డును నిర్మించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు మట్టి అంతా ఒర్లిపోయి పైపులు కొట్టుకపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి పైనుంచి ఐరన్ బ్రిడ్జి(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మించడానికి మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఇంజనీరింగ్శాఖ ద్వారా రూ. 35లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో ఐరన్ ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను మొదలు పెట్టారు. ప్రస్తుత వర్షాకాలంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలకు సురక్షితమైన రవాణా ఉండాలనే లక్ష్యంతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 280 అడుగుల పొడుగు.. 4 అడుగుల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 280 అడుగుల పొడువు, నాలుగు అడుగుల వెడల్పు నిడివితో నిర్మిస్తున్నారు. అయితే టేకుమండలంలో గతంలో బ్రిడ్జి కూలిపోతే అక్కడ ఐరన్ బ్రిడ్జిని నిర్మించడంతో దాని నమూనాలోనే ఇక్కడ నిర్మించేలా చర్యలు చేపట్టారు. జంపన్నవాగు బ్రిడ్జికి ఉన్న రెండు పిల్లర్ల స్థానంలో రెండు ఐరన్ పిల్లర్లను నిర్మించి దానిపై నుంచి ఈ ఐరన్ బ్రిడ్జిని వెల్డింగ్ చేసి నిర్మిస్తున్నారు. కొట్టుకపోయిన బ్రిడ్జి స్థానంలో ఈ ఐరన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పనులను పరిశీలించిన అధికారులు కొండాయి వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్బ్రిడ్జి పనులను ఐటీడీఏ ఈఈ వీరభద్రం, డీఈఈ చందర్లు బుధవారం పరిశీలించారు. వెల్డింగ్ పనులు సకాలంలో పూర్తి చేసి మరో రెండు రోజుల్లో బ్రిడ్జి వినియోగంలోకి వచ్చేలా చూస్తామన్నారు. ఈ బ్రిడ్జి నుంచి ముంపు ప్రాంతాల ప్రజలు వాగు వచ్చినప్పటికి దాటేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే దాటాలన్నారు. వరదల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. త్రీ, ఫోర్ వీటర్లకు ఎలాంటి అనుమతి లేదన్నారు.కొండాయి జంపన్నవాగుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఐటీడీఏ నుంచి రూ.35లక్షలు మంజూరు తీరనున్న ఆయా గ్రామాల ప్రజల కష్టాలుతాత్కాలికంగా రాకపోకలకు ఉపయోగపడేలా.. శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 9.50 కోట్లు ఆర్అండ్బీశాఖ ద్వారా మంజూరు ఇచ్చింది. మార్చి నెలలో సైతం పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే శాశ్వత నిర్మాణం బ్రిడ్జి పనులు మొదలయ్యే వరకు తాత్కాలికంగా ఈ ఐరన్ బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఉపయోగించేలా నిర్మిస్తున్నారు. ఇరువైపులా గైడింగ్ ఐరన్ వాల్స్, నడిచేందుకు ఐరన్ షీట్స్ను వెల్డింగ్ చేయడంతో దానిపై సులభంగా నడిచే అవకాశం ఉంటుంది. వర్షాలు కురిసి వాగు ఉప్పొంగినప్పటికీ రాకపోకలకు ఎలాంటి అవంతరాలు లేకుండా ఉండేలా, రాత్రి వేళలో సైతం ఈ బ్రిడ్జి పైనుంచి నడిచేలా నిర్మిస్తున్నారు. -
ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు
మంగపేట: మండల కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాలను మండల స్పెషలాఫీసర్ తుల రవి ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం సందర్శించింది. వర్షాకాలంలో గోదావరి వరదలు, గౌరారం వాగు వరద ఉధృతి కారణంగా మండల కేంద్రంలో ప్రతిఏటా లోతట్టు ముంపు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 15న సాక్షిలో పొంచి ఉన్న ప్రళయం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ముంపు ప్రాంతాలైన పొదుమూరు, సినిమాహాల్ వీధి, మంగపేట, బోరునర్సాపురం మధ్య నూతనంగా నిర్మించిన లోలెవల్ బ్రిడ్జిని వారు పరిశీలించారు. గత ఏడాది గౌరారంవాగు వరదకు ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చి లోలెవల్ బ్రిడ్జి పిల్లర్లకు అడ్డుపడిన అవశేషాలు గుర్తించారు. వాటిని తొలగిస్తే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుందని లేని పక్షంలో వాగు వరద నీటితో పాటు గోదావరి బ్యాక్ వాటర్తో సినిమాహాల్ వీధిలోని 28ఇళ్లతో పాటు పొదుమూరులోని లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు సైతం మునిగే ప్రమాదం ఉందని గుర్తించారు. ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అనంతరం ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకధికారులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా చర్యలు చేపట్టాలని, వరదల పట్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పెషలాఫీసర్ రవి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరస్వామి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఆర్ఆండ్బీ డీఈ రఘువీర్, ఐబీ ఏఈ వలీమ్ మహ్మద్, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకధికారులు పాల్గొన్నారు. -
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
ములుగు: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. మండల పరిధిలోని బండారుపల్లి పరిధిలో 16ఎకరాల విస్తీర్ణంలో రూ. 47కోట్లతో నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులను బుధవారం అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి పరిశీలించారు. నిర్మాణ ఆకృతి, బ్లూ ప్రింట్లను పరిశీలించారు. సంబంధిత పనుల కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి భవన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నిర్మాణ పనులకు అంతరాయం కలిగితే అంతర్గత పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పనుల పురోగతిని రోజువారీగా అందించాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కలెక్టర్ వెంట డీఈ వెంకటరమణ, ఏఈ రాకేష్, తహసీల్దార్ విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.ట్రెయినీ ఐపీఎస్లకు శిక్షణ గోవిందరావుపేట: తెలంగాణకు చెందిన ట్రెయినీ ఐపీఎస్లు శిక్షణలో భాగంగా బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్, ఫంక్షనింగ్పై ఒక్కరోజు ప్రాక్టికల్ ట్రైనింగ్ నిమిత్తం మండల కేంద్రంలోని 5వ బెటాలియన్ను 9మంది ఐపీఎస్ అధికారులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కమాండెంట్ శివ ప్రసా ద్ రెడ్డి ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్ కుమార్, వేణు గోపాల్ రెడ్డిలు ట్రెయినీ ఐపీఎస్లకు బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్, ఫంక్షనింగ్, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కార్తీక్, అన్నయ్య, రాంప్రసాద్, సల్మాన్ రాజు, శ్రీనివాస్, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. రామప్పలో ట్రెయినీ ఐఏఎస్ల పూజలు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఐఏఎస్ అధికారులు బుధవారం సందర్శించి దర్శించుకున్నారు. అజ్మీరా సంకేత్కుమార్, ఉమా హారతి, గరీమానరులా, అభిగ్యాన్ మాల్వియా, అజయ్ యాదవ్, మ్రినల్ శేష్టా, ఈఎస్ఎస్డీమనోజ్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారి శేషవస్త్రాలను, అశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట ప్రొఫెసర్ శ్రీనివాస్, టీఎస్టీడీసీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు, రవి, ఆర్ఐ రమేష్, టూరిజం. దేవాదాయ అధికారులు ఉన్నారు. చట్టాలపై అవగాహన తప్పనిసరి ములుగు రూరల్: విద్యార్థులు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సన్ రైజర్స్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయం, మోటర్ వెహికిల్ చట్టం, పోక్సో చట్టాలు, బాలలకు సంబంధించిన హక్కులను వివరించారు. -
సికిల్సెల్ వ్యాధిని నిర్మూలిద్దాం..
ములుగు: సికిల్సెల్ ఎనిమియా వ్యాధిని సమాజం నుంచి నిర్మూలిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు వరల్డ్ సికిల్సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సికిల్సెల్ సోకితే రక్తకణాలు చనిపోతాయని, శరీరం నీరసంగా మారి జ్వర తీవ్రత ఉంటుందన్నారు. ముఖ్యంగా రక్తమార్పిడి కష్టతరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్లో ఈ వ్యాధితో ఎవరు చనిపోకుండా చూడాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. జిల్లాలో వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో వ్యాధి తీవ్రత ఉంటున్నట్లుగా వైద్య సిబ్బంది గుర్తించారని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధిగా రోగ నిర్ధారణ శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ చిన్నదానికి రోగులను వరంగల్కు రెఫర్ చేయడం మానుకోవాలని సూచించారు. ఇకపై ఎప్పుడూ వైద్యశాలలో వైద్యులు లేరని వార్తలు రాకుండా చూసుకోవాలన్నారు. సమయపాలన పాటించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వైద్య సిబ్బంది సమస్యలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని సమయానుకూలంగా పరిష్కరిస్తామని వెల్లడించారు. కలెక్టర్ టీఎస్.దివాకర మాట్లాడుతూ యుక్తవయసులో ఉన్న బాలికలకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. జిల్లాలో 2,300 మందికి టెస్టులు నిర్వహించగా 20 మందికి పాజిటీవ్ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా సికిల్సెల్ టెస్టు చేయించుకున్నారు. ప్రతిఒక్కరూ టెస్టులకు ముందుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్లాల్, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, ౖసిబ్బంది పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందించాలి వెంకటాపురం(ఎం): ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో రూ.49.53 లక్షల నాబార్డ్ నిధులతో చేపట్టిన మిషన్ భగీరథ అంతర్గత తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను సీతక్క, కలెక్టర్ టీఎస్.దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో తాగునీటి పైపులైన్లు లీకేజీ కావడంతో ప్రజలు కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలు అవుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమై పైపులైన్ లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. వెంకటాపురంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న గృహాలకు నల్లాల కలెక్షన్ లేకపోవడంతో నిధులను కేటాయించి పైపులైన్ నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతన గృహాలకు భగీరథ నీటిని అందించాలని మంత్రి చొరవతోనే పైపులైన్ నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేశ్, డీఈ అజహర్ సయ్యద్, ఎంపీపీ రజిత, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.మంత్రి సీతక్క -
పదోన్నతుల కల నెరవేరిన వేళ..
విద్యారణ్యపురి: దశాబ్దంన్నర కాలంగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న ప్రభుత్వ, లోకల్బాడీ యాజమాన్యాల పరిధిలోని లాంగ్వేజ్ పండిట్ల(తెలుగు, హిందీ, ఉర్దూ)కు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలు ఎస్ఏ పీడీలుగా ఎట్టకేలకు పదోన్నతులు లభించాయి. వీరికి బుధవారం ఉత్తర్వలు ఇవ్వండంతో పోస్టింగ్ స్థానాల్లో జాయిన్ అవుతున్నారు. తొమ్మిదేళ్లుగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు కూడా పదోన్నతులు లభించాయి. వీరికి పీఎస్హెచ్ఎంలుగా, ఎస్ఏ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, కేటగిరీలో పదోన్నతులు కల్పించారు. మల్టీజోన్ –1 పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ప్రభుత్వ, లోకల్బాడీ యాజమాన్యాల పరిధిలో అన్ని కేటగిరీలు కలిపి 1,768మందికి పదోన్నతులు కల్పించారు. జిల్లాల వారీగా ఇలా.. ● హనుమకొండ జిల్లాలో 454మంది పదోన్నతులు పొందారు. వరంగల్ జిల్లాలో 434మంది పదోన్నతులు పొందాల్సిండగా. అందులో లోకల్బాడీలో పీఎస్హెచ్ఎం, ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ పీడీలు మొత్తంగా 76మందికి పదోన్నతులు ఉత్తర్వులు రావాల్సింది. రోస్టర్లో తలెత్తన సమస్యతో మళ్లీ పరిశీలించినట్లు సమాచారం. వీరికి ఆర్డర్స్ రావాల్సింది. రాత్రి వరకు వీరికి కూడా పదోన్నతుల ఆర్డర్స్ వస్తాయని భావిస్తున్నారు. మిగతా 358మందికి ఉత్తర్వులు అందాయి. ● ములుగు జిల్లాలో 217మందికి పదోన్నతులు కల్పించగా 163మందికి ఉత్తర్వులు అందాయి. పీఎస్హెచ్ఎం 39మందికి, ఎస్ఏ ఇంగ్లిష్ 15మంది.. మొత్తంగా 54మంది టీచర్లకు ఉత్తర్వులు రావాల్సింది. ● మహబూబాబాద్ జిల్లాలో 517మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 276మంది పదోన్నతులు పొందారు. ● ఎక్కువశాతం మంది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తమకు వెబ్ ఆప్షన్ల ప్రకారం కేటాయించిన ఉన్నత పాఠశాలలు, అక్కడక్కడా యూపీఎస్లలో విధుల్లో చేరారు. కొందరు ఎస్జీటీలకు రెండింటిల్లోనూ పదోన్నతులు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలో కొందరు ఎస్జీటీలకు రెండింటిల్లోనూ పదోన్నతులు లభించినట్లు సమాచారం. ఎస్జీటీ కేడర్లోని వారికి పీఎస్హెచ్ఎంలుగా, విద్యార్హతలను బట్టి ఇతర సబ్జెక్టుల్లో స్కూల్అసిస్టెంట్లుగా కూడా పదోన్నతి పొందే అవకాశం ఉంది. దీంతో హనుమకొండ జిల్లాలో అలా రెండు పోస్టుల్లోనూ పదోన్నతి పొందిన వారు 50మంది వరకు, మహబూబాబాద్ జిల్లాలో 30మంది వరకు ఉంటారని తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో ఒక టీచర్కు మాత్రం రెండు సబ్జెక్టుల్లో ఎస్ఏలుగా పదోన్నతి లభించినట్లు తెలిసింది. మిగతా జిల్లాల్లోనూ పలువురు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరు ఏదో ఒక పోస్టులో విధుల్లో చేరితే మిగతా పోస్టు ఖాళీగా ఉంటుంది. ములుగు జిల్లాలో 247మందివరకు అవకాశం ఉన్నా.. ములుగు జిల్లాలో 247 మంది టీచర్లకు పదోన్నతి అవకాశం ఉన్నప్పటికి అర్హులైనవారు లేకపోవడం వల్ల 217మందికే లభించినట్లు ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉండగా జనగామ జిల్లా మల్టీజోన్–2 పరిధిలో ఉండడంతో అక్కడ ఆ జోన్తోపాటు జరుగుతాయని విద్యాశాఖాధికారులు తెలిపారు.ఐదు జిల్లాల్లో 1,768మందిటీచర్లకు పదోన్నతులు ఉత్తర్వులు చేతికందడంతో పలువురు విధుల్లో చేరిక ఎస్ఏ పీడీలుగా పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్లకు ఎస్ఏలుగా, ఎస్జీటీలకు పీఎస్హెచ్ఎంలు, ఎస్ఏలుగా ఉద్యోగోన్నతి వరంగల్లో మరో 76మంది, ములుగులో 54మంది వెయింటింగ్ -
మద్యం తాగుతూ..విధి నిర్వహణ
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఒకరు మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం మంగళవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా సదరు ఉద్యోగి మద్యం తాగి విధి నిర్వహణకు రావడం పట్ల అప్పటి జిల్లా అధికారి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అదేవిధంగా మళ్లీ ఆ ఉద్యోగి మద్యం తాగి విధుల్లోకి రావడం, తాజాగా కార్యాలయంలోనే మద్యం తాగడంపై జిల్లా ఉన్నతాధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ అధికారుల తీరుమాత్రం మారకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి ఎండీ గౌస్ పాషాను వివరణ కోరగా కార్యాలయంలో మద్యం సేవిస్తూ ఉద్యోగం చేయడం సరికాదన్నారు. విషయం తెలిసిన వెంటనే సదరు ఉద్యోగిని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో ఔట్సోరి్సంగ్ ఏజెన్సీకి సరెండర్ చేశామని తెలిపారు. -
టీఎన్జీవోస్ నాయకుల సన్మానం
ములుగు రూరల్: జిల్లా నూతన కలెక్టర్ టీఎస్.దివాకరను టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ చాంబర్లో పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, భూక్య లాల్సింగ్, కుమారస్వామి, రమాదేవి, సరిత, సునీత, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెజింగ్ కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేయాలి వెంకటాపురం(కె): ఇసుక సొసైటీల్లో రెజింగ్ కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనె రామచందర్ అన్నారు. మండల కేంద్రంలో సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో వనరులపై ఆదివాసీలకు హక్కులు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు రెజింగ్ కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునేశ్వరావు, నవీన్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకిచ్చిన హామీలను నెరవేర్చాలి ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలను వెంటనే చెల్లించాలన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు రూ.4 వేల పెన్షన్ అందించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. దివ్యాగంలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. త్వరలోనే హైదరాబాద్లో నిర్వహించబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, దివ్యాంగులు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరుగు పైడి, శ్యాంబాబు, లావణ్య, నెమలి నర్సయ్య, కడారి సాంబయ్య, పోరిక నవీన్, మోహన్రావు, సుజాత పాల్గొన్నారు. -
కాళేశ్వరం: తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం!
పోలీసులు అంటే ఒక నమ్మకం.. ప్రజల మాన, ప్రాణాలు కాపాడేవారని భరోసా. కానీ ఓ సబ్ ఇన్స్పెక్టర్ని చూస్తే ఆ స్టేషన్లోని వారికే ఒక చిరాకు.. స్త్రీలోలుడు.. గతంలో పనిచేసిన చోటా ఇదే పని.. కన్నేసిన ఆడవారిని అనుభవించేదాకా వదలడు. అందుకు ఎంతదూరమైనా వెళ్తాడు. తన సర్వీస్ రివాల్వర్తో బెదిరించి మరీ తన కామవాంఛ తీర్చుకుంటాడు. అలాంటి ఘటనే ఇది. సొంత స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ పోలీస్ కామాంధుడి అరాచకాలు ఆ సబ్ డివిజన్లో హాట్టాపిక్గా మారాయి. వరంగల్క్రైం: ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరులోనే దేవత ఉంటుంది. కానీ అతను.. మహిళలంటే కేవలం కోరికలు తీర్చే వస్తువు అనుకుంటాడు. అతను పనిచేసేది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లోని ఓ స్టేషన్లో. ఇరవై రోజుల క్రితం తనకు కాలు విరిగింది.. ఇంటికి వచ్చి సాయం చేయమని తన స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్ను వేడుకోగా, తను మానవత్వంతో ఇంటికి వెళ్తే తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట తెలిస్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మళ్లీ ఆమె ఇంటికి వచ్చిన సదరు ఇన్స్పెక్టర్ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె తనలో తాను కుంగిపోతోంది. సదరు సబ్ఇన్స్పెక్టర్ రాసలీలలే కాదు.. మరిన్ని బాగోతాలు ఉన్నట్లు కాటారం డివిజన్లో చర్చ జరుగుతోంది. ఇతని వ్యవహారశైలిపై ‘సాక్షి’కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. అతను నోరు తెరిస్తే బూతు పురాణం. పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే మహిళలకు వణుకు పుడుతుంది. తన ఎదురుగా వెళ్తే నోటికొచ్చిన మాట అనేయడం ఆయనకు సర్వసాధారణం. గతంలో ఫిర్యాదుదారులతో నోటికి వచ్చినట్లు మాట్లాడి పలుమార్లు ఉన్నతాధికారుల చేతుల్లో చీవాట్లు తిన్నా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. చీవాట్లు తప్ప కఠిన చర్యలు తీసుకునే వారు లేరన్న ధీమాతో ఆయన తిట్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.చికెన్ కోసం చిల్లర బుద్ధి..ఆయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉన్నాయి. రోజూ ఒక సెంటర్ పావుకిలో చికెన్ తనకు వంతుల వారీగా పంపించాలని సమావేశం పెట్టి మరీ హుకుం జారీ చేయడం గమనార్హం. ఇక ఆ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు, ఇసుక ట్రాక్టర్లు, వేబ్రిడ్జి కాంటాల యజమానులకు ఫోన్లు చేసి మామూళ్లు వసూలు చేయడంతో ఆయనకు సాటి లేరు. ఆటోడ్రైవర్లు, చిల్లర వ్యాపారులు, ఇలా ఎవరినీ వదలడు. ఆయన వసూళ్లు రూ.100 నుంచి మొదలవుతాయంటే ఎంతగా దిగజారాడో తెలిసిపోతోంది. ఖాకీ చొక్కాను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు కేరాఫ్గా మారాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, విషయం తెలియడంతో డీఎస్పీ సదరు స్టేషన్కు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. ఆ ఎస్ఐనుంచి రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అతనిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.పనిచేసిన ప్రతీచోట రాసలీలలుప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ను అడ్డుపెట్టుకుని రాసలీలలు చేయడంలో తనకు తనే సాటి. గతంలో పనిచేసిన మంచిర్యాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్ అయిన ఘన చరిత్ర ఆయనది. తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్ మీనింగ్ డైలాగ్లతో ఇబ్బందికి గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను అందంగా లేనా... నన్ను వద్దంటావా...? కారణం చెప్పవా.. అనే మాటలు ఆయన దగ్గర పనిచేసే మహిళా సిబ్బంది, ఫిర్యాదుదారులు ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిందే. అవసరం లేకున్నా రాత్రి వరకు మహిళా సిబ్బందిని స్టేషన్లో ఉంచుకుని హింసపెట్టడం తన దినచర్యలో భాగం.నేను మంత్రి మనిషిని.. ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది. ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
No Headline
