-
యోగాతో ఆధ్యాత్మిక భావన పెంపు..
వరంగల్ లీగల్: మనిషికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను అందించడంలో యోగా ఎంతో దోహదపడుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్బాబు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని కోరారు. యోగా సాధన వల్ల శారీరక, మానసిక రుగ్మతలను పారదోలవచ్చన్నారు. ఈసందర్భంగా యోగా గురువు జితేందర్రావు ప్రదర్శించిన వివిధ ఆసనాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉత్సాహంగా వేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.జీవన్గౌడ్, బార్ అసోసియేషన్ల బాధ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్, పీజీటీ, స్టాఫ్ నర్స్ (ఔట్ సోర్సింగ్ పద్ధతిన) పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు మేన శ్రీను, డి.సౌజన్య శుక్రవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా పరిధి హనుమకొండ (బాలికలు) జూనియర్, పాఠశాలలో జూనియర్ లెక్చరర్లు తెలుగు, భౌతికశాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆంగ్లం(పీజీటీ) పోస్టు, కాజీపేట (బాలురు) జూనియర్ లెక్చరర్ (జంతు శాస్త్రం) ఉద్యోగాలు, వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ (బాలికలు–2)లో జూనియర్ లెక్చరర్( సివిక్స్), స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25లోగా దరఖాస్తుల్ని ఆయా జిల్లాల కార్యాలయాల్లో అందజేయాలని వివరాలకు హనుమకొండ జిల్లాకు సంబంధించి 80749 94073, వరంగల్ జిల్లాకు సంబంధించి 93988 60995లో సంప్రదించాలని సూచించారు. ఎంజీఎంలో విద్యుత్ తిప్పలుఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు పొందేందుకు వచ్చిన రోగులకు విద్యుత్ తిప్పలు తప్పడం లేదు. సాధారణ వార్డులకు విద్యుత్ సరఫరా జరిగితే తప్ప విద్యుత్ అందుబాటులో ఉండదు. ఎమర్జెన్సీ వార్డుకు జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ సకాలంలో సిబ్బంది స్పందించకపోవడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో ఎమర్జెన్సీ ఎక్స్రే విభాగానికి గంటల తరబడి విద్యుత్ నిలిచి ఎక్స్రే సేవలు ఆగిపోయాయి. అంతే కాకుండా పలు వార్డులకు కరెంట్ వస్తూ.. పోతూ ఉండడంతో రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఇదే విషయాన్ని రోగులు పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ సరఫరాలో ఉన్న సాంకేతిక లోపాన్ని సవరించారు. -
రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించిన జయశంకర్
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ: జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతోపాటు జనాన్ని జాగృతం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు తోట వెంకన్న, బంక సరళ, వెంకట రాజ్ కుమార్, బంక సంపత్, వీరగంటి రవీందర్, మాధవిరెడ్డి, చీకటి ఆనంద్ నలుబోల సతీశ్, వల్లపు రమేశ్, పాలడుగుల ఆంజనేయులు పాల్గొన్నారు. -
వీరభద్రుడికి మంత్రి బండి సంజయ్ పూజలు
ఎల్కతుర్తి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం రాత్రి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్ట మొదటిసారిగా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో పర్యటించిన ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మొదట ఎల్కతుర్తికి చేరుకున్న ఆయనకు మహిళలు, పార్టీ శ్రేణులు బంతిపూలు చల్లుతూ మంగళ హారతులు, డప్పుచప్పుళ్ల నడుమ ఘనస్వాగతం పలికాయి. అక్కడినుంచి భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వీరభద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర నాయకులు జన్నపురెడ్డి సురేందర్రెడ్డి, మార్తినేని ధర్మారావు, ఇనుగాల పెద్దిరెడ్డి, బుజ్జ సత్యనారాయణ, శ్రీను, పార్టీ మండల అధ్యక్షులు కుడితాటి చిరంజీవి, పైడిపల్లి పృథ్వీరాజ్, జనగాని కిష్టయ్య, ఎర్రగొళ్ల శ్రీను, కంచర్ల శంకరయ్య, ఆడేపు శ్రీవర్ధన్, ముష్కె వెంకటేష్, మంతుర్తి శ్రీకాంత్, మధుకర్రావు, ఆరేపల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఐనవోలు: ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో కృషి చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సుమారు రూ.18 లక్షల ఎమ్మెల్సీ, సీడీఎఫ్ అంచనా నిధులతో నూతన తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరై శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఒంటిమామిడిపల్లి పాఠశాల గ్రామస్తుల సహకారంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేయడం సంతోషదాయకమన్నారు. పని వేళల్ని గ్రామాల్లోని తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు గతంలో పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి వద్ద విద్యాశాఖ ఉండడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ పట్టిష్టమవుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒంటిమామిడిపల్లి స్కూల్లో పదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతోందని.. సాంకేతిక కారణాల వల్ల ఎస్జీటీలు మాత్రమే విద్యాబోధన చేస్తున్నారన్నారు. స్కూల్ బైఫరికేషన్ అయితే.. ఎస్జీటీలతో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరవుతాయని అందుకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సహకరించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎదుట వాగ్వాదం ఎమ్మెల్సీ నిధులు పాఠశాలకు తేవడానికి గతంలో ఎస్ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు కృషి చేశారని తెలుసుకున్న ఎమ్మెల్యే.. సభాధ్యక్షుడి ద్వారా రాజును మర్యాదపూర్వకంగా వేదికపైకి పిలిపించి కూర్చోబెట్టారు. ఇది గిట్టని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాజీ చైర్మన్కు వేదికపై స్థానం ఉండదని.. కిందికి దిగిపోవాలని డిమాండ్ చేశారు. కాగా.. రాజుకు కాంగ్రెస్ నాయకులకు మధ్య కొద్దిసేపు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఎదుటే వాగ్వాదం జరిగింది. ఎలాంటి అర్హతలేని అధికార పార్టీకి చెందిన మండల నాయకులు వేదికపై ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. దీంతో సదరు అధికార పార్టీ నాయకులు, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ రాజు వేదిక మీది నుంచి కిందికి దిగారు. పాఠశాల హెచ్ఎం ప్రతాప రత్నకుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎంపీటీసీ కడుదూరి రాజు, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు, ఎంఈఓ వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ విక్రమ్కుమార్, ఎంపీడీఓ పులి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ డైరెక్టర్ మేట చిరంజీవి, నాయకులు సమ్మెట మహేందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడుదాం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడుదామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని జరుపుకున్నారు. అంతకుముందు బాలసముద్రంలోని ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో సైనికులమవుతామన్నారు. తెలంగాణే శ్వాసధ్యాసగా జీవించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రఽభుత్వం ఏకశిలా పార్కును జయశంకర్ స్మృతివనంగా తీర్చిదిద్దిందన్నారు. కార్యక్రమంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. -
ఉపాధ్యాయుల వేకెన్సీ జాబితా వెల్లడి
విద్యారణ్యపురి: ఎస్జీటీల తత్సమానమైన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు సంబంధించిన వేకెన్సీల వివరాల్ని ఉపాధ్యాయ సంఘాలకు, ఆయా టీచర్ల వాట్సాప్ గ్రూపులకు అధికారులు శుక్రవారం పంపించారు. హనుమకొండ జిల్లాలో ఎస్జీటీల తత్సమాన ఉపాధ్యాయుల వేకెన్సీలు 357 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో క్లియర్ వేకెన్సీలు 202, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్ల వేకెన్సీలు 155 వరకు ఉన్నట్లుగా ప్రాథమికంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు గుర్తించారు. స్పౌజ్ కేటగిరీలో బదిలీలు కావాలనుకునేవారు సమర్పించిన దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్హై తెలిపారు. స్పౌజ్ ఇప్పటికే బదిలీ అయినా.. ఉద్యోగ విరమణ పొందినా, దివ్యాంగులై ఉన్నా ఈనెల 22వ తేదీ(శనివారం) సాయంత్రం వరకు 99481 88254కు వాట్సాప్ ద్వారా దరఖాస్తుస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో మరో 76 మంది తత్సమాన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వులు అందాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 434 మంది టీచర్లకు పదోన్నతుల ఉత్తర్వులు అందాయి. వరంగల్ జిల్లాలోనూ ఎస్జీటీ తత్సమాన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరగనుంది. వేకన్సీలు 606 ఉన్నాయి. క్లియర్ వేకెన్సీలు 278 ఉన్నాయి, 8సంవత్సరాలు పూర్తిచేసుకున్న టీచర్ల వేకన్సీలు 328 ఉన్నాయి. వీటిపై అభ్యంతరాలుంటే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుంది. -
హరితహారం చెట్ల నరికివేత
నల్లబెల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పదేళ్లుగా ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. నర్సరీల్లో పెంచిన మొక్కలను గ్రామాలు, ప్రధాన, లింక్, జాతీయ రహదారుల వెంట, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో నాటారు. సంరక్షించే బాధ్యతలను సంబంధిత సిబ్బందికి అప్పగించారు. అప్పుడు నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లయ్యాయి. కొందరు వ్యక్తులు చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సంఘటన రాంపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏపుగా పెరిగిన చెట్ల నీడ పంటపొలంలో పడి దిగుబడి తగ్గుతుందని భావించిన ఓ రైతు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేశాడు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో అధికారులు పలు గ్రామాల్లో చెట్లను నరికి వేస్తున్నారు. దీంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజాధనం వృథా అవుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెట్లను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
నేడు ప్రత్యేక గ్రీవెన్స్
కాళోజీ సెంటర్: దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి జె.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల నాలుగో శనివారం దివ్యాంగులు, వయోవృద్ధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కలెక్టరేట్లో ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ఉంటుందని వివరించారు. ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి నర్సంపేట: విధినిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను సూచించారు. ఈ మేరకు నర్సంపేట డిపోను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపో పరిసరాలను పరిశీలించి ఉద్యోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఎంఎఫ్ ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎన్వీ.రెడ్డి, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగులకు పదోన్నతులివ్వాలి నర్సంపేట రూరల్ : గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్, ప్రధాన కార్యదర్శి గంగయ్యనాయక్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని జీపీఎస్ వడ్డెకాలనీ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను తేల్చి, ఉద్యోగులకు 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పాఠశాలలను అప్గ్రేడ్ చేయాలని, సీఆర్టీలను రెగులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వరుణ దేవుడా కరుణించు.. గీసుకొండ: వరుణ దేవుడు కరుణించాలని, వర్షాలు కురవాలంటూ మండలంలోని కొమ్మాల గ్రామంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు శుక్రవారం వనభోజనాలకు వెళ్లారు. గ్రామంలోని బొడ్రాయి, పోచమ్మ, హనుమాన్ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. అనంతరం కనకదుర్గమ్మను వేడుకుంటూ గొర్రెలను బలిచ్చారు. రెడ్డి సంఘం అధ్యక్షుడు అరూరి రవీందర్రెడ్డి, పెద్దలు వీరాటి లింగారెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘గ్రీన్ఫీల్డ్’ సర్వే పరిశీలన గీసుకొండ: మండలంలోని మనుగొండలో గ్రీన్ఫీల్డ్ హైవే కింద రైతులు కోల్పోతున్న భూములను వరంగల్ ఆర్డీఓ దత్తు శుక్రవారం పరిశీలించారు.భూములు కోల్పోతున్న కొందరి పేర పట్టా పుస్తకాలు ఉండగా వారు మోఖా మీద లేకపోవడం, మరికొందరికి భూమి ఉన్నా పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి భూముల సర్వేను ఆర్డీఓ పరిశీలించారు. తహసీల్దార్ రియాజుద్దీన్, సర్వే ఇన్స్పెక్టర్ భుజంగరావు, ఆర్ఐ సాంబయ్య, సర్వేయర్ గోపీకృష్ణ, రైతులు పాల్గొన్నారు. పనులు ప్రారంభించాలి వరంగల్ అర్బన్: చెరువు కట్టలపైన బండ్ ప్లాంటేషన్ పనులు ప్రారంభించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఉద్యాన అధికారులను ఆదేశించారు. వరంగల్ పరిధి క్రిస్టియన్ కాలనీలోని నర్సరీ, గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువు, ఏనుమాములలోని ముసలమ్మకుంట ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. బండ్ ప్లాంటేషన్ కార్యాచరణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
మధ్యకాలిక రకాల నార్లు పోసుకోవాలి
చెన్నారావుపేట: వరిలో దీర్ఘకాలిక రకాలను నార్లు పోసుకునే సమయం మించిపోయిందని, రైతులు మధ్య కాలిక రకాల నార్లు పోసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. అమీనాబాద్, ఉప్పరపల్లి, కోనాపురం, జల్లీ, పాపయ్యపేట గ్రామాల్లో శుక్రవారం ఆమె పంటలను పరిశీలించారు. అనంతరం రైతులకు పలు సూచనలు చేశారు. వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వరి సాగుచేసే రైతులు పెసర, జీలుగ పచ్చిరొట్ట పైర్లను తప్పనిసరిగా వేసుకోవాలి. పూత దశలో కలియదున్నాలి. ప్రస్తుతం దీర్ఘకాలిక వరి రకాల నార్లు పోసుకునే సమయం అయిపోయింది. ఈ సమయంలో జగిత్యాల వరి–2, 3, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబ, జగిత్యాల మశూరి మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలని ఆమె సూచించారు. స్వల్పకాలిక రకాలు.. డబ్ల్యూజీఎల్–1119, డబ్ల్యూజీఎల్–962, ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, కేఎన్ఎం–773, జేజీఎల్–24423, కేఎన్ఎం–118, కేఎన్ఎం–7037, ఎంటీయూ–1010 వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలి. పత్తిలో వేరుకుళ్లు నివారణ.. ● కొంతమంది రైతులు పొడిదుక్కిలో పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వేరుకుళ్లు సోకి మొక్కలు తలలు వాల్చి, ఆకులు రంగు కోల్పోయి ఎండిపోతాయి. రైతులు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు.. లీటరు నీటికి కలిపి మొక్క వేరు భాగం తడిసే విధంగా పిచికారీ చేయాలి. ● బెట్ట పరిస్థితుల్లో తామర పురుగు ఎక్కువ ఉధృతమయ్యే అవకాశం ఉంది. నివారణకు 5 శాతం వేప కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● తేమ లేనప్పుడు మొలక శాతం తగ్గితే వర్షం పడిన వెంటనే ఖాళీ ఉన్న చోట (గ్యాప్ ఫిల్లింగ్) విత్తనాలు విత్తుకోవాలి. ● ఒక బస్తా డీఏపీ లేదా మూడు బస్తాల ఎస్ఎస్పీ భాస్వరం ఎరువు ఎకరాకు విత్తిన 20 రోజుల్లోపు వేసుకోవాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. 20, 40, 60, 80 రోజులకు నాలుగు దఫాలుగా యూరియా 25 నుంచి 30 కిలోలు, పొటాష్ 10 నుంచి 15 కిలోలు కలిపి వేసుకోవాలి. ● పత్తిలో కలుపు నివారణకు క్విజలోఫాప్ ఇథైల్ (టర్గా సూపర్) 400 మిల్లీలీటర్లను ఫైరితియోబాక్ సోడియం (హీట్ వీడ్) 250 మిల్లీలీటర్లు కలిపి ఒక ఎకరా విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. రసంపీల్చే పురుగు నివారణ.. ● పచ్చదోమ, పేను, పైముడత, రసం పీల్చే పురుగుల నివారణ కోసం కాండానికి పూత పూసే పద్ధతి పాటించాలి. ఈ పద్ధతిలో ఒక వంతు మోనోక్రోటోఫాస్, నాలుగు వంతుల నీరు కలిపి మొదటి 30 రోజుల వ్యవధిలో ఒకసారి, తర్వాత 45 రోజుల్లో పిచికారీ చేయాలి. ● 60 రోజుల వ్యవధిలో ఒక వంతు ప్లోనికమిడ్, 20 వంతుల నీరు కలిపి కాండానికి పూతపూయాలి. ఈ పద్ధతిలో రైతులకు ఖర్చు తగ్గుతుంది. మేలుచేసే మిత్రపురుగులు పంటను రక్షిస్తాయి. రైతులు ఈ సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఉషాదయాళ్ కోరారు. ఆమె వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ కె.నగేశ్, నర్సంపేట సహాయ సంచాలకులు పి.సారంగం, ఉమ్మడి వరంగల్ జిల్లా జాతీయ ఆహార భద్రతా మిషన్ కన్సల్టెంట్ అధికారి సీహెచ్.కృష్ణారెడ్డి, వ్యవసాయ అధికారి శశికాంత్, ఏఈఓలు రఘు, స్మిత ఉన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ గ్రామాల్లో పంటల పరిశీలన -
చెరువు కంట చెమ్మ!
పరకాల: నీటిని ఒడిసి పట్టి సిరుల పంటలకు ఆధారమయ్యే చెరువులిప్పుడు కంట తడి పెడుతున్నాయి. మట్టి దొంగల తవ్వకాలతో ఆనవాళ్లను కోల్పోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పరకాల పెద్ద చెరువులో మట్టి దొంగల ఆగడాలు పెరిగిపోయాయి. మొన్న దామెర చెరువు.. నిన్న ఎర్ర చెరువు.. నేడు పరకాల పెద్ద చెరువు మట్టిదందాకు అడ్డాలుగా మారాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే పగలు.. రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తుంటే ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. నిన్నటి వరకు నాటుసారా.. బియ్యం దందా చేసిన దొంగలంతా నేడు కొత్త అవతారమెత్తారు. జేసీబీలు, ట్రాక్టర్లు కొని కొత్త దందా (మట్టి వ్యాపారం) మొదలుపెట్టారు. మట్టి దందాతో మున్సిపాలిటీలో విలీనమైన ఓ గ్రామానికి చెందిన ఒకరు కొట్లకు పడగలెత్తగా.. కొత్తగా మరొకరు ఎలాంటి అనుమతులు లేకుండానే.. పరకాల పెద్ద చెరువు తన సొత్తు అన్నట్లుగా మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. నీటి నిల్వలు తగ్గుముఖం.. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1,000 నుంచి రూ.1,500లకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా అనుమతికి మించి పరకాల పెద్ద చెరువులో మట్టి తవ్వకాలు జరిపి నీటి నిల్వలు తగ్గుముఖం పట్టేలా చేశారు. ప్రస్తుతం ఇదే పంథాలో కొత్తగా కొందరు చెరువు మట్టి విక్రయిస్తూ లక్షలు మూటగట్టుకుంటున్నారు. అయినప్పటికీ అధికారయంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ధరలతో పాటు మట్టి ధరలను చూసి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం రూ.500 నుంచి రూ.800 వరకు ఉండగా.. నేడు ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.1,200 నుంచి రూ.1,600 వరకు అమ్ముకుంటున్నారు. దీంతో ఒక్కో ఇంటికి మట్టి ఖర్చే రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అవుతోందని సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.300లు మిగుల్చుకునే రోజుల నుంచి రూ.1,000లకు పెరిగిందని చెప్పవచ్చు. ఇదే ఆసరాగా చేసుకొని మట్టి దందా చేస్తున్న వారు అనుమతి లేకుండా దర్జాగా 20 ట్రాక్టర్లతో పరకాల పట్టపగలే చెరువు మట్టిని తరలిస్తున్నారు. రియల్ వ్యాపారులకు, పెద్ద పెద్ద ప్లాట్లలకు వందలాది ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టిని తరలిస్తూ.. లక్షలాది రుపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. తమకు అందిన సమాచారంతో మట్టి తరలింపును అడ్డుకున్నట్లు ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. ఎవరైనా చెరువుల్లోని మట్టిని తరలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరడం విశేషం. మట్టిదందాపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాలలో జరుగుతున్న మట్టి దందాపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్లో పరకాల చెరువుల్లో నీళ్లు నిలవవు. రైతులు సాగు నీరు, తాగునీటికి ఇబ్బందులు పడతారు. మట్టిదందాను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. – మేఘనాథ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పరకాల పెద్ద చెరువు మట్టి తరలింపు వందల ట్రిప్పులు.. కోట్లకు పడగలు! ఇరిగేషన్ అధికారుల ప్రేక్షక పాత్ర -
యోగాతో మానసిక ప్రశాంతత
కాశిబుగ్గ: ప్రతిరోజూ యోగా చేస్తే అనారోగ్య సమస్యలు దూరం కావడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. జిల్లా యువజన క్రీడలు, ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఓ సిటీ స్టేడియంలో 10వ ఆంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్య శారదాదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ప్రాచీన సంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక యోగా అన్నారు. ఆదిశంకరాచార్యుల భజ గోవిందంలోని యోగాకు సంబంధించిన సంస్కృత చరణాలను కలెక్టర్ వినిపించారు. మనస్సు, శరీరం, ఆలోచన, కార్యాచరణ ఐక్యతను యోగా ప్రతిబింబిస్తుందని, ప్రతిఒక్కరూ ఉదయం కొంత సమయం కేటాయించి యోగా సాధన చేయాలని ఆమె కోరారు. ‘సెల్ఫ్ హెల్త్ సోసైటీ హెల్త్ బై డూయింగ్ యోగా ఏవిడే’ ఈ సంవత్సరం యోగా థీమ్ అని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేసి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి, డీపీఆర్ఓ ఎండీ అయూబ్అలీ, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్కుమార్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, డీవైఎస్ఓ సత్యవాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్, పరిశ్రమల శాఖ జీఎం నరసింహమూర్తి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, ఆయుర్వేద హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్ డాక్టర్ సాంబమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్య శారదాదేవి ఓ సిటీ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
పెన్షనర్ల బకాయిలను విడుదల చేయాలి
దేశాయిపేట: పెన్షనర్ల కరువు భత్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో నగదు రహిత వైద్య సేవలందించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు కె.సుధీర్బాబు కోరారు. నగరంలోని ఇన్నర్వీల్ క్లబ్లో శుక్రవారం మూడో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన 35 మందికి సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఆమె పంపిన సందేశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలిశోజు రామమనోహర్ చదివి వినిపించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నామమాత్రంగా ప్రకటించిన 5 శాతం ఇంటీరియం రిలీఫ్ను 20 శాతానికి పెంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాకముందే పీఆర్సీ ప్రకటించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.నరసింగరావు, రాష్ట్ర సలహాదారు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగపురి సారయ్య, నాయకులు నర్సయ్య, రామమనోహర్, టి.పురుషోత్తం, జగన్మోహన్, అలువాల సూర్యనారాయణ, అంజయ్య, బాల మల్లేశ్, అంజయ్య, సత్యనారాయణ, రాజయ్య, జె.విజయసారథి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల వేకెన్సీ జాబితా వెల్లడి
విద్యారణ్యపురి: ఎస్జీటీల తత్సమానమైన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు సంబంధించిన వేకెన్సీల వివరాల్ని ఉపాధ్యాయ సంఘాలకు, ఆయా టీచర్ల వాట్సాప్ గ్రూపులకు అధికారులు శుక్రవారం పంపించారు. హనుమకొండ జిల్లాలో ఎస్జీటీల తత్సమాన ఉపాధ్యాయుల వేకెన్సీలు 357 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో క్లియర్ వేకెన్సీలు 202, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్ల వేకెన్సీలు 155 వరకు ఉన్నట్లుగా ప్రాథమికంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు గుర్తించారు. స్పౌజ్ కేటగిరీలో బదిలీలు కావాలనుకునేవారు సమర్పించిన దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్హై తెలిపారు. స్పౌజ్ ఇప్పటికే బదిలీ అయినా.. ఉద్యోగ విరమణ పొందినా, దివ్యాంగులై ఉన్నా ఈనెల 22వ తేదీ(శనివారం) సాయంత్రం వరకు 99481 88254కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో మరో 76 మంది తత్సమాన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వులు అందాయి. జిల్లాలో మొత్తం 434 మంది టీచర్లకు పదో న్నతుల ఉత్తర్వులు అందాయి. వరంగల్ జిల్లాలోనూ ఎస్జీటీ తత్సమాన ఉపాధ్యాయుల బది లీల ప్రక్రియ జరగనుంది. వేకెన్సీలు 606 ఉన్నాయి. క్లియర్ వేకెన్సీలు 278 ఉన్నాయి, 8సంవత్సరాలు పూర్తిచేసుకున్న టీచర్ల వేకెన్సీలు 328 ఉన్నాయి. వీటిపై అభ్యంతరాలుంటే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలి. -
తెరమీదకు మరోసారి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెల పంపిణీ పథకంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన అక్రమాలు మరోసారి తెరమీదకు రాబోతున్నాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని పక్కదారి పట్టించిన వారి అవినీతి అక్రమాలు మళ్లీ వెలుగుచూడబోతున్నాయి. అక్రమార్కులపై అప్పటి ప్రభుత్వం మొక్కుబడిగా చర్యలు తీసుకుని కేసులు మూసేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రమాలను తోడుతోంది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్పోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ పథకానికి సంబంధించిన సమస్త సమాచారం జిల్లాల వారీగా కావాలని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య, పశుసంవర్థకశాఖను ఇటీవల కోరింది. ఈనేపథ్యంలో కలెక్టర్లకు అందిన సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల జిల్లా పశువైద్య, పశు సంవర్థ్ధకశాఖ అధికారు(డీవీఏహెచ్ఓ)లు నేడే, రేపో పంపేందుకు సిద్ధం కావడం ఆ శాఖలో మళ్లీ కలకలం రేపుతోంది. మొదటి విడత సాగిందిలా.. ఉమ్మడి వరంగల్లో 575 సహకార సంఘాలు, సుమారు 60 వేల మంది సభ్యులను గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఆ మేరకు విడతల వారీగా అర్హులకు లబ్ధి చేకూరేలా ప్లాన్ చేసింది. మొదటి విడత (ఎ–లిస్టు)లో మొత్తం 50,678 యూనిట్లు మంజూరు చేసి, ప్రతి యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించి పంపిణీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది ఒక కమిటీగా మొత్తం ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేసింది. మహారాష్ట్రతోపాటు కడప జిల్లాలోని ఆరు మండలాల్లో గొర్రెల కొనుగోళ్లు చేపట్టారు. వాటికి ఇన్సూరెన్స్ ట్యాగ్లు పూర్తయిన అనంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా జిల్లాకు పంపాల్సి ఉండగా.. ఇక్కడే అనేక అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తాజాగా ఈడీ ఆదేశాల మేరకు పాత వరంగల్ జిల్లా పరిధిలో ఏర్పడిన జిల్లాల్లో లబ్ధిదారులకు 50,678 యూనిట్లకు 49,276 యూనిట్లు (97శాతం) గ్రౌండి ంగ్ చేసినట్లు ఇప్పటివరకు తేలినట్లు సమాచారం. అలాగే రెండో విడత గ్రౌండింగ్ తదితర వివరాలను సైతం క్రోడీకరించి రెండు, మూడు రోజుల్లో ఈడీకి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ డీవీఏహెచ్ఓ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అడుగడుగునా అక్రమాలే.. నివేదికలో వివరాలు అవే... పథకం ఆరంభంలో శ్రద్ధ వహించిన ఉన్నతాధికారులు రానురానూ మండల పశువైద్యాధికారులకే జీవాల కొనుగోలు బాధ్యత ఇచ్చారు. దీంతో గొర్రెలు లబ్ధిదారుల ఇంటికి చేరకముందే చేతులు మారాయి. కొన్నిచోట్ల ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వరకు చేరుకొని, మళ్లీ తరలిపోయాయి. ఈఅక్రమాల తంతులో పలువురు మండల పశువైద్యాధికారులే కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కొనుగోలుకు వెళ్లిన అధికారులు అటు అమ్మకందారులతో ఒప్పందం కుదుర్చుకొని తక్కువ ధర పలికే గొర్రెలకు ఎక్కువ ధర నిర్ణయించడం.. ఒక యూనిట్లో నాలుగు చిన్న పిల్లలను వేసి పెద్దవాటికి సమానంగా వెల కట్టడం వంటివి చేయడంతో లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోయారు కూడా... గొర్రెలను ఏడాదిలోపు విక్రయించరాదన్న నిబంధనలున్నా.. వారంలోపే అమ్మారు. రీసైక్లింగ్ కూడా చేసిన దాఖలాలు బయటపడ్డాయి. గొర్రెలు క్షేత్రస్థాయిలో లేకున్నా.. గొర్రెలు, వాటి పిల్లల పేరిట దాణా, నట్టల మందులకు కూడా డబ్బులు కాజేశారు. వీటన్నింటిపై వివరంగా నివేదిక సిద్ధం చేస్తుండడంతో మళ్లీ ఏం జరుగుతుందో? నన్న చర్చ అందుకు బాధ్యులైన వారిలో మొదలైంది. ఆ గొర్రెలు ఎవరివి? ఇప్పటికీ తేలని లెక్క.. బ్యాంకులో డబ్బుల జమ.. వరంగల్ జిల్లా నుంచి ఎల్కతుర్తి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలతోపాటు 574 గొర్రెలను 2019 పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా 13 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆ 13 మంది కూడా తమకు సంబంధం లేదని తప్పుకున్నారు. దీంతో ఆ గొర్రెలను విక్రయించిన పశుసంవర్థకశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు ఆ డబ్బులను బ్యాంకులో జమ చేశారు. ఆ గొర్రెలు ఎవరివి? ఎక్కడినుంచి తరలించారు? అనే వివరాలను ఇప్పటికీ తేల్చలేదు. ● చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 12 యూనిట్లలో అవకతవకలు చోటు చేసుకోవడంతో అక్కడి పశువైద్యాధికారిని సస్పెండ్ చేశారు. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో 10 మందిపై శాఖాపరమైన ప్రత్యేక బృందాలు విచారణ జరిపి ‘మమ’ అనిపించాయి. ● జయశంకర్ భూపాలపల్లికి చెందిన డీవీఅండ్ఏహెచ్ఓ డాక్టర్ ఎం.బాలకిషన్, జనగామ జిల్లా బచ్చన్నపేట వీఏఎస్ డాక్టర్ కె.హరికిషన్పై చర్యలకు ఫెడరేషన్ ఎండీకి చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అక్రమాలు, అవకతవకలు మరోసారి వెలుగు చూడనుండడం పశుసంవర్థ్దకశాఖలో చర్చనీయాంశంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల లెక్కలు జిల్లాల వారీగా వివరాలు కోరిన ఈడీ గతంలో ఉమ్మడి వరంగల్లో 10 మందిపై విచారణ ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశం.. మళ్లీ సమగ్ర విచారణకు రంగంలోకి ఈడీ.. ఈడీ, సమాఖ్యల ఆదేశాలతో నివేదిక తయారీలో డీవీఏహెచ్ఓలు -
శనివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2024
యోగాసనాలు వేస్తున్న హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, సీకేఎం మైదానంలో యోగాసనాలు వేస్తున్న నగరవాసులు, యోగాసనంలో చినజీయర్ స్వామి యోగా డేయోగా దినోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్లో, వరంగల్ ఓ సిటీ మైదానంలో ఆయా జిల్లాల ఆయుష్, యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, నగరవాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో మాస్టర్ యోగాసనాలు వేయించారు. ఆరోగ్యానికి యోగా ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. వరంగల్ దేశాయిపేట సీకేఎం కళాశాల మైదానంలో వికాసతరంగిణి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు.న్యూస్రీల్యోగాతోనే మానసిక ఆనందం త్రిదండి చినజీయర్ స్వామి – వివరాలు 8లోu -
ఎంజీఎం ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన
ఎంజీఎం: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు శుక్రవారం నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంజీఎంలో నిరసన తెలిపారు. ఎంజీఎంలోని గాంధీ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టైఫండ్ సకాలంలో విడుదల కోసం గ్రీన్ చానల్ ఏర్పాటు, కేఎంసీలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, జూనియర్ డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 24న నుంచి నిరవధిక సమ్మె కొనసాగించాలని జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలి పారు. ఈమేరకు సమ్మె నోటీసులను విడుదల చేశా రు. సమ్మె సమయంలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
నాయబ్ తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు
చెన్నారావుపేట: ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసి సమాచారం అడిగితే నాయబ్ తహసీల్దార్ ఇవ్వడం లేదని ఖాదర్పేటకు చెందిన రైతు కూస సుదర్శన్ శుక్రవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడాడు. తనకు వారసత్వంగా వచ్చిన 792, 803 ,805 సర్వే నంబర్లలోని భూమి విషయంలో పలుమార్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే నా దగ్గర లేవు.. పోయిన తహసీల్దార్ తీసుకెళ్లాడని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమార్కులకు ఎలాంటి ఆధారాలతో పట్టాచేశారో చెప్పాలని, ఆధారాలు లేకుండా పట్టాలు చేయించుకుని రైతుభరోసా తీసుకుంటున్న వారి పట్టాలు రద్దు చేయాలని కోరాడు. -
No Headline
ఖానాపురం: పంటల సాగులో రైతులకు మెళకువలు నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో డివిజన్ పరిధిలో మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందింంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటల సాగులో అధిక దిగుబడి సాధించిన రైతుల సలహాలు, సూచనలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైతు వేదికలకు కావాల్సిన సామగ్రిని సమకూరుస్తోంది. ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందిన వరంగల్ జిల్లాలో 1,97,000 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు సాగు చేస్తారు. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి, 1.25 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తి పంటలు సాగు చేశారు. భారీ వర్షాలు కురిస్తే వరినార్లు పోసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. పంటల్లో వచ్చే చీడపీడల నివారణ కోసం అనేక పురుగు మందులను వాడుతారు. షాపులకు వెళ్లి నేరుగా మందులు తెచ్చుకోవడం, పంటల్లో వచ్చిన రోగాలను అంచనా వేసి వాటిని నియంత్రించడానికి అనేక ఇబ్బందులు పడుతారు. ఈక్రమంలో ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాలతో రైతులకు అవగాహన కల్పించనుంది. ప్రతీ మంగళవారం రైతు నేస్తం.. ఏ సీజన్లో ఏ పంటలు సాగుచేయాలి, పంటల్లో వచ్చిన చీడపీడలను ఎలా నివారించాలని రైతులు తర్జనభర్జన పడతారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వీటిని పరిష్కరించి, రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రతీ మంగళవారం రైతు వేదికల ద్వారా శాస్త్రవేత్తలు, జిల్లాలో ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసే రైతులు, అధిక దిగుబడులు సాధించే రైతులతో ఇతర రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఏ సీజన్లో ఏ పంటలు సాగు చేయాలి, రసం పీల్చే పురుగులతోపాటు ఇతర చీడపీడల నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలో వివరించనున్నారు. తద్వారా పంటల సాగులో రైతులు మెళకువలు తెలుసుకునే అవకాశం ఉంది. మండల కేంద్రాల్లో ఏర్పాట్లు.. రైతు నేస్తం సదస్సులో భాగంగా మొదట నర్సంపేట, వర్ధన్నపేట డివిజన్ కేంద్రాల్లోని రైతు వేదికల్లో టీవీ, కంప్యూటర్, ఇతర సామగ్రిని అందించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. డివిజన్ కేంద్రాలకు మండల కేంద్రాల నుంచి రైతులు ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రతీ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతునేస్తానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న రైతు వేదికలకు టీవీ, కంప్యూటర్, సీపీయూలతో పాటు ఇతర సామగ్రిని అందించారు. నెట్ కోసం టీ ఫైబర్ సదుపాయాన్ని సైతం కల్పించారు. వీటిని త్వరలో ఫిట్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రతీ మంగళవారం రైతులకు రైతు నేస్తం ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి పంటల సాగులో పాటించాల్సిన ఆధునిక పద్ధతులు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలు ప్రతీ మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అందిస్తాం. శాస్త్రవేత్తలు రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు చేస్తారు. ఇప్పటికే నర్సంపేట, వర్ధన్నపేట డివిజన్ కేంద్రాల్లో ప్రారంభించాం. త్వరలోనే ప్రతీ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రారంభిస్తాం. రైతులు ప్రతీ మంగళవారం రైతు వేదికల వద్దకు వచ్చి రైతు నేస్తం ద్వారా పంటల సాగుపై మెళకువలను తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పంటల సాగులో మెళకువలకు ప్రత్యేక కార్యక్రమం ప్రతీ మంగళవారం రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు అవగాహన కల్పించనున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు జిల్లాలో 13 మండలాలు.. 1,97,000 మంది రైతులు 1.30 లక్షల ఎకరాల్లో వరి, 1.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు -
24 నుంచి పరీక్షలు
కాళోజీ సెంటర్: గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1, గ్రేడ్–2, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖలో వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాటిన్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షకు అరగంట ముందే కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు శనివారం నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
గంగదేవిపల్లిని సందర్శించిన సత్యసాయి జిల్లావాసులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాకు చెందిన 40 మంది గ్రామాభివృద్ధి బాధ్యులు శుక్రవారం సందర్శించారు. తలుపుల మండలంలోని నూతన కాలవ, పులింగుడ్లపల్లి, లక్క సముద్రం, గొల్లపల్లితండా, ఏపులపల్లి, రాజనాలపల్లి, ఉడుములకుర్తి, మంగివాండ్ల పల్లి, నిగ్గిడి గ్రామాల నుంచి అభివృద్ధి కమిటీ సభ్యులు సందర్శించి గ్రామ అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్టు, అనంతపురం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ టీం నుంచి శ్రీనివాస్, ధనలక్ష్మి, ఏరియా టీం లీడర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వారికి గ్రామ అభివృద్ధి గురించి జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి, బాలవికాస ప్రతినిధి కొట్టె రమాదేవి వివరించారు. -
భూ తగాదా.. పత్తి మొలకల ధ్వంసం
ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం వేలేరు: భూతగాదాల నేపథ్యంలో రెండెకరాల్లో వేసిన పత్తి మొలకలను కూలీలను పెట్టించి పీకేశాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈఘటన వేలేరు మండలం పీచరలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన జంగిడి సాంబరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన కంకణాల కృష్ణమూర్తి (రైల్వే ఉద్యోగి) నుంచి 2.08 ఎకరాల భూమిని ఎకరానికి రూ.24 లక్షల చొప్పున సాంబరాజు కొన్నాడు. విడతల వారీగా ఇప్పటి వరకు రూ.38 లక్షలు కృష్ణమూర్తికి ఇచ్చాడు. మిగతా డబ్బులు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన రోజున ఇస్తానని చెప్పాడు. 2.08 ఎకరాల భూమిలో కొంత ప్రభుత్వ భూమి ఉందని.. తనకు ప్రభుత్వ భూమి వద్దని.. ఒరిజినల్ పట్టా ఉన్న వరకే రిజిస్ట్రేషన్ చేసివ్వాలని పలుమార్లు కృష్ణమూర్తికి చెప్పాడు. ఇదే విషయమై పోలీసులు, గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించగా.. కృష్ణమూర్తి వారి మాటల్ని లెక్కచేయలేదు. ఇటీవలే పోలీస్ స్టేషన్లో మళ్లీ పంచాయితీ జరగ్గా.. పోలీసులు, గ్రామ పెద్దలు.. సాంబరాజును భూమి దున్నుకుని పంట వేసుకొమ్మని చెప్పారు. పది రోజుల క్రితం చెలక దున్ని పత్తి విత్తనాలు పెట్టాడు. బుధవారం కృష్ణమూర్తి అతడి భార్య, నలుగురు కూలీలు కలిసి రెండెకరాల్లో మొలిసిన పత్తి మొక్కల్ని పీకించి వ్యవసాయ బావిలో పడేశారు. పోలీసులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
రూ. 650.12కోట్లు
వరంగల్ అర్బన్ : గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను భారీ అంకెలతో రూపొందించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.650.12కోట్లతో వార్షిక అంచనాలకు కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గ సభ్యులు గురువారం ఆమోదం పలికారు. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 37.83కోట్ల అంచనాలను పెంచారు. బడ్జెట్ స్వరూపం ఇలా.. చివరి బడ్జెట్లో పద్దులను సల్ప మార్పులు తప్ప మక్కిమక్కిగా రూపొందించారు. రూ.650. 12కోట్లతో రూపొందించిన పద్దులు వివరాల ఇలా ఉన్నాయి. సొంత ఆదాయం రూ. 237.02కోట్లు(37 శాతం) కాగా ప్రణాళిక,ప్రణాళికేతర గ్రాంట్ల రూపేణా 410.10కోట్లు (63)శాతం వస్తాయని అంచనా వేశారు. బల్దియా రెవెన్యూ వ్యయాలు 147.95కోట్లు(23 శాతం) కాగా, ఇతర నిర్వహణకు 46.95 కోట్లు(7శాతం), క్యాపిటల్ వర్క్కు రూ.42.82కోట్లు (4శాతం) క్యాపిటల్ వ్యయాలు రూ.410.10కోట్లు (63శాతం) అంచనాలు వేశారు. బల్దియాకు సొంత ఆదాయం రూ. 237.02కోట్లు కాగా, అందులో నిర్వహణకు రూ.147.95కోట్లు ఖర్చు అవుతున్నట్లు రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను రూ.89.80కోట్లు వస్తుందని అంచనా వేశారు. సర్చార్జ్లు, స్టాంపు డ్యూటీ తదితర చార్జీలను సల్పంగా పెంచారు. బిల్డింగ్ పర్మిషన్లు, టౌన్ప్లానింగ్ ఫీజులు, లే అవుట్ సబ్ డివిజన్ ఫీజలను కొంత మేరకు పెంచారు. గ్రీన్ బడ్జెట్కు 10శాతం రూ.23.70కోట్లు కేటాయింపులు చేశారు. విలీన గ్రామాలు, మురికివాడల అభివృద్ధికి రూ.29.55కోట్ల నిధులు, 66వ డివిజన్లకు గాను కేటాయింపులు చేయగా, అందులో రోడ్లకు రూ.11 కోట్లు, డ్రెయినేజీలకు రూ. 9కోట్లు, తాగునీటి సరఫరాకు రూ.1.05 కోట్లు, లైటింగ్కు రూ.30లక్షలు, ఆఫీస్ భవనాలు, ఫర్నిచర్కు రూ.1.20కోట్లు, ఇతర పనులకు రూ.33లక్షలు అంచనా వేశారు. ‘గ్రేటర్’ బడ్జెట్ ఆమోదం సొంత ఆదాయం రూ.237.02కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.410.10కోట్లు -
శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2024
– 8లోuఆయిల్పామ్ రైతులకు రెండో సంవత్సర రాయితీహన్మకొండ: ఆయిల్పామ్ రైతులకు ప్రభుత్వం రెండో సంవత్సర రాయితీ సొమ్ము విడుదల చేసింది. హనుమకొండ జిల్లాలో 303 మంది రైతులు 1,116 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. తోటల నిర్వహణ, అంతర్ పంటల సాగుకు ప్రభుత్వం రాయితీని అందిస్తుంది. జిల్లాలోని 1,116 ఎకరాలకు గాను రూ.46.90,140ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.శ్రీనివాస్ రావు తెలిపారు. సొమ్ము జమకాని రైతులు సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్: వరంగల్ జిల్లాలో 2626 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేస్తున్న 754మంది రైతులకు రెండో ఏడాదికి గాను రాయితీ నిధులు రూ.1,10,31,300లు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. కేయూలో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులుకేయూ క్యాంపస్: కేయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తరగతులు జూలై 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా జూలై 9వ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కేయూ విద్యార్థులు, ఉద్యోగులకు రూ.1.000, ఇతరులకు రూ.1,500 ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజీకి నాన్ యూనివర్సిటీ ఫండ్లో చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. జూలై 10 నుంచి 40 రోజులపాటు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. రేపు ప్రిన్సిపాళ్లతో సమావేశంకేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఈనెల 22న సమావేశం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపస్లో నిర్వహించే ఈ సమావేశంలో 2024–25 విద్యాసంవత్సరం అలుమనాక్, పరీక్ష షెడ్యూల్, స్పోర్ట్స్అండ్ గేమ్స్, జాతీయ సేవా పథకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. సంబంధిత డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు విధిగా హాజరుకావాలని కోరారు. నిట్లో ముగిసిన సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని సెమినార్ హాల్లో నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం గురువారం అట్టహాసంగా ముగిసింది. నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ప్రొఫెసర్ విటీ.సోమశేఖర్ ఆధ్వర్యంలో ‘ఏఐఓటీ అండ్ అప్లికేషన్స్’ అంశంపై నిర్వహించిన నెల రోజుల సమ్మర్ ఇంటర్న్షిప్కు వివిధ కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిట్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్, కిశోర్కుమార్, వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలకు జీవం పోసిన వర్షం● జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ● మూడు మండలాల్లో చినుకులకే పరిమితం హన్మకొండ: వారం రోజులకుపైగా ముఖం చాటేసిన వర్షం బుధవారం రాత్రి కురవడంతో పంటలకు జీవం పోసినట్లయ్యింది. జిల్లాలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. వారం రోజులకు పైగా.. వర్షాల్లేకపోవడంతో హనుమకొండ జిల్లాలో మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ వర్షం మొక్కలకు ఊపిరిపోసింది. కానీ.. వేలేరు, పరకాల, నడికూడలో కేవలం చినుకులు మాత్రమే కురిశాయి. కాగా.. మిగతా 11 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఎల్కతుర్తిలో 48.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ధర్మసాగర్లో 45.8, భీమదేవరపల్లిలో 44.4, శాయంపేటలో 35.6, కాజీపేటలో 30.3, హనుమకొండలోని 26.7, ఆత్మకూరులో 21.6, కమలాపూర్లో 21.3, ఐనవోలులో 18.1, నడికూడలో 6.1, వేలేరులో 4.1, పరకాలలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో పదోన్నతులు పొందిన 455 మంది టీచర్లలో 414 మంది గురువారం విధుల్లో చేరారు. డబుల్ పదోన్నతులు పొందిన వారిలో ఒక పోస్టులో విధుల్లో చేరిన వారు, పదోన్నతి లభించినా నాట్ విల్లింగ్ ఇచ్చినవారు కలిపి 37 మంది ఉన్నారు. మరో నలుగురు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. దరఖాస్తులు చేసుకోవాలి.. జిల్లాలో పదోన్నతి పొందని లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ ఎండీ అబ్దుల్హై ఆదేశించారు. ఇప్పటికై నా బదిలీలకు దరఖాస్తులు చేసుకుని ఉంటే.. ఆయా టీచర్లు దరఖాస్తులు చేసుకోవా ల్సిన అవసరం లేదని సమాచారమిచ్చారు. బది లీలకు దరఖాస్తులు చేసుకోని వారు ఉంటే.. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసిన ప్రింట్ కాపీని అందజేయాలని సూచించారు. దీంతో పదోన్నతులు పొందని లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. పలు చోట్ల ఇద్దరు లాంగ్వేజ్ పండిట్లు జిల్లాలో లాంగ్వేజ్ పండిట్ల, పీఈటీల పోస్టుల్లో కొన్ని పోస్టులు ఎస్ఏలుగా అప్గ్రేడ్ చేయలేదు. దీంతో పలు హైస్కూళ్లలో పదోన్నతులు లభించిన లాంగ్వేజ్ పండిట్లు ఇద్దరు చొప్పున కూడా ఉండాల్సి వస్తోంది. అలాంటి టీచర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ఎస్జీటీల బదిలీల ప్రక్రియ హనుమకొండ జిల్లాలో పదోన్నతుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. ఇక ఎస్జీటీల బదిలీల పక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎస్జీటీల బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే మూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందేవారు బదిలీలలకు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి కాదు. వారు బదిలీ కావాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే చోట ఎనిమిదేళ్ల సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఎస్జీటీల వేకెన్సీలతోపాటు సీనియార్టీ జాబితాను కూడా వెల్లడించాల్సి ఉంది. అనంతరం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. హనుమకొండ జిల్లాలో 450 నుంచి 500 మంది వరకు ఎస్జీటీలు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పదోన్నతుల ఉత్తర్వులేవి? వరంగల్ జిల్లాలో లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు పదోన్నతులు పొందారు. అదేవిధంగా ఎస్జీటీలు వివిధ సబ్జెక్టుల్లో ఎస్ఏలుగా మొత్తం 358 మంది టీచర్లు పదోన్నతుల ఉత్తర్వులు అందుకున్నారు. కానీ, ఎస్జీటీలు పీఎస్ హెచ్ఎంలుగా, లోకల్ బాడీ ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో, పీఈటీలు పీడీలుగా కలిపి మొత్తం 76 మందికి ఉత్తర్వులు ఇవ్వలేదు. గురువారం రాత్రి వరకు వారికి పదోన్నతుల ఉత్తర్వులు అందలేదు. రోస్టర్ పాయింట్లలో సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. కానీ, హైదరాబాద్ నుంచి ఇంకా వారికి పదోన్నతులు ఉత్తర్వులు అందలేదు. బహుళ పదోన్నతులతో టీచర్లకు నష్టం పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్నారు. కానీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మల్టీ జోన్ పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూ బాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పూర్తయ్యాయి. వరంగల్ జిల్లాలోని పీఎస్హెచ్ఎం, ఇంగ్లిష్ మినహాయిస్తే, ఆయా జిల్లాలో ఎస్జీటీల్లో కొందరు రెండు, లేదా మూడు పోస్టులకు (కేడర్లలో) వెబ్ ఆప్షన్లు ఇచ్చుకొని పదోన్నతులు పొందారు. అందులో ఏదో ఒక పోస్టులోనే జాయిన్ అయ్యారు. దీంతో మిగతా పోస్టులు వేకెన్సీలు ఉంటాయి. దీంతో వివిధ పాఠశాలల్లో మళ్లీ ఉపాధ్యాయుల కొరత ఉండనుంది. మరోవైపు పదోన్నతులు ఆశించిన మరికొందరు ఎస్జీటీలకు పదోన్నతి లభించలేదు. అయితే జిల్లాల వారీగా పదోన్నతులు కల్పించాక.. ఇలా జాయిన్ కానీ పోస్టుల్లో మిగిలిపోయిన వాటిల్లో అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఆయా ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎస్జీటీల బదిలీల ప్రక్రియ కంటే ముందే మిగిలిపోయిన పోస్టుల్లో అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తే బాగుంటుందని వారు అభిపాయపడుతున్నారు. ఆయా వేకెన్సీలను భర్తీ చేశాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలనేది డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రాథమిక విద్యతోనే సృజనాత్మకతపరకాల: పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నతనం నుంచే విద్యార్థులను తీర్చిదిద్దవచ్చని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి మధురిమ అన్నారు. పరకాలలోని గణపతి బీఈడీ కళాశాలలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు పూర్వ ప్రాథమిక విద్యపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి మధురిమ మాట్లాడుతూ.. పరకాల ప్రాజెక్ట్ పరిధి 5 మండలాల్లోని 35 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ భాగ్యలక్ష్మి, సూపర్వైజర్ సునీతరెడ్డి, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు● ప్రవేశ పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ● కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం హన్మకొండ: నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ కాళోజీ జంక్షన్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేశ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్.అశోక్ స్టాలిన్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి, నాయకులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో.. నీట్ పరీక్ష లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా రాంనగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి బొట్లచక్రపాణి మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సారంపెల్లి వాసుదేవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, జి.రాములు తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్కొందరు టీచర్లు నాట్ విల్లింగ్ పండిట్లు, పీఈటీల బదిలీలకు దరఖాస్తులు వరంగల్ జిల్లాలో పదోన్నతులకు నిరీక్షణ -
పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించండి
వరంగల్: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించారు. సత్వరమే అనుమతి ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. బ్యాంకర్లు రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన దరఖాస్తులు ఏశాఖ వద్ద పెండింగ్లో ఉండకూడదని, నిర్ణీత కాలవ్యవధిలో అనుమతించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. టీజీ ఐపాస్ కింద నూతనంగా 20 పరిశ్రమలు స్థాపించడానికి 42 రకాల అనుమతులను కమిటీ మంజూరు చేసిందన్నారు. రూ.59.47 కోట్ల పెట్టుబడితో 221 మందికి ఉపాధి కలుగుతుందని ఆమె వివరించారు. టీప్రైడ్, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 21 రకాల యూనిట్ల స్థాపనకు రూ.81 లక్షల రాయితీలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్, డీటీడబ్ల్యూఓ సౌజన్య, విద్యుత్ శాఖ డీఈ ఆనంద్ పాల్గొన్నారు. రైతులను ప్రోత్సహించాలి అధిక రాబడి పొందే పంటలను సాగుచేసేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణ, పురోగతిపై సమీక్షించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. ఆయిల్ పామ్ లక్ష్యం, సాధించిన పురోగతి, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర పంటలు, యాజమాన్య పద్ధతులకు సంబంధించిన సబ్సిడీ, ఈ సంవత్సరం అమలు చేయనున్న కార్యాచరణపై ఉద్యానశాఖ అధికారులతో సమీక్షించారు. -
అకాడమీలు
రెండు క్రీడా వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు శుభవార్త ప్రకటించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో మూడు క్రీడల అకాడమీలు కొనసాగుతున్నాయి. వీటికి తోడుగా మరో రెండు క్రీడలను కొనసాగించేలా కొత్త అకాడమీలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా మంజూరైన అకాడమీల్లో క్రీడాకారుల ప్రవేశాల ఎంపిక ప్రక్రియను సైతం చేపట్టనుంది. ఇందులో అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధీనంలో జేఎన్ స్టేడియంలో ప్రస్తుతం అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్ అకాడమీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారులు స్టేడియంలోని వసతిగృహంలో ఉంటూ డీఎస్ఏ కోచ్ల పర్యవేక్షణలో ఆయా క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెజ్లింగ్, స్విమ్మింగ్ అకాడమీలను మంజూరు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆ రెండు క్రీడల క్రీడాకారులు డీఎస్ఏ నిర్వహించే ఎంపికలో పాల్గొని అర్హత సాధించినట్లయితే అకాడమీలో శిక్షణ పొందుతారు. ప్రస్తుతం 118మంది క్రీడాకారులు.. స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ఇప్పటివరకు ఉన్న మూడు క్రీడల్లో 118 మంది క్రీడాకారులకు వసతి కల్పిస్తోంది. అందులో జిమ్నాస్టిక్స్లో బాలురు– 30, బాలికలు 20, హ్యాండ్బాల్లో 16మంది బాలురు, అథ్లెటిక్స్లో బాలురు 27 మంది, 25మంది బాలికలు అడ్మిషన్లు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రీడాకారుల సంఖ్య 118 మంది దాటకుండా కొత్తగా మంజూరైన రెండు అకాడమీలు, ఇప్పటికే కొనసాగుతున్న మూడు క్రీడల్లో క్రీడాకారులకు అడ్మిషన్లు కల్పించాలని పేర్కొంది. అందులో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ క్రీడాకారులకు కోత విధించి రెజ్లింగ్లో బాలురు 17 మంది, స్విమ్మింగ్లో బాలబాలికలు 18 మంది క్రీడాకారులకు అడ్మిషన్లు కల్పించాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. కాగా, పదేళ్ల క్రితం వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో స్విమ్మింగ్ అకాడమీ కొనసాగింది. అనుకున్న స్థాయిలో అడ్మిషన్లు, ఆశించిన ఫలితాలు లేకపోవడంతో అకాడమీని ఇక్కడినుంచి తరలించారు. పదేళ్ల తర్వాత జిల్లాకు స్విమ్మింగ్, రెజ్లింగ్ అకాడమీలు మంజూరు కావడం విశేషం. ఎంపికలో పాల్గొనాలి.. వచ్చే నెల 3,4 తేదీల్లో వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్ తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే ఎంపికలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలురు రెజ్లింగ్ ఎంపికలో పాల్గొనవచ్చన్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికలు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. క్రీడాకారులు ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫొటోలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు ఒక జిరాక్స్ సెట్తోపాటు స్పోర్ట్స్ డ్రెస్, రన్నింగ్ షూతో రావాలని డీఎస్ఏ రెజ్లింగ్ కోచ్ రాజు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉత్తర్వులు జారీ చేసిన సాట్ హనుమకొండలో రెజ్లింగ్, స్విమ్మింగ్ అకాడమీల మంజూరు ఇప్పటికే ఉన్న అకాడమీల్లో క్రీడాకారుల కుదింపు? పదేళ్ల క్రితం తరలిన స్విమ్మింగ్ అకాడమీ తిరిగి ఏర్పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చన్న డీవైఎస్ఓ