-
తెలంగాణలోకి మావోయిస్టులు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు షెల్టర్ జోన్గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులను తీవ్రం చేశాయి. జనవరిలో ఆకురాలే కాలంలో మొదలైన ముప్పేట దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీలో కీలక నేతలు తమ వ్యూహాలను మార్చినట్లు సమాచారం.దళాలుగా సంచరించడం వల్ల పోలీసులు, కేంద్ర బలగాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనే అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో కీలక నాయకులను కాపాడుకోవడంతో పాటు పార్టీ ఉనికిని చాటుకునేందుకు వీలుగా తెలంగాణ వైపు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇక్కడి నుంచి కొత్త రిక్రూట్మెంట్లపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.గోదావరి తీరం వెంట కదలికలుగోదావరి తీరం వెంబడి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో వివిధ కమిటీల పేర్లతో మావో యిస్టులు తమ ఉనికి చాటేందుకు గత నాలుగైదేళ్లుగా ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలు ఎక్కు వగా లేఖలు, పోస్టర్లు, బ్యానర్ల వంటి అంశానికే పరిమితమయ్యాయి. దీంతో పార్టీ విస్తరణ విషయంలో సానుకూల ఫలితాలు పొందలేక వెనకడు గు వేశారు.ఇప్పుడు మావోయిస్టులు రూటు మార్చారు. దళాల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి బదులు ఇద్దరు ముగ్గురు సభ్యులతో టీమ్లుగా ఏర్పడి తెలంగాణలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. రెండు వారాలుగా గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు కని్పంచడం ఇందుకు బలం చేకూరుస్తోంది.మద్దతుపై రెక్కీ టీమ్ల ఆరామావోయిస్టు పార్టీలో తలపండిన నాయకులు, ఉద్యమ వ్యూహాలు తెలిసిన వారు చిన్న టీమ్లుగా విడిపోయారు. ఈ బృందాలు ఇటీవల భద్రాద్రి – ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న అటవీ గ్రామాల దగ్గర నుంచి గోదావరి తీరం దాటి రెక్కీ టీమ్లుగా వ్యవహరిస్తున్నా యని సమాచారం. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లకు మావోల నుంచి హుకుం జారీ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోకి వచ్చిన రెక్కీ టీమ్ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఎ లా ఉంది? సానుభూతిపరుల నుంచి మద్దతు లభిస్తుందా, లేదా? అనే అంశాలను బేరీజు వేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన నాయకుల కదలికలపైనా దృష్టి సారించారని సమాచారం. చర్ల మండల కేంద్రంలో ఐదుగురిని గురువారం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనేది స్పష్టత రాకపోయినా ఈ అంశం ఇప్పుడు ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. -
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
సాక్షి, హైదరాబాద్: ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు.. ఇలా ఎన్ని నిర్మించినా హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. చినుకు పడితే చాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ఐటీ కంపెనీలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో సమావేశమయ్యారు. ఐటీ కారిడార్లో రద్దీని తగ్గించడంతోపాటు నిర్వహణ వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. ఢిల్లీలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానాన్ని ఐటీ కారిడార్ పరిధిలోనూ అమలు చేయడాన్ని ఐటీ సంస్థలు పరిశీలించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ విధానంతో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఒకే పనివేళలు కాకుండా వేర్వేరు సమయాలను కేటాయించాలన్నారు. దీనివల్ల కూడా వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.కార్ పూలింగ్ అంటే?ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒక్కో వాహనంలో వచ్చే బదులు నలుగురు చొప్పున కలిసి ఒకే కారులో ఆఫీసుకు రావడాన్ని కార్ పూలింగ్ అంటారు. ఈ విధానంలో ఒకరోజు ఒక ఉద్యోగి కారు తీసుకొస్తే ఆ మరుసటి రోజు మరో ఉద్యోగి కారులో ప్రయాణిస్తారు. దీంతో ప్రతిరోజూ ఒకే సమయంలో, ఒకే రహదారిలో నాలుగు కార్లు రోడ్లపైకి రాకుండా ఒకే కారులో నలుగురు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకుంటారు. -
పంట లేకే ధరల మంట
