-
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఆత్మకూరు(ఎం): గ్రామాల అభివృద్ధ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, పోతిరెడ్డిపల్లి, పల్లెర్లలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. కొరటికల్లో శ్రీశంభులింగేశ్వర దేవాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా సీఎం రేవంత్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అనంతరం కొరటికల్ బిక్కేరు వాగు వద్ద నిర్మిస్తున్న చెక్డ్యామ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మశ్రీశైలం, జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖరరెడ్డి, ట్రాన్స్కో డీఈ దంతూరి మల్లిఖార్జున్, ఎంపీటీసీలు యాస కవిత, మిర్యాల వెంకటేశ్వర్లు, సోలిపురం మల్లారెడ్డి, బండ హంసమ్మ, కాంగ్రేస్ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, దేవాలయ కమిటి చైర్మన్ మురారిశెట్టి సురేష్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
నీట్లో అక్రమాలపై విచారణ జరిపించాలి
భువనగిరిటౌన్ : నీట్లో అక్రమాలపై విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తె లిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీట్ లీకేజీపై కేంద్రం స్పందించకుండా, ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో వారి స్కోర్ కార్డులు రద్దు చేసి, వారికి మళ్లీ రీ –ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టించడమేనని ఆరోపించారు. నీట్పై ప్రజలకు అనేక అనుమానా లు ఉన్నాయని సమాధానం చెప్పే బాధ్యత ప్రధానమంత్రి మీద ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, నాయకులు ఏదునూరి మల్లేష్, బందెల ఎల్లయ్య, కొండ అశోక్, ఓవల్ దాస్ అంజయ్య, భాగ్య, రాంబాబు, సాహి ద్, పాలడుగు రవి,రియాజ్, నితిన్ పాల్గొన్నారు. వలిగొండ : నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని మల్లెపెల్లిలో మెయిన్ రోడ్డు వెంట ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాటూరి బాల్ రాజు, సిర్పంగి స్వామీ, తుర్కపెల్లి సురేందర్, మెరుగు వెంకటేశం, గరుదాసు నర్సింహా, సత్తయ్య, స్వామి, లక్ష్మ య్య, కుమార్, శంకరయ్య, నర్సింహ పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వలిగొండ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఏదుళ్లగూడెం వద్ద శ్రీ వేంకటేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని ఏదుళ్లగూడెంలో చౌటుప్పల్ లోని దివీస్ ల్యాబరేటరీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రూ.5 లక్షల 36 వేల విలువగల వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించారు. ధర్మారెడ్డిపల్లె కాల్వ ద్వారా గొల్లెపెళ్లి లోగల రామసముద్రం చెరువును నింపాలని ఆయకట్టు రైతులు ఆయనను కోరగా వెంటనే స్పందించిన ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి కాల్వను పరిశీలించారు. చెరువు నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్లెపెళ్లి బీటీ రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ఈ గోపాల్, డీ ఈ శాంతి, ఏఈ అర్జున్, ప్రత్యేక అధికారి దివ్యా, వాకిటి అనంత రెడ్డి, గూడూరు వెంకట్ రెడ్డి, గూడూరు శివకాంత్ రెడ్డి, కందాల రామకృష్ణా రెడ్డి, పబ్బు ఉపేందర్ బోస్, గరిసె రవి, పలుసం సతీష్ , సంజీవ రెడ్డి, కొలను శ్రీనివాస్ రెడ్డి, బోధపట్ల జాన్ రెడ్డి, కొలను వెంకట్ రెడ్డి, ఏనుగు దాన్ రెడ్డి, కొలను ప్రతాప రెడ్డి, గూడూరు యాదిరెడ్డి, దివీస్ అధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి -
ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలో, లింగరాజుపల్లిలో ఎరువుల దుకాణాలను గురువారం ఆలేరు ఏడీఓ వెంకటేశ్వర్రావు తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన ధరకే విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈఓ సరిత ఉన్నారు. సంస్థాన్ నారాయణపురం: మండలంలోని వావిళ్లపల్లి గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను గురువారం డీఏఓ అనురాధ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులును పరిశీలించారు. ఎరువులు, విత్తనాలను ధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటమాన్నారు. అనంతరం సర్వేల్, సంస్థాన్ నారాయణపురంలో ఆయిల్ ఫాం తోటలను, పత్తి చేలను పరిశీలించారు. ఆమె వెంట ఏఓ ఉమారాణి, ఏఈవోలు నవీన్, అరుణ, పరశురాం పాల్గొన్నారు. -
నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం
బొమ్మలరామారం : నులిపురుగుల నివారణతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం మండలంలోని కేజీవీబీ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, ఎంపీటీసీ యాదమ్మ, వైధ్యాధికారి డాక్టర్ సుమలత, ఆయుష్ డాక్టర్ క్రాంతి కుమార్, సీహెచ్వో మురళీధర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ జనార్ధన్, ఫార్మసిస్ట్ శంకర్, ఏఎన్ఎం షకీరా పాల్గొన్నారు. ఆల్బెండజోల్ మాత్రల పంపిణీభువనగిరి రూరల్ : మండలవ్యాప్తంగా గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని బస్వాపురం గ్రామంలో గురువారం ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, అనంతారం గ్రామంలో ఎంపీడీఓ శ్రీనివాస్లు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి యామిని, డాక్టర్ విజయదుర్గ, ప్రధానోపాధ్యాయులు కష్ణవేణి, లింగయ్య, ఏఎన్ఎం విజయ, మహమూన, అంగన్వాడి టీచర్లు సాహిన్బేగం, ఎంపిటిసి గునుగుంట్ల కల్పన, సామల వెంకటేశం, ఉడుత ఆంజనేయులు, కంచి లలిత మల్లయ్య, బొక్క కొండల్రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట రూరల్ (ఆలేరు రూరల్): జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు పట్టణంలోని ఆర్పీఆర్పీ, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ కుమార్, ప్రిన్సిపాల్ సునీత, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట : నులిపురుగుల నివారణలో ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీపీ పూస బాలమణిఅ అన్నారు. గురువారం ఇంద్రపాలనగరంలో జాతీ య నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అశ్వినికుమార్, ఎంపీటీసీలు బడుగు రమేష్, గాదె పారిజాత, హెచ్ఈఓ గోపాల్, సూపర్వైజర్లు అండాలు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నట్లల నివారణకు మందుల పంపిణీమోటకొండూర్: మండలవ్యాప్తంగా గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ శాంతిలాల్, విజయ్, జయంత్, ప్రవీణ్, నర్సయ్య, కృష్ణారెడ్డి, సుగుణ, ధనమ్మ, మమత, సునీత, యాకయ్య, సందీప్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. గుండాల : మండల కేంద్రంలోని కసూర్బా గాంధీ పాఠశాలలో గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, మండల వైద్యాధికారి డాక్టర్ హైమావతి, ఎంపీడీఓ దేవిక, ఎస్ఓ విజయలక్ష్మి, ఏఎన్ఎం స్వర్ణలత, ఎం.డి.ఖలీల్, రాములు పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం): మండలవ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల వైద్యాధికారి విలియం కేరి, ప్రధానోపాధ్యాయుడు కె. మహదేవరెడ్డి, సిబ్బంది సాంబులమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాలలో గురువారం జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, మండల వైద్యాధికారి హేమంత్కుమార్, డాక్టర్ అమరావతి, ప్రధానోపాధ్యాయులు తీపిరెడ్డి గోపాల్రెడ్డి, సీహెచ్వో దేవకి, వైద్య సిబ్బంది రాములమ్మ, సైదమ్మ పాల్గొన్నారు. భూదాన్పోచంపల్లి : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, మండల వైద్యాధికారిణి శ్రీవాణి, లక్ష్మ ణ్బాబు, లత తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని -
పీహెచ్సీని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలని వినతి
మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా మార్చడంతో పాటు ఆసుపత్రిలో శవ పరీక్ష కేంద్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరు తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యోగాతో మానసిక ప్రశాంతతభువనగిరి : యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడెం రాజశేఖర్ అన్నారు. గురువారం పట్టణంలోని రాంనగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ గునుగుంట్ల శ్రీనివాస్గౌడ్, గౌరవ అధ్యక్షుడు చింతకింది కృష్ణమూర్తి, సభ్యులు చామల వెంకటనారాయణరెడ్డి,మల్లీకార్జునచారి, పడాల భాస్కర్,యాదగిరి, ఉపేందర్, శ్రీనివాస్రెడ్డి,వెంకట్రెడ్డి, శంకర్రెడ్డి, రాజు, శ్రీనివాస్, రవీందర్, యాదగిరి, ఇస్తారి, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ : యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురువు పాలకూర్ల పాండు అన్నారు. పట్టణ కేంద్రంలోని విద్యానగర్కాలనీలో సర్వేజన సుఖినోభవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముటుకుల్లోజు నీరజ, పోలోజు శ్రీలత, చింతల రజిత, వనం మమత, ధనలక్ష్మి, ఊడుగు కల్పన, పద్మ, వెంకటమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేతబీబీనగర్: మండలంలోని గుర్రాలదండి, జంపల్లి, మాదారం, రావిపహాడ్, ముగ్దుంపల్లి, గొల్లగూడెం, భట్టుగూడెం గ్రామాల్లో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపియనున్నట్లు ట్రాన్స్కో ఏఈ మనోహర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్రాలదండి సబ్స్షేషన్లో మరమ్మతు పనులు ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ధర్నాను జయప్రదం చేయాలిభువనగిరిటౌన్ : ఈ నెల 24న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి బోడ ఉదయభాగ్య అన్నారు. గురువారం తెలంగాణ మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు పసుపుల బుచ్చమ్మ , వసంత, వరమ్మ, లక్ష్మీ, లలిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య గుండాల : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంపీపీ తాండ్ర అమరావతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ దేవిక, డాక్టర్ హైమావతి, ఎండీ ఖలీల్, రాములు పాల్గొన్నారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషిఆత్మకూరు(ఎం): విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కేజీబీవీ ప్రత్యేక అధికారి ఎం.పద్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవి విద్యార్థులకు నోట్ , పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది స్వరూప, సంధ్యారాణి, జావెద్సుల్తానా, అంజుమర, సరిత, మహేశ్వరి, రజిత పాల్గొన్నారు. నోట్బుక్స్ పంపిణీరాజాపేట : మండలంలోని దూదివెంకటాపురం గ్రామంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు గ్రామానికి చెందిన నక్కీర్త కనకరాజు గురువారం నోట బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, ఎంపీటీసీ ఎర్రోళ్ల స్వరూప బాబు నాయకులు వగల భిక్షపతి, ధర్మారెడ్డి, రాజు, సిద్దులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బొమ్మలరామారం : మండలంలోని మైలారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం బండ బాబురావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు డాక్టర్ సిరి వెన్నెల, రేవంత్ కుమార్లు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరివెన్నెల, మాజీ సర్పంచ్ బండ వెంకటేష్, అశోక్, శ్యామల్ రెడ్డి, గిరి ప్రసాద్, మహేష్, బాబు, సుల్తాన, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం తగదు
భువనగిరిటౌన్ : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ భువనగిరి బ్లాక్ అధ్యక్షుడు చిక్కుల వెంకటేశం అన్నారు. గురువారం భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినందునే వల్లందాస్ ఆదినారాయణ పార్టీ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పాశం శివానంద్, మందడి లక్ష్మి నరసింహ రెడ్డి, ఎల్లంల జంగయ్య, నాగయ్య, కృష్ణ, చిన్నం శ్రీనివాస్, ఏడు మేకల మహేష్, బాలేశ్వర్ పాల్గొన్నారు. టీడీపీని బలోపేతం చేస్తాంచౌటుప్పల్ : రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. గురువారం మండలంలోని అల్లాపురం, పీపల్పహాడ్, దేవలమ్మనాగారం, కొయ్యలగూడెం గ్రామాల్లో ఊరూరా టీడీపీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ బడుగు లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భువనగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కుందారపు కృష్ణమాచారి, నాయకులు వర్కాల వెంకటేశం, నల్ల పర్వతాలు, పాశం రఘుపతి, యాట వెంకటేశం, పోలోజు గోవిందచారి, సుంకరి జంగయ్య, కోటేశ్వర్, గోగినేని కృష్ణ, సిలివేరు రాజు, పోలోజు ఉపేంద్రచారి, సుబ్బారావు, రాంరెడ్డి, లింగస్వామి, యాదయ్య, మహేష్ పాల్గొన్నారు. రైతులు కూరగాయల సాగుపై దృష్టిపెట్టాలిభువనగిరి రూరల్ : ౖరెతులు కూరగాయల సాగుపై దృష్టిపెట్టాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సీహెచ్ నరేష్ అన్నారు. మండలంలోని గౌస్నగర్ రైతు వేదికలో ఏజీఐ గ్లాస్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ విద్యాలయం శాస్త్రవేత్త నా రాయణరెడ్డి, ఉద్యానవన అధికారి సైదులు, వ్యవ సాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, ఏజీఐ ప్రతినిధులు జోగిరెడ్డి, అమిత్, రాజేష్దాస్ పాల్గొన్నారు. -
నేడు పోచంపల్లి అర్బన్ బ్యాంకు ఎన్నికలు
● ముగిసిన ఎన్నికల ప్రచారం ● 9 డైరెక్టర్ల స్థానాలకు 27 మంది పోటీ భూదాన్పోచంపల్లి : పది రోజులుగా హోరాహోరీగా సాగిన పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల ప్రచారం గురువారం ముగిసింది. తొమ్మిది డైరెక్టర్ల స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజు చైర్మన్ అభ్యర్థులు తడక రమేశ్, కర్నాటి వెంకటబాలసుబ్రహ్మణ్యం, సూరెపల్లి రమేశ్ తమ ప్యానెల్తో కలిసి ప్రచారం నిర్వహించారు. అలాగే గోలి యా దగిరి, మాటూరి రామకృష్ణ, రావుల యాదగిరి ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు. 6 పోలింగ్ బూత్లు ఏర్పాటు పోచంపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి, డిప్యూటీ రిజిస్ట్రార్ గోలి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 3 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. 9 డైరెక్టర్ల స్థానాలకు గాను 27 మంది పోటీ పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఒక ఎస్సీ స్థానానికి ఇద్దరు, రెండు మహిళా రిజర్వు స్థానాలకు ముగ్గురు, 6 జనరల్ స్థానాలకు 22 మంది మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బ్యాంకు పరిధిలో 2,301 ఓటర్లు ఉన్నారు. వీరికోసం 6 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. -
రికార్డులు పక్కాగా ఉండాలి
రామన్నపేట : ఉపాధిహామీ పనుల రికార్డులు ప క్కాగా నిర్వహించాలని అడిషనల్ డీఆర్డీఓ గుర్రం సురేష్ సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ రికార్డులను గురువారం ఆయన పరిశీలించారు. ఉపాధిహామీ పనులను పరిశీలించేందుకు జూలై మొదటి వారంలో కేంద్రం బృందం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. గుడ్ గవర్నెన్స్ పా రామీటర్స్, ఏడు రకాల రిజిష్టర్లు, వర్క్సైట్ బోర్డులను కేంద్ర ప్రతినిధులు పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాకుబ్నాయక్, ఏపీఓ వెంకన్న, టెక్నికల్ అసిస్టెంట్లు, సీఓలు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
ఆత్మకూరు(ఎం): పీఎం కిసాన్ యోజన 17వ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాఽథ్ మాట్లాడుతూ రైతుల కష్టాలు చూసి నరేంద్ర మోదీ 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరు మోదీకి జేజేలు పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అంబోజు ఆంజనేయులు, నాయకులు బండారు సత్యనారాయణ, పైళ్ళ ప్రశాంత్, పరకాల రాంబాబు, స్వామి, బోడ స్వామి పాల్గొన్నారు. బొమ్మలరామారం : పీఎం కిసాన్ యోజన నగదు రైతుల ఖాతాల జమ చేయడంతో పాటు పలు పంటలకు మద్దతు ధర పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగినేనిపల్లి ఎంపీటీసీ సభ్యులు ఫక్కీరు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, నాయకులు నవీన్, గణేష్, మధు, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోత్కూరు : కేంద్రం ప్రభుత్వం వరితో పాటు పలు పంటకు మద్దతు ధర పెంచడం హర్షనీయమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోచం సోమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
No Headline
సహృదయ వృద్ధాశ్రమంలో అన్నదానం భువనగిరి రూరల్ : పట్టణానికి చెందిన పాదరాజు వసంత వర్ధంతి సందర్భంగా గురువారం రాయగిరిలోని సహృదయ వృద్ధాశ్రమంలో ఆమె కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాదరాజు వెంకటేశ్వర్లు, పాదరాజు రాకేష్, సునీల్, నరేష్ పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శికి సన్మానంభువనగిరి : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెరేషన్ కార్యదర్శిగా నియమితులైన బాలకృష్ణను గురువారం జిల్లా యువజన క్రీడల అభివృద్ధి కార్యాలయంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ధనంజయనేయులు సన్మానించారు. అనంతరం వారు ఈ నెల 28న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణంలో జరిగే తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశా ల కోసం ఎంపిక పోటీలకు స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి భువనగిరిటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల ఎల్లయ్య వల్దాస్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కల్వర్టు పరిశీలన రామన్నపేట : మండలంలోని సిరిపురం గ్రామం నుంచి వెల్మినేడుకు వెళ్లే దారిలో ధర్మారెడ్డిపల్లి కాలువ వెంట ప్రమాదకరంగా ఉన్న కల్వర్టును గురువారం టీడీపీ నాయకులు పరిశీలించారు. ఆయనవెంట టీడీపీ రాష్ట్రకార్యదర్శి రాపోలు నర్సింహ, గోశిక చక్రపాణి, పున్న వెంకటేశం, సాయని శేఖర్, గాదె జాని, గంజి వీరయ్య, కొంపల్లి వీరేశం, యాదయ్య, సత్తయ్య ఉన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీసంస్థాన్ నారాయణపురం: మండలానికి చెందిన 37మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గుత్త ఉమాదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికసాయం అందజేత చౌటుప్పల్ : మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంధుడు ముద్దం యాదయ్యకు రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రూ.15వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి ఎంఏ.ఖయ్యూం, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య , మాజీ సర్పంచ్ సుమిత్రసత్తయ్య,నల్ల నర్సింహ, యాట శంకరయ్య, బొమ్మని యాదయ్య, సుర్వి చిన్నరాములు, ముద్దం సాయిరాం, రాజేష్, బద్దం చేతన్, బీమగోని గణేష్ పాల్గొన్నారు. మాజీ మంత్రి జానా రెడ్డిని కలిసిన నాయకులు భువనగిరిటౌన్ : పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం మాజీ మంత్రి కె. జానారెడ్డిని కలివారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పిట్టల బాలరాజు, జలీల్, రమేష్ తదితరులు ఉన్నారు. రామన్నపేట : మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం మాజీ మంత్రి కె.జానారెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎంపీటీసీ ఎండీ రెహాన్, గోదాసు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసంభువనగిరి రూరల్ : మండలంలోని చందుపట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి , ఆరోగ్య సిబ్బంది సునిత, అంగన్వాడీ టీచర్ దంతూరి భాగ్యమ్మ, సంధ్య, మంగమ్మ పాల్గొన్నారు. ఉచిత వైద్యశిబిరం యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని మల్లాపురం గ్రామంలో మెడ్సిటీ ఆస్పత్రి సకారంతో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ వీర య్య, శిఖ అరవింద్ గౌడ్ ,భవిత, దస్తగిరి, అక్ష య, బాబు గౌడ్, సురేష్, రఘు పాల్గొన్నారు.సంక్షిప్త సమాచారం -
రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లిలోని కాటమయ్య గుడి పక్కన నివాసముంటున్న మద్దెల ఇస్తారి ఇంటి వద్ద తన బంధువు వెంకటేష్ రెండు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు స్పెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలకు నిప్పుపెట్టారు. ఉదయం మద్దెల ఇస్తారి కుటుంబ సభ్యులు చూసేసరికి వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ సీజ్మోత్కూరు : ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ను గురువారం మండల విద్యాధికారి వి.శ్రీధర్ సీజ్ చేశారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు , ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట నోడల్ అధికారి టి.గోపాల్రెడ్డి ఉన్నారు. -
నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్య తీసుకోవాలి
చౌటుప్పల్ : నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్య తీసుకోవాలని ఎన్ఎస్యూఐ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని రాజీవ్స్మారక భవనంలో గురువారం జరిగిన ఎన్ఎస్యూఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డొనేషన్ల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. పుస్తకాలు, నోట్పుస్తకాలు, దుస్తులు, టై, బెల్టులు, షూ, విక్రయాలు నిర్వహిస్తూ కొత్త దందాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొనేషన్ల వసూళ్లు, పుస్తకాల విక్రయాల దందాలను అరికట్టాలని అధికారులను కోరారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలల యాజమాన్యాలు తమ తీరును మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్, శ్రీధర్, శ్రావణ్, ముజాహిద్, అజయ్, సాయికుమార్, మధు, శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు. దేదీప్య హైస్కూల్ ఎదుట ధర్నా.. భువనగిరి : అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్న పట్టణంలోని దేదీప్య హైస్కూల్ ఎదుట గురువారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి వచ్చి పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎండీ మసూద్, సన్నీ, అసద్,కార్తీక్, వరుణ్, ఫీరోజ్, కౌశిక్ పాల్గొన్నారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలిభువనగిరి : విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో అక్రమంగా నోటు బుక్స్, యూనిఫాం, టై, బెల్ట్ అమ్మడాన్ని నిరసిస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు చేరుకుని నోటుబుక్స్ ఉన్న గదిని సీజ్ చేశారు. కార్యక్రమంలో ఈర్ల రాహుల్, నేహల్, భవానీ, శంకర్, జగన్ పాల్గొన్నారు. -
మట్టి పరీక్షల మాటే లేదు!
నిధులు వస్తలేవు 2021 సంవత్సరం వరకు మట్టి నమూనా పరీక్షలు సవ్యంగా కొనసాగాయి. ఆ తరువాత నుంచి పరీక్షలకు అవసరమైన కిట్లు, రసాయనాలు, ద్రావణాలు సరఫరా చేయడం లేదు. నిధులు కూడా కేటాయించకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. రైతులు మట్టి నమూనాలను తీసుకొని పరీక్ష కేంద్రాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. నిధులు కేటాయిస్తే వాటిని వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంది. –అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి రాజేంద్రనగర్లో పరీక్ష చేయించాను నాకు పది ఎకరాల భూమి ఉంది. భూసార పరీక్షల కోసం వ్యవసాయ అధికా రులను సంప్రదించగా కిట్లు, రసాయనాలు లేవని చెప్పారు. వారి సూచన మేరకు మట్టి నమూనాలను రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లి చేయించాను. నేల స్వభావానికి అనుగుణంగా ఏ పంట వేయాలి, ఎరువులు ఎలా విని యోగించాలో అవగాహన లేక నష్టపోతున్నాం. ప్రతి క్లస్టర్లో భూసార పరీక్షలు చేయాలి. –లింగస్వామియాదవ్, భూదాన్పోచంపల్లిభువనగిరి టౌన్ : వ్యవసాయ రంగంలో ఆశించిన ఫలితాలు రావాలన్నా, అధిక దిగుబడులు సాధించాలన్నా భూసార పరీక్షలు కీలకం. అందుకోసం ఏటా మట్టి పరీక్షలు నిర్వహించి, పోషకాల శాతంపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. తద్వారా అనువైన పంటలు సాగు చేసి మెరుగైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ, భూసార పరీక్షలపై నిర్లక్ష్యం ఆవహించింది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లా కేంద్రంలో భూసార పరీక్ష కేంద్రాన్ని తెరిచేవారు కూడా కరువయ్యారు. నష్టపోతున్న రైతులు ఏడాదికి మూడుసార్లు భూసార పరీక్షలు చేయాల్సి ఉంది. తద్వారా భూమిలో లవణశాతం ఎంత ఉంది, ఎటువంటి పంటకు అనుకూలం, ఏ మేరకు రసాయనాలు అవసరమవుతాయి, వాటిని ఎంత మోతాదులో వినియోగించాలి.. తదితర అంశాలు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ, రైతులకు వీటిపై అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా పంటలు వేసి దిగుబడి రాక నష్టపోతున్నారు. సమస్యను అధిగమించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల సాగులో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి జిల్లాలోని 17 మండలాల్లో క్లస్టర్ల వారీగా 92 రైతువేదికలు నిర్మించింది. ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది. వీటిలోనే భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏఈఓ కార్యాలయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా మూడేళ్లుగా పరీక్షలు నిలిచిపోయాయి. కిట్లు, రసాయనాల కొరత 2017–18 నుంచి 2020–21 సంవత్సరం వరకు మట్టి నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. ఏఈఓలకు భూసార కిట్లు పంపిణీ చేయడంతో 2021వరకు ప్రక్రియ సజావుగా కొనసాగింది. 2021–22 నుంచి రసాయనాలు సరఫరా చేయకపోవడం, నిధుల కొరతతో ప్రక్రియ నిలిచిపోయి పరికరాలు నిరుపయోగంగా మారినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొందరు రైతులు డబ్బులు చెల్లించి భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు. మరికొందరు రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రానికి తీసుకెళ్తున్నారు. రానున్న రబీ సీజన్ నుంచి అయినా భూసార పరీక్షలు నిర్వహించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మూడేళ్ల క్రితం నిలిచిన భూసార పరీక్షలు ఫ వానాకాలం సీజన్ మొదలైనా కానరాని సన్నద్ధత ఫ కిట్లు, రసాయనాలు లేవంటున్న వ్యవసాయ అధికారులు ఫ రాజేంద్రనగర్ వెళ్తున్న రైతులు -
పది రోజుల్లో పనులు పూర్తి కావాలి
భువనగిరి టౌన్ : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కే.జండగే ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్య, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో 532 పాఠశాలల్లో పనులు చేపట్టగా ఇప్పటి వరకు 350 పాఠశాలల్లో పూర్తయ్యాయని, మిగతా స్కూళ్లలో పది రోజుల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. పూర్తయిన పనులను పరిశీలించి వాటి నాణ్యతను చెక్ చేయాలని పేర్కొన్నారు. నాణ్యతగా లేకపోతే సరిచేయాలన్నారు. వానాకాలం సీజన్ నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి పాఠశాలల పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టరు గంగాధర్, జెడ్పీ సీసీఓ శోభారాణి, డీఈఓ నారాయణరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఎంఈఓలు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ రకాల పోటీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతు కే.జెండగే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం భూదాన్పోచంపల్లి మండలం విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 2.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షకు 408 అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పబ్లిక్ కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకో వాలని వివరించారు. పరీక్ష కేంద్రం గేటు ఉదయం 9.30కి, మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తారని, అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్కోఇ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు అనుమతించబడవన్నారు. చెప్పులు మాత్రమే ధరించి రావాలని సూచించారు. పరీక్షహాల్ లోపల చెక్ఇన్ విధానంలో బయోమెట్రిక్ ఉంటుందని, చేతులకు మెహంది, టాటూలతో రావద్దన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాతే బయటకు వెళ్లాలన్నారు. ఫ కలెక్టర్ హనుమంతు కే.జెండగే ఆరోగ్యానికి మించిన సంపద లేదు వలిగొండ : ఆరోగ్యానికి మించిన సంపద లేదని, విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ హనుమంతు కే.జండగే పేర్కొన్నారు. గురువారం వలిగొండలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు వారందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పాపారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, డాక్టర్లు వంశీ కృష్ణ, సుమన్ కల్యాణ్, హెచ్ఎం సుంకోజు భాస్కర్, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్జీటీల దరఖాస్తులు పరిశీలన
భువనగిరి : ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి కోసం ఎస్జీటీల నుంచి వచ్చిన దరఖాస్తులను గురువారం అధికారులు పరిశీలించారు. జిల్లాలో 500 ఖాళీలు ఉండగా పదోన్నతుల కోసం 1,250 మంది ఎస్జీటీలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాదాద్రిలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టి స్వయంభూలకు నిజాభిషేకం తులసీదళాలతో అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కైంకర్యాలు గావించారు. సాయంత్రం జోడు సేవలను మాడ వీధిలో ఊరేగించారు. పారాఫిట్ వాల్పైవిద్యుత్ లైట్ల పునరుద్ధరణ యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని పారాఫిట్ వాల్పై విద్యుత్ దీపాల పునరుద్ధరణకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలు కొనుగోలు చేసి పారాఫిట్ వాల్పై ఏర్పాటు చేశారు. కాగా నిర్వహణ లేకపోవడంతో రెండేళ్లకే మూలనపడ్డాయి. దీనిపై శ్రీమూలనపడ్డ పారాఫిట్ లైట్లుశ్రీ శీర్షికతో గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. పాడైపోయిన విద్యుత్ దీపాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఎలక్ట్రీషియన్లు కొన్ని లైట్లను బిగించారు. మిగతా వాటిని కూడా త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ను సన్మానించిన సీపీ భువనగిరి క్రైం : పాన్ ఇండియా నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ అనిల్కుమార్ను గురువారం రాచకొండ సీపీ తరుణ్జోష్ సన్మానించారు. 800, 1500,5000 పరుగు పందెంలో అనిల్కుమార్ బంగారు పతకాలు సాధించారు. ఫిబ్రవరిలో థాయిలాండ్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లోనూ నాలుగు గోల్డ్మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న అనిల్కు సహాయ, సహకారాలు అందజేస్తామని సీపీ పేర్కొన్నారు.కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. వసతి గృహాలపై నమ్మకం పెంచండి భువనగిరిటౌన్ : వసతి గృహాలను శుభ్రంగా ఉంచడంతో పాటు నాణ్యమైన ఆహారం అందజేసి విద్యార్థుల్లో నమ్మకం పెంచాలని సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్ తోటకూరి అనురాధ సూచించారు. జెడ్పీ కార్యాలయంలో గురువారం జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు, సమస్యలను గుర్తించేందుకు అధికారులు నెలలో ఒకరోజు హాస్టళ్లలో బస చేయాలన్నారు. ఇంటి భోజనం మాదిరిగా వంటకాలు ఉండాలన్నారు. మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
అడ్డగూడూరు : పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను దూరం చేయవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ పాపారావు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించడం ద్వారా రక్తహీనత సమస్య ఏర్పడుతుందని, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా నివారించవచ్చన్నారు. అడ్డగూడూరు మండలంలోని 73 శాతం మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అంతకుముందు ప్రాథమిక అరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు అందజేస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, మండల వైద్యాధికారి ప్రవీణ్కుమార్, డాక్టర్ సుమన్, ప్రిన్సిపల్ రూప పాల్గొన్నారుఫ డీఎంహెచ్ఓ పాపారావు -
ఉపాధ్యాయ సంఘాల పదవులకు రాజీనామా
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండల పరిధిలోని పీఆర్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్, డీటీఎఫ్, టీయూటీఎఫ్, టీపీయూఎస్ సంఘాల ఉపాధ్యాయులు తమ పదవులకు గురువారం రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాగంగా ఎస్జీటీలకు కామన్ సీనియార్టీ విషయంలో అన్యాయం జరుగుతుందని, ఏ సంఘం కూడా వారికి బాసటగా నిలువకపోవడంతో తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. భాషా పండితుల పదోన్నతుల్లో కామన్ సీనియార్టీ ఆధారంగా అర్హత గల ఎస్జీటీలకు అవకాశం కల్పించాలని, ఎల్ఎఫ్ఎల్, పీఎస్హెచ్ఎం పదోన్నతుల్లో బీఈడీ వారిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నమిలే భరత్కుమార్, గడ్డమీది పాండురంగం, రామకృష్ణ, కమలాకర్, వెంకటేష్, రాములు, లక్ష్మీనరసింహ, శైలజ, సంధ్య, సుమిత్ర, మంజూల, అంజలి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ అడ్మిషన్లు డీలా..
మూడో విడతలో చేరే అవకాశం దోస్త్ ద్వారా నిర్వహించిన రెండు విడతల కౌన్సిలింగ్లో ఎంజీయూ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో అడ్మిషన్లు పూర్తికాకపోవడం, ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకపోవడంతో తక్కువ మంది విద్యార్థులు డిగ్రీలో చేరారు. మూడవ విడతలో ఆశించిన స్థాయిలో విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. – డాక్టర్ ఎ.రవి, దోస్త్, కోఆర్డినేటర్, ఎంజీయూ ఫ సంప్రదాయ కోర్సుల్లో చేరడానికి విద్యార్థుల విముఖత ఫ మొత్తం 24,000 సీట్లకు నిండినవి 3,690 మాత్రమే ఫ 16 శాతం కూడా దాటని అడ్మిషన్లు ఫ రెండు విడతల్లోనూ కానరాని పురోగతి ఫ ఆశలన్నీ ఇక చివరి దశ కౌన్సిలింగ్పైనే.. ●ఇది కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో గతంలో డిగ్రీ సీటు కావాలంటే మంత్రుల స్థాయిలో పైరవీలు చేయించినా దొరకని పరిస్థితి ఉండేది. అన్ని హంగులున్న ఈ కళాశాలలో డిగ్రీ స్థాయిలో 420 సీట్లు ఉండగా ఈ విద్యాసంవత్సరం దోస్త్ మొదటి విడతలో 28 మంది, రెండో విడతలో 30 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. అధ్యాపకులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తమ కళాశాలలో చేరాలని విద్యార్థులను వేడుకుంటున్నారు. కోదాడ : డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డిగ్రీ సంప్రదాయ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తిచూపడంలేదు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కాలేజీలు నేడు వెలవెలబోయే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు విడతల్లో దోస్త్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించినా 16 శాతం కూడా అడ్మిషన్లు దాటలేదు. 10 కాలేజీల్లో అడ్మిషన్లు నిల్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 62 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 24,000 సీట్లు ఉన్నాయి. వీటిలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్ట్) ద్వారా గత నెల 6 నుంచి ప్రభుత్వం అడ్మిషన్లు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.ఇప్పటి వరకు నిర్వహించిన రెండు విడతల కౌన్సిలింగ్లో 3,699 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 10కి పైగా కళాశాలల్లో ఒక్కరూ కూడా చేరలేదు. 20 కళాశాలల్లో 10 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు చేరారరు. జిల్లాలోని మూడ కళాశాలల్లో మాత్రమే మూడంకెల స్థాయిలో విద్యార్థులు చేరారు. ఆయా కాలేజీలు ఇక మూడో విడత కౌన్సిలింగ్పై ఆశలు పెట్టుకున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వస్తే మూడో విడతలో విద్యార్థుల చేరుతారని భావిస్తున్నారు. ఆదరణ కోల్పోయిన సంప్రదాయ కోర్సులు డిగ్రీ స్థాయిలో గతంలో ఎంతో ఆదరణ ఉన్న బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ (బీజెడ్సీ), బీఏ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు మాత్రం ఇష్ట పడడం లేదు. ప్రస్తుతం డిగ్రీలో చేరిన వారిలో 50 శాతం మంది విద్యార్థులు కేవలం బీకాం బ్రాంచికి చెందినవారే కావడం గమనార్హం. కొన్ని కళాశాలలు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టినా విద్యార్థుల నుంచి ఆదరణ లభించడం లేదని పలు కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. పట్టణాల్లో లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తూ పది, ఇరవై మంది విద్యార్థులతో కళాశాలలు నడప లేక పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూసివేతకు సిద్ధమవుతున్నారు. ఎంజీయూ పరిఽధిలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ఇలా.. కళాశాలలు సంఖ్య మొత్తం సీట్లు మొదటి దశలో రెండో దశలో చేరినవారు చేరినవారు ప్రభుత్వ 11 6,060 1,114 739 ఎయిడెడ్ 02 1,260 10 69 ప్రైవేట్ 49 16,680 877 790 మొత్తం 62 24,000 2,101 1,598 -
డిజిటల్ పాఠం
195 స్కూళ్లలో రామన్నపేట : ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్ది విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. తొలుత 8,9,10వ తరగతులకు డిజిటల్ విధానంలో బోధన చేస్తున్నారు. 163 జిల్లా పరిషత్, 7 మోడల్, 11 కేజీబీవీలు, 3 గురుకులాలు, వివిధ సొసైటీలకు చెందిన 13 స్కూళ్లలో డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా పాఠశా లల్లో మొత్తం 29,785మంది విద్యార్థులు ఉన్నారు. డిజిటల్ పాఠాలు బోధించడానికి 525 ఇంట్రాక్టివ్ ప్లాట్ ఫ్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశారు. నూతన విధానం ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సలభంగా అర్థం కావడమే కాకుండా వారి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒకే పాఠాన్ని మళ్లీ వినే అవకాశం..గ్రీన్బోర్డును చాక్పీస్లతో రాసేవిధంగా స్లైడింగ్ డోర్ల రూపంలో తయారు చేశారు. గ్రీన్బోర్డు లోపల ఐఎఫ్పీ ఏర్పాటు చేశారు. బోధించే ఉపాధ్యాయుడు బోర్డులాగా వాడవచ్చు. కాంటెంట్కు సంబంధించిన వీడియోలు, మ్యాథ్స్కు సంబంధించిన డయాగ్రామ్స్, కన్స్ట్రక్సన్స్.. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రదర్శించి బోధిస్తారు. నిష్ణాతులు, సబ్జెక్ట్ నిపుణుల బోధనలు ఆడియోలు, వీడియోల్లో అందు బాటులోకి వస్తాయి. ఒకే పాఠాన్ని మళ్లీ వినే అవకాశం ఉంటుంది. బోధనకు అవసరమైన సాఫ్ట్వేర్ను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. డిజిటల్ బోర్డులు టచ్ సెన్సార్ విధానంలో పనిచేస్తాయి. ప్రతి టీవీకి రెండు చొప్పున డిజిటల్ పెన్స్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ టీవీల ఏర్పాటు కోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున నిధులు ఖర్చు చేసింది. అధునాతన ఫర్నిచర్ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతమైన ఫర్నిచర్ను సైతం సమకూర్చారు. విద్యార్థులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బేంచీలు కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో ఉన్నాయి. అలాగే డిజిటల్ టీవీలు లేని తరగతుల్లో గ్రీన్బోర్డులు అమర్చారు. వీటితో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల కమీటీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.ఫ తొలుత 8,9,10 తరగతుల్లో బోధన ఫ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరగడానికి దోహదం ఫ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా నూతన విధానం -
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ: విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మె చేయడానికై నా వెనుకాడబోమని 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. బుధవారం 1104 యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని, అయినా వారి సంక్షేమం గురించి పట్టింపు లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని, విధి నిర్వహనలో మృతి చెందిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 327 యూనియన్ నుంచి సీహెచ్.శివప్రసాద్, వెంకటేశ్వర్లు 1104 యూనియన్లో చేరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎ.వేణు, ఎన్.వెంకన్న, ఆర్. జనార్దన్రెడ్డి, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. -
బడిబయట పిల్లలు 3,459 మంది
భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఈనెల 6వ తేదీ నుంచి చేపట్టిన బడిబాట బుధవారం ముగిసింది. 13 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం ద్వారా 3,459 మంది విద్యార్థులు బడిలో చేరినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు బడిబాటలో భాగస్వాములు అయ్యారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పథకాలు, పాఠశాలల్లో సౌకర్యాలు, బోధన తీరుపై పిల్లలకు. వారి తల్లిదండ్రులకు వివరించారు. ఫ బడిబాట కార్యక్రమంలో గుర్తింపు ఫ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులు -
నాపరాయి తరలిస్తున్న లారీ స్వాధీనం
అడవిదేవులపల్లి : అక్రమంగా నాపరాయిని తరలిస్తున్న ఓ లారీని మండల పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాల గ్రామం నుంచి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లకు నాపరాయిని లారీలో తరలిస్తుండగా మండలంలోని ఉల్సాయిపాలెం కాల్వకట్ట తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో ఉన్న ముగ్గురు పోలీసులను చూపిపరారు, దీంతో అనుమానంతో లారీలో తనిఖీ చేయగా నాపరాయి ఉన్నట్లు గుర్తించి లారీడ్రైవర్ బత్తుల అమరలింగంను అదుపులోకి తీసుకొని బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తంబాకు పట్టివేత కోదాడరూరల్: కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్లో తంబాకును పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర సరిహద్దులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కంటైనర్లో 420 బాక్సుల్లో తంబాకు పట్టుబడినట్లు తెలిపారు. ఈ తంబాకును విశాఖపట్టణం నుంచి నల్లగొండకు తరలిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పట్టుబడిన తంబాకు విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని తెలిపారు. రాజస్తాన్కు చెందిన మీనా మనోహార్లాల్పై కేసు నమోదు చేసి తంబాకును ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మూలనపడ్డ పారాఫిట్ లైట్లు
యాదగిరిగుట్ట : యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పారాఫిట్ దీపాలు రెండేళ్లకే పనికిరాకుండా పోయాయి. నిర్వహణ లేమితో కొన్ని, విరిగిపోవడంతో మరికొన్ని మూలనపడ్డాయి. భక్తులను ఆకర్షించేందుకు కోట్లాది రూపాయలతో ఈ దీపాలను కొనుగోలు చేశారు. వీటి పునరుద్ధరణపై దేవస్థానం అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. రూ.12 కోట్లతో విద్యుదీకరణ పనులు పూర్తిస్థాయిలో కృష్ణశిలతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంది. ఇందుకు అనుగుణంగా సుమారు రూ.12 కోట్లతో విద్యుదీకరణ పనులు చేపట్టారు. ఆలయం బంగారు వర్ణంలో కనిపించేలా బెంగళూర్కు చెందిన లైటింగ్ టెక్నాలజీస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమెరికా, రష్యన్ టెక్నాలజీతో పసిడి కాంతులు వెదజల్లే లైట్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్యారాఫిట్ వాల్పై బిగించిన దీపాలు చాలా వరకు విరిగిపోయాయి. కొన్ని పని చేయడం లేదు. భక్తులను ఆకట్టుకునేలా.. రాత్రి సమయంలో ఆలయం ఆకర్షనీయంగా కనిపించేలా, భక్తులను ఆకట్టుకునేలా క్యూకాంప్లెక్ పైభాగం, ఉత్తర దిశలో పారాఫిట్ వాల్పై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు రెండేళ్లకే మూలనపడ్డాయి. కొన్ని పూర్తిగా విరిగిపోగా మరికొన్ని నిర్వహణ లేకపోవడంతో పని చేయడం లేదు. వాటిని గోల్డ్ క్యూలైన్ల వెనకభాగంలో పడేయడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పూర్తిగా శిథిలం అవుతున్నాయి. వాటిని పునరుద్ధరించకుండా దేవస్థానం అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు వృథా కాకుండా వాటికి మరమ్మతులు చేసి యథాస్థానాల్లో బిగించాలని భక్తులు కోరుతున్నారు. ఫ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో కోట్లాది రూపాయలతో కొనుగోలు ఫ నిర్వహణ లేమితో రెండేళ్లకే విరిగిపోయిన దీపాలు ఫ పునరుద్ధరించకుండా ఆలయ అధికారుల చోద్యం వినియోగంలోకి తేవాలి వందల కోట్ల రూపాయలతో యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఎక్కడా రాజీ పడకుండా పనులు చేశారు. అందులో భాగంగానే భక్తులను ఆకర్షించేందుకు పారాఫిట్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ దీపాలు వెలిగినన్ని రోజులు ఆలయంతో పాటు యాదగిరిగుట్ట పట్టణ పరిసరాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. నిర్వహణ లేకపోవడం వల్లే లైట్లు స్వల్ప కాలానికే మూలనపడ్డాయి. వీటికి మరమ్మతులు చేపట్టి తిరిగి యథాస్థానంలో పునరుద్ధరించాలి. –బబ్బూరి శ్రీధర్, భక్తుడు -
తొమ్మిది వేలకు పైనే..
‘ధరణి’ దరఖాస్తులు సాక్షి, యాదాద్రి : ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ యంత్రాంగం మరోసారి దృష్టి సారించింది. ఇందుకోసం వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. జిల్లాలో తొమ్మిది వేలకు పైనే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ ఏరోజుకారోజు ఆర్డీఓలు, తహసీల్దార్ల ద్వారా దరఖాస్తుల పురోగతిని తెలుసుకుంటూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలతో బ్రేక్ ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు మార్చి నెలలోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి జూన్ మొదటి వారం లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో అధికార యంత్రాంగం అంతా నిమగ్నం కావడంతో దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది. కొన్ని దరఖాస్తులు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఈ నెల 8వ తేదీన ఎన్నికల కోడ్ ముగియడంతో అధికారులు మరోసారి ధరణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రతి మండలానికి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో రెండు, మూడు బృందాలు ఏర్పాటు చేసి తహసీల్దార్ కార్యాలయాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నారు. జీపీఏ, జీఎల్ఎం గ్రీవెన్స్ ల్యాండ్ మాటర్, ఖాతా మెర్జింగ్, కోర్టు కేసులతో పెండింగ్, పీడీసీ టీఎం–33, పౌదొ, మ్యుటేషన్, సెమీఅర్బన్ ల్యాండ్.. ఇలా 12 రకాల మాడ్యూల్స్లో అర్జీలను పరిష్కరిస్తున్నారు. ఒక దరఖాస్తును ఆమోదించినా? తిరస్కరించినా? అందుకు కారణాలను రైతులకు స్పష్టం చేస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలో భారీగా పెండింగ్ తహసీల్దార్ కార్యాలయ స్థాయిలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్తవారు వచ్చారు. నూతన తహసీల్దార్లు ధరణి దరఖాస్తుల పరిష్కారంపై పెద్దగా ఆసక్తి చూపిలేదు. ఎన్నికలు పూర్తికాగానే ఎలాగూ బదిలీ అవుతామన్న కారణంతో వాటిపై శ్రద్ధ చూపలేదన్న విమర్శలున్నాయి. దీంతో పాటు ధరణి పోర్టల్లో సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తులకు మోక్షం కలగలేదు. అత్యధికంగా ఈ మండలాల్లో.. బీబీనగర్, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి, వలిగొండ, సంస్థాన్నారాయణపురం, ఆలేరు, చౌటుప్పల్, రాజాపేట, భువనగిరి తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు భారీగా పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో.. దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్ కార్యాయాల్లో కొనసాగుతున్న క్యాంపులను కలెక్టర్ హనుమంతు కే.జెండగే క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఏరోజుకారోజు ఆర్డీఓలు, తహసీల్దార్ల ద్వారా దరఖాస్తుల పురోగతిపై ఆరా తీస్తున్నారు. పొరపాట్లకు తావు ఇవ్వకుండా దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. కాగా దరఖాస్తుల్లో ధరణి పోర్టలత్ పాటు గ్రీవెన్స్, సీఎం కార్యాలయానికి నేరుగా వచ్చినవి కూడా ఉన్నాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి చౌటుప్పల్ : భూ సమస్యలపై ధరణి పోర్టల్ ద్వారా అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే పేర్కొన్నారు. చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి ధరణి ధరఖాస్తులను పరిశీలించారు. ధరణిలో వచ్చిన పౌతీ కేసులు, మ్యుటేషన్లు తదితర దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఆమోదించినా, తిరస్కరించినా అందుకు కారణాలను రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. త్వరితగతిన అర్జీలకు పరిష్కారం చూపాలని కోరారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్కుమార్, సీనియర్ అసిస్టెంట్ సురేంద్రశర్మ పాల్గొన్నారు. భూ సమస్యలపై అర్జీల వెల్లువ ఫ పరిష్కారానికి మార్చిలోనే స్పెషల్ డ్రైవ్ ఫ ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన ప్రక్రియ ఫ కోడ్ ముగియడంతో మళ్లీ ప్రారంభించిన రెవెన్యూ యంత్రాంగం ఫ తహసీల్దార్ కార్యాలయాల్లో క్యాంపులు మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులు మండలం అర్జీలు అడ్డగూడూరు 208 ఆలేరు 645 అత్మకూర్(ఎం) 305 భువనగిరి 547 బీబీనగర్ 934 బొమ్మలరామారం 805 గుండాల 448 మోటకొండూర్ 362 మోత్కుర్ 293 రాజాపేట 562 తుర్కపల్లి 837 యాదగిరిగుట్ట 930 పోచంపల్లి 372 చౌటుప్పల్ 577 నారాయణపురం 597 రామన్నపేట 166 వలిగొండ 762 మొత్తం 9,350