-
ఓఆర్ఆర్ అవతల మహానగరం !
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో మహానగరాన్ని నిర్మించేందుకు సర్కార్ నిర్ణయించింది. ఔటర్రింగ్రోడ్డు లోపల హైదరాబాద్ నగరం చుట్టూ పలు పేరొందిన కంపెనీలు, విద్య, వైద్య సంస్థలతో తీవ్ర రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఔటర్రింగ్ రోడ్డు అవతల త్వరలో నిర్మించబోయే ట్రిపుల్ఆర్ మధ్యలో ఫార్మాసిటీకి సేకరించిన 13 వేల ఎకరాల్లో అన్ని వసతులతో కూడిన మహానగరాన్ని నిర్మించేందుకు సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సూచనల మేరకే రెండు రోజుల క్రితం ధరణి కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఫార్మాసిటీకి సేకరించిన భూములను పరిశీలించారు. నివేదికను మంత్రి శ్రీధర్బాబుకు అందజేశారు. రూ. 40 వేల కోట్లతో.. ఔటర్రింగ్ రోడ్డు అవతల ఫార్మాసిటీకి సేకరించిన 13 వేల ఎకరాల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో 3 నుంచి 5 వేల ఎకరాల్లో మల్టిపుల్ కాంప్లెక్స్, విద్య, వైద్య రంగాల హబ్స్, టౌన్షిప్లను నిర్మించడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా జపాన్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే కంపెనీ ప్రతినిధులకు ఫార్మాసిటీకి సేకరించిన భూముల వివరాలను సర్కార్ పెద్దలు అందజేశారు. హైదరాబాద్ నగర స్థాయికి మించి ఔటర్రింగ్ రోడ్డు అవతల ఫార్మాసిటీకి సేకరించిన నాలుగైదు వేల ఎకరాల భూముల్లో మహానగరాన్ని నిర్మిస్తే రంగారెడ్డి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల ప్రజలకు అనువుగా ఉంటుందని సర్కార్ యోచిస్తోంది. మహానగరం నిర్మాణంతో అక్కడి వరకు మెట్రో రైలు మార్గం, సరిపడా నీటి వనరుల కోసం మిషన్ భగీరథతో పాటు నాగార్జునసాగర్ నుంచి ప్రత్యేక కృష్ణాజలాలు, అవసరమైతే గోదావరి జలాలను సైతం తరలించే విధంగా దృష్టి పెట్టింది. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోంచే నూతన రైలు మార్గం కోసం భూ సర్వే చేశారు. నూతనంగా నిర్మించే మహానగరానికి సమీపంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయం కూడా ఉండడంతో పారిశ్రామికవేత్తలు దేశ, విదేశాల నుంచి సకాలంలో వచ్చివెళ్లే అవకాశం ఉంటుంది. దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఫార్మా భూముల్లో మల్టిపుల్ కాంప్లెక్స్, టౌన్షిప్ల నిర్మాణం ముందుకొచ్చిన జపాన్ కంపెనీ త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం -
ఆయకట్టు.. మురిసేట్టు
ధారూరు: మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ప్రాజెక్టును ఈఎన్సీ అనిల్కుమార్, చీఫ్ ఇంజనీర్ ధర్మా నాయక్, ఎస్ఈ రంగారెడ్డి, ఈఈ సుందర్, డీఈ భాస్కర్గౌడ్ తదితరులతో సందర్శించారు. ముందుగా దెబ్బతిన్న అలుగును, అలాగే కింది భాగాన్ని, ప్రాజెక్టులో పేరుకుపోయిన మట్టిని, బేబీ కెనాల్ తూమును, పనిచేయని షట్టర్ను పరిశీలించారు. తర్వాత కుడి కాలువ తూము ను, ప్రాజెక్టు ముందు ఉన్న ప్రధాన కాల్వ ను పరిశీలించి.. ఏయే పనులు చేపట్టాల్సి ఉందో అనే వివ రాలను నమోదు చేసుకున్నారు. కుడి కాలువ వెంట నాలుగు కిలోమీటర్లు నడిచి కూలిన గైడ్ వాల్స్ను, పూడుకుపోయిన కాలువను, బుంగలు పడి నీరువృథాగా పోతుండటాన్ని గమనించారు. కాలువల్లో ఏ చైన్ నంబర్ వద్ద ఎంత మేరకు పనులు చేయించాల్సి ఉందని సీఈ, ఎస్ఈలను అడిగి తెలుసుకున్నారు. 24 కిలో మీటర్ల కుడి కాలువ, 11 కిలో మీటర్ల ఎడమ కాల్వ, రెండున్నర కిలోమీటర్ల బేబీ కెనాల్ను చైన్ల వారీగా పరిశీలించి మరమ్మతులపై సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులుప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాల్సి ఉంటుందని ఈఎన్సీ అనిల్కుమార్ తెలిపారు. 2005 నుంచి మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రాజెక్టు ఆధునీకరణకు ఎంత మేర నిధులు అవసరం అవుతాయో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సూచనల మేరకు ప్రాజెక్టును సందర్శించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 9,200 ఎకరాల ఆయకట్టు ఉందని, చివరి ఆయకట్టుకు నీరందించేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు డిజైన్ చాలా మంచిగా ఉందని, నిర్మించిన నాటి కండిషన్కు తీసుకురావాల్సి ఉందన్నారు. హైడ్రాలిక్ డిజైన్తో ఆధునీకరణ పనులు కొనసాగిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో పూడిక తీత పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇరిగేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అనిల్కుమార్ అన్నారు. గతంలో ప్రాజెక్టు మట్టిని రైతులు తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాణిక్రెడ్డి అధికారుల కు వివరించారు. కార్యక్రమంలో డీఈలు, ఏఈలు,ఇతర అధికారలు రైతులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ దిశగా అడుగులు ప్రధాన కట్ట, అలుగు, తూములు, కాల్వలను పరిశీలించిన ఈఎన్సీ స్పీకర్ ప్రసాద్కుమార్ చొరవతో ముందడుగు అధికారులతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చర్చలు ప్రాజెక్టులను బాగు చేయాలి కోట్పల్లి ప్రాజెక్టు తోపాటు జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులకు కూడా మరమ్మతులు చేయించాలి. ఆయా ప్రాజక్టుల్లో ఏయే పనులు చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. అలాగే జిల్లాలోని చెరువులు, కుంటల మరమ్మతులకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. – మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు -
పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: పిల్లలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం ఊరేళ్ల గ్రామంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి హాజరయ్యారు. విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడుపులో ఉన్న నులిపురుగులను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్ పాల్గొన్నారు.చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి -
● ఎస్పీకి ఘనంగా వీడ్కోలు
అనంతగిరి: జిల్లాలో అందరి సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాకు బదిలీ అయిన ఆయన్ను గురువారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది ఘనంగా సన్మానించారు. ముందుగా కవాతు నిర్వహించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీపుపై ఎస్పీ కార్యాలయం నుంచి ఎన్నెపల్లి చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్లో విధులు నిర్వహించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. శాంతిభద్రతలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్రెడ్డి, డీటీసీ ఏఎస్పీ మురళీధర్, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, కరుణసాగర్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, జానయ్య, వీరేష్, సీఐలు, ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
అనంతగిరి: విద్య, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఇందుకోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ తెలిపారు. జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వికారాబాద్లోని సంఘం లక్ష్మీబాయి బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు చదువు తోపాటు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. బాలికలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి విద్యార్థికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు. పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గాన్ని రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, డీఎంహెచ్ఓ పల్వన్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ జీవరాజు, గురుకుల ప్రిన్సిపాల్ రమణమ్మ, ఎంఈఓ బాబుసింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు జాఫర్, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ రమేష్కుమార్, నాయకులు రఘుపతిరెడ్డి, పరశురాం, వెంకట్రెడ్డి, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బడి అంటే గుడి: కలెక్టర్ ప్రతీక్జైన్ కొడంగల్: బడి అంటే గుడిలాంటిదని.. తాను మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తానని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోనే సమాజంలో మార్పులు సాధ్యమన్నారు. చదువును అందించే బడిని గుడిలాగా భావించి విద్యార్థులకు శ్రద్ధ, క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించాలన్నారు. విద్యార్థులు.. దేశ భక్తులను, మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవాలని సూచించారు. 19 ఏళ్లలోపు ఉన్న వారందరికీ అల్బెండజోల్ పంపిణీ చేయాలన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మంద బుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు విద్యార్థులు లోనవుతారని అన్నారు. వీటిని నివారించడం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రెండు పర్యాయాలు మాత్రలను పంపిణీ చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహాలు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో బాల బాలికలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పనులపై అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు తాళం వేసి ఉండడం చూసి డీఈఓ రేణుకాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాల కోసం నిర్మించిన మరుగుదొడ్లకు ఎందుకు తాళం వేశారని ప్రశ్నించారు. వెంటనే తాళాలను తొలగించి మరుగుదొడ్ల లోపలకు వెళ్లి పరిశీలించారు. విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలల్లో చేపట్టిన పనులను నాణ్యతతో చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్కుమార్, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ విద్యార్థినులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ -
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు
డీపీఓ జయసుధ బంట్వారం: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీపీఓ జయసుధ హెచ్చరించారు. గురువారం కోట్పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీటి సర్వేపై ఆరా తీశారు. ఈ నెల 22లోపు సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అనంతరం కోట్పల్లిలోని కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, నర్సరీలను పరిశీలించారు. కంపోస్టు ఎరువు తయారీపై పలు సూచనలు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. డంపింగ్ యార్డులోనే చెత్తను పారబోస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనుల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం రాంపూర్లో పర్యటించారు. గ్రామంలోని కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, నర్సరీలను సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రతి రోజూ చెత్త సేకరించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ఎప్పటికప్పుడు మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో తాండూరు డీఎల్పీఓ శంకర్ నాయక్, కోట్పల్లి ఇన్చార్జ్ ఎంపీడీఓ డానియల్, పంచాయతీ కార్యదర్శులు వినోద్, లావారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య పరిగి: నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య కోరారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష లీకేజీపై తక్షణమే ప్రధాని మోదీ స్పందించాలన్నారు. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అల్లర్లు, గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సత్తయ్య, రఘురాం, సత్తయ్య, శేఖర్, ప్రభు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలి డీఈఓ రేణుకాదేవి పరిగి: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని డీఈఓ రేణుకాదేవి అన్నారు. గురువారం పరిగి పట్టణంలోని మల్లెమోనిగూడెం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మహేశ్వరం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో గురువారం మహేశ్వరం మండలం, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెందిన 148 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించాలన్నారు. కొత్తగా వివాహమైన ప్రతి పేదింటి కుటుంబాలు, మహిళలలు తులం బంగారం, లక్ష ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీపీ సునీతా నాయక్, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ శైలజ, డిప్యూటీ తహసీల్దార్ నవత తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించండికడ్తాల్: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రఘురాంరాథోడ్, జిల్లా అధ్యక్షుడు వాక్డోవత్ నరేశ్నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సేవాలాల్ సేన రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు, గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజనుల పది శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో నంబర్ 3కి ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలని, గిరిజనులకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, నూతనంగా ఏర్పడిన గిరిజన పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పరిగిలోని అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు -
తప్పుల సవరణకు అవకాశం
ఎరువుల కొరత.. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడిచినప్పటికీ.. రైతులకు ఎరువుల కష్టాలు తీరడం లేదు.వెల్లువలా దరఖాస్తులు 8లోu9లోuవికారాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం పేరిట స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జనవరి మాసంలో ఆరు గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలోని 18 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 566 గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం మినహా మిగిలిన ఐదు గ్యారంటీలకు అర్జీలు తీసుకున్నారు. అయితే దరఖాస్తు ఫారాలను పూరించడంలో లబ్ధిదారులు తప్పులు చేశారు. ఈ కారణంగా వారికి సంక్షేమ పథకా లు అందడం లేదు. ప్రస్తుతం గృహజ్యోతి పథ కం అమలవుతోంది. దరఖాస్తులు సక్రమంగా నింపని కారణంగా అర్హులకు పథకం అమలు కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సవరణలకు అవకాశం కల్పించింది. ఇందులోభాగంగా మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ‘ప్రజాపాలన’లో అంచనాలకు మించి దరఖాస్తులు పొరపాట్ల కారణంగా పథకాలకు పలువురు దూరం మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు జిల్లాలో ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తులు 3,14,090 సద్వినియోగం చేసుకోండి ప్రజాపాలన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే ప్రజలు సరి చేసుకోవాలి. ఇందుకోసం మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అర్హులందరికీ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లులు తీసుకెళ్లి తప్పులను సరి చేసుకోవాలి. – ప్రతీక్జైన్, కలెక్టర్ జిల్లాలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 3,14,090 మంది పథకాల కోసం అర్జీలు ఇచ్చారు. ఇందులో ఐదు గ్యారంటీల కోసం 2,74,470 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, భూమి తదితర ఇతర సమస్యల పరిష్కారం కోసం 39,620 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యింది మొదలు రేషన్ కార్డులు ఇవ్వకపోవటం, ధరణికి సంబంధించి వేల సంఖ్యలో సమస్యలు పేరుకుపోవడం తదితర కారణాలతో భారీగా అర్జీలు వచ్చాయి. తాండూరు మున్సిపాలిటీలో ఐదు గ్యారంటీలకు అత్యధికంగా 17,065 దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీ, దోమ, బొంరాస్పేట్ మండలాల్లో 16వేలకు పైగా అర్జీలు ఇచ్చారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో అత్యల్పంగా 3,414 దరఖాస్తులు వచ్చాయి. తాండూరు మండలంలో ఇతర సమస్యల పరిష్కారం కోసం అత్యధికంగా 4,045 దరఖాస్తులు రాగా బషీరాబాద్ మండలంలో కేవలం 8 దరఖాస్తులే వచ్చాయి. -
సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి
ఇన్చార్జి ఎంపీడీఓ యాదగిరి మోమిన్పేట: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారంటీలలో ఉచిత విద్యుత్, సబ్సిడీ వంట గ్యాస్కు అర్హత ఉన్నప్పటికీ పొందని వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి ఎంపీడీఓ యాదగిరి కోరారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ను రూ.500 అందించడం లాంటి పథకాలకు అర్హులై ఉండి సబ్సిడీ పొందని వారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న నంబరుతో పాటు ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులను దరఖాస్తుతో జతచేయాలన్నారు. పథకాల అమలుకు దరఖాస్తుల స్వీకరణకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. వచ్చిన దరఖాస్తులను అదే రోజు ఆన్లైన్ చేస్తున్నామని వివరించారు. దరఖాస్తుల ఆహ్వానం ఎస్సీ హాస్టల్ వార్డెన్ జైపాల్రెడ్డి మోమిన్పేట: మండల కేంద్రంలోని ఎస్సీ బా లుర వసతిగృహంలో అర్హత కల్గిన విద్యార్థుల నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హాస్టల్ వార్డెన్ జైపాల్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హాస్టల్లో వంద మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉందన్నారు. మూడవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకొనే విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధరఖాస్తుతో పాటుగా విద్యార్థులు కుల, ఆదా య, ఆధార్ కార్డు జిరాక్స్లతో పాటు బోనోఫైడ్ సర్టిఫికెట్ జత చేసి హాస్టల్ కార్యాలయంలో అందించాలని ఆయన తెలిపారు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.62లు సబ్బులు, నూనె కొరకు చెల్లిస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ట్యూటర్ వసతి ఉంటుందన్నారు. 45మంది విద్యార్థులకు ప్రస్తుతం అవకాశం ఉందని వివరించారు. మరిన్ని వివరాలకు హాస్టల్ వార్డెన్ జైపాల్రెడ్డి 9494062092 నంబర్ను సంప్రదించాలన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ సీజ్ యాలాల: తాండూరు–కొడంగల్ మార్గంలోని కాగ్నా కొత్త వంతెనపై బుధవారం రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని గురువారం పోలీసులు సీజ్ చేశారు. రెండు బైక్లను ఓ లారీ ఢీకొట్టడంతో బంట్వారం మండలం సల్బాత్తాపూర్కు చెందిన తల్లీకూతుళ్లు కోస్గి అనిత, క్రితీక ఘటన స్థలంలో మృతి చెందిన విషయం విదితమే. ఘటన అనంతరం లారీ డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి గాలించారు. లారీ ఆచూకీ కోసం తాండూరు–కొడంగల్ మార్గంలో సీసీ కెమెరాల ద్వారా ప్రతి లారీ వివరాలు సేకరించ తాండూరు పట్టణానికి చెందినదిగా గుర్తించినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. లారీతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ఘటన వివరాలను పూర్తిగా తెలుసుకుంటున్నామన్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా శ్రీకాంత్రెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీయూడబ్ల్యూజే (ఐజే యూ) రాష్ట్ర కార్యదర్శిగా కొంపల్లి శ్రీకాంత్రెడ్డిఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు.ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీకాంత్రెడ్డికి రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవీ లభించింది.22 ఏళ్లుగా జర్నలిస్టుగా జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన కొన్నేళ్లుగా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.ఆ సమయంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తెచ్చుకోవాలని జర్నలిస్టులు ఆకాంక్షిస్తున్నారు. -
గొలుసు దొంగకు రిమాండ్
మీర్పేట: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి వినయ్(24) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బీఎన్రెడ్డినగర్లో నివాసముంటూ కార్పెంటర్గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన వినయ్ తనకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గొలుసు దొంగతనాలు చేసి బంగారం అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. అదే క్రమంలో ఈ నెల 10వ తేదీన హస్తినాపురం విశ్వేశ్వరయ్య కాలనీకి చెందిన పద్మ మిర్యాలగూడ నుంచి తిరిగి బీఎన్రెడ్డినగర్లో బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వినయ్ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 14 గ్రాముల పుస్తెలతాడు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్కు తరలించారు. -
బాలికల విద్యతో భరోసా
తాండూరు టౌన్: బాలికల విద్యతో కుటంబానికి భరోసా ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలో 80 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపినీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదింటి ఆడబిడ్డ వివాహానికి ప్రభుత్వం అండగా ఉంటుంన్నారు. త్వరలోనే తులం బంగారం సైతం అందజేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.2కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లను ప్రారంభించారు. ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువును మించిన ఆస్తిలేదన్నారు. బాలికలు ఉన్నతంగా చదివితే వారి కుటుంబానికి ఎంతో అండగా నిలుస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు. మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీలో రూ.25లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం, డ్వాక్రా భవనాలను ప్రారంభించారు. నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, నాయకులు బాలేశ్వర్ గుప్తా, సిద్రాల శ్రీనివాస్, అక్బర్లాలా, ధారాసింగ్, విజయాదేవి, మమత, అబ్దుల్ రవూఫ్, నీరజారెడ్డి, హబీబ్ లాలా, వెంకటయ్య, ఇంటర్ విద్యాశాఖాధికారులు జయప్రద, శంకర్నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ రాజ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
రక్తదానం మహాదానం
కుల్కచర్ల: రక్తదానం మహాదానమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కుమ్మరి స్వామి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. భీంరెడ్డి మాట్లాడుతూ.. జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, హెల్మెట్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్–2 అధ్యక్షుడు భరత్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షుడు చంద్రలింగం, మాజీ సర్పంచ్లు సౌమ్యారెడ్డి, జానకిరాం, శంకర్ నాయక్, పద్మరవిలాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుప్పలి వెంకటేశ్, నాయకులు తమ్మలి రాంచంద్రయ్య, విఠల్ నాయక్, గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
విత్తన కొనుగోలు దుకాణాల్లో టాస్క్ఫోర్స్ అధికారుల దాడులు చేవెళ్ల: ఫర్టిలైజర్ దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను విత్తనాలను విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. గురువారం మండలంలో టాస్క్ఫోర్స్ బృందం సభ్యులైన ఏడీఏ చంద్రశేఖర్, సీడ్ సర్టిఫికేషన్ ఏడీ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రవీందర్రెడ్డి పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. రికార్డులు, బిల్స్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు తాము కొన్న విత్తనాలకు సంబంధించిన రసీదులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అదే విధంగా దుకాణదారులు తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. తనిఖీల్లో చేవెళ్ల డివిజన్ ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయాధికారి తులసి తదితరులు పాల్గొన్నారు. లూజు విత్తనాలు అమ్మితే.. మొయినాబాద్: సీడ్స్, ఫర్టిలైజర్ షాపులను జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీబాలాజీ ఫర్టిలైజర్, శ్రీ సద్గురు సాయి ఫర్టిలైజర్, శ్రీ కిసాన్ ఫర్టిలైజర్ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏయే రకాల పత్తి విత్తనాలు అమ్ముతున్నారు.. ఎంఆర్పీకి అమ్ముతున్నారా లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీలర్లు విత్తనాలను ప్యాకింగ్ లేకుండా లూజుగా విక్రయించవద్దన్నారు. ఎంఆర్పీకి మించి అధిక ధరలకు విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు చేసే రైతులకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలని సూచించారు. వారి వెంట మండల వ్యవసాయాధికారి రాగమ్మ తదితరులు ఉన్నారు. షాబాద్ ఫర్టిలైజర్ దుకాణాల్లో సోదాలు షాబాద్: ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సహాయ వ్యవసాయ సంచాలకుడు (ఏడీఏ) చంద్రశేఖర్, సీడ్ సర్టిఫికేషన్ ఏడీ శివకుమార్ హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని నాగర్గూడలోని విత్తనాల డీలర్ షాపులను జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. -
