-
వెంటనే వేతనాలు చెల్లించాలి
మెదక్జోన్: పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈసందర్భంగా సీఐటీ యూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. 8 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే కుటు ంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం 2, 3 నెలల వేతనాలు పెండింగ్లో పెడితే, కొత్త ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అసలు జీతాలే చెల్లించలేదన్నారు. వేతనాలు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భూమికి భూమి ఇవ్వాల్సిందే..
నర్సాపూర్ రూరల్: భూమికి భూమి ఇవ్వాలని కొండపోచమ్మ సాగర్– సంగారెడ్డి రీచ్ 2 కాలువ కోసం భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు. గురువారం నర్సాపూర్ రైతువేదికలో మండలంలోని చిన్నచింతకుంట, రెడ్డిపల్లి గ్రామాల రైతులతో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూమికి భూమి లేదా ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించేలా చూడాలని కోరారు. ఇటీవల ప్రభుత్వానికి శివ్వంపేట మండలంలోని ఓ రైస్మిల్ యజమాని డబ్బులు బాకీ ఉంటే ఎకరాకు రూ. 60 లక్షల చొప్పున ధర ప్రకటించి వేలం వేశారని గుర్తు చేశారు. ఆ ప్రకారం మా భూములకు ధరలు ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇప్పటికే కాళేశ్వరం, ట్రిబుల్ఆర్, విద్యుత్తు లైన్ కోసం భూములు కోల్పోయి నష్టపోయినట్లు రెడ్డిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమలాద్రి, ఇరిగేషన్ శాఖ డీఈఈ పద్మ, ఏఈ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భూ నిర్వాసితుల డిమాండ్ -
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయండి
మెదక్జోన్/రామాయంపేట(మెదక్): మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు గురువారం వివరాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అజంతా, రాయలసీమ ఎక్స్ప్రెస్లకు అక్కన్నపేట, వడియారం స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నుంచి మెదక్, అక్కన్నపేట స్టేషన్ను కలుపుతూ నూతనంగా రైల్వేలైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు సిద్దిపేట, పెద్దపల్లి లైన్ నిర్మించాలని, మెదక్, సిద్దిపేట స్టేషన్ల నుంచి నేరుగా భక్తులు తిరుపతి వెళ్లడానికి ప్రత్యేకంగా రైలు నడపాలన్నారు. సిద్దిపేట, వడియారం స్టేషన్లలో రేక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని జీఎంను కోరారు. -
మట్టిని తోడేస్తున్నారు..!
శివ్వంపేట(నర్సాపూర్): రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కోసం గుర్తించిన భూములపై ఇటుక మాఫియా కన్ను పడింది. ఆ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతూ ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి త్రిబుల్ఆర్ నిర్మాణం కోసం అధికారులు భూములు గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రంగంలోకి దిగారు. మండలంలోని కొత్తపేట పూర్వ పంచాయతీ పరిధిలో ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగుతుంది. కొత్తపేట, రూప్ల పంచాయతీ పరిధిలో త్రిబుల్ఆర్ కోసం గుర్తించిన భూముల యజమానులకు ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్న విషయం రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
నాణ్యమైన విత్తనాలే లక్ష్యం
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ పలు విత్తన సముదాయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే ఉద్దేశ్యంతో పలు దుకాణాల నుంచి విత్తన నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపిస్తున్నామన్నారు. డీలర్లు విత్తన నియంత్రణ చట్టానికి లోబడి వ్యాపారం నిర్వహించాలని, తప్పనిసరిగా విత్తన లైసెన్సును కలిగి ఉండాలని ఆదేశించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని, స్టాక్ బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఫర్టిలైజర్ యాజమానులు, రైతులు పాల్గొన్నారు. కబ్జాదారులపై చర్యల కోసం వినతి నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో తమ భూమి కబ్జాకు గురౌవుతోందని బీడీ కార్మికులు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెం.824లోని ఆరు ఎకరాల భూమి బీడీ కార్మికులందరూ కలిసి 35సంవత్సరాల క్రితం కొనుగోలు చేశామన్నారు. ప్రభు త్వం ఇళ్లు మంజూరు చేయడంతో కొంత మంది నిర్మాణాలు చేసుకున్నామని, మిగిలిన స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని వాపోయారు. కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. తహసీల్దార్ను వివరణ కోరగా ఆర్ఐ, సర్వేయర్లను పంపించి వివరాలు సేకరిస్తామని, ఆ నివేదికను పైఅధికారులకు పంపిస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. బీడీ కార్మికులు కళావతి, కౌసల్య, లక్ష్మి, నాగలక్ష్మి, సిద్దవ్వ, రాజ్ బీ, కాసింబీ తదితరులు పాల్గొన్నారు. -
నులి పురుగులు నివారిద్దాం
తూప్రాన్: నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న 2,36,000 మంది పిల్లలకు మాత్రలు వేస్తామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సిబ్బంది సూచించారు. నులి పురుగుల నిర్మూలనకు అన్ని రకాలుగా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరాం మాట్లాడుతూ.. పిల్లల్లో నులి పురుగుల సంక్రమణతో రక్తహీనత, చురుకుదనం, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఈసందర్భంగా కలెక్టర్తో పాటు అధికారులు, సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు వేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతి, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహిజొద్ధీన్, కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్, భగవాన్రెడ్డి, రవీందర్రెడ్డి, సీహెచ్సీ సూపరింటెండెంట్ అమర్సింగ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2,17,482 మందికి మాత్రల పంపిణీ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతమైందని డీఎంహెచ్ఓ శ్రీరామ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసినట్లు చెప్పారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 2,36,394 మంది ఉండగా గురువారం ఒక్కరోజే 2,17,482 మందికి మాత్రలు వేశామని వివరించారు. 92 శాతం మాత్రలు పంపిణీ చేశామని, మిగిలిపోయిన పిల్లలందరికీ ఈనెల 27వ తేదీన ఎంఓపీ, యూపీ రౌండ్లో ఆల్బెండజోల్ మాత్రలు వేస్తామని తెలిపారు. మొత్తం 92 శాతం పిల్లలకు మాత్రలు వేసినట్లు వివరించారు. కలెక్టర్ రాహుల్రాజ్ -
జీలుగతోనే నేల సారవంతం
చిలప్చెడ్(నర్సాపూర్): ఎదిగిన జీలుగను నేలలో కుళ్లబెట్టి, దున్నడంతో నేల సారవంతమవుతుందని మండల వ్యవసాయాధికారి బాల్రెడ్డి చెప్పారు. గురువారం ఆయన మండల పరిధిలోని శీలాంపల్లి, అజ్జమర్రి గ్రామాలలో జీలుగ సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీలుగ మొ క్క వేర్లు గాలిలోని నత్రజని గ్రహంచి, వేర్ల వద్ద బుడిపెల రూపంలో నిల్వ ఉంచుతుందన్నారు. కుళ్లి న అనంతరం, పంటను దున్నడంతో నేలకు సహజ స్థితిలో నత్రజని లభిస్తుందని, దీంతో యూరియా ను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. జీలుగలో ఉండే పీచుపదార్థం నేలను గుళ్లగా మార్చి సారవంతం చేస్తుందని, రైతులు తమ భూముల్లో ప్రధాన పంటవేసే ముందు జీలుగను తప్పనిసరిగా వేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈఓ భూపాల్, రైతులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలు వేయాలి మనోహరాబాద్(తూప్రాన్): వాతావరణ పరిస్థితులను అనుసరించి రైతులు ఆరుతడి పంటలు వేసుకుంటే లాభాలబాట పడతారని మండల వ్యవసాయ అధికారి స్రవంతి సూచించారు. మండలంలోని కోనాయపల్లిలో పలువురి పొలాలను పరిశీలించారు. అనంతరం వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఆమె వెంట ఏఈఓ నరేందర్, రైతులు ఉన్నారు. ఏఓ బాల్రెడ్డి -
ఎన్టీఏను తక్షణమే రద్దు చేయండి
మెదక్ కలెక్టరేట్: జాతీయ పరీక్షలను నిర్వహించడంలో ఎన్టీఏ, విద్యా మంత్రిత్వశాఖ వ్యవహరిస్తున్న బాధ్యతారాహిత్యాన్ని సీపీఎం ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం మండిపడ్డారు. హెడ్ పోస్టాఫీసు చౌరస్తాలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్లో పేపర్ లీక్, క్యూట్ పరీక్షలో పొరపాట్లు, ఇప్పుడు యూజీసీ నెట్– 2024 పరీక్ష నిర్వహించడంలో వైఫల్యం కనిపిస్తుందన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సమ్మ, బస్వరాజ్, సంతోష్, బాలమణి, సత్యం అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకస్మిక తనిఖీ
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం జీడిపల్లిలో సర్వే నంబర్ 323లో గల రైతుల భూ మిని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సర్వేయర్ దత్తస్వరూప్, సిబ్బంది తదితరులు ఉన్నారు. గ్రేడ్– 2 పరీక్షలకు ç³MýS-yýl¾…© HÆ>µr$Ï: MýSÌñæMýStÆŠæḥమెదక్ కలెక్టరేట్: గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమశాఖ హాస్టళ్ల సంక్షేమ అధికారుల పోస్టుల కోసం గ్రేడ్– 2 పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని నర్సాపూర్లో గల బీవీఆర్ఐటీలో సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 3,700 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష సమయానికి గంట ముందు అభ్యర్థులను లోపలికి అనుమతి ఇస్తామ న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు. బయోమెట్రిక్ను ఇన్విజిలేటర్ క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు. అభ్యర్థులు పరీక్షకు వచ్చే ముందు కమిషన్ వెబ్సైట్లో మాక్టెస్ట్ను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ అపెండెక్స్ ప్రతిని పరీక్షా కేంద్రంలోనికి తీసుకురావాలన్నారు. పరీక్ష సమయాల్లో అభ్యర్థులకు అనుకూలంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి ఇంటికి తాగునీరు: డీపీఓ అల్లాదుర్గం(మెదక్): ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని ముస్లాపూర్, కాగితంపల్లి, అల్లాదుర్గం గ్రామాల్లో పర్యటించి సిబ్బంది సర్వేను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 23 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ మెదక్ కలెక్టరేట్: ఈనెల 23, 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సువర్ణలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈసందర్భంగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ పాలిసెట్ హాల్టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, స్టడీ సర్టిఫికెట్లు కుల, ఆదాయ ధృవపత్రాలు, టీసీ రెండుసెట్ల జిరాక్స్ పత్రాలు సైతం వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. నీట్లో అక్రమాలపై నేడు కాంగ్రెస్ నిరసన నర్సాపూర్: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా శుక్రవారం నర్సాపూర్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో నిరసనలో పాల్గొని విజయవంతం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. -
3.5 లక్షల మంది ఎదురుచూపులు
● గృహజ్యోతి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో11.45 లక్షల మంది వినిమోగదారులు ● లబ్ధిదారులు 4.71 లక్షల మందిసాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది. రేషన్ కార్డు కలిగి ఉండి 200 యూనిట్ల లోపు వినియోగిస్తే ఉచిత విద్యుత్ను అందిస్తోంది. కానీ ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణలో లోపాలతో జిల్లావ్యాప్తంగా అర్హత కలిగిన విద్యుత్ వినియోగదారులకు సగం మందికి పైగా పథకం అందడం లేదు. దీంతో గ్రామాల్లో మండల పరిషత్ కార్యాలయాలకు, పట్టణాల్లో మున్సిపాలిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రజలు కొందరు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్పప్పటికీ గృహజ్యోతి పథకం లబ్ధిని పొందలేకపోతున్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో రేషన్ కార్డు లేదని నమోదు చేస్తున్నారు. ఇంకా విద్యుత్ సర్వీస్ నంబర్ తప్పుగా పడితే ఎడిట్ అప్షన్ ఇచ్చారే తప్ప.. రేషన్ కార్డు నంబర్లను ఎంటర్ చేయడం లాంటి వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,29,448 రేషన్ కార్డులుండగా సిద్దిపేట జిల్లాలో 2,91,400, సంగారెడ్డిలో 3,24,188, మెదక్లో 2,13,860 ఉన్నాయి. సుమారుగా 3.5 లక్షల మంది అర్హత కలిగిన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డులు లేకపోవడంతో దూరం రేషన్ కార్డులు ఉన్న వారే గృహజ్యోతికి అర్హులని ప్రకటించారు. లేనివారు పథకానికి దూరమవుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా వివాహమైన వారు వేరు కాపురాలు పెట్టారు. దీంతో రేషన్ కార్డులు లేకపోవడంతో అనర్హులవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆన్లైన్లో రేషన్కార్డు నంబర్లు ఎంటర్ చేసి, అలాగే కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసి అర్హులందరినీ పథకానికి ఎంపిక చేయాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.జిల్లా కేటగిరి–1 గృహజ్యోతి డబ్బులు పేరు సర్వీస్లు లబ్ధిదారులు (రూ.కోట్లలో) సిద్దిపేట 3,47,260 1,81,365 6.10సంగారెడ్డి 5,93,030 1,76,064 6.63మెదక్ 2,05,416 1,14,027 3.19 -
చినుకు.. కినుకు
మెదక్జోన్: కార్తెలు కరిగిపోతున్నాయ్.. వానాకాలం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ జిల్లాలో సరైన వర్షాలు కురవడం లేదు. ఎండలు మండుతున్నాయి. ముందు మురిపించిన వర్షానికి జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలు వేశారు. 25 శాతం మేర పత్తి సాగు చేశారు. భూమిలో పదును లేక గింజలు మొలకెత్తడం లేదు. దీంతో వానల కోసం రైతులు ఆశగా ఆకాశానికేసి చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో అన్నిరకాల పంటలు కలిపి 3.73 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారుల అంచనా వేశారు. ఇందులో ప్రధాన పంట వరి 3.27 లక్షలు, పత్తి 40,619 ఎకరాల్లో సాగు కానుంది. జిల్లాలో పత్తి సాగు పూర్తిగా వర్షాధారంగానే సాగు చేస్తారు. కాగా జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ఇప్పటివరకు 9,500 ఎకరాల్లో పత్తి, 145 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో పెసర సాగు చేశారు. ఇక వరి వేసే రైతులు పూర్తిస్తాయిలో తుకాలు (నారుమళ్లు) పోసి వేసవి దుక్కులు సిద్ధం చేసుకొని వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రోహిణి కార్తె పోయింది. ప్రస్తుతం మిర్గం కొనసాగుతోంది. ఈనెల 22 నుంచి ఆరుద్ర రాబోతుంది. అయినా చినుకు జాడ కానరావడం లేదు. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకుంటే ముందుగా సాగు చేసిన విత్తనం మొలకెత్తదని, మరోమారు విత్తనం వేయాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పడంతో చేసేది లేక గుండెలు బాదుకుంటున్నారు. పలు మండలాల్లో లోటు వర్షపాతం ఈనెలలో ఇప్పటివరకు 79 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 81.7 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఈ లెక్కన 2.7 మిల్లిమీటర్ల వర్షం అధికంగా కురిసింది. అయితే ఇది కొన్ని మండలాల్లో మాత్రమే. జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, రేగోడ్, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయింది. పది రోజులుగా చినుకు జాడలేక పోవడంతో ముందుగా కురిసిన వర్షానికి పత్తితో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేయగా భూమిలో తడిలేక మొలకెత్తడంలేదు. అంతేకాకుండా పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి.కరిగిపోతున్న కార్తెలు.. జాడలేని వర్షాలు ఇప్పటివరకు 9,500 ఎకరాల్లో పత్తిసాగు నీటి తడి లేక మొలకెత్తని విత్తనం ఆందోళనలో అన్నదాతలు తొందర వద్దు వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతే విత్తనం వేయాలని మొదటి నుంచి చెబుతున్నాం. ఇప్పటికే 25 శాతం మేర రైతులు పత్తి పంట సాగు చేశారు. పొడి దుక్కిలో విత్తనం వేశారు. 2, 3 రోజుల్లో సమృద్ధిగా వర్షం కురిస్తేనే ఆ విత్తనం మొలకెత్తుతుంది. లేనిచో మళ్లీ విత్తనం వేయాల్సి ఉంటుంది. జూలై 15వ తేదీ వరకు విత్తు విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు తొందర పడొద్దు. – గోవింద్, డీఏఓ మెదక్ -
విద్యార్థుల శాతం పెంచాలి
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోందని, పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని గణనీయంగా పెంచాలని ఎంపీపీ స్వరూపరెడ్డి ఉపాధ్యాయులకు సూచించా రు. మండలంలోని శెట్టిపల్లికలాన్, రామాయిపల్లి, బండపోసాన్పల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరుకుల నిల్వ, రికార్డుల్లో నమోదు మధ్య వ్యత్యాసం ఉండడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షయపాత్ర ద్వారా బండపోసాన్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, వైస్ ఎంపీపీ సుధాకర్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్రెడ్డి, నాయకులు మల్లేశం, నర్సింహారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ స్వరూప -
వ్యక్తి అదృశ్యం
మనోహరాబాద్(తూప్రాన్): పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం ప్రకారం.. అస్సాంకు చెంది న రాజు సైకియా పదేళ్లుగా దండుపల్లిలో భార్య రింకు సైకియాతో కలిసి నివాసం ఉంటున్నాడు. రంగాయపల్లి శివారులో గల మోడల్ సేఫ్టీగ్లాస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత 15న విధులకు వెళ్లిన రాజు సైకియా తిరిగి ఇంటికి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి భార్య రింకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత చిన్నశంకరంపేట(మెదక్): టి.మాందాపూర్ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు నిర్వహిస్తున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ సతీశ్బాబు తెలిపారు. టి.మాందాపూర్, మందాపూర్తండా, కొర్విపల్లితండా, గజగట్లపల్లి గ్రామాలలో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు విద్యుత్ ఉండదని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం టేక్మాల్(మెదక్): మోడల్ స్కూల్ హాస్టల్లో ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి బాల మణి గురువారం తెలిపారు. అర్హతగల అభ్యర్థులు 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమచారం కోసం కేజీబీవీని సంప్రదించాలని కోరారు. పోచమ్మకు ఎమ్మెల్యే పూజలు చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని రుద్రారం గ్రామంలో పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. గురువారం రాత్రి ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అందరూ క్షేమంగా ఉండా లని ఆకాంక్షించారు. ఆయన వెంట శ్రీమన్రెడ్డి, సత్యనారాయణ, రాజిరెడ్డి, మనోజ్, సుధాకర్, రాజసింగ్, చందంపేట ఎంపీటీసీ శివకుమార్, లక్ష్మణ్, సిద్దిరాములు, నర్సింహులు, పద్మా రావు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ఉపయోగాలెన్నో.. రోజూ ఒక గంట యోగాకు కేటాయిస్తే యోగం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. శుక్రవారం యోగా డే సందర్భంగా ప్రత్యేక కథనం. వివరాలు 8లో uకొల్చారం(నర్సాపూర్): పగలు భగభగ మండే ఎండ.. సాయంత్రం కారు మబ్బుల కలవరింత.. పది రోజులుగా జాడలేని వాన.. ఇది జిల్లావ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు. తొలకరి చినుకులకు గంపెడాశతో పత్తి విత్తనాలు విత్తిన రైతులకు నిరాశే మిగిలింది. చినుకు జాడ లేకపోవడంతో పొలాలు నెర్రలు బారాయి. అప్పటికే పురుడు పోసుకున్న మొక్కలు రెండు, మూడు రోజుల్లో వర్షం కురవకపోతే ఎండిపోయేలా కన్పిస్తున్నాయి. మరికొన్ని చోట్ల భూమిలోనే గింజలు దొల్లబారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
నులిపురుగుల నివారణ తప్పనిసరి
నర్సాపూర్/వెల్దుర్తి(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): పిల్లల్లో నులిపురుగుల నివారణకు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆమె పలు మండలాల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాల్లో పాల్గొన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు విద్యార్థులకు ఆమె ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కడుపులో చెడుచేసే బ్యాక్ట్టీరియాను బయటకు పంపేందుకుగాను ప్రభుత్వం ట్యాబ్లెట్లను అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ విజయనిర్మల, రెడ్డిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు ఫౌజియా, రఘువరన్, జెడ్పీటీసీ బబియానాయక్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయిమోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్, శివకుమార్, సత్యంగౌడ్, భిక్షపతి, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి, జ్ఞానేశ్వర్, నాగరాజుగౌడ్, ఇన్చార్జి హెచ్ఎం ఆంజనేయులు, నోడల్ ఆఫీసర్ రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసాయి డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తహీనత నిర్మూలించడంతోపాటు ఎదుగుదలకు ఈ మాత్రలు ఎంతో ఉపపయోగపడతాయన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం సర్కారు బడుల్లో వసతులు కల్పిస్తున్నాయని, ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ రమేశ్గౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్గౌడ్, హెచ్ఎం సాంబయ్య, మండల వైద్యాధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేట మండల పరిధి గూడూర్లోని కస్తూర్భా బాలికల వసతిగృహంలో నివారణ మాత్రలు వేశారు. ఆరోగ్య తెలంగాణ చేయడంలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఎంపీడీఓ నాగేశ్వర్గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు యాదగౌడ్, శ్రీనివాస్గౌడ్, మహేందర్రెడ్డి, వీరేశ్ తదితరులు ఉన్నారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శివ్వంపేటలో పర్యటన ముగించుకుని వెల్దుర్తి వెళ్తుండగా పాంబండ గ్రామ శివారులో బైక్పై వస్తున్న దంపతులతోపాటు ఓ చిన్నారి అదుపుతప్పి కిందపడ్డారు. అది గుర్తించిన ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులకు నీరుతాగించి ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మందులు వేయించాలి – జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి బ్రహ్మాజీ నర్సాపూర్ రూరల్: పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు తప్పక వేయించాలని జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి బ్రహ్మాజీ తల్లిదండ్రులకు సూచించారు. రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు వయసుకు తగ్గట్లు బరువు ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత, అంగన్వాడీ టీచర్ విమలత, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నిజాంపేట(మెదక్)లో.. మండలంలోని నందిగామ, చల్మెడ, నిజాంపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్ఎంలు, గ్రామ కార్యదర్శి మొహమ్మద్ ఆరిఫ్ హుస్సేన్, ఏఎన్ఎం బాలమణి, అంజలి, ఆశా వర్కర్ బండారి లక్ష్మి, కొమ్మట బాలమణి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. మాత్రల పంపిణీ పెద్దశంకరంపేట(మెదక్): చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని 19 యేళ్లలోపు పిల్లలందరికీ తప్పకుండా నులిపురుగుల మాత్రలను వేయాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైద్యురాలు వేదశ్రీ, సీనియర్ నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్ సూచించారు. స్థానిక కస్తూర్భా విద్యాలయంలో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాణి, ఎంపీటీసీ వీణ సుభాష్గౌడ్, దాచ సంగమేశ్వర్, వైద్య సిబ్బంది సాయిలు, వెంకటేశం తదితరులున్నారు. చేగుంట(తూప్రాన్)లో.. మండల కేంద్రమైన ఎస్టీ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ నులిపురుగు నివారణ కోసం మాత్రలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు ఆయన మాత్రలను వేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అనిల్కుమార్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నివారణ వారోత్సవాలు మనోహరాబాద్(తూప్రాన్)/కొల్చారం (నర్సాపూర్): మనోహరాబాద్లో పీహెచ్సీ వైద్యు లు వికాస్ ఆధ్వర్యంలో కూచారంలో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కాళ్ళకల్లో ఎంపీటీసీ లావణ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, వైద్య అధికారులు పాల్గొన్నారు. అలాగే కొల్చారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, వైద్యాధికారి రమేష్, రంగంపేట వైద్యాధికారి హర్షిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఏడీఏ
వెల్దుర్తి(తూప్రాన్): నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి హెచ్చరించారు. కొన్ని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ పరిశీలించారు. కొనుగోలుదారులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. పంట నూర్పిడి చేపట్టేవరకు రశీదులను భద్రంగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ నర్సాపూర్: పంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికులతో ధర్నా నిర్వహించారు. అనంతరం గేటుకు వినతిపత్రాన్ని అంటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా వేతనాలు అందక కార్మికులు అప్పుల పాలవుతున్నారని వాపో యారు. కార్మికులు బందేలి, సలీం, నర్సింహులు, మల్లేశం, పోచయ్య, లింగం, పెంటయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వసతిగృహం ఏర్పాటుకు స్థల పరిశీలన వెల్దుర్తి(తూప్రాన్): కెజీబీవీ వసతిగృహం ఏర్పాటుకు మాసాయిపేటలో గర్ల్చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుకన్య గురువారం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెల్దుర్తి కేజీబీవీలోనే తాత్కాలికంగా అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ సరిపోదనే ఉద్దేశ్యంతో మాసాయిపేట ఉన్నత పాఠశాల ఆవరణలోని నాలుగు గదులను పరిశీలించినట్లు చెప్పారు. ఆఫ్లైన్ విధానంలోనే బదిలీలు చేయండి పాపన్నపేట(మెదక్): ఆఫ్లైన్ విధానంలోనే బదిలీలు చేపట్టాలని పీఆర్టీయూ మండల కార్యదర్శి పంతులు రాజు కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇటీవల చేపట్టిన పదోన్నతులలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తాయని వాపోయారు. స్కూల్ అసిస్టెంట్తో పోల్చుకుంటే ఎస్జీటీలు ఎక్కువగా ఉంటారని, కాబట్టి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్ ఇవ్వడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైభవంగా వార్షికోత్సవం కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కొత్తచెరువు తండాలో శ్రీజగదాంబ మాత, సేవాలాల్మహారాజ్ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముంగి దేవగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అర్చకుడు కిషన్ మహారాజ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ పద్మదూడ్యనాయక్, విద్యుత్శాఖ ఏడీ దశరథ్, కిషన్, దేవిసింగ్, చంద్రనాయక్ పాల్గొన్నారు. యూనిఫాంలు అందజేత రామాయంపేట(మెదక్)/టేక్మాల్(మెదక్): స్థానిక హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం మున్సిపల్ కౌన్సిలర్ బొర్ర అనిల్కుమార్, హెచ్ఎం రవీందర్గౌడ్ యూనిఫాంలు అందజేశారు. కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, ఉపాధ్యాయులు నాగేందర్, అపర్ణ, కవిత, ఏఎన్ఎంలు లక్ష్మి, స్వప్న, ఆశా వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే టేక్మా ల్ మండలం కుసంగి ఉన్నత పాఠశాలలో హెచ్ఎం విశ్వనాథం, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగమేశ్వర్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అంజయ్య, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే అభివృద్ధి
