గంగదేవిపల్లిని సందర్శించిన సత్యసాయి జిల్లావాసులు - | Sakshi
Sakshi News home page

గంగదేవిపల్లిని సందర్శించిన సత్యసాయి జిల్లావాసులు

Published Sat, Jun 22 2024 1:32 AM | Last Updated on Sat, Jun 22 2024 1:32 AM

గంగదేవిపల్లిని సందర్శించిన సత్యసాయి జిల్లావాసులు

గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సత్యసాయి జిల్లాకు చెందిన 40 మంది గ్రామాభివృద్ధి బాధ్యులు శుక్రవారం సందర్శించారు. తలుపుల మండలంలోని నూతన కాలవ, పులింగుడ్లపల్లి, లక్క సముద్రం, గొల్లపల్లితండా, ఏపులపల్లి, రాజనాలపల్లి, ఉడుములకుర్తి, మంగివాండ్ల పల్లి, నిగ్గిడి గ్రామాల నుంచి అభివృద్ధి కమిటీ సభ్యులు సందర్శించి గ్రామ అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. రాయలసీమ డెవలప్‌మెంట్‌ ట్రస్టు, అనంతపురం హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ టీం నుంచి శ్రీనివాస్‌, ధనలక్ష్మి, ఏరియా టీం లీడర్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. వారికి గ్రామ అభివృద్ధి గురించి జిల్లా శిక్షణ మేనేజర్‌ కూసం రాజమౌళి, బాలవికాస ప్రతినిధి కొట్టె రమాదేవి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement