పరిగి: నులిపురుగుల నివారిస్తే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ జీవరాజ్ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులు తప్పక అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. నులిపురుగుల వృద్ధితో చిన్నారులకు హాని కలుగుతుందన్నారు. విద్యార్థిదశలో ఎదుగుదల లోపించి వివిధ అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్త హీనత తదితర వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి ముందుగానే మాత్రలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వైద్యాధికారి ప్రవీణ్కుమార్, నంబర్–1 స్కూల్ హెచ్ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్ఓ జీవరాజ్
Comments
Please login to add a commentAdd a comment