టమాటా సెంచరీ దాటి పోయింది.. చిక్కుడు అయితే డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది.. ఐదు రూపాయలకు దొరికే కొత్తిమీర, పుదీనా కట్ట ఇప్పుడు పది, పదిహేను రూపాయలు పెట్టినా రావడం లేదు.. అదీ, ఇదీ అని ఏదీ లేదు. అన్ని కూరగాయల ధరలూ అడ్డగోలుగా పెరిగిపోయాయి.‘జేబులో డబ్బులు తీసుకెళ్లి సంచీలో కూరగాయలు తేవడం కాదు.. సంచీలో డబ్బులు తీసుకెళ్లి జేబులో కూరగాయలు పెట్టుకోవాల్సి వచ్చేట్టుంది’ అని సామాన్యుడు నిట్టూరుస్తున్న పరిస్థితి. సుమారు కోటిన్నరకుపైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగరం సమీపంలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. చాలా వరకు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో.. ఏమాత్రం కొరత వచి్చనా, రేట్లు చుక్కలను తాకుతున్నాయని అంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్క్రాప్ మ్యాపింగ్ అంటే..కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూపరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించడమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి, అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించ వచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు.ఒక్కసారిగా రేట్ల పరుగులుఇటీవలి వరకు కూరగాయల ధరలు కాస్త అటూఇటూగా అయినా అందుబాటులోనే ఉన్నాయి. కానీ వారం, పది రోజుల కింద ఒక్కసారిగా ధరలు పెరగడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా కిలో రూ.100 దాటిపోయాయి. ఏటా ఎండాకాలం సీజన్లో కూరగాయల సాగుపై ప్రభావం ఉంటుందని, కానీ ఈసారి ఉష్ణోగ్రతలు మరీ అధికంగా నమోదవడం, వానలు జాడ లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ కూరగాయలు పండించే ప్రాంతాల్లో సాగు సరిగా జరగలేదని, దిగుబడులు కూడా తగ్గిపోయాయని అంటున్నాయి.ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి ఎండల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ధరలు అడ్డగోలుగా పెరిగాయని పేర్కొంటున్నాయి. ఇక ఎక్కువశాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం.. మన దగ్గర మిగతా సీజన్లలో పండిన కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం సమస్యగా మారిందని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే.. అటు రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు ధరల నియంత్రణతో వినియోగదారులకూ లాభం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.బోయిన్పల్లి ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్లు హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతాయి. అందులో 15 శాతం వరకే తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న చేవెళ్ల, వికారాబాద్, మేడ్చల్, శామీర్పేట, ములుగు, గజ్వేల్, భువనగిరి, జహీరాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తారు.ఎండల ఎఫెక్ట్తో ఏటా ఏప్రిల్, మే నెలల్లో కూరగాయల ధరలు అధికంగా ఉంటాయి. తర్వాత తగ్గుతాయి. కానీ ఈసారి ధరలు తగ్గే పరిస్థితులు లేవని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సాగు దశలో ఉన్న కూరగాయలు ఆగస్టు నాటికి చేతికి అందుతాయని, ధరలు నియంత్రణలోకి వస్తాయని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు దిగుమతులు తప్పని పరిస్థితిలో ధరలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. క్రాప్ మ్యాపింగ్ చేస్తే మేలు కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూపరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించడమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి, అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించ వచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు. దిగుబడులపైనే ఆధారం.. ఏటా ఏప్రిల్, మే, జూన్లో కూరగాయల కోసం ఎక్కువగా దిగుబడులపైనే ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలోని జిల్లాల నుంచి చాలా తక్కువగా కూరగాయలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ ధరలు ఉన్నాయి. ఆగస్టు నాటికి ధరలు తగ్గుముఖం పడతాయి. – ఎం.వెంకన్న, సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, బోయిన్పల్లి ఆకుకూరలు కూడా దొరకట్లేదు ఇప్పుడు ఆకుకూరలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలు ఎక్కువగా ఉండటంతో పంటల దిగుబడి తగ్గింది. అందుకే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. హోల్సేల్లో కొత్తిమీర పెద్దకట్ట రూ.30, పుదీనా రూ.15కుపైగా పలుకుతున్నాయి. – ఆనంద్కుమార్, ఆకుకూరల వ్యాపారి, గుడిమల్కాపూర్ -