సేంద్రియం.. అవసరం
నవాబుపేట: సేంద్రియ ఎరువులపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతో రైతులు దృష్టిసారించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రసాయన ఎరువుల వాడకం పెరుగుతోంది. ఏటా పెట్టుబడులు పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఈ సమస్య నుంచి రైతులుబయట పడేందుకు సేంద్రియ ఎరువుల తయారీ విధానం, వినియోగంతో కలిగే ప్రయోజనాలపై రైతులకు పూర్తి స్తాయిలో అవగాహన కల్పిండమే. మండల వ్యవసాయ అధికారులు మాత్రం ఇందులో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక భారం.. నష్టం రసాయన ఎరువుల వాడకం రైతులకు భారంతో పాటు నష్టం. భూసారం సైతం తగ్గుతోంది. ఆశించిన దిగుబడులు రావు. పర్యావరణంపై రసాయనిక ఎరువుల ప్రభావం చూపుతుంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. అదే స్థాయిలో సేంద్రియ ఎరువులు వేస్తే చీడపీడల బెడద తప్పడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. వ్యవసాయంలో సరైన సలహాలు, చూచనలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. దీంతో రైతులకు పంటకు సోకిన రోగాలకు ఏ దశలో ఏ మందులు వాడాలో తెలియక వ్యాపారులు ఇచ్చే నాణ్యతలేని నకిలీ మందులు వాడుతూ నష్టపోతున్నారు. సేంద్రియ ఎరువులు ఆరుతడి పంటలకు కూరగాయల సాగుకు ఎంతో ఉపయోగపడుతాయి. రైతు ఇంట సిరులు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలైనవని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఆకులు, అలములు, చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. ముందుగా తమకు అవసరమున్న కుండీలను ఏర్పాటు చేసుకుని ముడి సరుకు సేకరించి కొంత వరకు నీటిలో వేసి దాదాపు 45 రోజులు నిల్వ ఉంచితే ఎరువు తయారవుతుంది. అనంతరం దానిని పంటలకు ఉపయోగించవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుంది. వర్మి కంపోస్టుతో అధిక దిగుబడులు పొందవచ్చు. చెరువు ఒండ్రుమట్టిని తరలించుకోవడం, జీలుగ పంటను సాగు చేసుకుని పొలం కలియదున్నడం లాంటి పద్ధతులు పాటించినా మేలే. ఎక్కువ మొత్తంలో రసయనాలు వాడే భూముల్లో అప్పుడప్పుడు సేంద్రియ ఎరువులు వేస్తే భూసారం సమతుల్యంగా ఉంటుంది. పశువుల ఎరువులు, పొల్లాల్లో గొర్రెల మందలు వేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయి. సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇప్పటికై నా సంబందిత అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అవగాహన కల్పనలో అలసత్వం రసాయన ఎరువుల వైపే రైతుల మొగ్గు పెరుగుతున్న ఖర్చులు తగ్గుతున్న దిగుబడులు అవగాహన కల్పిస్తాం సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తాం. రైతులకు అందుబాటులో ఉండే పశువుల, గొర్రెల ఎరువును పొలాల్లో వేసుకోవాలి. జీవన ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వర్మికంపోస్టు బెడ్లు, వానపాములు ఇపుడు రావడం లేదు. – ప్రసన్నలక్ష్మి, మండల వ్యవసాయాధికారి -
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
పరిగి: నులిపురుగుల నివారిస్తే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ జీవరాజ్ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులు తప్పక అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. నులిపురుగుల వృద్ధితో చిన్నారులకు హాని కలుగుతుందన్నారు. విద్యార్థిదశలో ఎదుగుదల లోపించి వివిధ అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్త హీనత తదితర వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి ముందుగానే మాత్రలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వైద్యాధికారి ప్రవీణ్కుమార్, నంబర్–1 స్కూల్ హెచ్ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ జీవరాజ్ -
ఈ హెచ్ఎం మాకొద్దు
తాండూరు రూరల్: విఽధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తమకు వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంపై మాజీ సర్పంచ్ ఎస్.విజయలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్లో వైద్యనాథ్ సీనియర్ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల పదోన్నతి రావడంతో వైద్యనాథ్ అదే పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. 2023–24 పదోతరగతి ఫలితాల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం నుంచి 79 మంది విద్యార్థులు పరీక్షలకు రాయగా.. ఇంగ్లిష్ మీడియం నుంచి 21 మంది, తెలుగు మీడియంలో ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణలయ్యారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం, పాఠశాలకు సంబంధించిన విషయాలపై ఎస్ఎంసీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ విజయలక్ష్మి పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పాఠశాల నిధుల విషయంలోనూ అలసత్వం వహించారని ఆరోపించారు. పదోన్నతిపై వచ్చిన హెచ్ఎం వైద్యనాథ్ను తమ పాఠశాల నుంచి బదిలీ చేయాలని కోరారు. ఇదే విషయమై డీఈఓ, ఎంఈఓలకు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కుర్వ లక్ష్మి, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ అల్లావుద్దీన్, మాజీ ఉప సర్పంచ్లు అబ్దుల్ మాజీద్, కాశీనాథ్, గ్రామస్తులు మైనుద్దీన్, మహేందర్రెడ్డి, కిష్టప్ప తదితరులున్నారు. డీఈఓ, ఎంఈఓకు ఫిర్యాదు చేస్తాం మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్తుల ఆగ్రహం ఆరేళ్లుగా సేవలు: హెచ్ఎం మల్కాపూర్ జెడ్పీ పాఠశాలలో ఆరేళ్లుగా సీనియర్ ఉపాధ్యాయుడిగా ఉంటూ.. రెండేళ్లుగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాల్లో సేవలు అందించానన్నారు. పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పటికీ ఈ యేడాది పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీ నుంచి రూ.3.25లక్షలు మంజూరవ్వగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించానన్నారు. ఇటీవల పదోన్నతిలో ఇదే పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎంగా రావడంతో ఇక్కడే కొనసాగుతున్నానన్నారు. తనను ఇదే పాఠశాలలో కొనసాగించాలని వైద్యనాథ్ గ్రామస్తులను కోరారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● ఒక్కసారిగా తెగిపడిన విద్యుత్వైర్ ధారూరు: విద్యార్థులు ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు బస్సులకోసం నిరీక్షిస్తున్నారు. వారి పక్కనే స్తంభం పైనుంచి విద్యుత్ వైర్ ఒక్కసారిగా తెగిపడంతో భయంతో పరుగందుకు న్నారు. ఈ ఘటన మండల కేంద్రంలోని కూ రగాయల మార్కెట్లో గురువారం చోటు చే సుకుంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి వికారాబాద్లోని ప్రైవేట్ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఒక్కొక్కరుగా బ స్సులో ఎక్కేందుకు మార్కెట్కు వచ్చారు. వా రు బస్సుకోసం వేచియుండగా ఒక్కసారిగా వైర్ తెగిపడడంతో విద్యార్థులకు భయంతో పరుగులు తీశారు. గమనించిన స్థానికుడు వెంటనే సబ్ స్టేషన్కు ఫోన్లో సమాచారం ఇవ్వగా విద్యుత్ సరఫరా నిలిపివేడయంతో ప్రమాదం తప్పింది. తరుచూ విద్యుత్వైర్లు తెగిపడుతున్నాయని.. కొత్తలైన్ వేయాలని ఏఈకి, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా పాత వైర్లు తొలగించి కొత్త లైన్ వేయాలని కోరుతున్నారు. ‘నీట్’ నిర్వహణ తీరుపై ఆగ్రహం షాద్నగర్రూరల్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాజు డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తక్షణమే ప్రధాని మోదీ స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో, దేశ భవిష్యత్తో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ కావడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కల్వకుర్తిలో ‘స్కిల్ డెవలెప్మెంట్’
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు వంద ఎకరాల్లో స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీ (వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం) ఏర్పాటు చేయనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గాన్ని విద్యాహబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆమనగల్లు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గంలో స్కిల్డెవలెప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన వంద ఎకరాల స్థలాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు. 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను ఒకేచోట ఏర్పాటు చేస్తామన్నారు. ఆమనగల్లుకు మంజూరైన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం అనువైన 5 ఎకరాల స్థలాన్ని సేకరిస్తామని తెలిపారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన అసంపూర్తి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామని, అదే ఆవరణలో డిగ్రీ కళాశాల భవనం నిర్మిస్తామన్నారు. సమావేశంలో వివిధ మండలాల తహసీల్దార్లు లలిత, ముంతాజ్, రంగారెడ్డి, సుదీర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. స్థలాల పరిశీలన స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీ కోసం కడ్తాల మండలం అన్మాస్పల్లి గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 321, 260లో ఉన్న ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనుతో కలిసి పరిశీలించారు. అన్మాస్పల్లి సమీపంలోని ప్రభుత్వ భూములను వెంటనే సర్వే చేయించి నివేదిక అందించాలని తహసీల్దార్ ముంతాజ్కు సూచించారు. కార్యక్రమంలో కడ్తాల్ ఎంపీటీసీ గూడురి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిచ్చానాయక్, నాయకులు గూడురి భాస్కర్రెడ్డి, జహంగీర్ అలీ, హన్మానాయక్, రమేశ్, ప్రభు, శరత్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం కల్వకుర్తిని విద్యాహబ్గా మారుస్తాం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
‘నులి’మేద్దాం.. నివారిద్దాం
● నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ● 1 నుంచి 19 సంవత్సరాల వయసు వారికి పంపిణీ ● వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు 8లోuషాబాద్: పిల్లల్లో నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 20, 27తేదీల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1 – 2 సంవత్సరాల వయస్సు వారికి సగం మాత్రను, 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారికి పూర్తి ట్యాబ్లెట్ ఇవ్వనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల చేత మాత్రలు మింగించేందుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ పూర్తి చేశారు. లెక్కలు తప్పుతున్నాయా! వర్షపాత నమోదు కేంద్రాలు దిష్టిబొమ్మల్లా మారాయి. దీంతో వర్షపాత లెక్కల్లో కచ్చితత్వం తెలియడం లేదు.8లోu -
పక్కా వ్యూహం
అడవుల సంరక్షణకువికారాబాద్: జిల్లాలో అడవులు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో వాటి సంరక్షణకు అటవీ శాఖ సరి కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. గతంలో ఆక్రమణలకు గురైతే కేసులు నమోదు చేసి వదిలేసే వారు.. ప్రస్తుతం ఆ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాలో 1,08,000 ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి. ఇందులో అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 25 శాతానికి పైగా (దాదాపు31 వేల ఎకరాలు) ఆక్రమణకు గురయ్యాయి. జిల్లాలో 94 ఫారెస్టు బ్లాకులు ఉండగా అందులో కొన్ని ఏరియాలు పూర్తిగా కబ్జా కోరల్లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని చోట్ల 50 శాతం నుంచి 90శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి. జిల్లాలో 13శాతం అటవీ భూములు జిల్లాలో 1,08,000 ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉండగా భౌగోళికంగా 13శాతం అటవీ భూములు ఉన్నాయి. ఇందులో 12.7శాతం గ్రీనరీ (20 వేల ఎకరాల్లో దట్టమైన అడవులు) ఉంది. చుట్టుపక్కల జిల్లాలతో పోలిస్తే ఇదే అత్యధిక శాతం. ఈ అటవీ ప్రాంతాన్ని ఐదు క్లస్టర్లుగా 94 బ్లాకులుగా విభజించారు. అందులో అనంతగిరి అడవి ముఖ్యమైనదిగా చెబుతారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచేందుకు హరితహారం లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నా మరో పక్క కబ్జాల కారణంగా రోజు రోజుకూ అడవులు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దీంతో వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలుగుతోంది. పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తే తప్ప అడవుల సంరక్షణ సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. గూగుల్ మ్యాప్ల ద్వారా.. గతంలో అటవీ భూములు ఆక్రమణలకు గురైతే కేసులు నమోదు చేసే వారు. ప్రస్తుతం కబ్జాకు గురైన ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు. మళ్లీ ఎవరైనా మొక్కలు నరికితే కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి అడవుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. హద్దులు దాటకుండా కందకాలు తవ్వుతున్నారు. తాజాగా చెట్లు నరికిన ప్రదేశాలను గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తిస్తున్నారు. ఇటీవల ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి బాణాపూర్, దోర్నాల తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఆక్రమణలకు గురైన చోట మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు జిల్లాలో అటవీ విస్తీర్ణం 1,08,000 ఎకరాలు ఆక్రమణలో 25 శాతానికి పైగా.. కర్ణాటక సరిహద్దులో భారీగా కబ్జాలుమానవ మనుగడకు ఆధారమైన అడవులు నేడు ప్రమాదపుటంచుల్లోకి వెళ్లాయి. అడవుల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని భావించిన అటవీ శాఖ జిల్లా అధికారులు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. చెట్లు నరికితే చర్యలు అటవీ భూములను ఆక్రమించినా.. చెట్లను నరికినా కఠినంగా వ్యవహరిస్తాం. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సరిహద్దు అటవీ భూముల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ సాధ్యం. – జ్ఞానేశ్వర్, డీఎఫ్ఓ, వికారాబాద్ కర్ణాటక రైతుల ఆక్రమణ కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ జిల్లా.. మన జిల్లా సరిహద్దులో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయి. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామ శివారులో సుమారు 300 ఎకరాల అటవీ భూములను కర్ణాటక రైతులు ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ విషయమై రెండు సరిహద్దు రాష్ట్రాల రైతులు గొడవ కూడా పడ్డారు. వికారాబాద్ అటవీ అధికారులు కర్ణాటక రైతులు సాగు చేస్తున్న భూములు తెలంగాణకు చెందినవని తేల్చారు. ప్రస్తుతం ఆ భూముల్లో కూడా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం గుల్బర్గా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో మన జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ ముందుకు పంచాయితీ వచ్చింది. ఆ కలెక్టర్ మన కలెక్టర్తో మాట్లాడినట్టు సమాచారం. రెండు జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకుని సమగ్రమైన సర్వే చేయించి సరిహద్దులు ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. -
మూడు కాడెడ్ల అపహరణ
మర్పల్లి: షెడ్లో కట్టేసిన మూడు కాడెడ్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన మండల పరిధిలోని తుమ్మలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగడనల్లి రహీముద్దీన్ ఎద్దుల సాయంతో తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో పొలం వద్దే షెడ్ ఏర్పాటు చేశాడు. ఆదివారం రోజు రాత్రి పది గంటల సమయంలో భోజనం చేసి షెడ్ వద్దకు వచ్చి ఎడ్లకు మేత వేసి పడుకున్నాడు. అప్పటికే మాటేసిన దుండగులు ఎడ్ల మెడలో తాళ్లను కోసేసి తోల్కుని పోయారని మంగళవారం విలేకరులకు వివరించారు. అదేరాత్రి మర్పల్లి పోలీసులకు సమాచారమివ్వగా రాత్రి 2గంటల సమయంలో షెడ్ వద్దకు వచ్చి ఫొటోలు తీసుకున్నారని చెప్పారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సీసీ కెమెరాలు పరిశీలించి ఎడ్లను జాడ తెలసుకోవాలని కోరుతున్నాడు. పోలీసుల గస్తీ లేక రూ.2.50లక్షలు నష్టపోయానని త్వరగా దుండగులను పట్టుకోవాలని రైతు కోరాడు. రూ.2.50లక్షలు నష్టపోయానని రైతు ఆవేదన -
బీసీ కుల గణన చేపట్టాలి
అనంతగిరి: బీసీ కుల గణనను వెంటనే చేపట్టాలని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ కుల గణన చేపడతామన్న కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సంగమేశ్వర్, లక్ష్మణ్ యాదవ్, రాములు తదితరులు పాల్గొన్నారు. బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ -
కలెక్టర్ను కలిసిన ఉద్యోగులు
అనంతగిరి: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రతీక్జైన్ను మంగళవారం జిల్లా అధికారులు, ఆయా శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్తో వెళ్లి కలెక్టర్ను కలిశారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, అమరేంద్ర కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు దీపక్, డివిజన్ అధ్యక్షులు రమేష్, వీరేష్బాబు, రెవెన్యూ యూనియన్ ప్రతినిధులు విజయ్కుమార్, పురుషోత్తం, గణేశ్, మురళీధర్, సురేష్, విజయ్, శ్రీలత, రాజేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, మోహన్, బాల్రాజు, నరేందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రమేనా?
బడి బస్సుఏటా ప్రహసనంగా ఆర్టీఏ తనిఖీలుడ్రైవర్ల అర్హతలిలా.. ● గ్రేటర్ పరిధిలో 14,624 స్కూల్ బస్సులు ● రంగారెడ్డి జిల్లా పరిధిలోనే 11,922 ● వీటిలో 3,500 బస్సులు కండిషన్ లేనివే.. ● నిబంధనలు పట్టించుకోని పాఠశాలలు ● విద్యా సంవత్సరం ఆరంభంలోనే హడావుడి ● ఆ తర్వాత గాలికొదిలేస్తున్న రవాణా శాఖ ● డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించొద్దు. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను విధిగా నిర్వహించాలి. ● యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకోసారి రక్తపోటు, షుగరు, కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ● డ్రైవర్ను నియమించేందుకు ముందు అతని అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్,తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. ప్రతి బస్సులో ఒక అటెండర్ తప్పనిసరిగా ఉండాలి. ● డ్రైవర్కు బస్సు డ్రైవింగ్లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. అమలుకు నోచుకోని నిబంధనలు ● నిబంధనల్లో చాలా వరకు అమలుకు నోచుకోవడం లేదు. ● స్కూల్ బస్సుల భద్రతను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ● బస్సు లోపలివైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పిల్లలను జాగ్రత్తగా బస్సు ఎక్కించేందుకు, తిరిగి ఇళ్ల వద్ద దించేందుకు సిబ్బంది చూపే శ్రద్ధ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో సుమారు 14,624 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే సుమారు 11,922 బస్సులు పిల్లలకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో సుమారు 3,500కు పైగా బస్సులు సామర్థ్యం లేనివి ఉన్నట్లు అంచనా. మరోవైపు సామర్థ్యం ఉన్నట్లు ధ్రువీకరించిన వాటిలోనూ ఏ మేరకు ఫిట్నెస్ ఉందనేది సందేహామే. ఏటా వారం రోజుల పాటు ఆర్టీఏ అధికారులు హడావుడి చేయడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామామూలుగా మారింది. దీంతో స్కూల్ బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కొన్ని విద్యాసంస్థ లు తక్కువ జీతాలతో లభించే డ్రైవింగ్లో పెద్ద గా అనుభవం లేనివారిని నియమిస్తున్నాయి. బస్సుల సామర్థ్యాన్నీ గాలికొదిలేస్తున్నాయి. ఎందుకీ నిర్లక్ష్యం? స్కూల్ బస్సుల కారణంగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది. నిబంధనలు, మార్గదర్శకాలను పేర్కొంది. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. నిరంతర నిఘా విధానం లేకపోవడం, డ్రైవర్లపై ఎలాంటి నియంత్రణ, తనిఖీ లేకపోవడంతో బడి బస్సుల్లో పిల్లల భద్రత గాలిలో దీపంలా మారుతోంది. స్కూల్ బస్సు ఇలా ఉండాలి.. ● బస్సు పసుపు రంగులో ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్కు స్పష్టంగా కనిపించేలా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సు లోపలి భాగంలో పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి. దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్కు కనిపిస్తారు. ● బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్), పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారాం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి. ● సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. ● సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి. ● వాహనానికి నలువైపులా పైభాగం మూలాల్లో (రూఫ్పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపు పచ్చని) రంగున్న ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ● సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేలా ముందుభాగంలో పెద్ద బోర్డుపై 250 ఎంఎంకు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థులు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రం కింద ‘స్కూల్ బస్సు’ లేదా ‘కళాశాల బస్సు’ అని నల్ల రంగులో కనీసం 100 ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎంఎం ఉండాలి. ● బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్తో ఉండాలి. సైడ్ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. ● ఫుట్బోర్డుపై మొదటి మెట్టు 325 ఎంఎం ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. ● లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రెయిలింగ్ ఉండాలి. ● బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు, చిరునామాలు, ఎక్కాల్సిన, దిగాల్సిన వివరాలు బస్సులో ఉండాలి. బడి బస్సుల తనిఖీలు ప్రహసనంగా మారాయి. ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలో సామర్థ్యం లేని బస్సులను తనిఖీలు చేసి కేసులు నమోదు చేసినా.. ఆ తర్వాత అవి మళ్లీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీఏ అధికారులు సైతం బస్సుల సామర్థ్యాన్ని నిర్ధారించడంలో కచ్చితమైన ప్రమాణాలను పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన డొక్కు బస్సులను నడిపినా పట్టించుకోకుండా కొందరు ఎంవీఐలు ఉత్తుత్తి తనిఖీలు చేసి గ్రీన్సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
జనావాసాల్లోకి కొండచిలువ
మణికొండ: పన్నెండు అడుగుల పొడవు కొండ చిలువ జనావాసాల్లోకి వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ రోడ్డు నంబర్– 4లోని ఖాళీ స్థలంలో కొండచిలువ కనిపించింది. వెంటనే స్థానికులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పట్టుకున్నారు. పాములు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వాటిని జూపార్కులో అప్పగిస్తామని స్నేక్ సొసైటీ సభ్యులు సూచించారు. కవి విల్సన్ సుధాకర్కు ప్రతిష్టాత్మక రోమ్ పురస్కారం సాక్షి, సిటీబ్యూరో: నాశ్చిరా అసోసియేషన్, బార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక ‘డొన్నె డ్ఙీఅమోర్’ (ఉమెన్ ఆఫ్ లవ్) అంతర్జాతీయ అవార్డుకు తెలుగు కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ఎంపికయ్యారు. ఈ నెల 27న రోమ్ (ఇటలీ) వేదికగా అవార్డును స్వీకరించడానికి బార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ నుంచి ఆహ్వానం అందిందని విల్సన్ సుధాకర్ తెలిపారు. మహిళా ప్రపంచానికి ప్రేరణగా రాసే సాహిత్యానికి గౌరవంగా ఈ అవార్డును అందిస్తారు. సీ్త్రలపై సుధాకర్ రాసిన తెలుగు కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించగా.. ఆ కవిత్వం ఔన్నత్యాన్ని తెలుసుకొని దానిని ఇటాలియన్లోకి అనువదించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని సుధాకర్ వివరించారు. నగరానికి చెందిన సుధాకర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా జపాన్, దక్షిణాఫ్రికా, దుబాయ్లలో విధులు నిర్వహించారు. పేదల పక్షపాతిగా, సీ్త్రలు, బాలకార్మికులు, దళితులకు సంబంధించిన పలు అంశాలపై విల్సన్ సుధాకర్ రాసిన రచనలు ఆదరణ పొందాయి. ఆయన రాసిన పలు కవితలు ఆంగ్లం, ఇటాలియన్ భాషల్లోకి అనువాదమయ్యాయి.