ప్రధాన వార్తలు
పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ
ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.ఫ్రాన్స్కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్హోవ్ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్హోవ్కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్ప్లేస్ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.ఫ్రాన్స్లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్హోవ్ పేర్కొన్నారు.ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్హోవ్కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.వాసెన్హోవ్ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.ఎత్తైన రైల్వే బ్రిడ్జ్భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించారు.చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.The first train to cross the world’s highest railway bridge—the Chenab Bridge in India.Since it’s Yoga Day, it’s the perfect image to signify that our infrastructure is stretching itself as far towards the skies as possible….🙂pic.twitter.com/T73OnJBGup— anand mahindra (@anandmahindra) June 21, 2024
సరికొత్త ధోని ఎడిషన్.. కేవలం 100 మందికి మాత్రమే
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సిట్రోయెన్ కంపెనీ ఇటీవల 'సీ3 ఎయిర్క్రాస్ ధోనీ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ ధోనీ ఎడిషన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఈ కారును కంపెనీ 100 మందికి మాత్రమే పరిమితం చేసింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధోని పేరు, 7 నెంబర్ వంటివి ఉండటం చూడవచ్చు.సీ3 ఎయిర్క్రాస్ ధోనీ ఎడిషన్.. కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్లు, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారును కొనుగోలు చేసేవారు ధోని సంతకం చేసిన 'గ్లౌస్' పొందవచ్చు. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.The C3 Aircross 7 - Dhoni Edition comes with a surprise nobody saw coming. This is your cue to walk into the Citroen showroom to test drive the all new C3 Aircross 7 - Dhoni Edition today! What are you waiting for? #CitroenTeamDhoni #DoWhatMatters pic.twitter.com/ImLotpgvUb— Citroën India (@CitroenIndia) June 18, 2024
ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.ఇన్స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్స్టాగ్రామ్ను మరింత ప్రైవేట్ ప్లేస్గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్లో.. గ్రిడ్లో పోస్ట్లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.🚨 NEW 🚨Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024
బ్రెజిల్ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో రికార్డ్
భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్లైన్ మార్కెట్గా అవతరించింది.పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్లైన్ మార్కెట్ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది.
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్ఫామ్లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho)
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 384.83 పాయింట్ల నష్టంతో 77094.10 వద్ద, నిఫ్టీ 109.5 పాయింట్ల నష్టంతో 23457.94 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లో ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐ మైండ్ట్రీ, హిందాల్కో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ మొదలైన కంపెనీలు చేరాయి. అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కం పెనీలు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు.
ప్రముఖ మార్ట్లో 450 లీటర్ల కల్తీ నెయ్యి
వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్డీటీవీ నివేదిక పేర్కొంది.ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు.
కార్పొరేట్
బ్రెజిల్ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో రికార్డ్
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ మార్ట్లో 450 లీటర్ల కల్తీ నెయ్యి
ఆర్బీఐ కీలక ప్రకటన.. ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు
ఎన్విడియా సీఈఓ నోట.. తోటమాలి నేర్పిన పాఠం
ఈ వార్తను నేనెలా మిస్ అయ్యాను!.. ఆనంద్ మహీంద్రా
విడాకుల తరువాత హ్యాపీగా ఉన్నాను - బిల్ గేట్స్ మాజీ భార్య
తగ్గనున్న ట్యాక్స్!.. మోదీ 3.0 బడ్జెట్ ప్లాన్ ఇదేనా?
ఎయిర్పోర్ట్ విస్తరణకు రూ.2,869 కోట్లు
ఎగిరిపోతున్న సంపన్నులు! ఎక్కువగా ఆ దేశానికే..
తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
ప్రపంచ పరిణామాలు కీలకం
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్!.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!
భూ, సాగు, కార్మిక సంస్కరణలు అవసరం: సీఐఐ
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
టెక్నాలజీ
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్హస్ట్ సీఎన్బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్హస్ట్ వివరించారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్తోపాటు యూఎస్లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు.
టెలికం యూజర్లు @120 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్లో మొత్తం సబ్స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు.
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు.
మనీ మంత్ర
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
ఫ్లాట్గా ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
లాభాలతో దూసుకుపోతున్న స్టాక్మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,500
పెరిగే కార్ల అమ్మకాలతో ఆయిల్కు డిమాండ్
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
ఆటోమొబైల్
మస్క్ సంచలన నిర్ణయం: 2026 నాటికి..