సినిమా అంటే నేనొక్కడినే కాదు: ఫర్హాన్ అక్తర్
హిందీలో ‘దిల్ చాహ్తా హై’ (2001), ‘లక్ష్య’ (2004), ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్ (2011)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే దాదాపు మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ లీడ్ రోల్స్లో ‘జీ లే జరా’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు ఫర్హాన్.కానీ ఈ సినిమా సెట్స్పైకి వెళ్లకుండానే రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చింది. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. తాజాగా ఈ విషయాలపై స్పందించారు ఫర్హాన్. ‘‘నేను దర్శకుడిగా సెట్స్లోకి వెళ్లక పదేళ్లకు పైనే అయింది. నటుడిగా బిజీగా ఉండటం వల్లే డైరెక్షన్కి టైమ్ కుదరలేదు. ‘డాన్ 3’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభమవుతుంది.అలాగే ‘జీ లే జరా’ కూడా నా దర్శకత్వంలోనే ఉంటుంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా టైమ్ గడిచింది. సినిమా అంటే నేనొక్కడినే కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కాల్షీట్స్ అన్నీ కరెక్ట్గా కుదరాలి. నా దర్శకత్వంలో రాబోయే నెక్ట్స్ రెండు సినిమాలు ‘డాన్ 3, జీ లే జరా’నే’’ అన్నారు ఫర్హాన్ అక్తర్. -
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్కు బలవుతున్నారు. చత్తిస్గఢ్లోని భిలాయ్కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్లు చేయడం, ట్రాఫిక్లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
అలా పిలిస్తే సరదాగా తీసుకోలేం
నోరు మూసుకుని వెళ్లు అని స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీకి ఇంతలా కోపం రావడం వెనక ఓ కారణం ఉంది. వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహిస్తుంటారు శ్రుతీహాసన్. తాజాగా శ్రుతి నిర్వహించిన చాట్ సెషన్లో ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్న శ్రుతికి కోపం తెప్పించింది. ‘‘ఈ రకమైన జాతి వివక్షను నేను అస్సలు సహించను.మమ్మల్ని ఉద్దేశించి మీరు ఇడ్లీ, సాంబార్, దోసె అని పిలిస్తే ఊరుకోం. ఎలా పడితే అలా పిలిస్తే సరదాగా తీసుకోలేం. అలాగే మమ్మల్ని అనుకరించాలని మీరు ప్రయత్నించవద్దు. ఎందుకంటే.. మీరు మాలా చేయలేరు. సరే.. మీరు సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పమని అడిగారు కాబట్టి చెబుతున్నాను. ‘నోరు మూసుకుని వెళ్లు’’ అంటూ ఆ నెటిజన్కు రెస్పాండ్ అయ్యారు శ్రుతీహాసన్. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ, చెన్నై స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
ఈసారి ప్రిపేరై వచ్చాను!
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీమ్ యాక్సిన్గా కమల్ కనిపిస్తారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. ‘సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపున భగవంతుడే ఉన్నాడు, నేను కాపాడతా..’ (అమితాబ్), ‘ఎన్ని యుగాలైనా... ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు... మారలేడు’ (కమల్) ‘ఒక పెద్ద బౌంటీ... వన్ షాట్... కాంప్లెక్స్కి వెళ్లిపోతా..., సరే... ఇంక చాలు, ఈసారి ప్రిపేరై వచ్చాను... దా’ అనే డైలాగ్స్తో పాటు ‘మాధవా...’ అనే పాట కూడా ఈ ట్రైలర్లో వినిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరకర్త. -
పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో...
‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్డీటీ 18’ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘పీరియాడికల్ హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్డీటీ 18’. ఇందులో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ చిత్రం కోసం నిర్మించిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం తొలి షెడ్యూల్ జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం: నటుడు ఆనంద చక్రపాణి
‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.⇒ నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా. ⇒‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది. ⇒ ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్గారి ఫ్రెండ్గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి.