శాంతిభద్రతలు గతితప్పాయి - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలు గతితప్పాయి

Published Fri, Jun 21 2024 12:44 AM | Last Updated on Fri, Jun 21 2024 12:44 AM

శాంతిభద్రతలు గతితప్పాయి

● బీజేఎల్పీ నేత ‘ఏలేటి’

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా ఎస్పీగా జానకీషర్మిల వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షిణించాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. లక్ష్మణ చాంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్‌ జైల్‌లో గురువారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు కేవలం హిందువులపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జిల్లా పోలీస్‌ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్పీ తీరుపై కేంద్ర హోం శాఖ మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement