-
కొనసాగుతున్నవిధ్వంసం
ద్వారకాతిరుమల/తాడేపల్లిగూడెం/గోపాలపురం: అధికారమే అండగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో గురువారం కూడా యథేచ్ఛగా విధ్వంసం సాగించారు. ఏలూరు జిల్లాలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసంఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కిటికీ అద్దాలను పగులగొట్టాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డు సత్యనారాయణపేటలో టీడీపీ కార్యకర్తలు సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సత్యనారాయణ పేటలో రెండేళ్ల క్రితం రూ.9 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మించారు. తాజాగా ఈ శిలాఫలకాన్ని నాశనం చేశారు. ‘తూర్పు’లో శిలాఫలకం పగులకొట్టి.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సచివాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులకొట్టారు. అంతేకాకుండా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వెంకటాయపాలెం – గౌరీపట్నం రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తుప్పల్లో పడేశారు. దీంతో వెంకటాయపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పికెట్ ఏర్పాటు చేశామని ఎస్సై సతీష్కుమార్ తెలిపారు. -
జిల్లా రాజకీయాలపై పుస్తకావిష్కరణ
రాజానగరం: ‘తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు 1952 – 2022’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు గురువారం ఆవిష్కరించారు. వర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా పని చేసి, ఉద్యోగ విరమణ చేసి ఆచార్య బీవీవీ బాలకృష్ణ ఈ పుస్తకం రచన, సంకలనం చేశారు. క్యాంపస్ సెంట్రల్ లైబ్రరీలోని వివిధ గ్రంథాలను ఉపయోగించుకుంటూ రచయిత ఈ పుస్తక రూపకల్పన చేశారని వీసీ అన్నారు. దాతల పుస్తక భాండాగారంగా ఉన్న ‘నన్నయ భారతి’ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించారని, ప్రతులు కావలసిన వారు నన్నయ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. చరిత్రను భావితరాలకు భద్రంగా అందించడంలో పుస్తక రచనలు ఎంతో తోడ్పడతాయని, చరిత్ర, పూర్వీకుల ఘనత, త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రచయిత కృషిని వీసీ, రిజిస్ట్రార్ తదితరులు అభినందించారు. శిలాఫలకంపై తెల్ల ప్లాస్టర్లు రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకంపై గుర్తు తెలియని దుండగులు తెల్లని ప్లాస్టర్లు అతికించిన ఘటన నగరంలో గురువారం చోటు చేసుకుంది. ఏడో డివిజన్ గానుగ వీధిలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకంపై వైఎస్సార్ సీపీకి చెందిన నాటి మంత్రులు, ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. వీటిపై గుర్తు తెలియని వ్యక్తులు తెల్లకాగితం అతికించారు. కలెక్టర్, ఇతర అధికారుల పేర్లు అలాగే వదిలేశారు. టీడీపీ శ్రేణుల చేతిలో మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం ధ్వంసం ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై నగర ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం సంస్కృతి అని విమర్శిస్తున్నారు. శిలాఫలకంపై దుండగులు అతికించిన తెల్లని ప్లాస్టర్లను నగరపాలక సంస్థ అధికారులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇసుక తిన్నెలు.. ఎదురుతెన్నులు
