-
సినిమా అంటే నేనొక్కడినే కాదు: ఫర్హాన్ అక్తర్
హిందీలో ‘దిల్ చాహ్తా హై’ (2001), ‘లక్ష్య’ (2004), ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్ (2011)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే దాదాపు మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ లీడ్ రోల్స్లో ‘జీ లే జరా’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు ఫర్హాన్.కానీ ఈ సినిమా సెట్స్పైకి వెళ్లకుండానే రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చింది. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. తాజాగా ఈ విషయాలపై స్పందించారు ఫర్హాన్. ‘‘నేను దర్శకుడిగా సెట్స్లోకి వెళ్లక పదేళ్లకు పైనే అయింది. నటుడిగా బిజీగా ఉండటం వల్లే డైరెక్షన్కి టైమ్ కుదరలేదు. ‘డాన్ 3’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభమవుతుంది.అలాగే ‘జీ లే జరా’ కూడా నా దర్శకత్వంలోనే ఉంటుంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా టైమ్ గడిచింది. సినిమా అంటే నేనొక్కడినే కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కాల్షీట్స్ అన్నీ కరెక్ట్గా కుదరాలి. నా దర్శకత్వంలో రాబోయే నెక్ట్స్ రెండు సినిమాలు ‘డాన్ 3, జీ లే జరా’నే’’ అన్నారు ఫర్హాన్ అక్తర్. -
వంట మనిషి కోసం లక్షలు డిమాండ్: డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటీనటులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. కొందరు నటీనటులు సమంజసం కాని డిమాండ్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. షూటింగ్ సమయంలో కొంతమంది నటులు వ్యక్తిగత చెఫ్లను నియమించుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. అంతే కాదు.. వారి చెఫ్కు ఒక్క రోజుకు ఏకంగా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారి డిమాండ్స్ చాలా హాస్యాస్పదంగా ఉంటాయని కశ్యప్ వెల్లడించారు. అయితే ఎవరనేది మాత్రం పేర్లు వెల్లడించలేదు.కొందరు నటులు తమకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే వారు చెఫ్ వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారని కశ్యప్ అన్నారు. అంతే కాకుండాహెయిర్, మేకప్ ఆర్టిస్టులు రోజుకు రూ.75,000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది సాంకేతిక నిపుణుల కంటే ఎక్కువని కశ్యప్ పేర్కొన్నాడు. తాను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఇప్పటికే ధనవంతుడు అయ్యి ఉండేవాడినని తెలిపారు.ఇదంతా నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు వల్లే జరుగుతోందని.. నిర్మాతలు ఇలాంటి వారిని సెట్స్పై ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. కానీ నా సెట్స్లో ఇలాంటివి జరగవని చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ సెట్కు మైళ్ల దూరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బర్గర్ తీసుకురావాలని తమ డ్రైవర్ను ఓ నటుడు కోరినట్లు కశ్యప్ తెలిపారు. ఇలాంటి ఖర్చులు సినిమా మొత్తం నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.కాగా.. కశ్యప్ ఇటీవలే బాడ్ కాప్ సిరీస్లో నటించాడు. ఇందులో గుల్షన్ దేవయ్యకు విలన్గా నటించారు. -
స్టార్ హీరో ఒంటరిగా రమ్మని పిలిచాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనగానే కలల ప్రపంచమని మనందరికీ తెలుసు. అంతే కాదు ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవొచ్చు. మరి ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలంటే కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వారే. తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇషా కొప్పికర్.. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్కు చెందిన బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి ఆకట్టుకుంది. చివరిసారిగా శివ కార్తికేయన్ నటించిన అయలాన్ చిత్రంలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించింది.ఇషా మాట్లాడుతూ.. "ఒక నటుడు డ్రైవర్ లేకుండా అతన్ని ఒంటరిగా కలవమని అడిగాడు. ఇప్పటికే నాపై చాలా రూమర్స్ ఉన్నాయి. అందుకే ఎవరికైనా తెలిస్తే మరిన్ని రూమర్స్ సృష్టిస్తారని నన్ను రిక్వెస్ట్ చేశాడు. దీంతో నేను వెంటనే అతని విజ్ఞప్తిని తిరస్కరించా. అతనెవరో కాదు.. ఆ టైంలో అతను బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్నారు.' అని తెలిపింది .అంతే కాదు గతంలో తనను చాలామంది అసభ్యంగా తాకేవారని ఇషా కొప్పికర్ వెల్లడించింది. పని కావాలంటే హీరోలతో స్నేహంగా మెలగాలని కొందరు సలహాలు కూడా ఇచ్చారని తెలిపింది. తాను 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని నటి తెలిపింది. కాగా.. ఇషా 1998లో ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో టిమ్మీ నారంగ్ను పెళ్లాడిన ఆమె.. 14 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. -
ఆమె కంటే నేనేం తక్కువ? నిలదీసిన హీరోయిన్
ఫలానా హీరోతో పని చేయాలని దర్శకనిర్మాతలు కలలు కన్నట్లే ఫలానా ఫిలిం మేకర్స్తో పని చేస్తే బాగుండని హీరో హీరోయిన్లు కూడా అనుకుంటారు. అదే విధంగా దర్శకనిర్మాత మీరా నాయర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తహతహలాడింది సీనియర్ కథానాయిక షబానా అజ్మీ. కానీ ఆమె కోరిక నెరవేరనేలేదు.రేఖ, షబానా అజ్మీమీరా డైరెక్ట్ చేసిన 'ద రెలక్టెంట్ ఫండమెంటలిస్ట్'(2012) అనే సినిమాలో కేవలం చిన్న పాత్ర వరించింది. ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తుందనుకుంటే ఏదో చిన్న పాత్ర ఆఫర్ చేసిందని బాధపడింది. దర్శకురాలికి తన మీద నమ్మకమే లేదని విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాలను మీరా నాయర్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దర్శకనిర్మాత మీరా నాయర్ఆమె మాట్లాడుతూ.. 'ముంబై జుహులోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో వాష్రూమ్కు వెళ్తుంటే షబానా నా వెంటే వచ్చింది. నా కంటే రేఖ గొప్పగా చేసిందేముంది? అంటూ రెస్ట్ రూమ్లోనే గొడవపెట్టుకుంది. ఎందుకు నాకు పెద్ద రోల్ ఇవ్వవని నిలదీసింది. నిజంగానే ద రెలక్టెంట్.. సినిమాలో షబానాకు ఇచ్చిన పాత్ర చాలా చిన్నది.. మరో ప్రాజెక్ట్కు తప్పకుండా కలిసి పని చేద్దామని నచ్చజెప్తేగానీ ఊరుకోలేదు' అని మీరా నాయర్ పేర్కొంది. కాగా మీరా.. రేఖతో కలిసి కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్ (1996) అనే సినిమా చేసింది. 2012 తర్వాత ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన ఆమె అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో షబానాతో సినిమా చేస్తానన్న హామీ కూడా అటకెక్కింది.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
హీరో వంటమనిషికి రూ.2 లక్షలా.. తన వంట చూస్తే..!
హీరోలు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమా హిట్టయిందంటే రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉండే పారితోషికం ఇప్పుడు కోట్లల్లోనే ఉంది. స్టార్ హీరోలైతే వంద కోట్లపైనే అందుకుంటున్నారు. ఇదంతా పక్కనపెడితే ఓ హీరోకు వంట చేసే మనిషి రూ.2 లక్షలు డిమాండ్ చేయడమే విడ్డూరంగా ఉందంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.రోజుకు రూ.2 లక్షలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఓ హీరో చెఫ్ రోజుకు రూ.2 లక్షలు ఇవ్వమని అడిగేవాడు. అతడు చేసే వంట ఓ పక్షి తినేంత ఉంటుందంతే! ఇదేంటి..? మరీ ఏదో పక్షికి వేసినట్లు ఇంత తక్కువ పెడితే ఏం సరిపోతుందన్నాను. అయితే ఆ హీరోకు ఏదో అనారోగ్య సమస్య ఉందట.. అందుకోసమని తక్కువ పరిమాణంలోనే తినాలని చెప్పాడు. ఈ మాత్రం దానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? అనిపించింది. టెక్నీషియన్ల కన్నా ఎక్కువహెయిర్, మేకప్ ఆర్టిస్టులు కూడా రోజుకు రూ.75,000 డిమాండ్ చేస్తున్నారు. సినిమా కోసం పని చేసే టెక్నీషియన్లు కూడా అంత సంపాదించలేరు. ఇలాంటి పనికిమాలిన డిమాండ్లు ఎక్కువ అవడానికి కారణం నిర్మాతలే! వాళ్లు అడిగినదానికల్లా తలూపడం ముమ్మాటికీ తప్పే! నా సినిమాలో అయితే ఈ రకమైన డిమాండ్స్ అస్సలు ఒప్పుకోను' అని చెప్పుకొచ్చాడు.సినిమా..కాగా అనురాగ్ కశ్యప్.. దేవ్.డి, గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2, బాంబే టాకీస్, రామన్ రాఘవ్ 2, దొబారా, కెన్నడీ వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. పలు చిత్రాలకు రచయితగా, నిర్మాతగా పని చేశాడు. ఘూంకెటు, హడ్డీ, మహారాజ వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. బ్యాడ్ కాప్ అనే వెబ్ సిరీస్లో విలన్గా కనిపించనున్నాడు. -
ఆఫీస్లో చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటుడు
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్లో దొంగలు పడ్డారు. ఓ సినిమా నకలుతోపాటు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. రూ.4 లక్షల నగదు సైతం దొంగిలించారు. ఈ ఘటనపై అనుపమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ ఓ వీడియో షేర్ చేశాడు. 'నిన్న రాత్రి ముంబైలోని వీర దేశాయ్ రోడ్లో ఉన్న నా ఆఫీసులో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించి విలువైన పత్రాలను దొంగతనం చేశారు. సీసీటీవీలో..వాటిని నాశనం చేయరని ఆశిస్తున్నాను. అలాగే మా కంపెనీ నిర్మించిన ఓ సినిమా నెగెటివ్స్ కూడా మాయం చేశారు. ఆ ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది' అని చెప్పుకొచ్చాడు.సినిమా..కాగా ది కశ్మీర్ ఫైల్స్తో సెన్సేషన్గా మారిన అనుపమ్ ఖేర్.. ఇటీవల ఐబీ71, ద వ్యాక్సిన్ వార్, కుచ్ ఖట్టా హో జాయే, కాగజ్ 2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మెట్రో.. ఇన్ డినో, తన్వి ద గ్రేట్ అనే మూవీస్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే? -
గాయాలు తప్పవు
‘‘వృత్తిపరమైన గాయాలను తప్పించుకోలేం. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు గాయాలు తప్పవు’’ అంటున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’లో నటిస్తున్నారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ మూవీ షూటింగ్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆరంభమైంది.ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా పాల్గొనగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆమె పెదవి, ముక్కు, మెడకు గాయాలు అయ్యాయి. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, ప్రోఫెషనల్ లైఫ్లో జరిగే ప్రమాదాలు’ అంటూ వీడియో పోస్ట్ చేశారు ప్రియాంక. ఇక గాయాలు కాగానే షూటింగ్ ఆపేసి, ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లిందట యూనిట్. అక్కడ చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకుంటున్నారట ప్రియాంకా చోప్రా. -
నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు అనవసరం: హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్స్టాలోను సోనాక్షి సన్హాను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్ను ప్రారంభించింది. ఈ హోటల్ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్కు చివరి రోజుగా ఇన్స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
స్ట్రీమింగ్కు వచ్చేస్తోన్న ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
ఓటీటీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న వెబ్సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను అలరించాయి. తాజాగా మూడో సీజన్ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మూడో సీజన్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే గత సీజన్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. కొత్త సీజన్లో మరికొన్ని పాత్రలు పరిచయం చేయనున్నారు. -
హబ్బీతో బేబీమూన్కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్కోసం లండన్కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ లవ్బర్డ్స్ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)కాగా తన అప్కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్గా మారాయి. ప్రభాస్ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో ప్రభాస్తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. -
బేబీ బంప్తో దీపికా పదుకొణె.. ఆ బ్రేస్లెట్ ధరెంతో తెలుసా?
కల్కి సినిమాకు కౌంట్డౌన్ మొదలైంది. కేవలం వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ముంబైలో బుధవారం గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా దీపికా పదుకొణె కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. బేబీ బంప్తో కనిపించిన దీపికను చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తను స్టేజీపైకి వస్తుంటే బిగ్బీ చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ప్రభాస్ ఆమెను కూర్చోమని చెప్పి కుర్చీ వేయించాడు. ఈ ఈవెంట్లో దాదాపు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లోనే మెరిశారు. దీపికా సైతం టైట్ బ్లాక్ డ్రెస్లో కనిపించింది. సింపుల్గా ఉండేందుకే మొగ్గు చూపిన ఈ బ్యూటీ తన ఎడమ చేతికి వజ్రాల బ్రేస్లెట్ ధరించింది. దీని ధర 1 కోటి 16 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ ఆభరణం తన లుక్కే మరింత అందాన్ని తీసుకొచ్చింది.ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, బిగ్బీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కోటగిర వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా -
సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..!
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా లైఫ్.. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. అనురాధ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు కలిసి కాపురం చేసిన వీరు అంతలోనే విడిపోయారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ దూరాన్ని ఎంతోకాలం భరించలేకపోయారు. ఆరేళ్ల తర్వాత ఒకరి కోసం మరొకరు తీవ్రంగా తపించారు. తిరిగి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ మళ్లీ పెళ్లి ఒక సెన్సేషన్..ఇద్దరి తప్పుతాజాగా అనురాధ.. భర్త సంజయ్తో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'మేము విడిపోవడానికి సంజయ్ ఒక్కడే కారణం కాదు. నా వాటా కూడా ఉంది. ఒకానొక సమయంలో ఇక చాలు, నా వల్ల కాదు అనిపించింది. అందుకే విడాకులు తీసుకున్నాం. అయితే అప్పట్లో నా భర్తకు ఎఫైర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. కానీ నేను అవేమీ నమ్మలేదు. అందరికంటే ఎక్కువగా నా భర్తనే నమ్మాను. విడిపోయినప్పుడు కూడా అతడు నాతో, నా కుటుంబంతో టచ్లోనే ఉన్నాడు.విడిపోయాక కూడా..సంజయ్ అంటే నా కుటుంబానికి ఎంతో ఇష్టం. విడాకుల తర్వాత తన బంగ్లాలో ఎప్పుడూ ఏదో ఒక పార్టీ నిర్వహించేవాడు. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా కొన్నిసార్లు నేను కూడా తన పార్టీలకు హాజరయ్యేదాన్ని. ఫ్రెండ్స్తో కాసేపు చిల్ అయి వెళ్లిపోయేదాన్ని. ప్రతి ఆరు నెలలకోసారి మళ్లీ కలిసిపోదామా అని అడిగేవాడు. అలా చివరకు మళ్లీ పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. కాగా అనురాధ ఇటీవలే మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటం అందుకుంది.చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా -
ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?
సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా సరే ఒక్క ఫ్లాట్ లేదా బంగ్లా కొంటే దాని రేటు ఎంత? అనే విషయాలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితా ఒక్కసారే అన్ని కొనేయాల్సిన అవసరమేంటి? ఇంతకీ వీటి రేట్ ఎంత అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు హిట్స్ కొట్టాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు. కానీ మరీ సూపర్ స్టార్ రేంజుకి వెళ్లలేకపోయాడు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్లోనూ ఇతడికి ఓ జట్టు ఉంది.ఇక తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా.. మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు) -
లెజెండ్స్తో కలిసి పనిచేయడం అన్నింటి కంటే గొప్పది: ప్రభాస్
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, భైరవ ఆంథమ్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ముంబయిలో గ్రాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో అమితాబ్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, దీపికా, ప్రభాస్, రానా సైతం పాల్గొన్నారు. ఈవెంట్లో రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కల్కి మూవీకి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. 'గ్రేటెస్ట్ లెజెండ్స్తో వర్క్ చేసే అవకాశం రావడం ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగా. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ' అని అన్నారు.కల్కి 2898 ఏడీ చిత్రంలో భాగం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అమితాబ్ అన్నారు. నాగ్ అశ్విన్ తన విజన్తో మహా అద్భుతంగా తీశారని కొనియాడారు. కల్కి ఎక్స్ పీరియన్స్ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని.. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నాగ్ అశ్విన్ మా గురువు బాలచందర్లా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు ఉంది. ఇందులో బ్యాడ్ మ్యాన్గా నటించా. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు' అని అన్నారు. The biggest stars have come together. ✨#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/nK6hN7nmdU— Kalki 2898 AD (@Kalki2898AD) June 19, 2024 -
తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిందా?
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్తో డేటింగ్పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది. కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. -
మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్.. రూ.4 కోట్లు కాదు రూ.14 కోట్లు!
ఫ్రెండ్ అని నమ్మితే నిలువునా మోసం చేశాడంటోంది హీరోయిన్ రిమి సేన్. మాయమాటలు చెప్పి ఫ్రెండ్గా దగ్గరై.. డబ్బులిచ్చాక కనబడకుండా పారిపోయాడని వాపోయింది. రూ.4.14 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ తన ఫ్రెండ్ రోనక్ వ్యాస్పై రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది రిమి సేన్. తాజాగా ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది.ఇంటికి వచ్చి..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం జిమ్లో రోనక్ను కలిశాను. మంచి ఫ్రెండయ్యాడు. తనతో స్నేహం చేశాను. కానీ నన్ను మోసం చేశాడు. అహ్మదాబాద్లోనూ ఇలాగే చాలామందిని మోసం చేశాడని విన్నాను. తను నా ఇంటికి కూడా వచ్చాడు. మా అమ్మతో కలిసి తిన్నాడు. అంత క్లోజ్గా ఉన్న వ్యక్తి తర్వాత సడన్గా ప్లేటు తిప్పేశాడు. అధిక వడ్డీ అని చెప్పి నా దగ్గరి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. దానిపై తొమ్మిది శాతం వడ్డీ ఇచ్చేవాడు. ఒక్క నెల మాత్రమే..ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తే దానిపై 12- 15 శాతం వడ్డీ తీసుకొస్తానన్నాడు. అలా రూ.4.14 కోట్లు ఇచ్చాను. మొదటి నెల ఐదారు లక్షలు చేతికిచ్చాడు. తర్వాత వాళ్ల నాన్నకు కరోనా వచ్చిందని, డబ్బులు ఇవ్వలేనని చెప్పేసరికి నమ్మేశాను. నెలల తరబడి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడంతో ఇదంతా స్కామ్ అని అర్థమైంది. ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడా కేసు సీఐడీకి బదిలీ అయినట్లు ఫోన్ వచ్చింది. వడ్డీతో సహా..కేసు త్వరితగతిన విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ వేశాను. బహుశా రెండురోజుల్లో అరెస్ట్ వారంట్ జారీ చేస్తారు. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. వడ్డీతో సహా నాకు రూ.14 కోట్లు రావాల్సి ఉంది. పోలీసులకు లొంగిపోయుంటే నేను ఇచ్చిన అసలు మాత్రమే తీసుకుని వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు.. కాబట్టి నేను ఎంతదూరమైనా వెళ్తాను అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. కాగా రిమి సేన్.. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్? బిగ్బీని తక్కువ చేసి..
ఫలానా హీరోకు టెక్కు ఎక్కువ.. ఆ దర్శకుడికి ముక్కు మీద కోపం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్కైతే పొగరు.. ఇలా ఇండస్ట్రీలోని తారల గురించి నెగెటివ్గా చాలామంది మాట్లాడుకుంటారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధమనేది ఎవరికీ తెలియదు. అలా షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్ అని తానూ విన్నానంటున్నాడు బాలీవుడ్ నటుడు దేవన్ భోజని.యాటిట్యూడ్..తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జో జీతా వోహి సికిందర్ సినిమా తర్వాత ఓ మూవీలో షారూఖ్ ఫ్రెండ్గా నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటికే తనకు యాటిట్యూడ్ ఉందని విన్నాను. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ గురించి కూడా చెడుగా మాట్లాడతాడని ఎక్కడో చూశాను. ఫస్ట్ డే సెట్కు వెళ్లగానే నన్ను నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అయితే షారూఖ్ దగ్గరకు వెళ్లాలనేసరికి మాత్రం అవసరమా? అనిపించింది. నేనెవరనేది తెలుసునా పేరు దేవన్ అని పరిచయం చేసినప్పుడు అయితే ఏంటి? అని వెటకారంగా మాట్లాడతాడేమోనని ఏదేదో ఊహించుకున్నాను. ఇంతలో వెనక్కు తిరిగేసరికి తనే నిలబడ్డాడు. హాయ్, నేను షారూఖ్.. జో జీతా వోహి సికిందర్ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని మెచ్చుకున్నాడు. నేనెవరనేది తనకు తెలుసా? అని ఆశ్చర్యపోయాను.ప్రశంసలునా సినిమా చాలా నచ్చిందన్నాడు. తన గురించి విన్నదంతా పచ్చి అబద్ధమేనని అప్పుడర్థమైంది. తను చాలా బాగా కలిసిపోతాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా దేవన్, షారూఖ్ 1994లో యే లంహే జుడాయికె సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా 2004లో విడుదలైంది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
‘కలిసి ఉండలేరు..తోడులేక బతకలేరు’ : సింగర్ అల్కా ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ
ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ బాలీవుడ్లో 90లలో ఒక సెన్సేషన్. అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రసిద్ధ గాయకులలో ఒకరిగా మెలోడీ క్వీన్గా సత్తా చాటుకున్నారు. మెలోడీ, పాప్ ఇలా వివిధ రకాల పాటల్లో రాణించి అభిమానుల మనసు దోచుకున్న సీనియర్-మోస్ట్ గాయని. అల్కా యాగ్నిక్ 14 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. 90ల నాటి ఆ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలను రికార్డ్ పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. చోళీ కే పీచే, ఏక్ దో తీన్, మేరీ మెహబూబా, తాల్ సే తాల్, దిల్ నే యే కహా హై దిల్ సే, ఓ రే చోరీ, హమ్ తుమ్, ఘూంగట్ కి ఆద్ సే, కుచ్ కుచ్ లాంటి సూపర్ డూపర్ సాంగ్స ఆమె ఖాతలో ఉన్నాయి. హోతా హై, కహో నా... ప్యార్ హై, సాన్ సాన్ సనా, కభీ అల్విదా నా కెహనా, అగర్ తుమ్ సాథ్ హో ఇలా చెప్పుకుంటూ పోతే...ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇంకా టెలివిజన్ రియాలిటీ షోలు, స రే గ మ పా లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్, సూపర్ స్టార్ సింగర్, అనేక ఇతర వాటితో పాటు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. బాల్యం, ప్రేమ పెళ్లి1966 మార్చి 20, న కోల్కతాలో గుజరాతీ కుటుంబంలో ధర్మేంద్ర శంకర్ శుభ దంపతులకు జన్మించింది అల్కా యాగ్నిక్. తల్లి, భారతీయ శాస్త్రీయ గాయకురాలు శుభా నుంచే అల్కాకు సంగీతం అబ్బింది. ఆల్కాఆరేళ్ల వయసునుంచే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో భక్తి పాటలు, భజనలు పాడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో, అల్కా యాగ్నిక్ ‘పాయల్ కి ఝంకార్’ చిత్రంలో తిర్కత్ అంగ్ పాటతో ప్రొఫెషనల్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించింది.రైలు ప్రయాణంలో షిల్లాంగ్కు చెందిన నీరజ్ కపూర్ని 1986లో తొలిసారి కలిసింది. ఢిల్లీలోని అల్కాను, ఆమెతల్లిని స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. (నీరజ్ అల్కా తల్లి స్నేహితురాలి మేనల్లుడు) తొలిచూపులోనే ఇద్దరిలోనూ ప్రేమ పుట్టేసింది. ఆరేళ్లకు మాట కలిసింది. మొదట వీరి పెళ్లికి అల్కా ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ, రెండేళ్ల డేటింగ్ చేసిన తర్వాత 1989లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె సాయేషా కపూర్. ఈమె అమిత్ దేశాయ్ని వివాహం చేసుకుంది.అటు బాధ్యతల రీత్యా ఈ జంట ఒకరికొరు దూరంగా ఉండాల్సింది వచ్చింది.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. నీరజ్ నిర్ణీత వ్యవధిలో ముంబైకి వెళ్లేవాడు, అల్కా కుటుంబంతో ప్రతీ ఏడాది షిల్లాంగ్లో ఒక నెల గడిపేది. అయితే, దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అల్కా యాగ్నిక్ కెరీర్ కారణంగా, ఆమె ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చేది. నీరజ్ షిల్లాంగ్లో వ్యాపారంలో రాణిస్తాడని అల్కా ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తూ అతను వ్యాపారంలో మోసపోయాడు. నష్టాలెదుర్కొన్నాడు. మరోవైపు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కూతురి బాధ్యతలనుఒంటరిగానే స్వీకరించింది. దాదాపు అయిదారేళ్లు అస్సలు మాటలు కూడా లేవు. వీరు విడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా వీరి ప్రేమ ప్రయాణం అసామాన్యంగా కొనసాగుతోంది.ఇద్దరి మధ్య దూరం ఎంతున్నా, ఒకరికొకరు లేకుండా జీవించలేరని ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ద్వారా గ్రహించారు. ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని అర్థమైంది. తమది అంత ఈజీగా ఓడిపోయే ప్రేమ కాదని నిర్ధారించేసుకున్నారు. అల్కా ముంబైలో, నీరజ్ షిల్లాంగ్లో నివసిస్తూనే ఒకరి కలల్ని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు, కన్నీళ్లలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ గత 28 ఏళ్లుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ దంపతులే స్వయంగా చెప్పినట్టు, వీళ్లది విచిత్రమైన దాంపత్యం ‘కలిసి ఉండలేరు.. ఒకరికొకరు తోడు లేకుండా బతకలేరు’ -
హీరోయిన్ మొదటి వివాహ వార్షికోత్సవం.. దాదాపు ఐదు నెలల తర్వాత!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది జనవరి 23న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. వీరిద్దరికీ పెళ్లి జరిగి ఇప్పటికే ఏడాదిన్నర కావొస్తోంది. అయితే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు.అయితే దాదాపు ఐదు నెలల తర్వాత అతియా, రాహుల్ మొదటి వివాహా వార్షికోత్సవ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. వేడుక జరిగిన హోటల్ నిర్వాహకులు వీరిద్దరి ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ అద్భతమైన క్షణాలను ఇకపై సీక్రెట్గా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అతియా, కేఎల్ రాహుల్ క్యాండిల్లైట్ డిన్నర్, చెఫ్ టీమ్తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by The Private Chefs Club (@theprivatechefsclub) -
ఈ నెలాఖరు నుంచి బిగ్బాస్ ప్రారంభం.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే!
బిగ్బాస్ రియాలిటీ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. వీరికోసం ఏ యేటికాయేడు కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు హిందీలో బిగ్బాస్ షో.. 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. షో మొదలవగానే సంతోషపడే బిగ్బాస్ ప్రియులు ఫినాలే వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అని ఫీలవుతున్నారు. ఇలాంటివారికోసం నిర్వాహకులు ఓటీటీ సీజన్ను ప్రవేశపెట్టారు. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే ఈ షో చూడవచ్చన్నమాట! ఫస్ట్ కంటెస్టెంట్ఈ బిగ్బాస్ ఓటీటీ కూడా ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి సల్మాన్ ఖాన్కు బదులుగా స్టార్ నటుడు అనిల్ కపూర్ను హోస్ట్గా తీసుకున్నారు. తాజాగా బిగ్బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఓ చిన్న స్నాక్స్ బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. వారికి ఓ అమ్మాయి కావల్సివని సిద్ధం చేసి ఇస్తోంది. మరికొద్ది రోజుల్లో బిగ్బాస్ ఓటీటీ 3ఈ పిక్స్ చూసిన నెటిజన్లు తను ఫేమస్ వడాపావ్ గర్ల్ చంద్రిక అని కామెంట్లు చేస్తున్నారు. చంద్రిక.. ఢిల్లీలోని వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది. బిగ్బాస్ షో కోసం ఈ మధ్యే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. మరి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి షోలో క్లిక్ అవుతుందో, లేదో చూడాలి. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఈ వెబ్తెర బిగ్బాస్ను చూసేయండి.. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్ -
ప్రముఖ లేడీ సింగర్కి అరుదైన వ్యాధి.. ఫలితంగా చెవుడు!
ప్రముఖ లేడీ సింగర్ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని వల్ల ఆమెకు చెవుడు వచ్చింది. అసలేం జరిగిందో.. ఈ వ్యాధి వచ్చిన విషయాన్ని ఎలా కనుగొందో వివరంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ పెట్టి వివరించింది. 1990ల టైంలో బాలీవుడ్లో టాప్ సింగర్స్లో ఒకరైన అల్కా యాగ్నిక్.. ఇప్పుడు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్తో బాధపడుతోంది. అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే దీని బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!)'నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కటే చెబుతున్నా. పెద్ద సౌండ్తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను' అని అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చింది.90ల్లో హిందీలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అల్కా యాగ్నిక్.. పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించింది. ఇప్పటివరకు 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు ఈమె పాడటం విశేషం. అలానే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్ని ఆల్కా పాటలు సాధించడం విశేషం.(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?) View this post on Instagram A post shared by Alka Yagnik (@therealalkayagnik) -
సూర్య హిట్ సినిమా అక్షయ్ కుమార్ రీమేక్.. ట్రైలర్ విడుదల
సౌత్ ఇండియా స్టార్ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు 'సర్ఫిరా' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.సూర్య నిర్మాతగా 2020లో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా సర్ఫిరా చిత్రానికి కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా ఉంటే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్ చూస్తూంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తోంది. జులై 12 ఈ చిత్రం విడుదల కానుంది. -
స్టార్ హీరోయిన్ పెళ్లి హడావుడి.. బ్యాచిలర్ పార్టీ ఫొటోలు వైరల్
స్టార్ హీరో సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ అయిపోయింది. జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ని పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఈ వివాహం జరగనుందని, తల్లిదండ్రులకు సోనాక్షి నిన్న మొన్నటి వరకు చెప్పలేదట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి హడావుడి ఓ పక్క జరుగుతుండగా, మరోవైపు బ్యాచిలర్ పార్టీలు గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి:ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురే సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోనూ రజనీకాంత్ 'లింగా' మూవీలో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు పెద్దగా కలిసి రావట్లేదు. ఈ క్రమంలోనే జహీర్ ఇక్బాల్ అనే నటుడితో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇది జరిగిన కొన్నిరోజులకే పెళ్లి గురించి న్యూస్ బయటకొచ్చింది.పెళ్లి కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి పెళ్లి నిజమేనని క్లారిటీ వచ్చేసింది. జూన్ 23న వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది. ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. శుభకార్యానికి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీల్లో కాబోయే వధూవరులు బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) -
ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?
స్టార్ హీరోయిన్, ఈ మధ్య ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. కజిన్ వరుణ్ రనౌత్ పెళ్లి రీసెంట్గా అతడికి చంఢీగడ్లో ఖరీదైన లగ్జరీ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా స్టోరీలో మొత్తం అవే ఫొటోలని పోస్ట్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు)హిమాచల్ ప్రదేశ్కి చెందిన కంగనా రనౌత్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో ఇబ్బందులు దాటుకుని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ప్రభాస్తో 'ఏక్ నిరంజన్' సినిమా చేసింది. గత కొన్నాళ్ల నుంచి ఓవైపు నటిస్తున్నప్పటికీ మరోవైప రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటూ వచ్చింది. అలా ఈ మధ్య లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయిపోయింది.అలా ఎంపీగా అయిన ఆనందంలో ఉన్న కంగనా రనౌత్.. రీసెంట్గా తమ్ముడు వరసయ్యే వరుణ్ పెళ్లికి హాజరైంది. అందరిలా కాకుండా ఏకంగా ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చి అతడిని సర్ప్రైజ్ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' సినిమాలో కంగన నటిస్తోంది. ఒకప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగన నటిస్తోంది. ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) View this post on Instagram A post shared by Varun Ranaut (@varunranaut)