-
ఇరిగేషన్ సమస్యలు పరిష్కరించాలి
భైంసాటౌన్: నియోజకవర్గంలో అపరిష్కతంగా ఉన్న ఇరిగేషన్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ కోరారు. హైదరాబాద్లో రాష్ట్ర నీటి పారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ గుమ్మడి అనిల్కుమార్ను శుక్రవారం కలిసి విన్నవించారు. ముధోల్ నియోజకవర్గంలోని కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ము ంపు గ్రామమైన గుండెగాం నిర్వాసితులకు పరి హారం అందించడంతోపాటు, ముంపు సమస్యను పరిష్కరించాలని కోరారు. సిరాల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. -
ఖాళీల్లో అర్హులకు పదోన్నతి కల్పించాలి
నిర్మల్ రూరల్: జిల్లాలో ఇటీవలే నిర్వహించిన ఉపాధ్యాయ పదోన్నతులతో ఏర్పడిన ఖాళీ స్థా నాల్లో అర్హులకు పదోన్నతి కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, అశోక్ డీఈవో రవీందర్రెడ్డి ని కోరారు. ఈమేరకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఒక్కో ఉపాధ్యాయుడికి ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో పదోన్నతి రావడంతో ఏదో ఒకస్థానంలో జాయిన్ కావడంతో మిగిలిన ఖా ళీలు భర్తీ చేయాలన్నారు. లేకపోతే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు నిరాశే మిగులుతుందని తెలిపారు. నాట్ విల్లింగ్ ఇ చ్చిన ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లో వివరా లు పొందుపర్చాలని సూచించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో గోవర్ధన్, రాజగంగ తదితరులు ఉన్నారు. -
ఇకపై రోజూ ప్రజావాణి
నిర్మల్ చైన్గేట్: ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేలా ఇకపై ప్రతీరోజు ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణితోపాటు మిగతా పనిదినాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఫిర్యాదుకు రశీదు పొందవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుల పురోగతికి సంబంధింత శాఖల వారీగా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా మహిళా సంక్షేమ అధికారి నాగమణిసారంగపూర్: ప్రతీ అంగన్వాడీ కార్యకర్త శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న అంశాలకు అనుగుణంగా కేంద్రాల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారి నామగణి అన్నారు. మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోని మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నిర్మల్ ప్రాజెక్టు పరిధిలోని పూర్వ ప్రాథమిక విద్యాబోధన శిక్షణను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు నేర్చుకున్న అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న పూర్వ ప్రాథఽమిక విద్యాబోధన అంశాలను పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఈ శిక్షణలో చెప్పే అంశాలు 3 నుంచి ఆరు ఏళ్లలోపు పిల్లల అవసరాలకు అనుగుణంగా రూపొందించారని తెలిపారు. శిక్షణలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు విజయగౌరి, మంగళ, జ్యోతి ఇప్పటి వరకు నేర్పించిన అంశాలను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. శిక్షణ ఇస్తున్న మాస్టర్ ట్రైనర్లను అభినందించారు. కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి నిరంజన్రెడ్డి, నిర్మల్ ప్రాజెక్టు బ్లాక్ కోఆర్డి నేటర్ రాము, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘నీట్’ లీకేజీపై విచారణ చేపట్టాలి
● డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావునిర్మల్చైన్గేట్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సుప్రీం కోర్డు జడ్జితో విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ జరిగిందని ఒకే పరీక్షా కేంద్రంలో 8 మందికి టాప్ ర్యాంకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. వెంటనే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. అనంతరం ఆర్డీవో రత్న కల్యాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, టీపీసీసీ సభ్యుడు సాద సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్నూ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆరోగ్య‘యోగ’ం ఆనందభాగ్యం
యోగాతో సహజ శక్తి.. నిర్మల్టౌన్: యోగా ప్రకృతి సిద్ధమైన శక్తిని అందిస్తుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ యోగాసనాలు చేశారు. యోగా శిక్షకుడు హెడ్ కానిస్టేబుల్ బాలాజీ సిబ్బందితో ఆసనాలు వేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా, నడక దినచర్యలో భాగం కావాలని సూచించారు. పోలీసుల ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని తెలిపారు. – ఎస్పీ జానకి షర్మిల జిల్లా కోర్టులో.. నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. జడ్జి కర్ణకుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పనితోపాటు, ఆరోగ్యంపై దృష్టిసారించాలని సూచించారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షురాలు కవితా రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. నిర్మల్ఖిల్లా/నిర్మల్చైన్గేట్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ క్రమంలో యోగాసనాలు, ధ్యానం వంటి పలు ప్రక్రియలను ఆచరిస్తూ సాధన చేస్తే మంచి ఉపశమనం కలుగుతుందని యోగా సాధకులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను తెలిపేలా జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు, యువత, విద్యార్థులు ఆసనాలు వేశారు. యోగాతో శారీరక, మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని తెలిపారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నిత్య జీవితంలో యోగా భాగమైతే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని దివ్య గార్డెన్స్లో ఆయుష్ శాఖ, వశిష్ట యోగా సంఘటన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని జిల్లా వాసులకు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తన దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ‘తన కోసం, సమాజం కోసం యోగా‘ అనే నినాదంతో ముందుకెళ్లాలని తెలిపారు. అనంతరం యోగా దినోత్సవ కార్యక్రమ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, డీడబ్ల్యూవో నాగమణి, డీఎంహెచ్వో ధనరాజ్, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్సీసీ జిల్లా బెటాలియన్ ఆధ్వర్యంలో... నిర్మల్ఖిల్లా: జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ 32వ తెలంగాణ బెటాలియన్ ఆదిలాబాద్ జిల్లా అధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. నిర్మల్ సెక్టార్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రవి హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్బాకు చెందిన ఎన్సీసీ కాడేట్స్, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను వివరించారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ అధికారి జేభీమారావు, కస్బా పాఠశాలఎన్సీసీ అధికారి యాటకారి సాయన్న, రవి హైస్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, డాక్టర్ పీజీ.రెడ్డి, రవికుమార్, సమన్వయకర్త నాగేశ్వర్, నర్సయ్య, డాక్టర్ శంకర్, త్రిపాట్ వెంకట్రెడ్డి, జగదీష్, షేక్ జాన్బాబు, అరుణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలలో.. నిర్మల్ఖిల్లా/నిర్మల్ చైన్గేట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జె.భీమారావు మాట్లాడుతూ.. యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు అంతర్గత శాంతి, సహనశీలతను దారిలోకి తీసుకోవడానికి ఒక మార్గమని అన్నారు. ఇందులో విభిన్న యోగసనాలు, ప్రాణాయామ విధులు, ధ్యాన అభ్యాసాలను వివరించారు. ఈ కార్యక్రమం వాకర్స్ అండ్ లాఫర్స్ అసోసియేషన్ సభ్యులతోపాటు డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఆర్.నాగేశ్వర్, డీఈవో రవీందర్రెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ కాడెట్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం... జిల్లా వ్యాప్తంగా ఆసనాలు వేసిన ప్రముఖులు భైంసాలో.. భైంసాటౌన్: పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక నర్సింహ కళ్యాణ మండపంలో నర్సింహ యోగా గ్రూప్, పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించగా, శుక్రవారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకులు ప్రాముఖ్యత వివరించారు. అనంతరం యోగాసనాలు వేశారు. కోర్టు ఆవరణలో జడ్జి డి.దేవేంద్రబాబు న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేశారు. న్యాయవాదులు సి.శంకర్, ఏజీపీ సంతోష్ కులకర్ణి, మునీర్ అహ్మద్, కోర్టు సిబ్బంది అమర్నాథ్, వైద్యులు మహిపాల్, రామకష్ణ గౌడ్ పాల్గొన్నారు. -
బదిలీ కోరుకునే ఎస్జీటీలకు సూచనలు
నిర్మల్ రూరల్: ఎస్జీటీ బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు డీఈవో రవీందర్రెడ్డి పలు సూచనలు చేశారు. ఎస్జిటీ లేదా ఉత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులు బదిలీల్లో భాగంగా స్పౌజ్ కేటగిరీ పాయింట్లు వాడుకుంటున్న సందర్భంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే తేదీ నాటికి, వారి స్పౌజ్ ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలకు దగ్గర పాఠశాల తర్వాత దూరం అనుసరించి, దగ్గర నుంచి దూరంగా ఇతర పాఠశాలలు (మండల యూనిట్ లేదు) ఆర్డర్లో ఆప్షన్ పెట్టుకోవాలని వివరించారు. అలా కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలకు దగ్గర పాఠశాలలను వదిలి, ప్రియార్టీలో దూరం పాఠశాలలు ఆప్షన్స్ ఎంచుకుంటే వారు సీసీఏ రూల్స్ ప్రకారం శిక్షార్హులని పేర్కొన్నారు. స్పౌజ్ /ప్రిఫరెన్షియల్ ఉపాధ్యాయులు 5/8 సంవత్సరాలు పూర్తి కాకుండా, మళ్లీ స్పౌజ్ పాయింట్స్ వాడుకుంటున్న ట్లు విద్యాశాఖ దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్పౌజ్ పాయింట్లను విత్ డ్రా చేసుకోవాలనుకుంటే శనివారం డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
నిర్మల్
ఘనంగా వటసావిత్రి వ్రతం జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా వటసావిత్రి వ్రతాన్ని మహిళలు ఘనంగా జరుపుకు న్నారు. కుటుంబం కోసం ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 20249లోu కలెక్టర్ను కలిసిన బీజేపీ నాయకులు నిర్మల్చైన్గేట్: జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్ను బీజేపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసినవారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, సీనియర్ నాయకులు రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్రెడ్డి, నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీగాదె విలాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అలివేలు మంగ, జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్, బీజేవైఎం నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ కొండాజి శ్రావణ్, సర్పంచ్ అంకం శ్రీనివాస్, చలపతి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్: ‘హమ్మయ్య.