-
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్కు బలవుతున్నారు. చత్తిస్గఢ్లోని భిలాయ్కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్లు చేయడం, ట్రాఫిక్లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
యోగాసనాలతో ‘పవర్ కపుల్’ రకుల్-జాకీ ఇంటర్నెట్లో హల్చల్
అందంతో పాటు ఫిట్నెస్కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే హీరోయిన్స్లో ఒకరు రకుల్ ప్రీతి సింగ్. రకరకాల యోగాసనాలను వేయడంలో ఆమె దిట్ట. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోను ఇన్స్టా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఇటీవల ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ భర్తతో కలిసి రకరకాల భంగామల్లో యోగాసనాలను అదరగొట్టేసింది. ఈ కొత్త జంట యోగాసనాలు ఇపుడు ఇన్స్టాలో హల్చల్ చేస్తున్నాయి. ఆరోగ్యంలోనూ, అన్నింటిలోనే కలిసి ఉంటే ఆనందం.. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వరుస ఫోటోలను షేర్ చేశారు ఈ లవ్బర్డ్స్."పార్ట్నర్ స్ట్రెచెస్"తో ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఆసనాలో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా మారాయి. మొదటి భంగిమగా భాగస్వామి సహాయంతో బడ్డీ బోట్ భంగిమ అంటే నౌకాసనంలో కనిపించారు. ఇంకా లెగ్ ఫార్వర్డ్ బెండ్, కోబ్రా పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
సంగీతానికి ఆ శక్తి ఉందా?
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నయం చేయడమే గాక ఉల్లాసంగా ఉండేలా చేస్తుందని చెబుతుంటారు. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం(జూన్ 21న) పురస్కరించుకుని దీని ప్రాముఖ్యత గురించి, ఆరోగ్య ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.శ్రావ్యమైన సంగీతం విభిన్న సంస్కృతులను, సరిహద్దులను దాటి భాషలకు అతీతంగా అందర్నీ ఒక్కటి చేస్తుంది. దాని మాధుర్యానికి ఎవ్వరైన పరవశించిపోవాల్సిందే. మంచి రమ్యమైన సంగీతం మనసు స్వాంతన చేకూర్చి.. శాంతిని అందించగలదు కూడా. అలాంటి ఈ సంగీతం మన అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజు మంచి సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, హీలింగ్ రేటు పెరుగుతుందట. ఇదెలా నయం చేస్తుందంటే..సంగీతం ప్లే చేసినప్పుడూ ఆ తరంగాలు మన చెవిని తాకగానే మన శరీరం ఒక విధమైన విశ్రాంతి మూడ్లోకి వెళ్లిపోతుంది. దీంతో రక్తం సులభంగా శరీరం మంతట ప్రసరిసించి..హృదయస్పందన రేటు, రక్తపోటు స్థాయిలు తగ్గడమే గాక కార్డిసాల్ స్టాయిలు కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే రక్తంలోని సెరోటోనిన్ ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని పెంచుతుంది. డిప్రెషన్ను తగ్గిస్తుంది. సంగీతం మెదుడలో డోపమైన హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఆందోళన, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రపోయేముందు సంగీతం మంచి ఓదార్పునిచ్చి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శారీరీక అసౌకర్యం, నొప్పి వంటి వాటిని దూరం చేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పలు అధ్యయనాల్లో మన మనసు, శరీరాలపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇది హృదయ స్పందన రేటు, బీపీని, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేగాదు సంగీతాన్ని వినడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అంతేగాదు పరధ్యానాన్ని అడ్డుకుని అటెన్షన్తో ఉండేలా చేస్తుంది.(చదవండి: పాశ్చాత్యులకు యోగాను పరిచయం చేసింది ఈయనే..! ఏకంగా 60 దేశాలకు..) -
'ఏఐ-టెక్నాలజీ'తో కూడిన.. స్నాప్చాట్ లెన్స్ స్టూడియో!
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్లు ఏఐ–పవర్డ్ లెన్సెస్ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్చాట్ యూజర్లు వాటిని తమ కంటెంట్లో ఉపయోగించవచ్చు.డెవలపర్ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్చాట్. దీనితో ఆర్టిస్ట్లు, డెవలపర్లు స్నాప్చాట్, వెబ్సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..డిస్ప్లే: 6.78 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్కనెక్టివిటీ: 5జీమెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 4600 ఎంఏహెచ్బరువు: 190 గ్రా.స్క్రీన్ ఎక్స్పాండర్ అండ్ మాగ్నిఫైయర్..బ్రాండ్: పోట్రానిక్స్మోడల్: పీవోఈఆర్–1899ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..బ్రాండ్: సౌన్స్కలర్: బ్లాక్మోడల్ నెంబర్: ఎస్సీఎంజీబీకె–బీకె5బరువు: 200 గ్రాస్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్లెన్స్ మెటీరియల్: గ్లాస్ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు.. -
International Yoga Day 2024 : ఈ ఆసనాలతో ఎన్నిలాభాలో తెలుసా?
యోగా సాధనతో అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే అనే అవగాహన ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మెరుగైన జీర్ణవ్యవస్థ మొదలు, గుండె జబ్బులు దాకా, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం , అందం, ఆకర్షణ లాంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. నిపుణులైన యోగ గురువుల సమక్షంలో కొన్ని ఆసనాలను సాధనం చేయడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.యోగా సాధన ప్రయోజనాలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుందిఒత్తిడిని దూరం చేస్తుందిఫ్లెక్సిబిలిటీని పెంచుతుందిరక్తపోటును తగ్గిస్తుందిఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందిఆందోళనను దూరం చేస్తుందిదీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుందిమధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తుందిసంతులనం భావాన్ని మెరుగుపరుస్తుందిఎముకలకు బలాన్నిస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది.గుండె జబ్బు, ఇతర కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందివజ్రాసనంఒత్తిడి, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం వజ్రాసనం. మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శ్రద్ధగా, ఓపిగ్గా పాటిస్తే ఒత్తిడిని తరిమి కొట్టవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసన,సుప్త మత్స్యేంద్రాసన, భుజంగాసనం, మర్జర్యాసనం- ఇలాంటివెన్నో జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. సుప్త బద్ధ కోణాసనంఅలసట, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాడీలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను ఈజీగా కరిగిస్తుంది. ముఖ్యంగా తొడలు, మోకాళ్లను నాజూకుగా చేస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది.ఊర్ధ్వ ప్రసారిత పద్మాసనంఅవయవాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. కండరాలను బలపరుస్తుంది. వెన్నెముకకు శక్తినిస్తుంది. కాలేయం, మూత్రపిండాల పనీతీరును మెరుగుపరుస్తుంది. మార్జాలాసనంఈ ఆసనం తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను ఉత్తేజితం చేసి, బలపరుస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా ఇతర అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.తడాసానంభోజనం చేసిన తరువాత చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.భుజంగాసనం సయాటికా నొప్పి, ఆస్తమాకు చికిత్సలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వెన్నెముకను బలపరుస్తుంది కూడా. ఛాతీ, ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది. భుజాలు, పొట్ట, పిరుదుల్లోని కొవ్వును కరిగించి, దృఢ పరుస్తుంది.వీటితోపాటు పార్శ్వ సుఖాసనం, అర్ధ మత్స్యేంద్రాసన, సుప్త మత్స్యేంద్రాసన, అపానాసన, మర్జర్యాసనం-బితిలాసనం, ధనురాసనం లాంటివి చాలా ఉన్నాయి. నిపుణుడైన యోగా గురు పర్యవేక్షణలో ఆయా అవయవాల పనితీరు కోసం ప్రత్యేకంగా ఆచరించవచ్చు. -
'ఆధునిక యోగా పితామహుడు'! ఏకంగా 60 దేశాలకు..
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఒకటి 'యోగా'. అలాంటి యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ యోగా భారతదేశం వారసత్వమే అయినా అందరికీ దీని గురించి కూలంకషంగా తెలియని కాలంలో తిరుమలై కృష్ణమాచార్య గారు దీన్ని వ్యాప్తి చేశారు. ఎంతలా అంటే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా తెలుసుకునేలా ప్రజాధరణ తీసుకొచ్చారు. ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యుడిగా చెప్పుకునే బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్ లేదా బీకేఎస్ అయ్యంగార్కే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే..? ఆయన ఏకంగా 60 దేశాలకు యోగా అభ్యాసాన్ని గురించి తెలియజేశారు. ఇవాళ(జూన్ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీకేఎస్ అయ్యంగార్ ఎలా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేయగలిగారు? ఆయన యోగా నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు గురించి తెలుసుకుందామా..!బీకేఎస్ అయ్యంగార్ లేదా బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగారిని 'ఆధునిక యోగా పితామహుడి'గా పిలుస్తారు. ఆయన యోగాని శారీరక అభ్యాసానికి సంబంధించిన కళ, సైన్స్, ఫిలీసపీ అని ప్రగాఢంగా నమ్మారు. 1950లలో యోగా అభ్యాసాలను ప్రచార చేసే నిమిత్తం ముంబై పర్యటనలో ఉన్నారు అయ్యంగారు. సరిగ్గా ఆ సమయంలోనే భారత్ సందర్శనకు వచ్చిన అమెరికన్ బ్రిటీష్ వయోలిన్ వాద్యకారుడు యొహూదీ మెనూహిన్ యోగా గురువు అయ్యంగార్ని కలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యోగా గురించిసేలా చేసే ప్రచారం చేయాలన్న అతని దృఢ సంకల్పం విని ఆశ్చర్యపోయారు. ఆయన అలవోకగా వేస్తున్న ఆసనాలన్నీ మెనూహిన్ని ఎతంగానో ఆకర్షించాయి. ఆ ఆసనాలు తాను నేర్చుకుంటే తన వయోలిన్ కళ మరింత మెరుగుపడుతుందని భావించి, అయ్యంగార్ని తనతోపాటు స్విట్జర్లాండ్, లండన్ వంటి దేశాలకు తీసుకెళ్లాడు. అలా అయిన యోగా ప్రాముఖ్యత గురించి విదేశాల్లో ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆ క్రమంలో 1956లో అయ్యంగార్ న్యూయార్క్ వచ్చిన తొలినాళ్లల్లో చాలామంది యోగా పట్ల ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నెమ్మదిగా యోగాకు క్రేజ్ లభించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఆరు ఖండాల్లో యోగా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాడు. అంతేగాదు 'లైట్ ఆన్ యోగా' వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇవి అంతర్జాతీయంగా అమ్ముడైన పుస్తకంగా కూడా నిలిచింది. ఎవరంటే..అయ్యంగార్ డిసెంబర్ 14, 1918న కర్ణాటక బెల్లూరులో జన్మించారు. 1937లో మహారాష్ట్రలోని పూణేకు వచ్చి అయ్యంగార్ యోగాగా పిలిచే యోగా శైలిని తీసుకొచ్చారు. ఆయన చిన్నతనంలో క్షయ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అతనికి యోగా ఉపకరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్నో ప్రయోజనాలందించే ఈ యోగాని అందరూ తెలసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. ఇక ఆయన యోగా అభ్యాసన విధానంలో చాలా సులభమైన భంగామల్లో వేసేలా బ్లాక్లు, పల్టీలు, వంటి వాటిని వినియోగించేవారు. ఎవ్వరైనా ఇట్టే నేర్చుకునేలా బోధించేవారు. ఆ తర్వాత 1975లో తన స్వంత 'యోగవిద్య' సంస్థను స్థాపించారు. అలా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా వివిధ శాఖలకు విస్తరించాడు. అలా యోగా వ్యాప్తి కోసం చేసిన కృషికి గానూ యోగా గురువుగా, ఆధునిక ఋషిగా కీర్తించబడ్డారు. ఆయనకు విదేశాల్లో సుమారు 100కు పైగా యోగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయన సామాన్యులకే గాక పలువురు ప్రముఖులకు కూడా యోగాసనాలు నేర్పారు. ఆయన వద్ద యోగాసనాలు నేర్చుకున్నవారిలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్, ప్రసిద్ధ తత్వవేత్త జె కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. ఆయన యోగాసనాల శైలికి నటి కరీనా కపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి అన్నెట్ బెనింగ్, డిజైనర్ డోనా కరాంటో, రచయిత ఆల్డస్ హక్స్లీ వంటి అభిమానులు కూడా ఉన్నారు. అంతేగాదు యోగాకు ఆయన చేసిన అపారమైన కృషికి గానూ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో భారతప్రభుత్వ సత్కరించి, గౌరవించింది. 2004లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందారు. చివరిగా ఆగస్టు 20, 2014న, 95 ఏళ్ల వయసులో గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యంతో పూణే ఆస్పత్రిలో అయ్యంగార్ మరణించారు. (చదవండి: International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం) -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం
యోగా అంటే బరువు తగ్గడం కాదు. అంతకుమించిన మానసిక వికాసం. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం. యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్యతకు మూలం. యోగా నేర్చుకోవాలనుకుని అనుకుంటున్నారా? యోగ మొదలు పెట్టాలనుకునే వారు, ఎలా మొదలు పెట్టాలో తెలియని వారు మార్గదర్శకాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు యోగా అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? తెలుసుకుందాం.యోగాని జాతి, మత, కుల, లింగ భేదాలు, చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. యోగా సాధనకు సంక్పలం, చక్కటి గురువు ఉంటే చాలు. ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. అలాగే దీన్ని పట్టుదలగా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం.యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు. అదొక అనిర్వచనీయ అనుభూతివైపుగా తీసుకెళ్లే శక్తి. విభిన్నమైన ఆసనాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ, మన శరీర తత్వాన్ని, లక్షణాలను అవయవాల తీరును తెలుసుకొనే శాస్త్రం కూడా.మరోవిధంగా చెప్పాలంటే...మనుషుల్లోని కోపం, ఆవేశం, ఉల్లాసం, ఆందోళన ఇలాంటి భావోద్వేగాల్ని, శరీర భంగిమల్ని ఇట్టే పసిగడతాం. ఇలాంటి మానసిక భావోద్వేగ పరిస్థితులను గమనిస్తూ మన శరీరాన్ని వివిధ భంగిమల ద్వారా కావలసిన స్థితిని తీసుకువచ్చేదే ఆసన విద్య. అలా మనుషులకు చైతన్యాన్ని, కొత్త శక్తిని అందించాలనేదే యోగాసనాల ఉద్దేశ్యం. అయితే ఇది అందరికీ ఒకేలాగా పనిచేయకపోవచ్చు. వ్యక్తుల స్వభావాన్ని బట్టి, సాధన ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. అవగాహన, అనుభవం, ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఆధునిక కాలంలో కొంతమంది నిపుణులు సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల యెగా శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి ఇంట్లోనే ఉండి అభ్యాసం చేసే వెసులుబాటునిస్తాయి. నిపుణుల సమక్షంలో జరిగే ఇలాంటి శిక్షణ శారీరక , మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే మరిన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం యోగా గురువుల సమక్షంలో భౌతిక శిక్షణ అవసరం. సముద్రంలాంటి యోగ జీవితకాలం స్ఫూర్తినిచ్చే ఒక నిరంతర ప్రయాణం. దైవాన్ని నమ్మేవారికి ఆధ్యాత్మిక తాదాత్మ్యం. మిగిలినవారికి భౌతిక మానసికోల్లాసం.యోగాసనాలలో , 84 ప్రాథమిక ఆసనాలు ఉన్నాయని చెబుతారు. శ్వాసపై దృష్టి పెడుతూ శరీరం , మనస్సు ఎలా పని చేస్తాయో అన్వేషించడమే దీని ఉద్దేశం. ఇందులో సుఖాసన మొదలు, తడసానా లేదా పర్వత భంగిమ, అధోముఖ స్వనాసన , ధనుర్ ఆసనం, శవాసనం, మొదలు, హనుమనాసన, అస్తావక్రాసన , యోగనిద్రాసన, ద్విపద విపరిత దండాసనా, ,కపోతాసా , వృశ్చికా, పింఛ మయూరాసన, బకాసనా లాంటి ఎన్నో క్లిష్టమైన ఆసనాలున్నాయి. కఠోర శ్రమతో వీటిని ఆచరిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది. -
Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్తోనే.. రాగాల రారాజుగా..
తొలి ఆల్బమ్తోనే వేలాది అభిమానులను సంపాదించుకున్నాడు దిల్లీకి చెందిన అర్పణ్ కుమార్ చందెల్. మల్టీపుల్ సూపర్–హిట్ ఆల్బమ్లతో అభిమానుల చేత ‘కింగ్’ అనిపించుకున్నాడు. స్వరరచనలోనే కాదు పాటల రచనలోనూ భేష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మ్యూజిక్ కంపెనీలతో కలిసి పని చేసిన ‘కింగ్’ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో చోటు సంపాదించాడు....పాపులర్ ర్యాప్ రియాలిటీ షో ‘హసల్’తో తొలి గుర్తింపు పొందాడు అర్పణ్ కుమార్ చందెల్. ‘టాప్ 5’లో ఒకరిగా చోటు సంపాదించాడు. ఆ తరువాత ‘హసల్ 2.వో’లో స్క్వాడ్ బాస్గా మరింత పేరు తెచ్చుకున్నాడు.‘వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. వారి గురించి చదివినప్పుడల్లా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం’ అంటున్న అర్పణ్ దిల్లీలోని సాధారణ కుటుంబనేపథ్యం నుంచి వచ్చాడు.మొదట్లో ఫుట్బాల్ ఆటను బాగా ఆడేవాడు. ఫుట్బాల్ ప్లేయర్గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే ‘ఆట’ నుంచి ‘పాట’ వైపు అతని మనసు మళ్లింది. సంగీతంపై ఆసక్తి అంతకంతకూ పెరగడం మొదలైంది. మ్యూజిక్ పట్ల తన ఆసక్తి, ప్రయోగాలకు యూట్యూబ్ వేదిక అయింది. పాటలు రాయడం మొదలు పెట్టాడు.‘చిన్నప్పటి నుంచి నాకు రకరకాల సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు, నాలోని ఊహాలతో పాటలు రాయడం మొదలుపెట్టాను’ అంటాడు అర్పణ్. ‘ది కార్నివాల్’ ‘షాంపైన్ టాక్’ ‘న్యూ లైఫ్’లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్లతో సంగీత ప్రపంచంలో సందడి చేసి ‘కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు అర్పణ్. ‘మేరీ జాన్’ పాట బిల్బోర్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ప్రేమ, భావోద్వేగాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకుంది. ‘ప్రతి జెనరేషన్ కనెక్ట్ అయ్యేలా మేరీ జాన్ పాటను రూపొందించాను. ఈ పాటలోని ఒక వాక్యం....నీ నీడలా ఎప్పుడూ నీతో ఉంటాను అనేది యువతరానికి బాగా నచ్చింది’ అంటాడు అర్పణ్.చార్ట్బస్టర్ ‘తూ ఆఖే దేఖ్లే’ తనను సంగీతకారుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘నేను చేసిన మంచి పని ఏమిటంటే నాలోని భావాలను కాగితంపై పెట్టడం. వాటికి బాణీ కట్టడం. నాకు తోచినది నేను రాస్తాను. అది శ్రోతలకు నచ్చింది. అందుకే వారు నన్ను కింగ్ అనిపిలుస్తున్నారు. తమ భావాలకు ప్రతినిధిగా చూస్తున్నారు’ అంటాడు అర్పణ్.అర్పణ్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆయన మాటల్లోనే... ‘ఓపికగా ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో....ఇలా ఎన్నో విషయాలను నా ప్రయాణంలో నేర్చుకున్నాను. నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ నాన్–బాలీవుడ్ హిప్–హప్ కింగ్గా పేరు తెచ్చుకున్న అర్పణ్ కుమార్ చందెల్ ఇప్పుడు బాలీవుడ్ పాటలతోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.సింపుల్గా స్పీడ్గా...‘సింపుల్గా ఉండాలి, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి’ అనుకొని పాట ప్రయాణం మొదలుపెడతాను. నా పాటలు శ్రోతలను ఆకట్టుకోవడానికి ఇదొక కారణం. ఈ పాట ఎవరి గురించో అనుకోవడం కంటే, ఈ పాట నా గురించే అనుకోవడంలో విజయం ఆధారపడి ఉంటుంది. పాట అనేది గాలిలో నుంచి పుట్టదు. దాని వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. నా పాటల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందితే అంత కంటే కావల్సింది ఏముంది! – అర్పణ్ కుమార్ చందెల్ -
International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!
యోగా చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం మాత్రమే కాదు అనువైన దుస్తులు ఉండటం కూడా అవసరం. నవతరం అభిరుచికి తగినట్టు ఇటీవల యోగా వేర్ కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేతన్నలు చరఖాతో దారం వడికి మగ్గంపై నేసిన కాటన్తో తయారైన యోగా వేర్కి డిమాండ్ పెరుగుతోంది. మేనికి హాయిగొలిపేలా సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల డిజైన్లే యోగా వేర్లో కీలకమైన అంశాలు. యోగా డే సందర్భంగా సౌకర్యవంతమైన హంగులను మనమూ సొంతం చేసుకుందాం.– కాటన్ స్మోక్డ్ వెయిస్ట్ క్రాప్ టాప్ బాటమ్గా బ్లాక్ హారమ్ ప్యాంట్ ధరించడంతో క్రీడాకారిణి లుక్ వచ్చేస్తుంది.– ఆర్గానిక్ కాటన్తో డిజైన్ చేసిన ప్రింటెడ్ క్రాప్ టాప్, హారమ్ ప్యాంట్ ఇది.– మిడ్ లెంగ్త్ స్లీవ్స్ కాటన్ టాప్, సైడ్ పాకెట్స్ ఉన్న కాటన్ ప్యాంట్తో యోగా కదలికలలో సౌకర్యంగా ఉంటుంది.– కాటన్ షార్ట్ కుర్తీ లేదా క్రాప్ టాప్స్ని ధోతీ ప్యాంట్తో జత చేస్తే యోగసాధనలో సౌకర్యవంతమైన సంప్రదాయ శైలి కనిపిస్తుంది.– కాటన్ బెల్టెడ్ టాప్కి, పెన్సిల్ కట్ ప్యాంట్ యోగావేర్లో స్మార్ట్ లుక్తో ఆకట్టుకుంటుంది.– యోగా వేర్లో జంప్సూట్ డిజైన్స్ సౌకర్యాన్ని ఇస్తాయి.పర్యావరణ స్పృహ, వ్యక్తిగత శైలి, సౌకర్యం.. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగా డ్రెస్ డిజైన్స్ని మెరుగుపరచవచ్చు.యోగా సాధనలో సౌకర్యవంతంగా, పర్యావరణ స్పృహని కలిగించే సంప్రదాయ యోగా డ్రెస్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఆధునిక డిజైన్స్నీ కలపవచ్చు.లేత రంగులు, ప్లెయిన్గా ఉండే చేనేత వస్త్రాలు యోగా చేయడానికి సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ పరిచయం చేస్తాయి.నడుము దగ్గర కాటన్ బెల్ట్, కాలి మడమల దగ్గర ప్రత్యేకమైన డిజైన్ని జోడించడం ద్వారా యోగా డ్రెస్సులను ఆకర్షణీయంగా మార్చేయవచ్చు.యోగాలో సౌకర్యం చాలా ముఖ్యమైనది. శ్వాసక్రియకు పర్యావరణ అనుకూలమైన దుస్తులను ఎంచుకుంటే ఫ్యాషన్గానే కనిపిస్తాం.శరీర కదలికలకు తగినట్టు డ్రెస్ కూడా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సహజ రంగులను ఉంచుకోవాలి.స్టైల్గా ఉండాలనుకుంటే హై వెయిస్టెడ్ ప్యాంట్స్, ర్యాప్టాప్ల వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి. హైవెయిస్ట్ లెగ్గింగ్స్, క్రాప్టాప్స్, స్పోర్ట్స్ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.హెయిర్ హెడ్ బ్యాండ్స్, సన్నని బ్రాస్లెట్స్, స్టడ్స్ లేదా చెవి ΄ోగులు వంటి తేలికైన ఆభరణాలను ధరించాలి.పార్క్ లేదా యోగా క్లాసులకు వెళ్లేటప్పుడు వెంట ఆర్గానిక్ కాటన్ లేదా రీ సైకిల్ చేసిన బ్యాగ్లో యోగాకు ఉపయోగించే మ్యాట్ను, వాటర్ బాటిల్నూ వెంట తీసుకెళ్లవచ్చు.యోగా ప్రయోజనాన్ని ఆనంద దాయకంగా మార్చుకోవాలంటే మాత్రం మీ అభ్యాసమే ముఖ్యమైనది. -
ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.మినరల్ వాటర్ క్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
భిన్నత్వంలో.. ఏకత్వం!
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’
దేశ రాజధాని నగరం ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకరస్థాయిలకు పడిపోవడం ఇటీవలి కాలంలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళకరమైన అధ్యయనం ఒకటి మరింత ఆందోళన రేపుతోంది. వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాద కారకంగా వాయు కాలుష్యం నిలుస్తోందని కూడా ఈ నివేదిక తేల్చింది.అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం, 2021లో ఏకంగా 81 లక్షలమంది చిన్నారు వాయు కాలుష్య భూతానికి బలైనారు. మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది. మన నిర్లక్ష్యమే తదుపరి తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునిసెఫ్కు చెందిన కిట్టి వాన్ డెర్ హీజ్డెన్ తెలిపారు.వాయు కాలుష్యంకారణంగా ఐదేళ్ల లోపు ఉన్న 7 లక్షల మంది పిల్లల మరణించారు. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటం వలన సంభవించాయి.తరువాతి తరంపై తీవ్ర ప్రభావంయూనీసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని అధ్యయనం హెడ్ పల్లవి పంత్ వెల్లడించారు. ఇవి మనం పరిష్కరించగల సమస్యలేనని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని దాదాపు ప్రతీ ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యంతో 2021లో 5 లక్షల మంది ప్రాణాలు గాల్లోకి కలిసి పోయాయి. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి చాలా సారూప్యమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని పల్లవి వ్యాఖ్యానించారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200 పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. -
బంతి ఆకారంలో ఉండే బ్రేక్ఫాస్ట్.. ఏ దేశం వంటకం అంటే..
ప్రతి దేశం ఒక్కో రకమైన వంటకంలో ఫేమస్ అవుతుంది. ఆ వంటకం పేరు వినగానే వెంటనే ఆ దేశం లేదా ప్రాంతం పేరు మనకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా కొన్ని రకాల వంటకాలు మన మనసులో స్థానం దక్కించుకుంటాయి. అలానే ఇక్కడొక వంటకం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వంటకం మన భారతీయ వంటకానికి దగ్గర పోలిక ఉన్న రెసిపీలానే ఉంటుంది. కానీ వాళ్లు తయారీ చేసిన విధానం మాత్రం వావ్ అనాల్సిందే. ఇంతకీ ఏంటా వంటకం, ఏ దేశానికి సంబంధించింది అంటే..జపాన్ పాకశాస్త్ర నిపుణులు బంతి ఆకారంలో ఉండే బ్రేక్ఫాస్ట్ని తయారు చేశారు. అది ఎక్కడ వంకర లేకుండా..గుండ్రటి బంతి ఆకారంలో ఉంది. పైగా ప్లేటంతా ఆక్రమించేసింది. దీన్ని ఎలా చేస్తారంటే..మైదాపిండికి కొద్ది మోతాదు బొంబాయిరవ్వను కలిపి పులియబెట్టేలా కొద్దిగా ఈస్ట్ జోడించి చపాతి పిండి మాదిరిగా నీళ్లతో కలిపి ఒక పక్కన ఉంచాలి. తర్వాత చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలిన. కానీ వేయించేటప్పుడూ బంతి షేపులోకి పొంగేలా జాగ్రత్తగా వేయించాలి. అంతేగాదు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానిస్తే అంతలా అవి డీప్ ఫ్రై చేసేటప్పుడూ కచ్చితమైన చందామామ లాంటి ఆకృతికి వస్తాయి. మన ఇండియన వంటకమైన భాతురా రెసిపీకి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. ఇది పంజాబీ వంటకం. ఇది కూడా ఒక విధమైన పులియబెట్టిన బన్ లేదా పూరీ మాదిరిగా ఉండే వంటకం. మనం ఎలా అయితే పూరీలను సెనగలు ఆలు కర్రీ లేదా కుర్మాతో తింటామో అలానే ఈ జపాన్ రెసీపీని కూడా ఇంచుమించుగా అదే మాదిరి స్పైసీ కర్రీతో తింటారట అక్కడ ప్రజలు. దీన్ని వాళ్లు "జెయింట్ సెసేమ్ బాల్" అని పిలుస్తారట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెసిపీని కాస్మిక్ భాతురా, బంతి ఆకారపు పూరీ అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by むにぐるめ(唯一無二の絶品グルメ) (@muni_gurume_japan) (చదవండి: బీచ్లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు..