పోలీసులు అంటే ఒక నమ్మకం.. ప్రజల మాన, ప్రాణాలు కాపాడేవారని భరోసా. కానీ ఓ సబ్ ఇన్స్పెక్టర్ని చూస్తే ఆ స్టేషన్లోని వారికే ఒక చిరాకు.. సీ్త్రలోలుడు.. గతంలో పనిచేసిన చోటా ఇదే పని.. కన్నేసిన ఆడవారిని అనుభవించేదాకా వదలడు. అందుకు ఎంతదూరమైనా వెళ్తాడు. తన సర్వీస్ రివాల్వర్తో బెదిరించి మరీ తన కామవాంఛ తీర్చుకుంటాడు. అలాంటి ఘటనే ఇది. సొంత స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ పోలీస్ కామాంధుడి అరాచకాలు ఆ సబ్ డివిజన్లో హాట్టాపిక్గా మారాయి. – వరంగల్క్రైం నేను మంత్రి మనిషిని.. ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది. ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ఏటూరునాగారం: జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో కలెక్టర్ టీఎస్.దివాకర అధ్యక్షతన మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ శ్రీజ(స్థానిక సంస్థలు), పీఓ చిత్రామిశ్రా, ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్, అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్ యాదవ్, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఐటీడీఏ ఇంజనీరింగ్ ఈఈ వీరభద్రం, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనిన, ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పోచం, ఇరిగేషన్ ఈఈ జగదీశ్ ఇతర ఉన్నత శాఖల అధికారులతో రెండు గంటల పాటు మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. గతేడాది లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఐటీడీఏ సమావేశపు గదిలో ఆయా శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడుతూ పాఠశాలలు, హాసళ్లు ప్రారంభమైనందున సంబంధిత అధికారులు హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, వసతులు, పాఠ్యపుస్తకాలపై ముందస్తుగా ఆలోచన చేయాలన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. ఐటీడీఏ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తర్వాత మూడు నెలలకోమారు పాలకమండలిని నిర్వహించుకునే విధంగా ప్రణాళిక చేపట్టాలన్నారు. వీలైనంత త్వరలో జనరల్ బాడీ సమావేశానికి కలెక్టర్ ఏర్పాట్లు చేయాలన్నారు. విధులపై నిబద్ధతలేని అధికారులు ఇతర జిల్లాలకు వెళ్లిపోవచ్చని తెలిపారు. కేవలం జీతాల కోసం పనిచేయాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన శర్మ సేవలను మంత్రి కొనియాడారు. గంజాయిపై ఉక్కుపాదం తెలంగాణ– ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి మత్తు మందు(డ్రగ్స్) రవాణా జరుగుతుందని వాటిపై పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు. అత్యాచారాలు నిర్మూలించే విధంగా పోలీస్ శాఖ కృషి చేయాలన్నారు. ఫారెస్ట్ శాఖ అధికారులు సంయమనం పాటించాలని తెలిపారు. తాను కూడా 20ఏళ్లుగా రాజకీయంగా అధికారులు, ప్రజలతో మమేకమై ఉన్నానని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే ఐటీడీఏకు మంచి పేరు వస్తుందన్నారు. ప్రస్తుతం కొండాయి– జంపన్నవాగుపై తాత్కాలిక ఐరన్ వంతెన ఐటీడీఏ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. నాణ్యతా లేకుండా పనులు చేయిస్తే ఇంటికి పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం చిన్నబోయినపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ రడం సుజాత ఇటీవల హత్యకు గురికాగా ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్లాక్ అధ్యక్షుడు వెంకన్న, ఏపీఓ వసంతరావు, ఎస్ఓ రాజ్కుమార్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఐటీడీఏలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం -
24గంటలు ప్రజలకు సేవలు
ములుగు/ఏటూరునాగారం/గోవిందరావుపేట: 24గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తానని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయా శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, సీహెచ్ మహేందర్జీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉంటారని తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ– ఆఫీస్ విధానంపై కిందిస్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దని తెలిపారు. ఈ సమీక్షలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్కుమార్, డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, విద్యాశాఖ అధికారి పాణిని తదితరులు పాల్గొన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటన ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి వరద ముంపు ప్రాంతాన్ని కలెక్టర్ దివాకర మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వర్షాకాలంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వరదల సమయంలో ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. గత వర్షాకాలంలో జంపన్నవాగు పరీవాహక ప్రాంతంలోని కొండాయి గ్రామంలోకి వచ్చిన వరద పరిస్థితులను తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.35 లక్షలతో ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కొండాయి వంతెనపై చేపట్టిన తాత్కాలిక వంతెన నిర్మాణ(ఐరన్ రోప్వే) పనులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని ప్రాజెక్ట్నగర్ వరద ముంపు గ్రామాన్ని సందర్శించారు. వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగు వరద ఉధృతి పెరిగే సమయంలో పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. గతంలో ఇళ్లు ముంపునకు గురైన గ్రామస్తులు తమకు నూతన గృహాలను నిర్మించాలని కలెక్టర్ను కోరగా వాటిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మొదటి సారిగా ప్రాజెక్ట్నగర్ రావడంతో గ్రామస్తులు కలెక్టర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
గొత్తికోయగూడేల్లో వైద్యపరీక్షలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని గొత్తికోయ గూడేల్లోని ప్రజలకు డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ చంద్రకాంత్ ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్లు జంపయ్య, కృష్ణయ్య, శ్రీనివాసులు కాలినడకన వెళ్లి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల పరిధిలోని జారూరు బండ, మామిడి తోట, కన్నయ్య గూడెం, మచ్చాపూర్ గూడేలకు హెల్త్ అసిస్టెంట్లు వెళ్లి మూడు గూడేల్లో 62ఇళ్లలో మొత్తం 308మంది జనాభా ఉండగా 202మందికి మలేరియా రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో రోగాలు రాకుండా చిన్నారులకు గోరు వెచ్చని నీరు తాగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్యుఓ భూపాల్రెడ్డి, ఏఎన్ఎం వెంకటలక్ష్మీ, ఆశ కార్యకర్తలు సరోజన, వనిత, సమత, స్వరూప, భారతి, మంజుల, సరిత పాల్గొన్నారు. -
కరకట్ట పనులకు మోక్షం
మంగపేట: గోదావరి కరకట్ట నిర్మాణం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కరకట్ట నిర్మాణం పనులను టెండర్ పద్ధతిన దక్కించుకుని ప్రభుత్వంతో అగ్రిమెంటు కుదుర్చుకున్న హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ పనులను మంగళవారం ప్రారంభించింది. కరకట్ట నిర్మాణం పనుల్లో బాగంగా గోదావరి ఒడ్డు వెంట సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పొక్లెయిన్తో స్లోబ్ లెవలింగ్ పనులు జరుగుతున్నాయి. మండల కేంద్రంలోని దొంగల ఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు 2.05 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం పనులు చేపట్టేందుకు 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.09 కోట్లు, భూసేకరణకు రూ.27 కోట్లు మంజూరు చేసింది. గోదావరి ఒడ్డు నుంచి సుమారు 30 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలో మీటర్ల దూరంవరకు కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు 2022 ఏప్రిల్లో హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ అగ్రిమెంటు కుదుర్చుకుంది. పనులు ప్రారంభించేందుకు భూసేకరణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించారు. పనులు చేపట్టే క్రమంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలు పడటంతో పాటు గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. మంత్రి సీతక్కకు రుణపడి ఉంటాం.. 2015 పుష్కరాల నుంచి కరకట్ట నిర్మాణంపై తొమ్మిదేళ్లుగా సందర్శనలు, అంచనాలు, సర్వేలతోనే సరిపెట్టిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి నిరాధరణకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి సీతక్క చొరవతో రెండు నెలల క్రితం కరకట్ట నిర్మాణం పనులను పొందిన గుత్తేదారు పనులు ప్రారంభించేందుకు సాయల్ టెస్టింగ్ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ కొద్ది నెలల జాప్యం కావడంతో మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించి కరకట్ట నిర్మాణంపై సంబంధిత ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించింది. వర్షాకాలంలో వరదల కారణంగా గోదావరి ఒడ్డు వెంట ఉన్న రైతులకు ఎలాంటి నష్టం జరగొద్దని, మండల కేంద్రంలోని పొదుమూరు, ముస్లింవాడ, పాతసినిమా హాల్తో పాటు తదితర లోతట్టు ప్రాంత ప్రజలకు వరద సమస్యలేకుండా చర్యలు చేపట్టాలని అందుకు త్వరిత గతిన పనులు చేపట్టి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం నుంచి కరకట్ట నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో మంత్రి సీతక్కకు ఎప్పటికీ రుణపడి ఉంటామని హర్హం వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన వరదలు కట్టేందుకు.. 2008 సర్వే నివేధిక ఆధారంగా కరకట్ట పనులు చేపట్టకుండా 2022 జులైలో వచ్చిన వరదలను అరికట్టే విధంగా ఏటూరునాగారం నుంచి భద్రాచలం వరకు కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు సర్వే నిర్వహించాలని అప్పటి వరకు తాత్కాలికంగా పనులు నిలిపి వేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పనులు నిలిచి పోయినట్లు అధికారులు తెలిపారు. నూతన టెక్నాలజీతో నిర్మాణం మండల కేంద్రంలో గోదావరి ఒడ్డు వెంట నిర్మించనున్న కరకట్ట నిర్మాణ పనులను నూతన జియోట్యూబ్స్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు ఏఈ వలీమ్ మహ్మద్ తెలిపారు. గతంలో కరకట్ట నిర్మాణంలో ఒడ్డు కోతకు గురికాకుండా రాయిని వినియోగించే వారు. రాతికట్టడం కంటే అత్యంత బలిష్టంగా ఉండేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేసేవిధంగా ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న జియో ట్యూబ్స్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలిపారు. – వలీమ్ మహ్మద్, ఇరిగేషన్ ఏఈ మంగపేట●ప్రారంభమైన స్లోబ్ లెవలింగ్ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు -
కొవ్వొత్తులతో ర్యాలీ
ములుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్రపల్లిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్ప డి, హత్యచేసిన బీహార్కు చెందిన దుర్మార్గుడిని తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చిన్నారి ఆత్మకు శాంతిచేకూరాలని బంజారా నాయకులు జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి జాతీయ రహదారి మీదుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చట్టాలలో మార్పులు చేసి ఇకముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్నాయక్, డాక్టర్ పోరిక రవీందర్, భూక్య జంపన్న, పాడ్య కుమార్, చంటి, రాజ్కుమార్లతో పాటు ఆయా మండలాలకు చెందిన సుమా రు 60 మంది బంజారా నాయకులు పాల్గొన్నారు. -
ఆదిమానవుల సమాధుల సందర్శన
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలో పర్యాటకులు సోమవారం సందడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, పెద్దపల్లి, పర్కాల ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అడవిలో ఆదిమానవుల సమాధులను సందర్శించారు. అటవీ ప్రాంతంలో పెద్దపెద్ద బండారళ్లతో నిర్మించిన ఆదిమానవుల సమాధులను పరిశీలించి ఆశ్చర్యపోయారు. ప్రకృతిని ఆస్వాధించి ఆనందంగా గడిపారు. సమాధులన్నీ వృత్తాకారంలో ప్రహరీ, ఎత్తయినా ప్రదేశంలో అత్తి పెద్ద రాళ్లను పేర్చి తూర్పు, ఉత్తరం ముఖంగా నిర్మించడం వారి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమన్నారు. దామెరవాయి గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్ పర్యాటకులు సమాధులను చూసేందుకు దగ్గరుండి తీసుకెళ్లారు. ఆదిమానవుల సమాధులను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పర్యాటకులు అధికారులను కోరుతున్నారు. -
అర్హతలు ఉన్నవారిని రెగ్యులరైజ్ చేయాలి
విద్యావనరుల కేంద్రాలు, కేజీబీవీల్లో పని చేస్తున్న సీఆర్పీలు, ఎంఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఆర్పీలు, పీఈటీలు, మెసెంజర్లను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం అందించాలి. విధి నిర్వహణలో మృతిచెందిన వారికి రూ. 20లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలి. – పాడ్య కుమార్, సీఆర్పీల జేఏసీ జిల్లా కోశాధికారి