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇప్పటికీ సర్కారు కరుణించింది. ఏడాదికేడాది పంట మీద అప్పు పెరుగుకుంటా పోయింది. లక్ష దాటి రెండు లక్షలకు చేరింది. పండించిన పంటలు పెట్టిన పెట్టుబడికే సరిపోతుండటంతో రుణం కట్టడం కష్టమైంది. ఇప్పుడు సర్కారు ఒకేసారి రూ.రెండులక్షల రుణం మాఫీ చేస్తామనడంతో పాణం సల్లవడ్డట్లయ్యింది...’ అని జిల్లా రైతులు అంటున్నారు. రూ.2లక్షల వరకు రైతురుణాలను మాఫీకి రాష్ట్ర మంత్రివర్గ కేబినేట్ ఆమోదం తెలుపడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వాళ్లకే వర్తిస్తుంది.. ప్రస్తుత సీజన్ నేపథ్యంలో రైతు సంక్షేమ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ చర్చించింది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ప్రచారం చేసిన రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023, డిసెంబర్ 9ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది. ఆ తేదీ వరకు రూ.2 లక్షలలోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించనున్నట్లు పేర్కొంది. అది కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే ఆగస్టు 15 లోపు మాఫీ పూర్తిచేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీసుకున్న ఈ రుణాలను మాఫీ చేసేందుకు రూ.39 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోనూ దాదాపు లక్షకుపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు.. గత ప్రభుత్వం రూ.లక్షలోపు రైతు రుణమాఫీ చేసింది. కానీ విడతల వారీగా చేపట్టడంతో రుణమాఫీ ఎప్పుడవుతుందా.. అని రైతులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇందులోనూ కొందరికీ ఇంకా మాఫీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రుణమాఫీ కాకపోవడం, చెల్లించే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇటీవల లక్ష్మణచాందకు చెందిన ఓరైతుకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు పలు పథకాలు ప్రకటించిన గత డిసెంబర్ 9నే రుణమాఫీ కూడా చేస్తుందని రైతాంగమంతా భావించింది. కానీ భారీ బడ్జెట్తో కూడుకుని ఉండటంతో కొత్త సర్కారు సమయం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోపు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. ఈ ప్రకారం ఇప్పుడు రాష్ట్ర కేబినేట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలో మాఫీ.. జిల్లాలో దాదాపు 1.87 లక్షల మంది రైతులు ఉన్నారు. 4.40 లక్షల ఎకరాలు పంట భూమి ఉంది. వ్యవసాయ భూమి ఉన్న ప్రతీరైతు ఎంతో కొంత పంట రుణం తీసుకున్నారు. చాలామంది అసలు కట్టలేని పరిస్థితుల్లో ఏటా వడ్డీలు కట్టుకుంటూ రుణాన్ని రెన్యువల్ చేయించుకుంటున్నారు. అలా.. తీసుకున్న రుణానికి వడ్డీ కడుతున్నా.. ఏడాదికేడాది అసలు మాత్రం పెరుగుతూ పోతోంది. రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు చేరిన రైతులకు ఇప్పుడు సర్కారు తీపికబురు చెప్పింది. తాము ఇచ్చిన హా మీ మేరకు రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. అది కూడా.. ఏకకాలంలో ఈ మొత్తాన్ని మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్లు చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తంచేస్తోంది. న్యూస్రీల్ రూ.2 లక్షల వరకు మాఫీకి కేబినెట్ గ్రీన్సిగ్నల్ 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్ డేట్ ఆగస్టు 15 వరకు మాఫీకి కసరత్తు హర్షం వ్యక్తం చేస్తున్న జల్లా రైతులు ‘భరోసా’ కూడా ఇస్తే.. రూ.రెండులక్షల రుణమాఫీని చేపడుతున్నట్లే రైతు భరోసానూ అమలు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. గత యాసంగి పంటకు అంతకు ముందు ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం డబ్బులే అందించారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల కావస్తున్నా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పేర్కొన్న రైతుభరోసా పథకం అమలు చేయలేదు. ఈ పథకం ప్రకారం ఎకరాకు రూ.15వేలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడంతో ఈ మొత్తాన్ని కూడా ఇస్తే.. అటు రుణభారం తప్పడంతోపాటు పెట్టుబడికి కూడా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పక్కాగా సాగుచేసే రైతులకే ఈ పథకం అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.బ్యాంకులో రైతులు (ఫైల్)సంతోషంగా ఉంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు పంట భూమిపై రూ.2 లక్షల దాకా రుణం ఉంది. ఇప్పుడు ఈ రుణభారం తప్పితే.. ఇక ఇబ్బంది ఉండదు. –గురాల లింగారెడ్డి, రైతు, మునిపెల్లి, మం.లక్ష్మణచాంద -
అనుమతి లేని పాఠశాలలు మూసివేయాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థను ముసివేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, టై లు అధిక ధరలకు అమ్మడమే కాక విద్యా సంస్థను నడపడానికి అనుమతి పొందకుండానే పాఠశాల నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అరోపించారు. నిరసనలో మాస్లైన్ పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వి.మహేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దిగంబర్, న్యూడెమోక్రసి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, రుద్ర ప్రతాప్ పాల్గొన్నారు. -
భైంసాకు సబ్ కలెక్టర్ హోదా..!
● ఉమ్మడి జిల్లాలో మరో మూడు.. ● ఉట్నూర్, బెల్లంపల్లి, కాగజ్నగర్ కూడా.. ● ఆర్డీవో స్థానంలో ఐఏఎస్ అధికారి భైంసాటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలు గు రెవెన్యూ డివిజన్ కేంద్రాలైన భైంసా, ఉట్నూర్, కాగజ్నగర్, బెల్లంపల్లికి సబ్ కలెక్టర్స్థాయి హోదా దక్కాయి. ఆర్డీవో స్థానంలో ఐఏఎస్ కేడర్ అధికా రిని నియమించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూర్, భైంసా, కాగజ్నగర్, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లకు గాను ఇప్పటి వరకు ఆర్డీవో స్థాయి అధి కారి ఉండగా, ఇకపై ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్గా ఉండనున్నారు. పరిపాలన ఆవశ్యకతలో భాగంగా రాష్ట్రంలోని 15 రెవెన్యూ డివిజన్లలో ఐఏఎస్ అధికారులను సబ్ కలెక్టర్లుగా నియమించడానికి ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగం ద్వారా జీవో 834ను తేదీ 13.06.2024న జారీ చేసింది. 2016లో డివిజన్గా.. భైంసాను 2016లో అప్పటి ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించింది. ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎస్ కేడర్ అధికారిని ఏఎస్పీగా నియమించారు. తాజాగా ఐఏఎస్ కేడర్ అధికారిని సబ్ కలెక్టర్గా నియమించేందుకు నిర్ణయించారు. ఆర్డీవోస్థాయి నుంచి సబ్ కలెక్టర్ స్థాయికి హోదా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డివిజన్ పరిధిలోని అపరిష్కృత సమస్యలకు సైతం త్వరితగతిన మోక్షం లభించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
No Headline
నిర్మల్చైన్గేట్: ఆలయాల భూములకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాల పేరిట ఉన్న భూములు చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. అలాంటి వాటిని గుర్తించి భూములను స్వాధీనం చేసుకుని, వివాదాలు పరిష్కరించి పట్టాపాస్ బుక్కులు జారీ చేయనుంది. ఇది త్వరగా పూర్తయితే ఆక్రమణకు గురైన భూములు ఆయా దేవాలయాల పరిధిలోకి రానున్నాయి. వాటిద్వారా వచ్చే ఆదాయంతో ఆలయాలు అభివృద్ధి చెందనున్నాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 273 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం.. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 18 మండలాలు ఉన్నాయి. 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఆదాయం వస్తున్న ఆలయాలు మాత్రమే దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరి ధిలో ఉన్నాయి. ఇక ఆదాయం రాని సుమారు 273 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద నెలకు రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఆ డబ్బులతో ఆలయాల్లో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. 1,472.23 ఎకరాల ఆలయ భూములు.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వివిధ ఆలయాలు ఉన్నా.. 108 ఆలయాలకు మాత్రమే భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి పరిధిలో 1,472.23 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ రాకముందు ఆలయ భూములన్నీ మిగులు భూములుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో కొన్ని ఆలయాల భూములు ఆక్రమణకు గురయ్యాయని భక్తులు అంటున్నారు. అప్పట్లో కొన్ని ఆలయాల భూములు అర్చకుల పేరు మీద ఉండేవి. ధరణి పోర్టల్ వచ్చాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ భూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేయించింది. సమస్య ఉన్న భూములు మాత్రం అలాగే ఉండిపోయాయి. విలువైన భూములు ఆక్రమణకు గురైనా చర్యలు తీసుకోవడంలో ఏళ్ల తరబడి జాప్యం జరగడంతో వాటి గురించి తెలిసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయాల భూములకు రక్షణ కల్పించాలని, వాటికి పట్టా పాసుబుక్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 330.2 ఎకరాలు కౌలుకు.. దేవాలయాల భూములు మొత్తం 1,472.23 ఎకరా లు ఉండగా వాటిలో 330.2 ఎకరాలను ఇతరులకు కౌలుకు ఇచ్చినట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నా రు. ఈ లెక్కన ఇంకా 1,342.03 ఎకరాలు పడావు ఉన్నాయి. ఈ భూములను వృథాగా ఉంచకుండా ఎవరికై నా కౌలుకుఇచ్చి ఆ ఆదాయంతో ఆలయాలను అభివృద్ధిచేయాలని భక్తులు కోరుతున్నారు.ప్రభుత్వ పరిశీలనలో ఉందిఆలయాల భూములకు పట్టా జారీ చేయాలనే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆలయాల భూముల విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తాం. – రవికిషన్, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ -
ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలి
● ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ చంద్రగిరి శివకుమార్ నిర్మల్ రూరల్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ హిందూ విభాగ్ కన్వీనర్ చంద్రగిరి శివకుమార్ డిమాండ్ చేశారు. గురువారం మాట్లాడుతూ.. ప్రైవేటు, కా ర్పొరేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ఇందులో జిల్లా ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ దుర్గాప్రసాద్, సన్నీ, దినేష్, మహేష్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బడిలో బిజినెస్!
● ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా ● ఏటా రూ.కోట్లలో వ్యాపారం ● తల్లిదండ్రుల జేబులకు చిల్లు.. ● చోద్యం చూస్తున్న విద్యాశాఖ.. ● అడ్డుకోవాలంటున్న విద్యార్థి సంఘాలుభైంసాటౌన్: ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నర్సరీ, యూకేజీ మొదలు పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులే కాకుండా స్టేషనరీ, యూనిఫాంలు కూడా పాఠశాల ఆవరణలోనే విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు సమీపంలో గదులను అద్దెకు తీసుకుని పుస్తకాల దందా సాగిస్తున్నారు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సందర్భాల్లో తనిఖీలు చేసి నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆయా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు షరామామూలే అన్నచందంగా దందా సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ విక్రయించవద్దు. కానీ, నో ప్రాఫిట్–నో లాస్ నిబంధన సాకుతో పాఠశాలల ఆవరణలోనే కొన్ని యాజమాన్యాలు తమ పాఠశాలల పేరు ముద్రించిన పాఠ్య, నోటు పుస్తకాలు విక్రయిస్తున్నాయి. వేలల్లో ధరలు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలు తప్పనిసరిగా తమ పాఠశాలల్లోనే విక్రయించే పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మారు మాట్లాడకుండా అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మార్కెట్లో ఎక్కడా లభించని పాఠ్య పుస్తకాలనే విక్రయిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు చేసేది లేక వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా ఎల్కేజీ, యూకేజీ తరగతులకు సైతం వేల రూపాయలు తీసుకుని పాఠ్య పుస్తకాలు అంటగడుతున్నారు. అవసరమున్నా లేకున్నా టై, బెల్టు, ఐడెంటిటీ కార్డు, డైరీల పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగేవారు లేరని.. ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ విక్రయాలతోపాటు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారు. అధిక ఫీజులకు తోడు అడ్మిషన్ఫీజు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదుకు వెనుకాడుతుండడంతో ఇదే అలుసుగా భావిస్తున్న యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్నాయి. ఏటా విద్యార్థి సంఘాలు ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల విక్రయం, అధిక ఫీజుల వసూలుపై ఆందోళన చేపడుతున్నా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు పాటించేలా చూడాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
శాంతిభద్రతలు గతితప్పాయి
● బీజేఎల్పీ నేత ‘ఏలేటి’ నిర్మల్చైన్గేట్: జిల్లా ఎస్పీగా జానకీషర్మిల వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షిణించాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. లక్ష్మణ చాంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్ జైల్లో గురువారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు కేవలం హిందువులపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జిల్లా పోలీస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్పీ తీరుపై కేంద్ర హోం శాఖ మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. -
‘నీట్’పై కేంద్రం మౌనం వీడాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం నూతన్కుమార్ నిర్మల్చైన్గేట్: నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం మౌనం విడాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం నూతన్కుమార్ అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండు ఎదుట గురువరాం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చే యాలని, పేపర్ లీకేజీ అంశంలో ఎన్టీఏ, ఉన్నతాధికారుల పాత్రపై సుప్రీంకోర్టు జడ్జితో విచా రణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించే బాధ్యత నుంచి ఎన్టీఏను తప్పించి, ప్రతీ రాష్ట్రం తమకు తామే పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా కమిటీ సభ్యులు శంబు, సీపీఎం పట్టణ కార్యదర్శి ఫసియుద్దీన్, నాయకులు సాయిరెడ్డి, దిగంబర్, సాయి కిరణ్, గంగారాం పాల్గొన్నారు. -
ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్చైన్గేట్: మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవా లని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నా రు. హిందూ సామ్రాజ్య దినోత్సవం(శివాజీ ప ట్టాభిషేక మహోత్సవం) సందర్భంగా నిర్మల్ శివాజీచౌక్లోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడు తూ దేశభక్తికి, పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ నిలుస్తారన్నారు. కార్యక్రమంలో శివాజీ సమితి జిల్లా అధ్యక్షుడు మెడిసెమ్మ రాజు, నాయకులు అంజుకుమార్రెడ్డి, భూమయ్య, రాంనాథ్, సత్యనారాయణగౌడ్, రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అరవింద్ పాల్గొన్నారు. -
నాణ్యతపై అవగాహన కల్పించాలి
● అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ నిర్మల్చైన్గేట్: ప్రతీ వస్తువు నాణ్యతపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత నాణ్యత ప్రమాణల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) ఆధ్వర్యంలో వస్తువుల నా ణ్యత ప్రమాణాలపై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నాణ్య మైన వస్తుసేవలను పొందడం ప్రతీ వినియోగదారుని హక్కు అని పేర్కొన్నారు. ప్రజలకు వస్తువుల నాణ్యత ప్రమాణాలపై, నాణ్యత లోపాలపై ఫిర్యాదులు చేయు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. భారత నాణ్యత ప్రమాణాల సంస్థ ప్రతీ వస్తువుకు నిర్దిష్టమైన నాణ్యత ప్రమాణం నిర్దేశించబడుతుందని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డస్ వారు ఉత్పత్తిదారులకు సర్టిఫికెట్లు మంజూరు చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుతాయన్నారు. ఐఎస్ఐ హాల్ మార్క్, ఇతర రకాలైన సర్టిఫికెట్లను ఈ సంస్థ జారీ చేస్తుందని తెలిపారు. వీటిపై అధికారులు అవగాహన కలి గి ఉండాలన్నారు. పాఠశాలల్లో 8వ తరగతి నుంచి స్టాండర్డ్ క్లబ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, స్టాండర్డ్ ప్రమోషన్ ఆఫీసర్ అభిసాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులు పాజిటివ్గా ఆలోచించాలి
● ప్రముఖ సినీ నటుడు, మోటివేటర్ ప్రదీప్నిర్మల్ రూరల్: విద్యార్థులు పాజిటివ్గా ఆలోచించాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, మోటివేటర్ ప్రదీప్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గురువారం మోటివేషన్ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వి ద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని పేర్కొన్నారు. వివిధ ఉదా హరణలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఇతరులతో పోల్చుకోవద్దని సూచించారు. ఉపాధ్యాయులు కాలంతోపాటు అప్డేట్ కావాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను అన్నిరంగాలలో తీర్చిదిద్దాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మనం కూడా అభివృద్ధి చెందాలన్నారు. ట్రస్మా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎస్ఎన్.రెడ్డి, అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ గంగన్న, కోశాధికారి కొమ్ము వినోద్కుమార్, పట్టణ అధ్యక్షుడు చంద్రగౌడ్, ప్రధాన కార్యదర్శి పద్మనాభగౌడ్, కోశాధికారి శ్రీనివాస్, పాల్గొన్నారు. -
కలెక్టర్కు శుభాకాంక్షల వెల్లువ
నిర్మల్టౌన్: జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్కు జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల గురువారం తేనేటి విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. ఈ సందర్భంగా లాఅండ్ఆర్డర్, అడ్మిని స్ట్రేషన్, శాంతి భద్రతలపై పోలీస్ ఉన్నతాధికాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. అందుకు పోలీస్ శాఖకు సహకారాలు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ను సత్కరించిన బాసర ఆలయ ఈవోబాసర: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్ను బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం ఈవో విజయరామారావు, అర్చక బృందం కలెక్టర్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ అభిలాష అభినవ్ను పట్టువస్త్రాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. గెజిటెడ్ అధికారుల సంఘం..నిర్మల్ఖిల్లా: నూతనంగా బాధ్యతలు చేపట్టిన నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ను గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నాయకులు గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారుల సంఘం తరఫున అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ, కలిసి నడుస్తామని తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో టీజీవో జిల్లా కార్యదర్శి డాక్టర్ పీజీ.