కలలు కనడమే కాదు.. వాటి సాకారానికి కృషి చేయాలనే ఆలోచన ఓ ముగ్గురు గృహిణులలో కలిగింది. ఫలితంగా వాహనాలను రిపేర్ చేయడంలో శిక్షణ తీసుకున్నారు. అంతటితో ఆగిపోకుండా ‘సిగ్నోరా’ పేరుతో వెంచర్ను కూడా ఏర్పాటు చేశారు. మేరీ, బిన్సీ, బింటు అనే ఈ ముగ్గురు మహిళలు కేరళలోని కాసర్గోడ్కు చెందినవారు. ‘ఫస్ట్ ఆల్ ఉమెన్ టు ఆటోమొబైల్ వెంచర్గా మా సంస్థకు గుర్తింపు రావడం గర్వంగా ఉంది’ అని చెబుతున్న ఈ మహిళల లక్ష్యం ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తోంది.పనిముట్లను అందుకున్న మేరీ అరగంట కృషితో రిపేర్లో ఉన్న కారును డ్రైవింగ్కు అనుకూలంగా మార్చేసింది. మేరీ, బిన్సీ, బింటు ముగ్గురూ ఆ తర్వాత మరో వాహనాన్ని రిపేర్ చేయడంలో మునిగిపోయారు. సాధారణంగా మహిళలు వెనకడుగు వేసే ఆటోమొబైల్ రిపేరింగ్ రంగంలో ఈ ముగ్గురూ సక్సెస్ను చూపుతున్నారు.శిక్షణతో ముందడుగు..మహిళలు ఒంటరిగా లేదా బృందంగా వ్యా΄ారంప్రారంభించేందుకు శిక్షణ ఇవ్వడానికి పరప్ప బ్లాక్ పంచాయితీ ఆలోచన చేసింది. ఆ సమయానికి బిన్సీ, బింటు, మేరీలు ఎవరి కాపురాలు వారు చేసుకుంటూ కుటుంబ జీవనం గడుపుతున్నారు. అయితే తాము కుటుంబ బాధ్యతలకు అతీతంగా సమాజం ముందు సగర్వంగా నిలబడాలని కలలు కన్నారు. అంతటితో ఆగిపోలేదు.. వాటిని సాకారం చేసుకోవాలనుకున్నారు. పరప్ప బ్లాక్ పంచాయితీ ద్విచక్ర వాహనాల మరమ్మతులో వృత్తి శిక్షణ కోర్సును ΄్లాన్ చేసింది. ఆ శిక్షణా కార్యక్రమమే ముగ్గురు మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.గ్రూప్గా ఏర్పాటు..పద్ధెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల ఇరవై మంది మహిళలను కోర్సుకు ఆహ్వానించింది. ఈప్రాజెక్ట్ను అమలు చేసేందుకు ఏడు పంచాయతీలను ఎంపిక చేశారు. మొత్తం 23 మంది మహిళలు శిక్షణకు ముందుకు వచ్చారు. వీరికి నెల రోజుల ΄ాటు నిపుణులు శిక్షణ ఇచ్చారు. బిన్సీ మాట్లాడుతూ ‘కోర్సు పూర్తవగానే వెంచర్ప్రారంభించాలనుకునేవారికి సహాయం అందిస్తామన్నారు. అప్పుడే మేం ఒక గ్రూప్గా ఏర్పడి సరైన ΄్లాన్తో ముందుకు రావాలనుకున్నాం.ఒకే ప్రాంతంలో ఎంటర్ప్రైజ్ప్రారంభించాలనుకున్నాను. సిగ్నోరా అంటే లాటిన్ భాషలో ‘పెళ్లయిన స్త్రీ’ అని అర్థం. కుటుంబ సభ్యులు కూడా మాకు మద్దతునిచ్చారు. ఆటో సర్వీసింగ్ రంగం మహిళలకు అంత సులువైన పనికాదనే అభి్ర΄ాయం అందరిలోనూ ఉంది. దీనిని అధిగమించాలనే పట్టుదలతోనే మేం వర్క్షాప్నుప్రారంభించాం. భీమానది–కలికడవ్ మార్గంలో మా వెంచర్ను ఏర్పాటు చేశాం.మేరీ, బిన్సీ, బింటుతొలినాళ్లలో ‘ఆడవాళ్లు రిపేర్లు చేస్తే ఇక ఆ వాహనం ముందుకు నడిచినట్టే..’ లాంటి వ్యంగ్యపు మాటలు వినవచ్చేవి. అలాంటి ఆలోచనతో చాలా మంది మా వెంచర్కు వచ్చేవారు కాదు. అయితే, ఆ తర్వాత మెల్లగా మా వెంచర్కు వచ్చిన వాహనాలకు తగిన రిపేర్ చేయడంతో మంచి గుర్తింపు రావడం మొదలైంది. ఎలాంటి వాహన సమస్యనైనా మేం పరిష్కరించగలం.ప్రతిరోజూ కొత్త విషయాలు..‘విజయాన్ని త్వరగా సొంతం చేసుకోగల వృత్తి ఇది కాదని మేం నమ్ముతున్నాం. దీనివల్ల లాభాలు గడిస్తాం అని కూడా అనుకోవడం లేదు. ప్రస్తుతం వచ్చే ఆదాయం అద్దెకు, రుణం చెల్లించడానికి సరిపోతుంది. సర్వీస్ సెంటర్లో అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి డబ్బు కావాలి. ప్రతి రోజూ ఒక్కో వాహనం గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.మా ముగ్గురికీ ఆర్థిక సహకారం అందించేలా సంస్థ క్రమంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం’ అంటున్నారు ఈ మహిళలు. మొదట్లో ఆటోమొబైల్ సర్వీస్ ట్రెయినింగ్కు విముఖత చూపిన పలువురు స్థానిక మహిళలు ఇప్పుడు ఆసక్తిగా ఈ ΄ారిశ్రామికవేత్తలను సంప్రదిస్తున్నారు. తమ వెంచర్ విజయవంతమైతే ద్విచక్రవాహనాల రిపేరింగ్లో అమ్మాయిలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామ’ని మేరీ చెబుతోంది.‘ఈ వెంచర్ను ప్రారంభించి ఆరు నెలలు కావస్తోంది. యూనిఫామ్ ధరించి పని చేస్తున్నప్పుడు మాపై మాకు నమ్మకంగానూ, గర్వంగానూ అనిపిస్తుంది. టెక్నాలజీ రోజు రోజుకూ మారుతున్న కొద్దీ ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. చాలామంది అమ్మాయిలు, మహిళలు ఇప్పుడు మమ్మల్ని ఈ పని నేర్పించమని అడుగుతున్నారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందించాలనుకుంటున్నాం. మా వెంచర్ను పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం’ అంటున్నారు ఈ ఉమెన్ మెకానిక్స్.ఇవి చదవండి: ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా.. -
ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా..
‘కృత్రిమ నవ్వు’ అని వెక్కిరిస్తాం. ‘వారి మాటల్లో అంతా కృత్రిమత్వమే’ అని విమర్శిస్తాం. ‘కృత్రిమత్వం’ ‘సహజత్వం’ భిన్న ధ్రువాలు అనే వాస్తవాన్ని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తిరగ రాసింది. కృత్రిమ మేధస్సు నుంచి పుట్టిన అందాల యువతులు నవ్వితే ఆ నవ్వులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. మాట్లాడితే... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందేగానీ ఎక్కడా కృత్రిమ ఛాయ కనిపించదు.మానవులతో పోటీ పడుతూ ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటున్న డిజిటల్ సొగసరులకు ఏఐ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ అందాల పోటీ నిర్వహించింది. ‘మిస్ ఏఐ’ పోటీ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘మిస్ ఏఐ’ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఏఐ మోడల్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. ‘టాప్ –10’ ఫైనలిస్ట్ జాబితాలో మన దేశం నుంచి డిజిటల్ దివా జరా శతవరి చోటు సాధించింది.బ్యూటీ, టెక్ స్కిల్స్, సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఎంత... మొదలైన అంశాలు ‘మిస్ ఏఐ’ ఎంపిక ప్రక్రియలో ఉంటాయి. న్యాయ నిర్ణేతలలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం విశేషం. ‘మిస్ ఏఐ విజేత’ ఎవరవుతారో అనే ఆసక్తికంటే ‘ఎవరీ జరా శతవరి?’ అనే ఆరా ఎక్కువ అయింది. అందానికి అక్షరాలా నిర్వచనంలా ఉన్న ఈ శతవరి ఎవరో తెలుసుకుందాం..ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి శతవరి సృష్టికర్త. శతవరిని ‘డిజిటల్ మీడియా మేధావి’గా అభివర్ణించాడు రాహుల్. ‘మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో శతవరికి ‘టాప్–10’ చోటు దక్కిన సందర్భంగా తన లింక్డ్ ఇన్ పోస్ట్లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాహుల్.‘ఈ గుర్తింపు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి జరా శతవరి చేసిన విశేష కృషిని తెలియజేస్తుంది. ప్రపంచ వేదికపై భారత్, ఆసియాకుప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాను. శతవరి భారత్ నుంచి ఏకైక ఫైనలిస్ట్, ఆసియా నుంచి ఇద్దరిలో ఒకరు’ అని పోస్ట్లో స్పందించాడు రాహుల్.కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ని ఎలా చూడాలి?’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తోంది. అందం, సోషల్ మీడియాలోని అభిమాన గణం మాత్రమే శతవరి విలువకుప్రాతిపదిక కాదు. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తుంది. కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణానికి సంపూర్ణంగా అద్దం పడుతుంది.‘ఏ.ఐ. సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ఆమె లక్ష్యం’ అంటున్నాడు జరా శతవరి సృష్టికర్త రాహుల్. కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ పనితీరును ఎలా చూడాలి? ’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తుందిశతవరి శక్తి ఇది...– ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ–పవర్డ్ సోషల్ మీడియా స్ట్రాటజీ, ఎనాలటిక్స్ నేర్చుకుంది.– 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంది.– ‘ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్’గా తన టాలెంట్ను చూపించింది.– సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ‘వావ్’ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 8000 మంది ఫాలోవర్లు ఉన్నారు.– స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది. -
మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్గా జరా శతావరి!
ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్ టెన్ ఫైనలిస్ట్గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్ , డిప్రెషణ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్ హ్యుమన్ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..ఎవరీ జరా శతావరి.?ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్ ఎల్ఎల్పీలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్గా చేరింది.అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్లో, కంటెంట్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్ అడ్వకేసీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్ సంరక్షణ కౌన్సిలింగ్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. తనని తాను డిజిటల్ మీడియా మావెన్గా అభివర్ణించే రాహుల్ చౌదరి మిస్ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. అంతేగాదు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే ఫ్యాన్వ్యూ వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డ్స్ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్ కావడం విశేషం అన్నారు బ . కాగా, ఈ మిస్ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్ ఏఐ క్రియేటర్ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్ షిప్ ప్రోగ్రామ్లు, పీఆర్ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: -
రెయిన్బో డైట్: రంగురంగుల ఆహారాలతో ఆరోగ్యం పదిలం..!
మనం తినే ఆహారంలో వివిధ రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అందుకే పోషకాహార నిపుణులు మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఉండాలంటున్నారు. ముఖ్యంగా రెయిన్బో(ఇంద్ర ధనుస్సు) డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏంటీది అనేకదా..!. ఏం లేదండీ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడమే గాక చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఈ డైట్ వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని అంటున్నారు. అలాంటి ఈ రెయిన్బో డైట్లో రంగుల వారీగా ఉండే కూరగాయాలు, పండ్లు వర్గీకరణ, వాటి ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది. అందులోని ప్రతి రంగుతో కూడిన కూరగాయాలు, పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దామా..!రెడ్ ఫుడ్స్: ఇవి లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రంగు కూరగాయలు, పండ్లు ప్రోస్టేట్, మూత్ర నాళం, డీఎన్ఏ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల ఎరుపు రంగులో ఉండే యాపిల్స్, చెర్రీస్, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, ఎర్ర ద్రాక్ష, బీట్రూట్లు, టమోటాలు మొదలైనవి తప్పక తినమని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్ ఫుడ్స్: క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు కంటి, ఊపిరితిత్తులు, కాలేయం, కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. త్వరగా గాయాలు నయం అవ్వడంలో, చిగుళ్ల ఆరోగ్యంలో సహయపడతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే అవోకాడో, ద్రాక్ష, కివి, బేరి, బ్రోకలీ, దోసకాయ, ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి తీసుకోవాలి.వైట్ ఫుడ్స్: దీనిలో అల్లిసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మద్దతునిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కేన్సర్తో పోరాడుతాయి. అందుకోసం అరటిపండ్లు, వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, అల్లం, ముల్లంగి మొదలైనవి తినండి.పసుపు ఆహారాలు: వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం నిమ్మకాయలు, పైనాపిల్, అత్తి పండ్లను, మొక్కజొన్న, పసుపు మిరియాలు, పసుపు టమోటాలు, మామిడి, బంగారు కివి మొదలైనవి. ఈ ఆహారాలు కళ్ళకు, రోగనిరోధక వ్యవస్థకు మంచివిపర్పుల్ ఫుడ్స్: వీటిలో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కడుపులోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుండెకు, మెదడుకు, ఎముకలకు, ధమనులకు, జ్ఞానానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు కేన్సర్తో పోరాడటమే గాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా తోడ్పడతాయి. అందుకోసం ప్లం, ప్రూనే, బ్లాక్బెర్రీ, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, వంకాయ, ఊదా క్యాబేజీ, బ్లూబెర్రీస్, పర్పుల్ ద్రాక్ష మొదలైనవి.ఆరెంజ్ ఫుడ్స్: వీటిలో ఉండే బీటా-కెరోటిన్తో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. నరాలు, కండరాల ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా అవసరం. దీని కోసం నారింజ, గుమ్మడికాయ, బొప్పాయి, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి తీసుకోవాలి.ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. పాటించేమందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం మంచిది. -
Diljit Dosanjh: కల్కి సింగర్ వాచ్ ధర తెలిస్తే కంగుతినడం ఖాయం..!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఇక దిల్జిత్ దోసాంజ్ పాటలే గాక మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. ప్రతి పాటకు అందుకు తగ్గ డిజైనర్ డ్రెస్లతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాడు. బహుశా ఈ ఆహార్యమే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందేమో.!. ఇక ఇటీవల జిమ్మీపాలన్ ది టునైట్ షోలో దిల్జిత్ దోసాంజ్ ధరించి వాచ్ అందర్నీ ఆకర్షించింది. ఆయన ఆ షోలో పంజాబీకి చెందిన గోట్ లిరిక్స్, బోర్న్ టు షైన్ వంటి మంచి హిట్ పాటలతో ప్రేక్షకులనూ ఉర్రూతలు ఊగించాడు. ఈ షోలో ఆయన పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణతో పాటలు పాడారు. అలాగే అందుకు తగ్గట్లు తన సంస్కృతిని తెలియజెప్పేలా గోట్ లిరిక్స్లో మంచి హిట్ పాటలతో అలరించారు. ఈ షోలో ఆయన పాడుతూ.. లయబద్ధంగా డ్యాన్స్లు చేశారు. ఆ షోలో అందరి దృష్టి ఆయన చేతికి ధగ ధగ మెరుస్తూ కనిపిస్తున్న వాచ్పైనే పడింది. విలాసవంతమైన వస్తువుల కలెక్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే దిల్జిత్ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ సెల్ఫ్వైండింగ్ బ్రాండ్ వాచ్ని ఈ షోకి ఎంపిక చేసుకున్నారు. ఈ వాచ్ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ లింక్లతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ బ్రాస్లెట్తో రూపొందించారు. అంతేగాదు ఈ వాచ్ ఇండెక్స్ అవర్ మార్క్లో సిల్వర్ డయల్ ఉంటుంది. దీన్ని జైన్ ఆభరణాల వ్యాపారులు రూపిందించారట. ఈ వాచ్ మెరిసిపోయేలా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఎంత దూరం నుంచి చూసినా వాచ్ చేయిపై మిరుమిట్లు గొలిపే కాంతితో కూడిన ఒక ఆభరణంలా కనిపిస్తుంది. ఇంత లగ్జరీయస్ వాచ్ ధర వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్ముతాయి. దిల్జిత్ ఈ లగ్జరీయస్ బ్రాండెడ్ వాచ్ని ఏకంగా రూ. 1.2 కోట్లుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by The Tonight Show (@fallontonight) (చదవండి: ప్లాస్టిక్ బాటిల్స్తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!) -
గిరిజన నేతకు ‘రిచా’ బ్రాండ్
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన రిచా మహేశ్వరి కెరీర్లో సంతృప్తిని కలిగించే మూలాలను వెతికింది అయితే వాటి ఆచూకి ఆ ఉద్యోగంలో లభించలేదు. ఫలితంగా లాంగ్ లీవ్ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నప్రాంచీన గిరిజన తెగల వద్దకు వెళ్లింది. ఒడిశాలో గిరిజన తెగల కళాత్మక నేత పనితో మమేకమైఆ అరుదైన కళను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా మారిన తన ప్రయాణం గురించి వివరించే విశేషాలు మనదైన ప్రపంచాన్ని వెతుక్కునేందుకు తప్పక ఉపయోగపడతాయి.‘‘నేను పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో. మా నాన్నగారిది ఒడిశా. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడం, తరచూ బదిలీలు ఉండటం వల్ల కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా తిరిగాను. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత శాప్ కెరీర్ను ఎంచుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం నాకు డబ్బు మాత్రమే ఇస్తుంది కానీ, ఉద్యోగం చేసిన సంతృప్తి నివ్వదనిపించింది. దాంతో 2021లో ఏడాది పాటు ఉద్యోగానికి లీవ్ పెట్టేసి దేశంలోని చాలా గ్రామాలు తిరిగాను. ఒడిశాలోని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు నాదైన ప్రపంచంలోకి వచ్చిన భావన నాలో కలిగింది. అక్కడి గిరిజన సంఘాలను కలిశాను. వారి కళాత్మక వస్త్ర శ్రేణులను చూశాను. నాకు అవి అత్యద్భుతంగా కనిపించాయి.నేత పని... కొండపత్తితో అక్కడి తెగల కళాత్మక నేత పనితనాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. ‘బోయిటో’ పేరుతో నాదైన డిజైనర్ స్టూడియో ఏర్పాటు చేశాను. అశోకుని కాలంలో ఈ కళింగ రాజ్యానికి గొప్ప చరిత్ర ఉంది. ఓడరేవు ద్వారా విదేశీ వాణిజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడి పత్తిని ఇండోనేషియా, చైనా వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడి పట్టును తెచ్చేవారు. బోట్ను బోయిటో అని కూడా పిలుస్తారు. ఆ పేరునే మా బ్రాండ్కు పెట్టాను. టెక్స్టైల్స్ ద్వారా ఒడిశాను అన్వేషిస్తూ పూరీ సమీపంలోని పిప్లిలో నా మొదటి సంస్థనుప్రారంభించాను. పిప్లి ఆప్లిక్ వర్క్కు ప్రసిద్ధి. నుపట్నాలోని ఖండువా, సంబల్పూర్, పశ్చిమ బెల్ట్లోని సోనేపూర్, బర్గర్, బార్పల్లి వంటి ఇతర నేత యూనిట్లు కలుసుకున్నాను. కోరాపూట్లో కోట్΄ాడ్ శాలువాలకు ప్రసిద్ధి. దీంతో కోట్పాట్ నేత సంఘాన్ని కలుసుకున్నాను. ఆ తర్వాత చుట్టుపక్కల పర్వతాలను డిజైన్ చేసినట్టుగా ఉండే కప్పగండ శాలువాలను తయారు చేసే డోంగ్రియా సంఘం వారితో చర్చించాను. మల్కన్గిరిలో నివసించే ్ర΄ాచీన తెగలలో ఒకటైన బోండాల గురించి తెలుసుకున్నాను. వారి అద్భుతమైన, అందమైన నెక్పీస్, తల΄ాగా డిజైన్లను చూశాను. వారంతా వారి సొంత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుకుంటున్నాను. శరీరాన్ని పూసలతో కప్పుతారు. దిగువ శరీరాన్ని కప్పి ఉంచే రింగా అనే చిన్న వస్త్రాన్ని ఉపయోగిస్తారు. సంప్రదాయకంగా కెరాంగా అనే చెట్టు ఫైబర్ను ఉపయోగించి ఆ వస్త్రాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు దానిస్థానంలో పత్తి నుంచి తీసిన నూలు దారాన్ని వాడుతున్నారు.డాక్యుమెంట్ వైపుగా.. ఇక్కడి తెగల వారితో మాట్లాడుతూ, వారితో కలిసి ఉంటున్నప్పుడు స్వచ్ఛమైన మనుషుల మధ్య నేను ఒదిగి΄ోతున్నాను అనిపించింది. వీరంతా చెప్పే కథలను డాక్యుమెంట్ చేస్తున్నాను. ఈ అద్భుతమైన పనితనం, ప్రత్యేకమైన కళారూ΄ాలు ప్రపంచానికి తెలియాలి అనే ఆలోచనతో డిజైనర్లతో కలిసి పనిచేయాలనుకున్నాను. అలా ప్రయాణాలు చేస్తూ, ఆలోచిస్తూ, పనులను ఆచరణలో పెట్టడానికి ఆరునెలల సమయం పట్టింది.సంఘాలతో కలిసి..గిరిజన తెగల నేత పనితనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ముందు అక్కడి సంఘాలను కలిసి మాట్లాడాను. ఇది ఒక రోజులో జరగలేదు. మొదట్లో చాలా కష్టమైంది. తూర్పు బెల్ట్లోని నేత కార్మికులను కలిసినప్పుడు నా కోసం ప్రత్యేక రంగులలో చీరలను తయారుచేయగలవా అని అడిగాను. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నాకూ పట్టుదల పెరిగింది. వారితో కలిసి కూర్చోవడం, మాట్లాడటం చేస్తూ వచ్చాను. నా మార్గంలోకి వారు రావాలంటే వారి సంస్కృతిని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి అని గుర్తించాను. ఒక ‘రింగా’ నేయడానికి బోండా కమ్యూనిటీకి చెందిన నలుగురు ఒడియా మహిళలు ఒప్పుకున్నారు.ప్రత్యేకంగా..కోరాపుట్లోని గడబా కమ్యూనిటీచే నేసిన కేరాంగ్ వస్త్రాల కోసం అన్వేషిస్తున్నాను. డిజైనర్లు, నేత కార్మికులు చర్చలు జరుపుతున్నారు. ఫాస్ట్ ఫ్యాషన్కు విరుద్ధంగా మేం అందించేవి తరతరాలుగా ధరించడానికి వీలైన క్లాసిక్ కళాఖండాలు. గిరిజన సంఘాలు మేం సూచించిన స్వల్ప రంగు మార్పులకు, సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయి. బోయిటో నుంచి ట్రెంచ్ కోట్లు, అన్ని రకాల జాకెట్లు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇదొక లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్గా పేరొందింది. మేం వీటిని అంతర్జాతీయంగా కూడా తీసుకెళుతున్నాం. మా కేటలాగ్లో ట్రెంచ్ కోట్లు, కిమోనో జాకెట్లు, ప్యాటు, బేసిక్ షర్టులు, డ్రెస్సులు ఉన్నాయి. పూసలతో కూడిన బోండా జాకెట్, డోంగ్రియా డిజైన్, కోట్΄ాడ్ మోటిఫ్లు.. మా డిజైన్స్లో తీసుకువస్తున్నాం. కొన్ని నెలలుగా బోయిటోతో కలిసి పని చేయడం వల్ల నా ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు నాలుగైదు వారాలకు ఒకసారి నా పని కోసం సంఘాలను చేరుకుంటాను. వారికి కావల్సిన మొత్తాన్ని చెల్లిస్తూ, నాకు కావల్సిన డిజైన్లను పోందుతాను. కమ్యూనిటీలకుప్రాతినిధ్యం వహించే హెరిటేజ్ షోలను కూడా చేయాలని చూస్తున్నాం. ప్రతి వస్త్ర డిజైన్ వెనుక అది నేసిన విధానం గురించి కథగా కూడా అందిస్తున్నాం’’ అంటూ చేస్తున్న పని, దాని వెనుక దాగున్న కృషిని వివరిస్తుంది ఈ నిరంతర అన్వేషి. -
సామాజిక కళకు సై అంటున్నారు...
‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.తన కళకు ఇన్స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్వర్క్స్ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.జస్ట్ లోకల్...చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. ‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.ఈజ్ దట్ యూ? ‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్తో వేసిన డ్రాయింగ్ సిరీస్కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత. -
లెమన్గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..కావాల్సినవి:నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు..దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్లు వంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందిబరువు తగ్గడంలో సహాయపడుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..తల తిరగడంఆకలి పెరగటంనోరు పొడిబారడంతరుచుగా మూత్రవిసర్జన అలసటదద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్గ్రాస్ టీని తాగకూడదు.(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్) -
హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా?
ఇటీవల మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వెరైటీ బ్యూటీ ప్రొడక్ట్లు వస్తున్నాయి. ఎలాంటి సమస్య అయినా చిటికెలో చెక్పెట్టేలా కళ్లు చెదిరిపోయే ధరల్లో మనముందుకు వస్తున్నాయి సౌందర్య ఉత్పత్తులు. ముఖ్యంగా యువత వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంది. వాటిల్లో ప్రముఖంగా ఉపయోగించేది హెయిర్ పెర్ఫ్యూమ్నే. ఇది మనం జస్ట్ అలా ఎంట్రీ ఇవ్వంగానే అందరి ముక్కులను ఘామాళించేలా మంచి సువాసన వచ్చేస్తుంది. అందరిలో ప్రత్యేకంగా సువాసనభరితంగా అనిపించేలా కనిపించడం కోసం కొందరూ ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్స్ని తెగ వాడేస్తుంటారు. అయితే ఇలా ఉపయోగించటం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..!పరిమిళాలు వెదజల్లే ఈ హెయిర్ పెర్ఫ్యూమ్లు మంచి తాజాదనాన్ని ఆహ్లాదమైన అనుభూతిని కలిగించినప్పటికీ అవి మీకు హానిని కలుగజేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే..స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడం లేదా పొడిబారినట్లుగా మారుతుంది. ఇవి జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా హెయిర్ పెర్ఫ్యూమ్లోని ఆల్కాహాల్లు జుట్టులోని సహజ నూనెలను తొలగించి.. పొడిగా, పెళుసుగా అయిపోతాయి. ఎక్కువగా జుట్టు చివర్లు చిట్లిపోవడం, నిస్తేజంగా అయిపోవడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు మెయింటెయిన్ చేయాలనుకుంటే వీటిని మితంగా లేదా దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్లు ఓ ట్రెండ్గా మారినప్పటికీ.. అవి ఆరోగ్యానికి హానికరమే గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అంతగా అలాంటి సువాసనభరితమైన ఫీల్ కావాలనుకుంటే సహజ పదార్థాలతో కూడా ఇలాంటి అనుభూతిని పొందొచ్చని చెబుతున్నారు. సంరక్షణ పద్ధతులు..తేలికపాటి మెత్తపాటి జుట్టు ఉన్నవాళ్లు పొగమంచులాంటి లైట్ ఫెర్ఫ్యూమ్లు ఒత్తు జుట్టు ఉన్నవారు మంచి గాఢతగలవి వినియోగించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ పెర్ఫ్యూమ్లను మితంగా వాడితే జుట్టు నష్టాన్ని నివారించి ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారని చెబుతున్నారు. తేలికపాటి స్ప్రేలు సరిపోతాయని, వాటిని నేరుగా తలపై కాకుండా చివర్ల లేదా జుట్టు మధ్యలో స్ప్రే చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. సహజ ప్రత్యామ్నాయాలు..హెయిర్ ఫెర్ఫ్యూమ్కు సహజమైన ప్రత్యామ్నాయాలు ఏంటంటే..లావెండర్, రోజ్మేరీ లేదా చమోమిలే వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ని నీటిలో కలిపి హెయిర్పై స్ప్రేగా ఉపయోగించొచ్చు. ఇవి శిరోజాలకు సహజమైన నూనెలను అందించడమే కాకుండా ఆహ్లాదభరితమైన సువాసనను కూడా ఇస్తాయి. ముఖ్యంగా రోజ్ వాటర్ చక్కటి రిఫ్రెష్ని కలిగించే సువాసనను అందిస్తుంది. అలాగే నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ తొక్కలతో తయారు చేసిన నీటిని కూడా ఉపయోగించొచ్చు. ఇవి జుట్టు స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎలాంటి ఫెర్ఫ్యూమ్ అయినా ఎక్కువ మోతాదులో స్ప్రే చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.(చదవండి: వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా లుక్ అదుర్స్..!) -
International Picnic Day : ఛలో పిక్నిక్...అటు విందు, ఇటు దిల్ పసందు
నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్లోని లిస్బన్లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్గా రికార్డుల కెక్కింది. రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం. పిక్నిక్లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్మెంట్ పార్క్లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్.. -
వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా..!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఓ రేంజ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇంటిలో జరిగే ఆఖరి వివాహం కావడంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల లగ్జరీ క్రూయిజ్లో ఏకంగా 800ల మంది అతిథుల సమక్షంలో అనంత్-రాధికల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన అంబానీ కుటుంబ సభ్యుల వేషాధారణకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ వేడుకల్లో వధువు ధరించిన ప్రతి డ్రెస్ హైలెట్గా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రాధిక ధరించిన అనంత్ లవ్ లెటర్ని ముద్రించిన గౌను అత్యంత హాట్టాపిక్గా మారింది. ఇక ఈ వేడుకలో ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం ప్రిన్స్ రేంజ్లో తన వేషాధారణతో ఆకట్టుకుంది. ఈ వేడుకలో రాధికాకు ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఆహార్యం ఉంది. ముఖ్యంగా ఆమె ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధరించిన డ్రెస్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆమె నీలం- బంగారు డ్రెస్లో యువరాణిలో మెరిసింది శ్లోకా మెహతా. ఆమె ఈ వేడుకలో కోసం ధరించిన వెర్సాస్ బ్రాండ్ గౌనుని ఎంచుకుంది. ఈ గౌను 2018 మెట్ గాలో జిగి హడిద్ ఫ్యాషన్ శైలిని అనుకరించింది. ఈ గైనును రూపొందించింది స్టైలిస్ట్ దియా మెహతా జటియా. ఆమె ఈ వెర్సాస్ గౌను శ్లోకా మెహతా కోసం ఎందుకు రూపొందించారో వెల్లడించింది. శ్లోకా మెహతా ఇద్దరు పిల్లల తల్లి. మాతృత్వం రీత్యా శరీరాకృతి మారడం సహజం. అది బయటకు కనిపించకుండా ఉండేలా ఆమెలో ఉన్న యువరాణి లుక్ని వెలికి తీసేలా ప్రజెంట్ చేసేందుకు ఈ వెర్సాస్ గౌనుని రూపొందించామని చెప్పారు. మెట్ గాలాలో ఆకర్షణగా కనిపించిన జిగి హడిడ్ రూపాన్ని మెహాతాలో కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసేందుకు ఇలా నీలం బంగారు గౌనుని డిజైన్ చేశామని అన్నారు. శ్లోకా ఈ గౌనుకి తగ్గట్టుగా రోజీ మేకప్, డైమండ్ జ్యువెలరీని ధరించింది. ఈ గౌనులో శ్లోకా యువరాణి రేంజ్ స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఒత్తిడికి గరైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా? పరిశోధన ఏం చెబుతోందంటే..)