-
విత్తనాలు, ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
హొసపేటె: రైతులకు ఎక్కడైనా విత్తనాలు, ఎరువుల కొరత ఏర్పడితే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యవసాయ శాఖ అధికారులను హెచ్చరించారు. ఆయన శుక్రవారం విజయనగర జిల్లా ప్రగతి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు నిల్వ ఉన్నాయన్నారు. రైతులకు కావాల్సిన విత్తనం, ఎరువులను ఎక్కడైనా ఒకసారి ఇచ్చిన విత్తనం మొలకెత్తకపోతే రెండో దఫా కూడా విత్తనాలను రైతులకు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.130 కోట్ల కరువు సాయం పూర్తిగా రైతులకు అందజేశారా? అని సీఎం ప్రశ్నించారు. పంట నష్టం సర్వే శాసీ్త్రయంగా నిర్వహించి ఎవరికీ అన్యాయం జరగకుండా డీబీటీ ద్వారా ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని జిల్లాధికారి ముఖ్యమంత్రికి వివరించారు. పంట కోత సమయంలో కూడా భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి గురైన రైతులందరికీ పంటల బీమా పంపిణీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. 2023–24లో మొత్తం 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ఆ రైతు కుటుంబాలకు పరిహారం అందించారా? లేదా? అని ముఖ్యమంత్రి నిలదీశారు. డీడీపీఐ, బీఈఓల సస్పెన్షన్కు సీఎం సూచన మానవాభివృద్ధి సూచీలో విద్యారంగంలో జిల్లా 10వ స్థానం నుంచి 27వ స్థానానికి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం దీనికి మీరెందుకు బాధ్యత వహించరని డీడీపీఐని ప్రశ్నించారు. ఎస్ఎస్ఎల్సీలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉతీర్ణత తగ్గడానికి కారణం మీరే. మీ బీఈఓలు, ఉపాధ్యాయులు కృషి ఏమిటి? ఈ దిశలో మీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని డీడీపీఐని సీఎం ప్రశ్నించారు. ఈ సారి 20 శాతం గ్రేస్ మార్కులు ఇచ్చినా ఈ స్థాయికి పడిపోయారు, ఓవరాల్ పని తీరుతో సంతృప్తిగా ఉన్నారా? అని అడిగారు. సమావేశంలో మధ్యలో విద్యాశాఖ కార్యదర్శి రితీష్ను సీఎం ఫోన్లో సంప్రదించారు. వారి పని తీరును ప్రశ్నిస్తూ డీడీపీఐ, బీఈఓ ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ఖాన్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి గోవిందరాజు, ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజరాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు సీఎం సిద్దరామయ్య హెచ్చరిక -
పక్కాగా సాక్ష్యాల సేకరణ
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సంచలనం రేపిన చిత్రదుర్గకు చెందిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్ సంచరించిన 28 ప్రాంతాల్లో మహజర్ నిర్వహించిన పోలీసులు.. ఏకంగా 139 వస్తువులను సాక్ష్యాలుగా సేకరించారు. నిందితులు ధరించిన దుస్తులు, షూస్, చెప్పులు, దాడికి ఉపయోగించిన వస్తువులు, హోటల్ లెడ్జర్ బుక్, సీసీటీవీ కెమెరా పేటేజీలు, వాహనాలు, నగదు, మృతదేహంపై నుంచి దోచిన నగలు ఇలా ఒక్కటీ వదలకుండా పోలీసులు సాక్ష్యాలుగా తీసుకువచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్లో చాటింగ్ చేసిన మెసేజ్లు కేసులో కీలకంగా మారనున్నాయి. దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు. పవిత్రగౌడ పాత్రనే కీలకం రేణుకాస్వామి హత్య జరగడానికి నటి పవిత్రగౌడ ముఖ్య కారణమని పోలీసుల రిమాండ్ కాపీలో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పవిత్ర ఏ3 నుంచి మొదలుకుని ఏ7, ఏ11, ఏ12, ఏ13, ఏ16 నిందితులు హత్యలో నేరుగా పాల్గొన్నారని, వీరందరికీ చట్టంపై కనీసం గౌరవం లేదని లభించిన సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందని రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. ఏ1 ముద్దాయి పవిత్ర,రేణుకాస్వామి హత్యకు అందరినీ ప్రేరేపించినట్లు తెలిపారు. బెయిల్కు దర్శన్ ప్రయత్నాలు రేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నారు. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్రెడ్డి అనే లాయర్లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్స్టేషన్కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం 28 చోట్ల మహజర్ 139 వస్తువుల సేకరణ -
బైక్ను ఢీకొన్న లారీ.. చిన్నారి మృతి
దొడ్డబళ్లాపురం: బైక్ను లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన దొడ్డ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంజనేయ, మమత దంపతులు తమ మూడేళ్ల ధ్వనిత్తో కలిసి బైక్పై వెళ్తుండగా దొడ్డబళ్లాపురం–దాబస్పేట మార్గంలోని కెస్తూరు గేట్ వద్ద లారీ ఒకటి వెనుకనుంచి వేగంగా ఢీకొంది. ధన్విత్ అక్కడికక్కడే మృతిచెందగా దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దొడ్డబళ్లాపురం ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారవడానికి ప్రయత్నించగా దొడ్డబళ్లాపురం రూరల్ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. జేడీఎస్తో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలనే విషయాన్ని జేడీఎస్తో చర్చించాక ప్రకటిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యోగాడే కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగా సాధన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కనకపుర ఎమ్మెల్యేగా ఉన్నారని, అయినా చెన్నపట్టణ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్నారు. అయితే అది వారి పార్టీ వ్యక్తిగత విషయమన్నారు. బెంగళూరు గ్రామీణ లోక్సభ స్థానంలో తమకు తిరుగులేదని భావించిన డీకే బ్రదర్స్కు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అందరికీ తెలుసన్నారు. దావణగెరెలో పార్టీ అభ్యర్థి ఓటమికి యడియూరప్ప, విజయేంద్ర కారణమని ఎమ్మెల్యే హరీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బహిరంగంగా ప్రకటనలు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం కాదన్నారు. పార్టీలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు. కొత్త ఎంపీలకు, కొత్తగా కేంద్రమంత్రులుగా ఎన్నికైన వారికి శనివారం ప్యాలెస్ గ్రౌండ్లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. -
బీరు.. తెగ తాగేశారు!
బనశంకరి: రాష్ట్రంలో ఈ ఏడాది ఎండలు రికార్డులు బద్దలు కొట్టాయి. వేడిమి తాళలేక మద్యం ప్రియులు చల్లదనం కోసం తాగేశారేమో కాని బీరు విక్రయాలు కూడా అంతే స్థాయిలో రికార్డు సృష్టించాయి. దీంతో అబ్కారీ శాఖ ఖుషీగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అబ్కారీ శాఖ చరిత్రలో రికార్డుస్థాయిలో బీర్ల విక్రయాలు జరగ్గా మేనెలలో కూడా విక్రయాలు ఆ రికార్డులను కూడా బద్దలు కొట్టాయి. ఏప్రిల్ నెలలో 3.80 కోట్ల లీటర్ల బీరు (48.72 లక్షల బాక్సులు, ఒక బాక్సులో 7.8 లీటర్లు) విక్రయాలు జరిగాయి. ఒకేనెలలో ఇంత భారీమొత్తంలో బీర్ల విక్రయాలు జరగడం ఇదే మొదటిసారి. కానీ మేనెలలో 3.95 కోట్ల లీటర్ల బీరు (50.71 లక్షల బాక్సులు) విక్రయం కావడంతో ఏప్రిల్ నెల రికార్డు బద్దలైంది. 2023 ఏప్రిల్ నెలలో 115.25 లక్షల బాక్సుల ఐఎంల్ మద్యం,(ఒక బాక్సులో 8.64 లీటర్లు), 76.88 లక్షల బాక్సుల బీర్లు విక్రయాలు జరగ్గా అబ్కారీ శాఖకు రూ.4915.59 కోట్ల ఆదాయం లభించింది. 2024 ఏప్రిల్–మే నెలలో 118.27 లక్షల బాక్సు ఐఎంఎల్ మద్యం, 100.43 లక్షల బాక్సుల బీర్ల విక్రయం కాగా రూ.5449.80 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది ఇదే అవధితో పోలిస్తే రూ.534.21 కోట్ల అధిక ఆదాయం లభించింది. బీర్ల విక్రయాల్లో 30.63 శాతం పెరిగింది. బీర్లు మాత్రమే కాకుండా ఐఎంఎల్ మద్యం విక్రయాలు గత ఏప్రిల్–మేనెలలతో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. 2023 ఏప్రిల్లో 52.90 లక్షల బాక్సులు ఐఎంఎల్ మద్యం విక్రయం కాగా 2024 ఏప్రిల్లో 54.46 లక్షల బాక్సుల విక్రయాలు(2.95శాతం అధికం) జరిగాయి. 2023 మేనెలలో 62.35 లక్షల బాక్సుల ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరగ్గా 2024 మే నెలలో 63.81 లక్షల బాక్సుల విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో మండు వేసవితో ఉష్ణోగ్రతలు పెరగడం మేనెలలో బీర్లు విక్రయాలు పెరగడానికి కారణం కాగా మరో పక్క లోక్సభకు మే 7తేదీన రాష్ట్రంలో రెండోదశ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో బీర్ల విక్రయాల పెరగడానికి మరో కారణం అని చె ప్పవచ్చు. రికార్డు స్థాయిలో విక్రయాలు మే నెలలో 50.71 లక్షల బాక్సుల బీర్ల విక్రయాలు వాటి విలువ రూ.3,185 కోట్లు వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికలే కారణం ! -
రవాణా ఉద్యోగులపై ఎస్మా అస్త్రం ?
శివాజీనగర: రవాణా శాఖ ఉద్యోగులు ఆరు నెలలపాటు ఎటువంటి కారణానికి సమ్మె, ధర్నా, ఆందోళనలు చేయటానికి లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత బీజేపీ పాలనలో కార్మికులు కొన్ని రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కార్మికులతో చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం శక్తి పథకంతో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించకపోగా ధర్నాలు చేయరాదని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. చాముండి బెట్టపై భక్తులకు ఏర్పాట్లు చేయండి మైసూరు: చాముండేశ్వరి దేవి కొండపై ఆషాఢ మాసంలో నిర్వహించే పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ కే.వీ. రాజేంద్ర అధికారులను ఆదేశించారు. జెడ్పీ సమావేశపు హాలులో శుక్రవారం ఆయన అధికారులతో మాట్లాడారు. జూలై 12 మొదటి శుక్రవారం, 19న రెండో శుక్రవారం, 26న మూడో శుక్రవారం, 27న అమ్మవారి జయంతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు వస్తారన్నారు. వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. -
శ్వాస మీద ధ్యాస
శివాజీనగర: భారతదేశం ప్రపంచానికి యోగాను పరిచయం చేసి యోగా గురువుగా ఆవిర్భవించిందని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం బెంగళూరులోని విధానసౌధ ముందు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. దేహం, మనస్సును సమతుల్యం చేసేది యోగా అని అన్నారు. భారతీయ సంస్కృతికి యోగానే మూలమన్నారు. యోగా విశిష్టతను స్వామి వివేకానంద చికాగోలోని సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. యోగాను పాటించాలని 2018 సెప్టెంబర్ 27న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచదేశాలకు పిలుపునివ్వగా 179 దేశాలు స్పందించాయన్నారు. అప్పటినుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధానపరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండూరావు, ఎమ్మెల్సీ శరవణ, క్రీడాకారిణి అశ్విని నాచప్ప, క్రికెట్ క్రీడాకారుడు మనీశ్ పాండే, సినీ నటులు శరణ్, అను ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మైసూరు: మైసూరు ప్యాలెస్ ఆవరణలో ఆయూష్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి హెచ్.సీ.మహాదేవప్ప హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతికి యోగా నిలువెత్తు నిదర్శనమన్నారు. యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. గవర్నర్ గెహ్లాట్శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపకరించే యోగాను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో భాగంగా శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ధ్యానం, ఆసనాల ఆవశ్యకతను యోగా గురువులు వివరించారు. లక్షలాది మంది ప్రజలు మైదానాలకు వెళ్లి ఆసనాలు వేసి శ్వాసపై మనస్సును లగ్నం చేశారు. -
ప్రధాని కృషితో విశ్వవ్యాప్తంగా యోగా
తుమకూరు: భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గొప్పపేరు రావడానికి ప్రధాని మోదీ కృషి చేశారని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమన్న ఆన్నారు. శుక్రవారం తుమకూరు నగరంలో పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఐఏఎస్ రోహిణి భర్తపై లోకాయుక్తకు ఫిర్యాదు బనశంకరి: ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి భర్త సుధీర్రెడ్డి, బావమరిదిపై ప్రముఖ గాయకుడు లక్కీఆలీ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి సింధూరి మరోసారి చిక్కుల్లో పడ్డారు. లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీని తన ఎక్స్ ఖాతాలో లక్కీఅలీ పోస్ట్పెట్టారు. యలహంక న్యూటౌన్ పరిధిలోని తమ ట్రస్ట్కు సంబంధించిన భూమిని రోహిణి భర్త సుధీర్రెడ్డి, బావమరిది మధుసూదన రెడ్డి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే విషయంపై గాయకుడు లక్కీఆలీ 2022లో ఫిర్యాదు చేశారు. యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ ఏసీపీ మంజునాథ్, తాలూకా సర్వే అధికారి మనోహర్ కబ్జాలో భాగస్వాములయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. భట్కల్లో ఏటీఎస్ అధికారులు బనశంకరి: భట్కళ తాలూకా నవాయత్కాలనీ హాజీమంజిల్ నివాసి అబ్దూల్కబీర్ సుల్తాన్ అలియాస్ మౌలానాసుల్తాన్ అనే అనుమానిత ఉగ్రవాది ఆచూకీ కోసం మహారాష్ట్ర ఉగ్రవాద నియంత్రణ దళం (ఏటీఎస్) అధికారులు శుక్రవారం ఉత్తర కన్నడ జిల్లా భట్కళకు విచ్చేశారు. ఈ సందర్భంగా సదరు వ్యక్తి ఇంటికి నోటీస్ అంటించారు. పూణేలో జరిగిన ఉగ్రకార్యకలాపాల కేసులో ఇతను ఆరోపి. ఏడాదినుంచి అదృశ్యమయ్యాడు. ఇతను సిరియా లేదా అప్ఘనిస్థాన్, అమెరికా బాంబు పేలుడులో మృతిచెందినట్లు అమెరికా మీడియాలో ప్రసారమైంది. కానీ ఇతడి మృతిపట్ల ఎలాంటి ఆధారాలు భారత్కు లభించలేదు. అతని అరెస్ట్కు మహారాష్ట్ర కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉత్తరకన్నడ పోలీసుల సహాయం కోరారు. ఒకవేళ అతను మృతిచెందినట్లయితే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంకోసం నోటీస్ అంటించారు. ఇతడి గురించి కుటుంబ సభ్యులకు సైతం ఎలాంటి సమాచారంలేదని పోలీసుల విచారణలో తెలిసింది. విదేశీ కన్సల్టెన్సీ నియామకానికి విజయేంద్ర అభ్యంతరం శివాజీనగర: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు విదేశీ కన్సల్టెన్సీ నియామకాన్ని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తప్పుబట్టారు. శుక్రవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఆర్థిక నిర్వహణకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వద్ద నిపుణులైన అధికారులు ఉన్నా కూడా విదేశీ కన్సల్టెన్సీ అవసరం ఏముందని, ఒక సంవత్సరంగా రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. అభివృద్ధి కూడా జరగలేదన్నారు. హోటల్లో పేలిన సిలిండర్ ● పదిమందికిపైగా కార్మికులకు గాయాలు యశవంతపుర: వంటగ్యాస్ సిలిండర్ పేలి పదిమందికి పైగా హోటల్ కార్మికులు గాయపడ్డారు. ఈఘటన కలబురగి నగరంలో జరిగింది. అప్పాకెరె సమీపంలోని హోటల్లో శుక్రవారం ఉదయం ఉదయం 6:30 గంటలకు అల్పాహారం తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి సిలిండర్ పేలింది. దీంతో వంట గదిలో ఉన్న 10 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. మిగిలిన కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కలబురిగిలోని ట్రామా కేర్ సెంటర్కు, మిగిలినవారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడు తీవ్రతకు భవనంలో పగుళ్లు ఏర్పడాయి. టేబుల్స్, కుర్చీలు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినపడింది. దీంతో నగరప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
మళ్లీ వానల జోరు
బనశంకరి: రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు మళ్లీ జోరందుకోగా వీకెండ్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కరావళి, మలెనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో నాలుగురోజుల పాటు రెడ్అలర్ట్ ప్రకటించారు. ఉత్తర, దక్షిణ ఒళనాడులో వర్షాలు అధికమయ్యే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో మూడురోజుల పాటు మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని, రాత్రిసమయంలో వర్షం కురుస్తుందని పేర్కొంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 9 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. అయితే అధికవర్షాలు కురిసే కరావళి, మలెనాడులో తక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర, దక్షిణ ఒళనాడులో క్రమంగా 78 శాతం నుంచి 84 శాతం అధికవర్షం కురిసింది. రానున్న నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నదులు సమీపప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని తెలిపింది. బెంగళూరులో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం అనంతరం కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. -
భారతీయ సంస్కృతి ప్రాచీనమైనది
బనశంకరి: భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైది సామూహిక పూజ, లలితసహస్ర నామపఠనంతో దేశానికి మంచి జరుగుతుందని హరిహరిపుర శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి తెలిపారు. శుక్రవారం జయనగర ఐదోబ్లాక్ శాలినీ మైదానంలో రక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం 5 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసిన లలిత సనహస్ర నామపూజ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర, విపక్షనేత ఆర్.అశోక్, ఎంపీ మంజునాథ్, సచ్చిదానందసరస్వతి స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. మనందరం ఒకే కుటుంబం అనే సేవాభావనతో జీవనం సంస్కారవంతంగా ఉండాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, భక్తిశ్రద్దలతో అచరించాలని తారతమ్యం చూపకుండా ఇతరమతాలను గౌరవించాలని తెలిపారు. బీవై.విజయేంద్ర మాట్లాడుతూ... తల్లిని ఎవరూ పూజిస్తారో, మహిళలను ఎవరూ గౌరవిస్తారో వారికి జీవితంలో విజయం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో విపక్షనేత ఆర్.అశోక్, ఫౌండేషన్ అధ్యక్షుడు ఎమ్మెల్యే సీకే.రామమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి, లక్ష్మీనటరాజ్, మాలతి సోమశేఖర్, దీపికా ఎల్.మంజునాథ్రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు దొంగలు అరెస్టు
చింతామణి: రహదారుల్లో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ మాచర్లకు చెందిన లారీని బెంగళూరు వెళ్తుండగా నలుగురు దొంగలు ఆపి డ్రైవర్ వద్దనున్న 2 వేలు నగదును లాక్కొన్నారు. దీంతో డ్రైవర్ తక్షణమే చింతామణి పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ చేసి తాలూకాలోని నల్లగుట్టహళ్లి గ్రామానికి చెందిన సుబ్రమణిని, మల్లికాపుర గ్రామానికి చెందిన అరుణ్ను బెంగళూరు కుండ్లహళ్లికి చెందిన శివకుమార్ను అరెస్టు చేశారు. మరొక దొంగ కోసం గాలిస్తున్నారు. -
అధిక లాభం అంటూ లక్షలు దోచేశారు
మైసూరు: మైసూరు నగరంలో ఆన్లైన్ మోసాలు పెరిగి పోతున్నాయి. కొంత పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని చెప్పి సైబర్ కేటుగాళ్లు లక్షలు దోచేశారు. మైసూరు నగరంలోని నేతాజీ నగర్కు చెందిన సాగర్ ఆనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన చూసి అందులో ఉన్న ఫోన్ నంబర్కు సంప్రదించగా తమమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని కేటుగాళ్లు ఆశ పెట్టారు. దీంతో వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.10.28క్షలు పంపాడు. మళ్లీ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో మోసం జరిగినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
నా రాజకీయ జీవితాన్ని నిర్ణయించేది ప్రజలే
శివాజీనగర: చెన్నపట్టణ నుండి డీ.కే.శివకుమార్ పోటీ చేస్తే రాజకీయంగా మనుగడ కోల్పోతారని సీ.పీ.యోగేశ్వర్ వ్యాఖ్యలకు డీసీఎం డీ.కే.శివకుమార్ తన రాజకీయ జీవితాన్ని తీర్మానించేది ప్రజలు. వారు చూసుకొంటారని ఎదురుదాడికి దిగారు. 10వ అంతర్జాతీయ యోగా దినాచరణ నిమిత్తం శుక్రవారం విధానసౌధ ముందు భాగంలో జరిగిన యోగోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, పెద్దవారి గురించి తాను మాట్లాడేందుకు సాహసించను, తనకు సమయం లేదు. తనకు శక్తి ఇవ్వండని తాను ఓటర్లను కోరుకొన్నాను. తన వెనుక ఒక శక్తి ఉంది. ప్రజలు ఉన్నారు. తన జీవితాన్ని రాసేవారు ప్రజలు. విశ్వాసముంటే ఓటు వేస్తారని తెలిపారు. కనకపురలో ఉప ఎన్నికలు వస్తే దేశ సంపద నాశనమవుతుందన్న ఎమ్మెల్యే సురేశ్కుమార్ వ్యాఖ్యలకు స్పందించిన డీకేశి, తాను కనకపుర ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షుడి అవకాశం కూడా తనకు బాధ్యత ఉంది. తన నియోజకవర్గంలో తనదే బాధ్యత. తాను సీఎం సిద్దరామయ్యతో కలసి ఎన్నికలకు వెళ్తానన్నారు. -
రక్షిత నీటిని అందించండి
బళ్లారిఅర్బన్: జిల్లాలోని అన్ని జీపీల పరిధిలలో సమర్థవంతంగా క్లోరినేషన్తో కూడిన రక్షిత మంచినీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి కార్యదర్శి డాక్టర్ కేవీ త్రిలోక్చంద్ర టీపీ ఈఓలకు సూచించారు. నగరంలోని జెడ్పీ సభాంగణంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్కు ముందే వర్షాలు ప్రారంభమైనందున అంటువ్యాధులను అరికట్టే దిశగా ప్రజలకు తాగునీటిని కాచి వడబోసి చల్లార్జుకుని తాగేలా అవగాహన కల్పించాలన్నారు. తరచుగా నీటి నిల్వ కేంద్రాలను పరిశుభ్రం చేయడం, నీటి నమూనాలను పరీక్షించడం చేసిన తర్వాతే సదరు నీటిని ప్రజలకు అందించాలన్నారు. జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు, సంబంధిత అధికారులతో పాటు డిప్యూటీ, అటవీ సంరక్షణ అధికారి సందీప్ సూర్యవంశీ, ఏసీ హేమంత్తో పాటు టీపీ ఈఓ పాల్గొన్నారు. పెట్రో ధరలు తగ్గించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు, నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ మాట్లాడారు. రాస్తారోకో చేస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కరవే కార్యకర్తలు శుక్రవారం అధ్యక్షుడు వీరేష్ నేతృత్వంలో సింధనూరు బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. తరగతులు కేటాయించరూ రాయచూరు రూరల్: రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు ఎల్కేజీ, యూకేజీ తరగతులను కేటాయించాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షురాలు పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి మాట్లాడారు. అనంతరం రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్కు వినతిపత్రం సమర్పించారు. మంత్రి పాటిల్ స్పందిస్తూ ఈనెల 24న సీఎం సిద్దరామయ్యతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళ అదృశ్యం బళ్లారిఅర్బన్: కురుగోడు తాలూకా జకనిహాళ్ గ్రామానికి చెందిన ఎం.కల్పన అనే 24 ఏళ్ల వయస్సుగల మహిళ ఈనెల 17వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సుమారు 5 అడుగుల ఎత్తు, గుండ్రటి ముఖం, గోధుమ రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి కలిగిన ఈమె ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని పోలీస్స్టేషన్లో లేదా 9480803010 నెంబరుకు తెలియజేయాలని పోలీసులు కోరారు. -
మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కెలమంగలం: కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... డెంకణీకోట పోలీసులు గురువారం రాత్రి అటవీశాఖ చెక్పోస్ట్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆ మార్గంలో వచ్చిన ఓ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా 30 కర్ణాటక మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. నిందితుడు డి.జి.దొడ్డి ప్రాంతానికి చెందిన ప్రభాకర్ (44)గా గుర్తించారు. అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి మైసూరు: కరెంటు వైర్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకా కణ్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్ (52) మృతుడు. ఇతను ఇంటి ముందు పునాదికి నీరు పోస్తుండగా అక్కడే ఉన్న కరెంట్ వైర్ తొక్కడంతో షాక్ తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీటీ వాహనం బోల్తా
దొడ్డబళ్లాపురం: బైక్ను తప్పించబోయి టీటీ వాహనం బోల్తాపడ్డ ఘటన యలహంక–దొడ్డబళ్లాపురం మార్గంలోని రాజానుకుంట వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున టీటీ వాహనం దొడ్డబళ్లాపురంలోని ఫ్యాక్టరీకి కార్మికులను పికప్ చేసుకోవడానికి వస్తుండగా రాజానుకుంట వద్ద హఠాత్తుగా బైక్ అడ్డంగా వచ్చింది. దీంతో బైక్ను తప్పించబోయి టీటీ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణా పాయం సంభవించలేదు. టీటీ వాహనం డ్రైవర్, బైక్ చోదకుడికి స్వల్ప గాయాలయ్యాయి. రాజానుకుంట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నలుగురు బాల కార్మికులకు విముక్తి గౌరిబిదనూరు: పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ అధికారి సతీష్తో కలిసి జిమ్మా బాల కార్మికుల నిషేధ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీఆర్ రమేశ్ శుక్రవారం వివిధ వర్క్షాపులు, బేకరీలు, హోటళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నలుగురు బాల కార్మికులను గుర్తించి విముకల్పించారు. ఇకపై ఎవరైనా బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలలను పనులకు కాకుండా బడులకు పంపాలన్నారు. తనిఖీల్లో అధికారిణులు మంజుల, కళావాణి, విజయలక్ష్మి, సీడీపీఓ రవికుమార్, అమ్మాజాన్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరంగా భారీ వృక్షం తుమకూరు: తుమకూరు నగరంలో బీహెచ్ రోడ్డులోని రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో ఓ భారీ వృక్షం కూలిపోయే స్థితికి చేరుకుంది. భారీ వర్షాలు, ఈదురు గాలులు తరచూ వస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏళ్ల నాటి ఈ చెట్టు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. అధికారులు ఇప్పటికేనా ప్రమాదం జరగక ముందే చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. మమదాపుర చెరువుకు పునరుజ్జీవం శివాజీనగర: విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకాలో ఉన్న చారిత్రక మమదాపుర చెరువును రూ. కోటి వ్యయంతో పునఃశ్చేతనకు కోకాకోలా కంపెనీ ముందుకు వచ్చిందని జిల్లా ఇన్చార్జి, పరిశ్రమల మంత్రి ఎం.బీ.పాటిల్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కంపెనీ ఉన్నతాధికారులు హిమాంశు ప్రియదర్శి, ముకుంద్ త్రివేది మంత్రిని భేటీ చేసి చర్చించారు. 16వ శతాబ్దంలో అదిల్ షాహి సుల్తానుల కాలంలో నిర్మితమైన మమదాపుర చెరువు రాష్ట్రంలో అతిపెద్ద చెరువుల్లో ఒకటి. 674 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందిస్తుందని ఆయన తెలిపారు. చెరువు పునఃశ్చేతన తరువాత ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రమవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నీట్లో భారీ కుంభకోణం తుమకూరు: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన నీట్ యూజీ పెద్ద కుంభకోణమని కేపీసీసీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ హాలప్ప ఆరోపించారు. నీట్ అక్రమాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాజా ఫలితాల్లో పదుల సంఖ్యలో ర్యాంకులు రావడం అనుమానంగా ఉందన్నారు. నీట్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. హసనకు ప్రజ్వల్ బనశంకరి: సీఐడీలో నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను హాసన్లోని ఆర్సీ.రోడ్డులోని ఆయన నివాసానికి తీసుకెళ్లి విచారణ చేశారు. శుక్రవారం సిట్ అధికారులు, ఎఫ్ఎస్ఎల్ బృందం ప్రజ్వల్ రేవణ్ణను హాసన్ ఆర్సీ.రోడ్డులోని ఇంటికి తరలించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం బెంగళూరు నుంచి ఆయన్ను నేరుగా సిట్ బృందం హాసన్కు తీసుకెళ్లి మహజర్ చేశారు. పాఠశాలలో యోగా బాగేపల్లి: ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమయంలో యోగా సాధన చేయాలని బీఆర్సీ సమన్వయ అధికారి వెంకటరామ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో యోగా దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేడు యోగాను ప్రపంచ వ్యాప్తంగా ఆచరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలన్నారు. -
దివ్యాంగులను ఆదుకోవాలి
హోసూరు: హోసూరు ప్రాంతంలో ఉంటున్న దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేసేందుకు నిధుల సేకరణ కోసం నేడు శనివారం మీరామల్టి స్పెషాలిటీ ఆస్పత్రి, వివిధ స్వచ్చంద సంస్థలు కలిసి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, స్థానిక ప్రజలు సహకరించాలని శుక్రవారం ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో డైరెక్టర్ అంబికాపారి కోరారు. హోసూరు– బెంగళూరు జాతీయ రహదారిలోని చైన్నెసిల్క్స్ వద్ద ఉన్న ఏటీఎస్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయ్ టీవీ సెలబ్రెటీలు పాల్గొననున్నారని, దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు అందజేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమాన్ని ఆర్డి డెవలప్స్, టవీఎస్ విఎస్ ఏజెన్సీ, విజయ్ ఆస్పత్రి తదితర స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైయ్యే సాంస్కృతిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొనాలని కోరారు. కారు బోల్తా, వ్యక్తి మృతి క్రిష్ణగిరి: క్రిష్ణగిరి – చైన్నె జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన మైలు రాయిని ఢీకొనడంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మృతి చెందిన ఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... కోయంబత్తూరు జిల్లా రామక్రిష్ణాపురం ప్రాంతానికి చెందిన గణేష్ మల్లయ్య (56) గురువారం సాయంత్రం సొంత పనిపై కారులో క్రిష్ణగిరికి వెళ్లాడు. కోయంబత్తూరుకు చెందిన మణిగంటన్ డ్రైవర్గా వెళ్లాడు. చైన్నె జాతీయ రహదారిపై కారును నడుపుకొంటూ వెళ్లుతుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన మైలురాయిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గణేష్ మల్లయ్య మృతి చెందాడు. క్రిష్ణగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పశువుల దొంగలు అరెస్ట్ కెలమంగలం: కొట్టంలో కట్టివేసిన పశువులను దొంగలిస్తున్న ముగ్గురిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... డెంకణీకోట సమీపంలోని బజ్జేపల్లి గ్రామానికి చెందిన రైతు ముత్తప్ప (54) పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి అతను తన మూడు పశువులను పొలంలోని కొట్టంలో కట్టి ఉంచాడు. శుక్రవారం వేకువజామున కొట్టంలో అలికిడి కావడంతో ముత్తప్ప అక్కడికి చేరుకున్నాడు. పశువులను దొంగలిస్తున్నట్లు గుర్తించి స్థానికులను సమాచారం ఇచ్చి వారు రాగానే నిందితులు మునిరాజ్, రమేశ్, రామక్రిష్ణన్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.హోటల్ కార్మికుడు ఆత్మహత్య హోసూరు: హోటల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హోసూరు కార్పొరేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు... కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన రవికుమార్ (39). హోసూరు రెండవ పారిశ్రామికవాడ గాంధీనగర్ ప్రాంతంలో నివాసముంటూ అదే ప్రాంతంలోని ఓ హోటల్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. గురువారం ఉంట్లో ఉరివేసుకొన్న విషయం గమనించిన స్థానికులు హడ్కో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్ల కోసం గాలింపు హోసూరు: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగల కోసం హడ్కో పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు... కార్పొరేషన్ పరిధిలోని బాగలూరు రోడ్డు ప్రాంతానికి చెందిన రీనా (48). గురువారం సాయంత్రం దుకాణం నుంచి వంట సరకులు తీసుకొని నడుచుకుంటు వెళ్తుండగా అదే మార్గంలో హెల్మెట్లు పెట్టుకుని బైక్పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న ఏడు పౌన్ల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హడ్కో పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు. పంటల సాగుపై రైతులకు శిక్షణ హోసూరు: ఖరీఫ్ సీజన్ పంటల సాగుపై శుక్రవారం హోసూరు తాలూకా బేగేపల్లి గ్రామంలో హోసూరు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఒక్క రోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. ఉపడైరెక్టర్ భువనేశ్వరి అధ్యక్షత వహించి మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా వర్షాలు సమృద్దిగా కురుస్తుండడంతో రైతులు పొలాలను దుక్కి చేసుకొన్నారని, ఖరీఫ్ సీజన్ పంటలుగా కంది, కారామణి, ఇతర పంటలను సాగు చేస్తున్నారని, పంట సాగులో రైతులు పాటించవలసిన మెలకువలపైవివరించారు. ముఖ్యమంత్రి సంయుక్త వ్యవసాయ పథకం ద్వారా మట్టి సంరక్షణ ఉపయోగాలను, మట్టి పరీక్షల వల్ల ఉపయోగాలపై రైతులకు వివరించారు. పొలాల్లో వెలువడే వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ విధానంపై రైతులకు శిక్షణ అందజేశారు. కార్యక్రమంలో ఆదియమ్మాన్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు గోవిందరాజ్, వ్యవసాయ శాఖాధికార్లు మురుగేషన్, ఆర్ముగం, ఆత్మా పథక అధికారిణి సుగుణ, షణ్ముగం తదితరులు పాల్గొని రైతులకు శిక్షణ ఇచ్చారు. -
యోగాతో ఆరోగ్యకర జీవనం
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు, ప్రజలు యోగాసనాలు ఆచరించారు. ఆరోగ్య పరిరక్షణకు, అనేక రుగ్మతలను దూరం చేసే సత్తా యోగాకు ఉంది. దీంతో నేడు గ్రామ గ్రామాన యోగా విస్తరించింది.బొమ్మనహళ్లి: యోగా భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని, నేడు ప్రజలందరూ ఆరోగ్య సాధన కోసం యోగా చేయాలని బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే సతీష్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్లో అటల్ బిహారి వాజ్బేయి క్రీడా మైదానంలో స్థానిక హెచ్ఎస్ఆర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన కూడా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు పాల్గొని యోగా సాధన చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గురుమూర్తి రెడ్డి, శ్రీసాయి రామ్ విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బొమ్మనహళ్లి బీజేపీ యువ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండ్య: శారీరక రుగ్మతలను రూపమాపేది యోగా అని, యోగా సాధన చేస్తే ఉత్తమ ఆరోగ్య సిద్ధిస్తుందనని మండ్య జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు. మండ్య జిల్లా పరిపాలన విభాగం ఆధ్వర్యంలో ఆయన యోగా దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రోజు గంట సమయం యోగా సాధనకు కేటాయించాలని అన్నారు. గౌరిబిదనూరులో... గౌరిబిదనూరు: విశ్వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హీరేబిదనూరులోని బ్రైట్ పాఠశాల విద్యార్థులు రామలింగేశ్వర దేవాలయం ఆవరణంలో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి ఎన్ రంగనాథ్ మాట్లాడుతూ.... ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారత దేశమని, నేడు యోగా విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సుల్తానా, జుగాన, రషియా తదితరులు పాల్గొన్నారు. మండ్యలో... మండ్య: ఆత్మ, పరమాత్మను జోడించడంతో పాటు మనసును, ఆరోగ్యంగాను సంతోషంగా ఉండేలా చేసేదే యోగా అని ఉపాధ్యాయురాలు పూర్ణిమా రవిశంకర్ అన్నారు. మండ్య తాలూకా కెరెగోడు సమీపంలో ఉన్న మాధవ పాఠశాల ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. మైసూరులో యోగా దినోత్సవం మైసూరు: మైసూరు నగరంలోని వాణి విలాస్ ఆరసు బాలికల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కేంద్ర సంవహాణ శాఖ డైరెక్టర్ బెంగళూరు విబాగం పల్లవి చిన్న ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించాలన్నారు. దత్తపీఠంలో... మైసూరు: ప్రతి రోజూ యోగా సాధన చేస్తే ఉత్తమ ఆరోగ్యం సిద్దిస్తుందని దత్తపీఠం అవదూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. మైసూరు నగరంలోని దత్తపీఠంలో యోగా దినోత్సవం సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి 40 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. చిక్కబళ్లాపురంలో.. చిక్కబళ్లాపురం: అంతర్జాయతీ యోగా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని అగలగుర్కి బీజీఎస్ పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగ గురువు కుమారి గిరిజా విద్యార్థులు, ఉపాధ్యాయులతో యోగా సాధన చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం గౌరిబిదనూరు: పతంజలి యోగ శిక్షణ సంస్థ ఆవరణలో శుక్రవారం బ్యాంక్ ఉద్యోగుల క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా ఉపాధ్యాయుడు గంగరాజు యోగా ఆవశ్యకతను వివరించారు. యోగాతో క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ లాయర్ మల్లికార్జున, యూనియన్ బ్యాంకు చంద్రశేఖర్, తీర్థ పాఠశాల ప్రకాశ్, శోభ, కోటక్ బ్యాంకు గౌతమ్, గ్రామీణ బ్యాంకు కమల్, అశోక్, కెనరా బ్యాంకు లాల్ సింగ్ పాల్గొన్నారు. చింతామణిలో.. చింతామణి: నగరంలోని కోర్టు ఆవరణలో విశ్వ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు నాగవేణి, శైలజ లాయర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిక్కబళ్లాపురంలో: చిక్కబళ్లాపురం: జిల్లా కేంద్రంలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో యోగా దినోత్సవాన్ని మంత్రి సుధాకర్, ఎంపీ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్థానికులతో కలిసి యోగా సాధన చేశారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక సమయంలో యోగా సాధన చేయాలని మంత్రి, ఎంపీ సూచించారు. యోగాతో ఉత్తమ ఆరోగ్యం సాధ్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రవీంద్ర, జెడ్పీ సీఈఓ ప్రకాశ్ నిట్టాలి, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పతంజలి యోగ సమితి లోకనాథ్ వీణా తదితరులు పాల్గొన్నారు. విజయపురలో... విజయపుర (బెంగళూరు గ్రామీణ): విజయపుర పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాల ఆవరణంలో అంతర్జాయతీ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కర్ణాటక పతంజలి యోగా సమితి రాష్ట్ర సంచాలకులు దీపా రమేశ్ పాల్గొని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా యోగా దినోత్సవం -
వేడుకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
హోసూరు వార్తలు..హోసూరు: ప్రతి ఒక్కరూ రోజు యోగా సాధన చేయాలని సేలం ఎన్సీసీ కమాండింగ్ అధికారి కర్నల్ సూరజ్ తెలిపారు. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హోసూరు ఆర్.వి. ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, హోసూరు మహర్షి విద్యామందిర్ సంయుక్తంగా నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమానికి పాఠశాల నిర్వాహకులు శైల అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సేలం కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ సూరాజ్ పాల్గొని యోగా ప్రయోజనాలు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి వెంకటరమణ, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్.టి.రాజు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా హోసూరు పారిశ్రామికవాడ బేడరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పొన్నాగేష్ అధ్యక్షతన పిల్లలకు యోగా శిక్షణ ఇచ్చారు. యోగా ఉపాధ్యాయుడు అరుణ్, ఉపాధ్యాయినులు గాయత్రీ, శ్యామల తదితరులు పాల్గొని పిల్లలచే యోగా సాధన చేయించారు. కెలమంగలం సమీపంలోని కాడుద్దనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ అధ్యక్షతన యోగా దినోత్సవాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా పిల్లలచే యోగాసనాలు చేయించారు. కార్యాలయంలో యోగా సాధన కెలమంగలం: యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కెలమంగలం బీడీవో కార్యాలయంలో యోగా సాధన చేశారు. యూనియన్ చైర్మన్ కేశవమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొని యోగాసనాలను వేశారు. -
అవినీతిలో నా పాత్ర శూన్యం
రాయచూరు రూరల్: మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన రూ.187 కోట్ల అవినీతిలో తన పాత్ర ఏమీ లేదని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సిట్ అధికారులు సమగ్ర విచారణను జరుపుతున్నట్లు వివరించారు. కేంద్ర మంత్రితో భేటీ రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఫుడ్ హబ్ పార్క్ను స్థాపించడానికి చర్యలు చేపట్టాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్రాధ్యక్షుడు వెంకటరెడ్డి కేంద్ర ఆహార సంస్కరణల పరిశ్రమల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్కు విన్న వించారు. ఆయన న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి చర్చించారు. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో ఫుడ్ పార్కును ప్రారంభిస్తే వలసలను నివారించవచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడిని తొలగించాలని ధర్నా రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని గత రెండు రోజుల నుంచి పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. శుక్రవారం ప్రభుత్వ హైస్కూలు ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన కార్యక్రమంలో సంచాలకుడు రమేష్ మాట్లాడారు. యలగట్ట ప్రభుత్వ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు నాగనగౌడ పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారని ఆరోపించారు. గత మూడు నెలల నుంచి విధులకు గైర్హాజరైన నాగనగౌడను సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా, తాలుకా విద్యాశాఖాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఘనంగా జన్మదిన వేడుక సాక్షి,బళ్లారి: నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. జూన్ 21న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని నగరంలో పెద్ద ఎత్తున ఫ్లేక్సీలు, బ్యానర్లు వేయడంతో పాటు వివిధ కాలనీల్లో కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గాలి సోమశేఖరరెడ్డి ప్రతి ఏటా మాదిరిగానే ముందు రోజు గురువారం రాత్రి తన ఇష్టదైవమైన కసాపురం ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుని అక్కడే బస చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, బళ్లారికి చేరుకున్న తర్వాత కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం తన నివాస గృహం వద్ద అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు. నగర ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, కార్పొరేటర్లు, పలువురు అధికారులు ఆయన నివాస గృహానికి చేరుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణంతో మమేకం కావాలి హుబ్లీ: 30 వేల సంవత్సరాల క్రితం నుంచే నాగరికత ప్రారంభమై దశల వారీగా వికసించిందని సీనియర్ పర్యావరణ వేత డాక్టర్ సంజీవ్ కులకర్ణి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్వేషణ కూటమి ఆధ్వర్యంలో సాధనకేరి చైత్ర మీటింగ్ హాల్లో నిర్వహించిన మట్టి నుంచి దూరం, ఆరోగ్యం నుంచి దూరం అనే విషయంపై ఆయన ప్రత్యేకంగా ప్రసంగించారు. పెంటతో నిర్మించుకున్న చిన్న చిన్న ఇళ్లలోనే సుఖమయమైన జీవితాన్ని అనుభవించిన నాటి మనుషులు ప్రస్తుతం మేమే టైల్స్, కాంక్రీట్లతో అంతస్తుల భవనాలను నిర్మించుకున్నా ఆనాటి సుఖ శాంతులు నేడు కరువయ్యాయన్నారు. మట్టితోనే అవినాభావ సంబంధాన్ని కోల్పోతున్నామన్నారు. ప్రస్తుతం అరికాళ్లకు కూడా మట్టి అంటకుండా బతుకు సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం అధ్వాన దశలో జీవనశైలిలో పర్యావరణంతో మమేకమై తగిన మార్పులతో మనుగడ సాగించడం మంచిదని మరో పర్యావరణవేత్త డాక్టర్ ప్రకాష్ భట్ తెలిపారు. కూటమి అధ్యక్షులు నరసింహా పరంజపే, వెంకటేష్ దేశాయి, అనిల్ కాకండకి, ప్రొఫెసర్ దుష్యంత్ నాడగౌడ, అనంతసిద్దేశ్వర, సత్య ధీరకట్టి, శ్రీధర్ గాంవకర్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు కొత్త కార్యవర్గం కొలువు
సాక్షి,బళ్లారి: ఎట్టకేలకు మేయర్ ఎంపికను కాంగ్రెస్ పార్టీ నాయకులలు ఏకాభిప్రాయంతో పూర్తి చేశారు. నగర మేయర్ జనరల్ స్థానానికి రిజర్వ్ కావడంతో ముల్లంగి నందీష్, ప్రభంజన్కుమార్, వివేక్(విక్కీ), గాదెప్ప తీవ్ర పోటీ పడ్డారు. మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారాభరత్రెడ్డి, ఎంపీలు నాసిర్హుస్సేన్, తుకారాం తదితరుల సమక్షంలో మేయర్ పదవి రేసులో ఉన్న కార్పొరేటర్లతో చర్చలు జరిపారు. దీంతో శుక్రవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముల్లంగి నందీష్, ప్రభంజన్కుమార్, గాదెప్ప, వివేక్లతో పాటు బీజేపీ తరపున మోత్కూరు శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదరడంతో ముగ్గురు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఇక పోటీలో కాంగ్రెస్ పార్టీ తరపున ముల్లంగి నందీష్, బీజేపీ తరపున మోత్కూరు శ్రీనివాసరెడ్డి మాత్రమే పోటీ పడటంతో ఓటింగ్ నిర్వహించారు. నందీష్కు 30 మంది సభ్యుల మద్దతు కలబుర్గి నుంచి విచ్చేసిన ఎన్నికల ప్రాంతీయ అధికారి ఆధ్వర్యంలో మేయర్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ముల్లంగి నందీష్కు 26 మంది కార్పొరేటర్లతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఓటు వేయగా 30 మంది మద్దతు లభించింది. బీజేపీ తరపున పోటీ చేసిన మోత్కూరు శ్రీనివాసరెడ్డికి బీజేపీ కార్పొరేటర్లు 13 మందితో పాటు విధాన పరిషత్ సభ్యుడు ఒకరితో కలిపి 14 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముల్లంగి నందీష్ నగర మేయర్గా, ఉపమేయర్గా సుకుం ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం నూతన పాలక వర్గం విలేకరులతో మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్య, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు, రోడ్ల సమస్యలను పరిష్కరించి నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా శ్రమిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి నాగేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. ఉన్నది ఒకే గ్రూపు అన్నారు. ఏకాభిప్రాయంతో మేయర్ ఎంపిక జరిగిందన్నారు. వివాదరహితంగా ఎంపిక బెంగళూరు నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మాట్లాడుతూ నగర మేయర్ ఎంపికపై రెండు రోజులుగా కసరత్తు చేశామన్నారు. తమ పార్టీలో ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారని, సహజంగానే పోటీ ఉంటుందన్నారు. అందరితో చర్చలు జరిపి కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేకుండా కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకుని సీఎం, డీసీఎంలకు నివేదిక పంపామన్నారు. వారి సూచన మేరకు నడుచుకుంటామని మేయర్ రేసులో ఉన్న కార్పొరేటర్లు సూచించారన్నారు. హైకమాండ్ నుంచి మేయర్గా నందీష్, ఉపమేయర్గా సుకుం పేరు సూచించడంతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సజావుగా మేయర్, ఉపమేయర్ ఎంపిక పూర్తి చేశామన్నారు. నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేటర్లు, నగర ప్రముఖులు అభినందించారు. సిటీ కార్పొరేషన్ హస్తగతం మేయర్గా ముల్లంగి నందీష్ ఉపమేయర్గా సుకుం -
నీట్పై సీబీఐ విచారణ జరపాలి
రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, ఇందులో బడా నేతల హస్తముందని, నిష్పక్షపాతంగా సీబీఐతో విచారణ జరపాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నీట్ కేసులో ఎవరినో రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేయడం తగదన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ దాగి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా నీట్లో జరిగిన అక్రమాలపై ఆందోళనలు జరుగుతున్నందున కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. పంట నష్ట పరిహారంపై నివేదిక ఇవ్వండి జిల్లాలో పంట నష్టం, రైతులకు పరిహారం చెల్లింపుపై నివేదిక అందించాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులకు సూచనలు జారీ చేశారు. శుక్రవారం నగరంలోని జెడ్పీ భవనంలో జరిగిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అతివృష్టి, తాగునీరు, ఇతర అంశాలపై చర్చించారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందకుండా జరిగిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు సర్కార్ అప్పగించిన పనులను సక్రమంగా చేయడం లేదని ప్రతినిధులు మంత్రికి ఫిర్యాదు చేశారు. రైతులకు నేటికీ పంట నష్ట పరిహారం అందలేదన్నారు. సమావేశంలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్, నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, గ్రామీణ శాసన సభ్యులు బసనగౌడ, సింధనూరు ఎమ్మెల్యే హంపన గౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే తదితరులున్నారు. -
ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు షురూ
రాయచూరు రూరల్: గ్రామీణ సంస్కృతిని మరపించేలా ముంగారు ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. వారు శుక్రవారం నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంగారు ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక ఎద్దులకు ఏర్పాటు చేసిన ఒకటిన్నర టన్నుల బరువుగల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి ఆధ్వర్యంలో ఏరువాక పున్నమి సందర్భంగా జరిగే పోటీలు ప్రజలకు కనువిందు చేయడం హర్షణీయమన్నారు. రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి అన్నారు. కార్యక్రమంలో వీరభద్ర శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, సోమ శంభునాథ శివాచార్య, శాసన సభ్యులు బసనగౌడ, హంపనగౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ బయ్యపూర్, కాపు సమాజ నేతలు నరసారెడ్డి, బసవరాజరెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, క్రీడా సహాయ కార్యదర్శి పుల్లా రాజేంద్రరెడ్డి, వెంకటరెడ్డిలున్నారు. -
ఈ–ఖాతా సమస్యకు త్వరలో పరిష్కారం
కోలారు : నగరసభ ఈ–ఖాతా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి రహీంఖాన్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి సన్మానం స్వీకరించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీబీఎంపీ మినహాయించి నగరపాలక, నగరసభ, పురసభ వ్యాప్తిలోని అక్రమ కాలనీల్లో ప్లాన్ మంజూరు కాకుండా భవనాలు నిర్మించి సౌకర్యాలు పొందుతున్న యజమానులకు నిర్వహణ శుల్కం విధించాలని కేబినెట్లో తీర్మానించారన్నారు. మూడు నెలల్లోగా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కార్యకర్తల శ్రమ వల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం ఇస్తామన్నారు. అన్ని సముదాయాలను కలుపుకుని పోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ మాట్లాడుతూ కోలారు జిల్లా బెంగళూరుకు సమీపంలో ఉన్నా ఇంకా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రధ్ద తీసుకోవాల్సి ఉందన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఊరుబాగిలు శ్రీనివాస్, నగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్ బాబు, జయదేవ్, యల్లప్ప పాల్గొన్నారు. -
ఇకపై పుష్కలంగా తాగునీరు
మాలూరు: పట్టణంలోని ఓవర్ హెడ్ ట్యాంకుకు పైప్లైన్ ద్వారా యరగోళు తాగునీటి పథకం నుంచి నీరు వస్తున్నందున ఇకపై ప్రతినిత్యం పట్టణ ప్రజలకు 3.2 దశలక్ష లీటర్ల తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. శుక్రవారం మారుతీ కాలనీలో నగర నీటి సరఫరా మండలి నుంచి రక్షిత తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకుకు తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఇదొక ప్రత్యేకమైన రోజన్నారు. యరగోళు తాగునీరు ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. యరగోళు తాగునీటి ప్రాజెక్టును 6 నెలల క్రితం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించారన్నారు. సోమవారం నుంచి పట్టణంలోని 12 వార్డులకు మొదటి దశలో తాగునీటిని అందిస్తామన్నారు. పైప్లైన్ శుభ్రం కావాల్సి ఉన్నందున పట్టణ ప్రజలు మొదటి 15 రోజుల పాటు ఈ నీటిని గృహ అవసరాలకు వినియోగించుకుని అనంతరం తాగడానికి ఉపయోగించుకోవాలన్నారు. తహసీల్దార్ కె రమేష్, పురసభ సభ్యుడు ఇంతియాజ్ ఖాన్, ఎ రాజప్ప, తదితరులు ఉన్నారు. -
అక్రమ దుకాణాల తొలగింపు
హుబ్లీ: కిమ్స్ ఆస్పత్రి వెనుక భాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద రోడ్డుకు ఇరువైపుల 15కు పైగా వెలిసిన అక్రమ అంగళ్లను పాలికె అధికారులు శుక్రవారం తొలగించారు. ఈ అంగళ్ల వల్ల వాహనదారులు, సామాన్య ప్రజలు రాకపోకలకు ఇబ్బందికి గురయ్యే వారు. స్వచ్ఛందంగా తమ అంగళ్లను తొలగించాలని పలుసార్లు సూచించినా స్పందించక పోవడంతో తొలగింపు అనివార్యమైందని ఆ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ గిరి తళవార్ తెలిపారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా వాహనాలు, అంబులెన్స్, పాదచారులు సంచరిస్తారు. భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ప్రజలు ఈ విషయమై పలు సార్లు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అంగళ్ల వారు పాలికె పట్ల నిర్లక్ష్యంగా నడుచుకోవడంతో సీనియర్ ఆరోగ్య ఇన్స్పెక్టర్ రాజు కోలగొండతో కూడిన సిబ్బంది ఈ తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.