రెడ్డి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సురేశ్, యు.రవికుమార్, జి.సత్యపాల్రెడ్డి, సాయినాథ్, విఠల్ తదితరులు ఉన్నారు. టీఎన్జీవోస్ సభ్యులు..నిర్మల్చైన్గేట్: కలెక్టర్ను టీఎన్జీవోస్ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు గురువారం కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెలుమల ప్రభాకర్, కార్యదర్శి కూడాల రవికుమార్, అసోసియేట్ అధ్యక్ష శ్రీరామ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, టి.స్రవంతి, ఎస్.మోహన్రెడ్డి, జేబీ. హమ్మద్, ఎన్.శ్రీహరి, గోదావరి, విజయ గౌరీ , వెంకట్ రమణ, డి.రాములు, అరుణ్ కుమార్, వై అశోక్ కుమార్, శ్రీనివాస్, టి. ప్రవీణ్ టి .శ్రీకాంత్ ఈ సుధాకర్ ఉన్నారు. -
నిర్మల్
జీవన ‘యోగ’ం భారతీయ సనాతన సంస్కృతికి ఎంతో విశిష్టత ఉంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా విశిష్టతపై ప్రత్యేక కథనం.శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 20248లోuకష్టపడేవారికి గుర్తింపు● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: పోలీస్ శాఖలో కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఇటీవల జరిగిన 16వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ చాంపియ న్షిప్లో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ దత్తురాంకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం ప్రశంసాపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ద త్తురాం మార్చి 17 నుంచి 22 వరకు హైదరా బాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకా డమీలో నిర్వహించిన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కీలక పాత్ర పోషించారన్నారు. అతని కష్టానికి ప్రతిఫలంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ స్టీఫెన్ రవీంద్ర ప్రశంసాపత్రం పంపించినట్లు పేర్కొన్నారు.వివరాలు: ● భూములు కలిగిన దేవాలయాల సంఖ్య:108 ● మొత్తం భూములు 1472.23 ఎకరాలు ● పాస్బుక్ ఉన్న భూమి ఎకరాలు 604.19 ● పాస్ బుక్ లేని భూమి ఎకరాలు 668.04 ● దూపదీప నైవేద్యం పొందుతున్న ఆలయాలు 273 ● కౌలుకు ఇచ్చిన భూమి 330.2ఎకరాలు● పట్టాల జారీకి ప్రభుత్వం నిర్ణయం ● జిల్లాలో 108 దేవాలయాలు ● వీటి పరిధిలో సుమారు 1,472.23 ఎకరాలున్యూస్రీల్ -
నిర్మల్లో వీధి కుక్కల బీభత్సం
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండు సంవత్సరాల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గాజులపేట్ ప్రాంతంలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ షేక్ అజ్గర్ కుమారుడు షేక్ రోహన్ అనే బాలుడు బుధవారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా దాడిచేశాయి. బాలుడు కేకలు విన్న చుట్టుపక్కల వారు కుక్కలను తరిమేందుకు ప్రయత్నం చేయగా, కుక్కలు వారిపై తిరగబడ్డాయి. దీంతో రాళ్లు, కర్రలతో కుక్కలను తరిమేశారు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు..జిల్లా కేంద్రంలోని గాజులపేట్లో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజుకు గురువారం ఫిర్యాదు చేశారు. కుక్కల బెడద నివారించాలని కోరారు. కుక్కల భయంతో బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో ఎంఐఎం నాయకులు మహమ్మద్ ఇర్ఫాన్, ఆమన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోగాత్మకంగా బోధన సాగాలి
● ఐటీడీఏ డీడీ దిలీప్కుమార్ఆదిలాబాద్రూరల్: ప్రయోగాత్మక బోధనతోనే వి ద్యార్థులు సులువుగా అర్థం చేసుకొని ఎప్పటికీ గు ర్తుంచుకుంటారని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డి ప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో కొనసాగుతు న్న ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ శిబిరా న్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్స రం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే బోధన చేయాల్సి ఉన్నందున విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే ప ద్ధతులను ఎంచుకోవాలన్నారు. ప్రతి నెల ఒక రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. పరిసరాలు, వంటగది, స్టోర్ రూం, తదితర వాటిని పరిశీలించారు. హాజరుపట్టికలను పరిశీలించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇందులో శిక్షణ తరగతుల ప్రత్యేకాధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయులు నారాయణ, కృష్ణవేణి, తదితరులున్నారు. -
సీఎం దృష్టికి ట్రిపుల్ఐటీ సమస్యలు
బాసర: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ని టీచర్ ఎమ్మెల్సీ కూర రఘూత్తమ్రెడ్డి ఆధ్వర్యంలో బాసర ఆర్జీయూకేటీ(ట్రిపుల్ఐటీ) కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు శ్రీశైలం గురువారం కలిశారు. కాంట్రాక్ట్ అ ధ్యాపకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రా క్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, పీఆర్సీని యూజీసీ 7వ వేతన ఒప్పందం ప్రకారం చెల్లించాలని కోరారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, బుధవారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా కలిశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై వినతిపత్రం అందించారు. పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరశురాం, అధ్యాపకులు పాల్గొన్నారు. -
దుబాయ్లో నిర్మల్ జిల్లా వాసి మిస్సింగ్
● ఉపాధి నిమిత్తం వెళ్లిన రెండు రోజులకే.. ● అచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు నిర్మల్ఖిల్లా: గల్ఫ్ దేశమైన దుబాయ్కి ఉపాధి నిమిత్తం వెళ్లిన నిర్మల్ జిల్లావాసి అక్కడ అదృశ్యమైనట్లు ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన కస్తూరి శేఖర్ కుమారుడు కస్తూరి చందు(19) ఈ నెల 14న ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడికి చేరుకున్న చందు టాక్సీలో ఏజెన్సీ వారు కేటాయించిన గదిలో ఉంచగా మరుసటిరోజే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా అతని సెల్ ఫోన్ ఆధారంగా ఆచూకీ కనుక్కొని మళ్లీ అతనిని తీసుకువచ్చారు. ఇదే నెల 16వ తేదీన అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత తన గది నుంచి మళ్లీ వెళ్లిపోయాడు. ఆచూకీ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసును నమోదు చేయించారు. ఈ విషయం స్వగ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియగా వారు ప్రవాపీ మిత్ర లేబర్ లేబర్ యూనియన్ వాలంటీర్ ఏనుగు సాయి రాజుకు సమాచారం అందించారు. అనంతరం లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పండ్లను కలిసి పూర్తి వివరాలు తెలిపారు. దుబాయ్ ఎంబసీకి పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పంపించారు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై వెళ్లిన యువకుడు అదృశ్యమైనట్టు అక్కడి సామాజిక మాధ్యమాల్లో, స్థానిక గల్ఫ్ కార్మికుల సంఘాల నాయకులకు సమాచారం అందించి ఆచూకీ కనుగొనే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
విస్తృత ప్రయోజనాలు
యోగా సాధన మనిషి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. ఇది కేవలం శారీరక వ్యాయామానికి మాత్రమే పరిమితం కాదు. విస్తృత ప్రయోజనాలు ఉంటాయి. నిరంతర సాధనతో ప్రశాంతత చేకూరుతుంది. తనలోని అంతరంగాన్ని చదివే దిశగా మనిషిని ప్రేరేపిస్తుంది. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు చేయవచ్చు. ముఖ్యంగా నేటి యువత యోగా సాధన అలవర్చుకోవాలి. – సంధ్య బెదోడ్కర్ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా.. నిత్యజీవితంలో పెరిగిన ఒత్తిడితో పాటు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో శారీరక, మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా కొన్నిసార్లు దీర్ఘకాలిక వ్యాధులు అదుపు చేసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో వ్యాధుల నియంత్రణకు, మానసిక దృఢత్వం సాధించేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో సాధనతో ప్రతి ఒక్కరిలో ఉత్తేజం నింపుతుంది. శరీరం, మనస్సుపై అదుపు ఏర్పడుతుంది. భారతీయ సంస్కృతి ప్రసాదమైన యోగా పలువురికి నేర్పిస్తుండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. – తిరుపతి రెడ్డి, యోగా శిక్షకుడు, పతంజలి యోగ భవన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ యోగాకు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. దీనిని ఒక క్రీడగా గుర్తించడంతో ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. భవిష్యత్తులో ఒలంపిక్ క్రీడల్లో సైతం దీన్ని చేర్చి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు ఉపాధి సైతం యోగా ద్వారా సాధ్యమవుతుంది. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే విధంగా పాఠ్యపుస్తకాల్లో యోగాను చేర్చడం శుభ పరిణామం. అలాగే పాఠశాలల్లో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుండడం దీనికి పెరుగుతున్న మద్దతుకు సంకేతంగా నిలుస్తుంది. యోగాతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. – సంతోష్, యోగా శిక్షకుడు, ఆదిలాబాద్