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్ మార్కెట్ మోడల్తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్ 5, కోనా ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్ ఈవీ, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఈవీ, మైల్డ్ హైబ్రిడ్ ఈవీ, ఫ్యూయల్ సెల్ ఈవీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.
ఏడేళ్లలో 7 లక్షలు.. ఇండియన్ కార్ ఘనత!
టాటా నెక్సాన్ 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 2017లో భారత్లో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ అమ్మకాల మార్కును అధిగమించడానికి కేవలం ఏడేళ్లు పట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని టాటా మోటార్స్ నెక్సాన్పై రూ .1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో వంటి వాటిని అధిగమించి, టాటా నెక్సాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో 1,71,697 యూనిట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో 1,72,139 యూనిట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో 1,24,130 యూనిట్లతో భారత్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది. అయితే టాటా నెక్సాన్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలోకి ప్రవేశించలేకపోయింది. ఈ రెండు నెలల్లో 11వ స్థానానికే పరిమితమైంది.నెక్సాన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్యూవీలో రెవోట్రాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120 పీఎస్, 170 ఎన్ఎమ్), రెవోటార్క్ 1.5-లీటర్ డీజిల్ (115 పీఎస్, 260 ఎన్ఎమ్) రెండు ఐసీఈ ఎంపికలు ఉన్నాయి. ఇక ఈవీ వెర్షన్లో 129 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో మీడియం రేంజ్ (ఎంఆర్), 145 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఎంఆర్ వెర్షన్ రేంజ్ 325 కిలోమీటర్లు, ఎల్ఆర్ వెర్షన్ రేంజ్ 465 కిలోమీటర్లు.నెక్సాన్ ఐసీఈ, ఈవీ వర్షన్లు రెండూ సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. నెక్సాన్ ఐసీఈకి గ్లోబల్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండగా, నెక్సాన్ ఈవీకి భారత్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇక ధర విషయానికి వస్తే టాటా నెక్సాన్ ఐసీఈ రూ .8 లక్షల నుంచి రూ .15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య, ఈవీ రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
చేప కాదు కానీ.. నీటిలో దిగితే తక్కువా కాదు
వాహన ప్రపంచంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హోవర్క్రాఫ్ట్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది భూమి మీద మాత్రమే కాకుండా నీటిలో, గాలిలో కూడా పయనించగలదు. అయితే ఇప్పుడు 'నార్త్రోప్ గ్రుమ్మన్' (Northrop Grumman) అంతర్గత జలాలలో (నీటి లోపల) ప్రయాణించే ఓ సరికొత్త 'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్' గురించి వెల్లడించింది.'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్'కు సంబంధించిన వీడియోలో గమనించినట్లయితే.. ఇది వేగంగా నీటిలోపల వెళ్లడం చూడవచ్చు. చూడటానికి ఓ చేప ఆకారంలో ఉండే ఈ వెహికల్ రెండు కన్నుల వంటి నిర్మాణం, రెక్కలు వంటి వాటిని కూడా పొందుతుంది. నీటిలో సులభంగా ముందుకు వెళ్ళడానికి చేపవంటి నిర్మాణంలో దీన్ని తయారు చేసినట్లు భావిస్తున్నాము.నార్త్రోప్ గ్రుమ్మన్.. తన మాంటా రే ప్రోటోటైప్ను ఈ ఏడాది పరీక్షించింది. లాంగ్ రేంజ్, లాంగ్ డ్యూరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన వాహనాన్ని నిమించడానికి ఏకంగా నాలుగు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని 'ఎక్స్ట్రా లార్జ్ అన్క్రూడ్ అండర్ వాటర్ వెహికల్' అని పిలుస్తారు. దీనిని DARPA అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారు చేశారు.తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. అంతే కాకుండా ఎక్కువ బరువును తీసుకెళ్లే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇది పైకి, కిందికి గ్లైడింగ్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ టెక్నాలజీ ఈ వాహనాన్ని మరింత వేగంగా ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఇది సముద్రం అడుగు భాగంలో కూడా ప్రయాణించగలదు.
రియల్టీ
పర్సనల్ ఫైనాన్స్
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..
నెలవారీ వేతనం ఈఎంఐలు, ఇంటిఖర్చులు, ఇతర పెట్టుబడులు, పొదుపు..ఇలా బ్యాంకులో జమైన కొద్దిరోజులకే ఇట్టే ఖర్చయిపోతోంది. నెలాఖరు వరకు చాలామంది చేతిలో డబ్బులేని పరిస్థితి ఏర్పడుతోంది. దాంతో క్రెడిట్ కార్టులకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పటిలా కాకుండా బ్యాంకులు కూడా వీటిని సులువుగా జారీ చేస్తున్నాయి. క్యాష్బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఉండటంతో వీటిని వినియోగించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా..వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అసలు ఏమిటీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్టులు? వీటి ఉపయోగం ఏమిటనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డువినియోగదారుల అవసరాలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేలా ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేకంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు..వంటి వాటితో అనుబంధంగా వీటిని ఇస్తున్నారు. అయితే, ఈ కార్డుల ద్వారా సాధారణ క్రెడిట్ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి తమ అనుబంధ బ్రాండ్లతో చేసిన లావాదేవీల ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు రాయితీ వంటి ప్రయోజనాలు కల్పిస్తాయి. ఉదాహరణకు..ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్లిప్కార్ట్తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్కార్డు అందిస్తోంది. వినియోగదారులు దీనితో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తే నిబంధనల ప్రకారం అదనంగా రాయితీలుంటాయి. దానివల్ల అటు వినియోగదారులకు, ఇటు క్రెడిట్కార్డు సంస్థలకు లాభం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ప్రయోజనాలు..కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు నిబంధనల ప్రకారం టార్గెట్ చేరుకుంటే వార్షిక రుసుము మినహాయింపు పొందొచ్చు.ప్రతి లావాదేవీలో రివార్డు పాయింట్లు అందుతాయి.కార్డు ఇస్తున్న సంస్థలు సూచించిన మర్చంట్స్ నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాల్ని పొందవచ్చు.కొత్తగా ఈ కార్డులను తీసుకున్న వారికి వెల్కమ్ ఆఫర్ కింద షాపింగ్ కూపన్లు, డిస్కౌంట్లు ఉంటాయి.ఇదీ చదవండి: ఈపీఎస్లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టంకార్డు ఎంపిక ఇలా..కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు దేనిపై ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ నిత్యం ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా షాపింగ్ చేస్తే దానికి అనుబంధంగా ఉన్న సంస్థ కార్డును ఎంచుకోవాలి. లేదంటే అమెజాన్లో షాపింగ్ చేస్తే ఆ సంస్థతో భాగస్వామ్యంగా ఉన్న కార్డును సెలక్ట్ చేసుకోవాలి. కార్డు ఎంచుకునేముందు ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు వంటి ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయో ముందే తెలుసుకోవాలి.
కొనుగోలుదారులకు నిరాశ.. బంగారం, వెండి మళ్లీ..
దేశవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల వైపు పయనించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (జూన్ 20) స్పల్పంగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగింది. ఇది ప్రస్తుతం రూ.66,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.220 పెరిగి రూ. 72,440 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.220 ఎగిసి రూ.72,590 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.200 పెరిగి రూ.66,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.220 పెరిగి రూ.72,440 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.72,440 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.67,000లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి మాత్రం రూ.40 తగ్గి రూ.73,010 లకు దిగొచ్చింది.భారీగా పెరిగిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,100లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్!
PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు.
వెండి గుడ్న్యూస్.. మరి బంగారం?
దేశవ్యాప్తంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 19) స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలపై బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.72,370 వద్ద ఉన్నాయి.» ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.66,960 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.10 ఎగిసి రూ.73,050 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.వెండి తగ్గుముఖందేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు క్షీణించాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు మోస్తరుగా రూ.400 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రేటు రూ.95,600 వద్దకు దిగొచ్చింది. క్రితం రోజున ఇది రూ.96,000 లుగా ఉండేది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 92500.00 | 1500.00 | |
Gold 22K 10gm | 900.00 | 1000.00 | 200.00 |
Gold 24k 10 gm | 72440.00 | 220.00 |
Stock Action
Name | Rate | Change% |
---|---|---|
Emkay Global Financial Services Ltd | 174.7 | 13.5891 |
Ramco Systems Ltd | 340.9 | 19.993 |
Sadbhav Engineering Ltd | 34.85 | -9.9483 |
Dangee Dums Ltd | 7.95 | -11.6667 |
Emkay Global Financial Services Ltd | 155.75 | 9.9929 |