పెద్దశంకరంపేట(మెదక్): అందరూ పార్టీలకు అతీతంగా, సమష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన చివరి మండల సర్వస్వభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూలమాలలు, శాలువాలతో సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ మండ ల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి నిధులు కేటాయిస్తానని, అమ్మ ఆదర్శపాఠశాలలో పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ పనులపై గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలో మరో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని, గ్యాస్, విద్యుత్ సబ్సిడీపై సమస్యలు రాకుండా చూడాలని, విద్యుత్ సబ్ ఇంజనీర్ శంకర్పై వచ్చిన ఫిర్యా దుల మేరకు మెమో ఇవ్వాలని చెప్పారు. అలాగే వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, భగీరథ నీటి సరఫరా సక్రమంగా చేపట్టాలని సూచించారు. జూ కల్, ముసాపేటలో శిథిలావస్థలో ఉన్న తాగునీటి ట్యాంకులను తొలగించాలని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలను నాటారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీడీఓ రఫీఖ్ఉన్నీసా, తహసీల్దార్ గ్రేస్బాయి, ఎంపీటీసీ సభ్యులు వీణ సుభాష్ గౌడ్, అనితావిఠల్, మానససురేష్ గౌడ్, ఎలిషమ్మ, రాజునాయక్, సురేందర్రెడ్డి, మధు, సత్యనారాయణ, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, రాములు, సంగమేశ్వర్, శ్రీను, గోవింద్రావు, పెరుమాండ్లు, సాయిలు తదితరులున్నారు. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి -
పూర్వ విద్యార్థి సహాయం
పాపన్నపేట(మెదక్): స్థానిక ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ మన్నె ఉపేందర్ సమకూర్చిన సామగ్రిని ఆయన ప్రతినిధి అందజేశారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడు తాను చదివిన పాఠశాలకు ఫర్నిచర్, ఆర్వో ప్లాంట్ అలాగే విద్యార్థులకు బూట్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు, బోధనా సామగ్రిని ఆయన ప్రతినిధి కైలాస్ రాజేశ్వర్ ద్వారా అందజేయించారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి ప్రతాపరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎంలు మహేశ్వర్, శ్రీనివాసరావు, చైర్మన్ భవాని, మాజీ చైర్మన్ దుర్గాగౌడ్, ఉపాధ్యాయులు సంగీత, జయవర్ధన్, నాగరాజు, కిషన్, అంజాగౌడ్, రాజు, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాల్సిందే
సంగారెడ్డి : పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆర్డీఓ వసంతకుమారి సూచించారు. మంగళవారం తన చాంబర్లో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిశ్రమలలోని ప్రతీ అంశానికి సంబంధించిన వివరాలు బోర్డుపై పొందుపర్చాలని ఆదేశించారు. సమావేశంలో ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. రేపు అప్రెంటిస్ మేళా సంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 20న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎంఆర్ఎఫ్ కంపెనీలో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి వందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 08455271010 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
క్రీడా పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ఈనెల 21 నుంచి 29 వరకు జిల్లాలో క్రీడా పాఠశాలలకు ఎంపిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు హకీంపేట్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాలకు మండల, జిల్లా స్థాయిలో ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 25 తేదీ వరకు మండల స్థాయిలో ఎంఈఓల ఆధ్యర్యంలో పీడీలు, పీఈటీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో జిల్లాకేంద్రంలో.. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 28, 29 తేదీల్లో మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారికి హకీంపేట్ క్రీడా పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలో పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలకు 9347344440, 8483584388 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
నేడు కొండా సురేఖ పర్యటన
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో బుధవారం మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి మొదట కొల్చారం మండలం చేరుకొని బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మండల ప్రజా పరిషత్ భవన సముదాయానికి ప్రారంభోత్సవం, పోతం శెట్టిపల్లిలో హై లేవెల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు. అదేవిధంగా కౌడిపల్లి, నర్సాపూర్ మండలాల్లో జెడ్పీ రోడ్లకు శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. కొల్చారం, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు. పీఎం కిసాన్ ప్రోగ్రాం ప్రత్యేక ప్రసారం కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్దగల డాక్టర్ రామానాయుడు ఏకల్యవ గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషివిజ్ఞాన క్రేంద్రం (కేవీకే)లో మంగళవారం పీఎం కిసాన్ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్టింగ్ ద్వారా రైతులకు చూపించారు. కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ సంబాజీ దత్తాత్రేయ నల్కర్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పీఎం కిసాన్ సమ్మాన్నిధి 17వ విడత నిధులు పంపిణీ ప్రత్యేక ప్రసారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీకేలో చేస్తున్న సేంద్రియసాగుపై అవగాహన కల్పించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ వినియోగం గురించి వివరించారు. సేంద్రియసాగు చేసే రైతులకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీకాంత్, రవికుమార్, ఉదయ్కుమార్, శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్రెడ్డి, డాక్టర్ భార్గవి, రైతులు పాల్గొన్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు ఉచిత శిక్షణ మెదక్ కలెక్టరేట్: ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్షకు బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా లాంగ్టర్మ్ శిక్షణ ఇవ్వనున్నట్టు సంగారెడ్డి జిల్లా బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ టి.ప్రవీణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తిచేసిన యువతీ, యువకులు 13నుంచి జూలై 3వరకు స్టడీసర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉచిత శిక్షణ కోసం జూలై 7న పరీక్ష నిర్వహించి వందమంది అర్హులను ఎంపిక చేస్తామని, ప్రతినెలా లాడ్జింగ్, రవాణా చార్జీల కింద రూ.5వేలు, బుక్ఫండ్ కింద రూ.5వేలు ఇస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 08455–277015, 99495 92991 నంబర్లను సంప్రదించాలని కోరారు. సద్వినియోగం చేసుకోండి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు సివిల్స్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతి యువకులు ఈ నెల 17 నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఎస్సీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ దుకాణాలకు రీటెండర్ వేయించండి జస్టిస్ లోకాయుక్త కమిషన్కు ఫిర్యాదు మెదక్ మున్సిపాలిటీ: మున్సిపాలిటీకి చెందిన దుకాణాలకు రీ టెండర్ వేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువజన సంఘాల ఐక్య కార్యచరణ సమితి కన్వీనర్ బాల్రాజ్ ప్రభుత్వాన్ని అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని జస్టిస్ లోకాయుక్త కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెండర్లు వేయకుండా ఏళ్ల తరబడి వాయిదాలు వేస్తున్నారని, ఇప్పటికై న టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ దుకాణాలు ప్రస్తుతం బినామీల చేతుల్లో ఉన్నా యని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ నాయక్, రఘునాయక్, ప్రవీణ్కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
అల్లరి మూకలను వదిలిపెట్టం
పోలీసులు సైతం జైలుకెళ్లాల్సిందే మెదక్ మున్సిపాలిటీ: మత సామరస్యాన్ని దెబ్బతీసేలా అల్లర్లు సృష్టిస్తే అంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ డాక్టర్ బాలస్వామి హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన అల్లర్లకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. గొడవల కారణంగా ఇతర జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ను రప్పించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అవాస్తవ వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అందులో కానీ, మరేతర కారణంగా గొడవలు పెట్టాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలపై పోలీసు నిఘా ఉందని, గొడవలకు కారణమైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. గొడవలకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను గుర్తించామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. మెదక్జోన్: పోలీసులు తప్పుడు పనులు చేస్తే కచ్చితంగా వారు కూడా జైలుకు వెళ్లక తప్పదని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. మెదక్లో ఇటీవల రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మెదక్ సబ్జైల్లో ఉన్న బీజేపీ నేతలను మంగళవారం పరమర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఎస్ఐను దూషించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మెదక్ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 14 మందిని తీసుకొచ్చి టౌన్ పోలీస్స్టేషన్లో పెట్టడం సరికాదన్నారు. ఉర్దూలో ఫిర్యాదుచేస్తే కానిస్టేబుల్ దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారా? అని ప్రశ్నించారు. ఆరిఫ్ అనే వ్యక్తిని సాయంత్రంలోగా ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు జరిగిన ఘటన గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట నాయకులు పంజా విజయ్కుమార్, మురళీయాదవ్, నల్లాల విజయ్, రాజు, గణేశ్ తదితరులు ఉన్నారు. నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన ములుగు(గజ్వేల్): లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు తమను దుర్భాషలాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు వారి ఆందోళనతో కళాశాలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. గొడవలకు కారకులైన 27 మందికి రిమాండ్ ఎస్పీ బాలస్వామి తప్పుడు పనులు చేస్తే ఎవరినీ వదలం మెదక్ ఎంపీ రఘునందన్రావు -
కూరగాయల ధర దడ
● అమాంతం పెరిగిన రేట్లు ● మార్కెట్కు వెళ్తే సామాన్యుడి జేబుకు చిల్లు ● సెంచరీకి చేరువలో టమాటా.. ● మిగతావి రూ.80కి పైమాటే.. మార్కెట్లో కూరగాయల ధరలను చూస్తే.. ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’’ పాట గుర్తుకు వస్తుంది. రెండు వారాల్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రూ.500 తీసుకెళ్తే కనీసం ఐదు రకాల కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. భగ్గుమంటున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా టమాటా సెంచరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఉల్లి ఏడిపిస్తోంది. పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. దాదాపుగా కూరగాయలన్నీ కిలో రూ.80 పైనే ఉన్నాయి. కొన్నైతే సెంచరీ దాటేశాయి. వంట చేయక ముందే కూరగాయల ధరలు కుతకుత ఉడుకుతున్నాయి. – మెదక్జోన్జిల్లాలో కూరగాయాల ధరలు 15 రోజుల క్రితంతో పోల్చుకుంటే రెండింతల పెరిగాయి. టమాట కిలో ధర రూ. 30 ఉండగా ప్రస్తుతం రూ.90కి చేరింది. బీర, దొండ, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ రేటు రూ.80కి చేరగా, ములక్కాయ, బీన్స్ రూ.160 పలుకుతుంది. ఉల్లిగడ్డ, క్యారెట్, ఆలు కిలో ధర రూ.50–60 ఉంది. కేవలం రెండు వారాల వ్యవధిలో 50 నుంచి 60శాతం ధరలు పెరగటంతో సామాన్యులు కిలో కొనేదగ్గర అరకిలోతోనే సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. డిమాండ్ కొండంత... దిగుబడి గోరంత జిల్లాలో కూరగాయల డిమాండ్ కొండంత ఉండగా.. పంట ఉత్పత్తి గోరంతే ఉంది జిల్లా వ్యాప్తంగా 7,67,428 మంది జనాభా ఉన్నారు. సగటున రోజుకు ఒక వ్యక్తికి 186 గ్రాముల కూరగాయలు అవసరం ఉంటుంది. అధికారిక గణాంకాల ప్రకారం ఏడాదికి జిల్లాకు 55,208 మెట్రిక్టన్నుల కూరగాయలు అవసరం. కానీ రైతులు పండించే కూరగాయలు ఏడాది పొడవున 23,221 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఇంకా 31,987 మెట్రిక్టన్నుల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. జిల్లాకు సరిపడాలంటే... జిల్లాకు సరిపడా కూరగాయలు పండించాలంటే 7,607 ఎకరాలలో సాగు చేయాలి. కానీ ప్రస్తుతం 2,562 ఎకరాలలో మాత్రమే సాగు చేస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 5,125 ఎకరాలలో కూరగాయలు పండిస్తేనే జిల్లాకు సరిపడా ఉత్పత్తి వస్తుంది. లేదంటే ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. ఎనిమిదేళ్ల నుంచి ప్రోత్సాహం బంద్ కూరగాయలు పండించే రైతులకు ఎనిమిదేళ్లుగా ప్రోత్సాహం కరువైంది. 2016 వరకు కూరగాయల రైతులకు అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి అందేవి. ముఖ్యంగా హర్టికల్చర్శాఖ ద్వారా విత్తనాలను సగం ధరకే ఇచ్చేవారు. దీనికి తోడు డ్రిప్పును సైతం సబ్సిడీపై అందించడంతో అప్పట్లో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపేవారు. 2017 నుంచి పూర్తిగా సబ్సిడీలను ప్రభుత్వం ఎత్తివేయటంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు రకం ధర (కిలో రూ.లలో) టమాటా 90 కాలీఫ్లవర్ 100 క్యాప్సికం 80 ఉల్లిగడ్డ 50 బీన్స్ 160 క్యారెట్ 60 ఆలు 50పచ్చిమిర్చి 80దొండ 80బీర 80 ములక్కాయ 160మార్కెట్లో కూరగాయల దుకాణంరైతుల్లో ఆసక్తి తగ్గింది కూరగాయలు పండించడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతుంది. అంతా వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే జిల్లాలో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో సబ్సిడీపై విత్తనాలు ఇచ్చిన సమయంలో సాగు అధికంగా ఉండేది. – నర్సయ్య, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి, మెదక్ -
వైభవంగా దత్తాత్రేయ వార్షికోత్సవం
నారాయణఖేడ్: పట్టణంలోని దత్తాత్రేయ మందిర ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి అవదూతగిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర్ మహారాజ్, కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీబాయి, సాగర్షెట్కార్, వీర్శెట్టి, సాయిలు, శివకుమార్, శ్రీకాంత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పరమేశ్వర్, నగేష్, శివలింగ్పటేల్, హన్మండ్లు, కాశీనాథ్పటేల్, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీలో డ్రైవర్ల కొరత
ఆర్టీసీ డిపోలో పలు రూట్లలో సర్వీసులు రద్దు చేస్తున్నారు. ఇందుకు కారణం డ్రైవర్ల కొరతేనని తెలుస్తోంది. 40 మంది డ్రైవర్లకు గాను ప్రస్తుతం 36 మందే ఉన్నారు. ఇటీవల పలువురు రిటైర్మెంట్ అయ్యారు. దీంతో కొరత ఏర్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం విధులలో ఉన్న కొందరు సిక్ లీవ్లో వెళ్లగా ఇతరేత్రా అత్యవసర సెలవుల్లో ఇంకొందరు ఉన్నారు. అయితే అన్ని మార్గాల్లో సర్వీసులు నడపాలన్నది ఆర్టీసీ అధికారుల ఉద్దేశం. దీంతో స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసిన డ్రైవర్లతో, డ్యూటీకి వెళ్లి వచ్చిన వారితో డబుల్ డ్యూటీలు చేయిస్తున్నా గానీ పలు మార్గాలలో సర్వీసులు రద్దవుతున్నాయని తెలిసింది. – నర్సాపూర్ ప్రధానంగా నర్సాపూర్ బాలానగర్ మార్గంతో పాటు నియోజకవర్గంలో రోజూ పలు మారుమూల మార్గంలో సర్వీసులు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం లేదు. ఒక్కో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతున్నందునా కిక్కిరిసి ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా స్పెషల్ ఆఫ్ డ్యూటీలు చేసినా, సాధారణ డ్యూటీ చేసిన మరునాడు రెస్ట్లో వెళ్లాల్సి ఉంది. అయితే డబుల్ డ్యూటీల మూలంగా అలసిపోతున్నామని, డ్రైవర్ల కొరత కారణంగా తప్పనిసరిగా డబుల్ డ్యూటీలు చేస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన మేరకు డ్రైవర్లను భర్తీ చేసి డబుల్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా డిపోలో అవసరమైనంత మందిని భర్తీ చేసి అన్ని మార్గాల్లో బస్సు సర్వీసులు నడపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నవారితోనే డబుల్ డ్యూటీలు అయినా ఆయా రూట్లలో సర్వీసులు రద్దు! రిటైర్మెంట్ కావడంతోనే ఖాళీలు డ్రైవర్లు తక్కువగా ఉన్నారు. డిపో ప్రారంభంలో సరిపోయే అంత మంది ఉన్నా కొందరు రిటైర్మెంట్ కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర స్థాయిలో సంస్థ డ్రైవర్ల భర్తీ చేపడితే మా డిపోకు సైతం వస్తారు. దీంతో కొరత తీరుతుంది. అన్ని మార్గాల్లో సర్వీసులు నడిపించేందుకు కృషి చేస్తున్నాం. – లక్ష్మణ్, డిపో ట్రాఫిక్ ఇన్చార్జి