కొవ్వూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఇసుక ర్యాంపులన్నీ మూత పడ్డాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎక్కడా ఇసుక లభ్యం కావడం లేదు. కొత్త ప్రభుత్వం నూతన ఇసుక విధానం ఖరారు చేయడానికి మరి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక పాలసీ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే. అయితే, ఈలోగా ఇసుక లభ్యం కాకపోవడంతో జిల్లాలో నిర్మాణ పనులు నెమ్మదించాయి. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ఇసుక పాలసీ ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఇటు ప్రజలు, అటు నిర్మాణ రంగ కార్మికులు ఎదురుచూస్తున్నారు. వరద వస్తే అంతే సంగతులు సాధారణంగా గోదావరి నదికి జూన్ నెలాఖరు నుంచి క్రమంగా ఎర్ర నీరు (కొత్త నీరు) రావడం ఆరంభమవుతుంది. జూలై రెండో వారంలో వరదలు రావడం మొదలవుతుంది. ఆ సమయంలో ఇసుక తవ్వకాలకు ఆటంకం కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన ఇసుక ర్యాంపులు తెరవకపోతే రానున్న వర్షాకాలంలో ఇసుకకు కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో ర్యాంపులు నిలిచిపోయే సమయానికి జిల్లావ్యాప్తంగా అనేక బోట్స్మెన్ సొసైటీ ర్యాంపుల్లో సుమారు 50 వేల టన్నులకు పైగా ఇసుక నిల్వలున్నాయని అంచనా. ర్యాంపులు తెరిస్తే ఈ ఇసుక నిల్వలు ముందుగా అక్కరకు వచ్చే అవకాశాలుంటాయి. బోట్స్మెన్ సొసైటీకి దక్కేదెంత? రాష్ట్రవ్యాప్తంగా గోదావరిలోనే అత్యంత నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. గోదావరి జిల్లాల్లో అత్యధికంగా బోట్స్మెన్ సొసైటీల (పడవల) ద్వారా ఇసుక సేకరిస్తున్నారు. ఇసుక సేకరణ ద్వారా సుమారు 10 వేల మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. జిల్లాకు చెందినవారితో పాటు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఇసుక సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరు నదిలో నుంచి పడవల ద్వారా ఇసుక సేకరించి ఒడ్డున పోస్తారు. ఇసుక సేకరణకు గాను బోట్స్మెన్ సొసైటీలకు టన్నుకు రూ.200 చొప్పున ఒక యూనిట్కు (4 టన్నులు) ప్రభుత్వం రూ.800 చెల్లించేది. ఇప్పటి వరకూ టన్ను ఇసుక ధర బోట్స్మెన్ ర్యాంపుల్లో రూ.625గా ఉంది. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తే బోట్స్మెన్ సొసైటీలకు నిర్వహణ ఖర్చు కింద యూనిట్కు ఎంత చెల్లిస్తారనేది కొత్త ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉంది. డీజిల్ ధరలు, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో యూనిట్కు రూ.1,000 పైగా చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని పడవల నిర్వాహకులు చెబుతున్నారు. గోదావరికి వరదలు వచ్చే సమయం ఆసన్నమవుతూండటంతో మరో 10 రోజులు గడిస్తే ఓపెన్ రీచ్లు తెరిచే పరిస్థితి ఉండదని అంచనా. దీంతో రానున్న నాలుగైదు నెలలూ ఇసుక కోసం పూర్తిగా బోట్స్మెన్ ర్యాంపుల పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అటువంటి కీలకమైన బోట్స్మెన్ ర్యాంపుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. నిర్వాహకుల్లో అయోమయం మరోవైపు గోదావరిలో పూడిక తీతకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో ప్రస్తుతం డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికి ఆగస్టు 8వ తేదీ వరకూ గడువు ఉందని చెబుతున్నారు. ఆ తరువాత డ్రెడ్జింగ్ ప్రక్రియ కొనసాగిస్తారా లేక తమకు పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తారా అనే అంశంపై బోట్స్మెన్ సొసైటీల నిర్వాహకులు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. పడవల ద్వారా ఇసుక సేకరించే కార్మికులకు కూలి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఖర్చు కొంత ఎక్కువ అవుతోంది. అదే డ్రెడ్జింగ్ ద్వారా అయితే తక్కువ ఖర్చుకే ఇసుక సేకరించే అవకాశం ఉంటుంది. ఏది ఎలా ఉన్నా వారం పది రోజుల్లో ప్రభుత్వం ఇసుక పాలసీ ఖరారు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్న బోట్స్మెన్ సొసైటీలు తమ పడవలను సిద్ధం చేసుకుంటున్నాయి. బోట్స్మెన్ ర్యాంపులే అధికం జిల్లావ్యాప్తంగా తాళ్లపూడి, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 30కి పైగా బోట్స్మెన్ ర్యాంపులున్నాయి. కొవ్వూరు మండలం, పట్టణ పరిధిలో 13, తాళ్లపూడి మండలంలో 7, రాజమహేంద్రవరం రూరల్లోని కాతేరు, రాజమహేంద్రవరం నగరంలో కోటిలింగాల రేవు, గాయత్రీ రేవు ర్యాంపులతో పాటు చిన్నాచితకా మరో 4 వరకూ ర్యాంపులున్నాయి. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల పరిధిలోనే 500 వరకూ పడవలున్నాయి. వీటిలో ఎంత తక్కువగా లెక్కేసినా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇవి కాకుండా కొవ్వూరు, తాళ్లపూడి, పెరవలి, సీతానగరం మండలాల పరిధిలో బల్లిపాడు, కుమారదేవం, పందలపర్రు, పెండ్యాల, కానూరు, తీపర్రు, ఉసులుమర్రు, ఖండవల్లి, సీతానగరం, వంగలపూడి వంటి చోట్ల ఓపెన్ రీచ్లున్నాయి. ఈ ర్యాంపులన్నీ దాదాపు నెల రోజులుగా మూత పడ్డాయి. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ ఓపెన్ ర్యాంపులను తెరచి, బాటలు (రోడ్డు) వేసుకుని, తవ్వకాలు ప్రారంభించే సమయానికి గోదావరిలో వరద వచ్చేస్తుంది. దీనినిబట్టి ఈ ర్యాంపులను తెరచినా పది పదిహేను రోజులకు మించి పని చేసే పరిస్థితి లేదు. జూలై నుంచి నవంబర్ నెలాఖారు వరకూ బోట్స్మెన్ ర్యాంపుల ద్వారా సేకరించిన ఇసుక పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అది కూడా గోదావరిలో వరద ప్రమాదకర స్థాయికి చేరితే ఇసుక సేకరించే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇసుక పాలసీ ఎలా ఉంటుందా అని జనం ఎదురు చూస్తున్నారు. పేట్రేగుతున్న అక్రమార్కులు ఇసుక ర్యాంపులు మూతపడడంతో అక్రమార్కులు పంజా విసురుతున్నారు. ఈ నెల 15న కొవ్వూరులో ఎరినమ్మ ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేములూరులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు ఆరు లారీల ఇసుక, పొక్లయినర్, లోడింగ్ ట్రాక్టర్ను సీజ్ చేశారు. నిడదవోలు మండలం పందలపర్రు సమీపంలో రావివారిపాలెంలో గోదావరి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. మద్దూరు లంక గ్రామంలోను రెండు ఇసుక లారీలను, రెండు లోడింగ్ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా నిత్యం ఏదో ఒకచోట ఇసుక తరలిస్తూ, అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాంపులు తెరిస్తే అక్రమార్కులకు కళ్లెం వేసినట్లవుతుంది. ఫర్యాంపులు తెరచుకునేదెప్పుడో! ఫసార్వత్రిక ఎన్నికలతో నిలచిన అమ్మకాలు ఫభవన నిర్మాణ కార్మికుల ఉపాధిపై ప్రభావం ఫప్రభుత్వ ఇసుక విధానం కోసం ఎదురుచూపులు -
ఆనందయోగం
● మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందిస్తున్న యోగా ● ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆదరణ ● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/తాళ్లపూడి/కాకినాడ క్రైం: దేహాన్ని, మనసును ఐక్యం చేసే అద్భుత యోగం యోగా. యోగా అంటే అదేదో మునులు ముక్కు మూసుకుని చేసే తపస్సు కాదు. శరీరాన్ని మెలికలు తిప్పి చేసే అద్భుత విన్యాసం. మనసును, శరీరాన్ని సమన్వయంతో సమస్థితిలో ఉంచే మహత్తర ప్రక్రియ. కులమతాలకు అతీతంగా పూర్వీకులు మనకు ప్రసాదించిన ఆరోగ్య రహస్యం. ప్రపంచానికి భారత దేశం అందించిన మహా మంత్రం ఈ యోగ తంత్రం. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకునే వారే కాదు.. నిత్య జీవన యుద్ధంలో తలమునకలయ్యే వారు సైతం యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటున్నారు యోగా గురువులు. నిరంతరం యోగా చేసే వారి జీవిత కాలం అక్షరాలా వందేళ్ల పైనే అని అంటున్నారు. యోగా, ధ్యానం చేస్తున్న 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులు పలువురు నేటికీ ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో యోగా కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు వెలిశాయి. జిల్లావ్యాప్తంగా పలు సంస్థలతో పాటు రాజమహేంద్రవరంలో శ్రీ రామకృష్ణ మఠం, శారదా మఠం, బ్రహ్మకుమారీస్ వంటి వాటిలో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు ● యోగా వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలై, అన్ని రకాల రుగ్మతలూ దూరమవుతాయి. శరీరం తేలికవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. మానసిక ప్రశాంతత కలిగి, భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ● శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి, ఊబకాయం, బరువు తగ్గుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. సైనస్, ఎలర్జీ సమస్యలు దూరమవుతాయి. వృద్ధాప్య ఛాయలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు. ● మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి నియంత్రణలోకి వస్తాయి. ● యోగాలో భాగంగా వేసే సూర్య నమస్కారాల్లోని వివిధ భంగిమల ద్వారా అత్యంత శక్తిమంతమైన సూర్యరశ్మి శరీరంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. దీనివలన మెదడు, గుండె, వెన్నెముక, కీళ్లు, ఎముకలు, కండరాలు.. ఇలా శరీరంలోని అన్ని అవయవాలకూ నూతన శక్తి చేకూరుతుంది. శాసీ్త్రయ నిరూపణ ● లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు యోగ సాధకుల అనుభవం, పలు పరిశోధనల ఆధారంగా యోగా వల్ల మెదడు, శరీరంలో వచ్చే మార్పులపై ఓ స్పష్టతకు వచ్చారు. ఒత్తిడిని సమూలంగా నియంత్రించే ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ లేని ఒకే ఒక్క సాధనం యోగా అని శాసీ్త్రయంగా నిర్ధారించారు. ఉదాహరణకు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు శరీరాన్ని అన్ని వైపులకూ వంచుతాం. దీనివలన మెదడులోని ఎమోషనల్ బ్రెయిన్ అనే భాగంలో భంగిమలకు అనుగుణంగా కృత్రిమ ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ భంగిమలో ముందుకు వంగినప్పుడు తలలో రక్త ప్రసరణ జరిగి లాజికల్ బ్రెయిన్ స్పందిస్తే, మరో భంగిమలో ముందుకు వంగడం వల్ల పారా నాడీ వ్యవస్థలో రిలాక్స్ రెస్పాన్స్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియకు కొనసాగింపుగానే పారా సింపాథిటిక్ నాడీ వ్యవస్థలో స్విచ్లు, జంక్షన్లు ఉంటాయి. వివిధ ఆసనాలు వేసే క్రమంలో మెడ, నడుము, కాళ్లు, చేతులు, భుజం వంచడం ద్వారా ఈ స్విచ్లను నియంత్రించి మెదడులో ఒత్తిడి తగ్గుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. ● బ్రెజిల్లోని ఇజ్రాయిలిటా ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైద్య కేంద్రం పరిశోధకులు యోగా వల్ల మెదడులో కలిగే మార్పులను ‘ఫ్రంటైర్స్ ఇన్ ఈజింగ్ న్యూరో సైన్స్’ అనే సంచికలో తాజాగా ప్రచురించారు. యోగా చేసే 45 ఏళ్లు పైబడిన సీ్త్రలలో సెరిబ్రల్ కార్టిక్స్ పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ సెరిబ్రల్ కార్టిక్స్ పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్లే మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ యోగా యాంటీ ఏజింగ్, రివర్స్ ఏజింగ్ టెక్నిక్గా ఉపయోగపడి, సెరిబ్రల్ కార్టిక్స్ పరిమాణం పెంచుతుందని పేర్కొంది. ● మానసిక వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు, జనరల్ ఎండీలు, ఆంకాలజిస్టులు తమ వైద్య సేవల్లో యోగాను అంతర్భాగం చేస్తున్నారు. దీంతో యోగా ఓ థెరపీగా కూడా ఎదిగింది. ● పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్లో కూడా యోగానే మందు. అలాగే క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీని తట్టుకునేందుకు కూడా యోగా సహాయ పడుతుంది. ● చర్మం, జుట్టు ఆరోగ్యానికి, మలబద్ధకం నివారణకు, ప్రసవం సునాయాసంగా జరగడానికి, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో యోగా, ధ్యానం దివ్యౌషధాలు. యోగాయే శ్వాసగా.. రాజమహేంద్రవరం నగరానికి చెందిన యోగా గురువు పతంజలి శ్రీనివాస్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ, యోగా విశిష్టతనూ వివరిస్తూ, నేర్పిస్తున్నారు. రామ్దేవ్ బాబా శిష్యునిగా యోగ జీవితం ప్రారంభించిన ఆయన ప్రణవ సంకల్ప యోగ సమితి స్థాపించి, పదహారేళ్లుగా 400 ఉచిత యోగా శిబిరాలు నిర్వహించారు. యోగా శిక్షణ ద్వారా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని ఎంతో మంది ఖైదీల్లో పరివర్తన తీసుకుని వచ్చారు. 15 హత్యలు చేసిన గ్యాంగ్స్టర్ కూడా ఆయన శిక్షణలో యోగా స్టార్గా మారారు. ఐటీడీఏ ఆధ్వర్యాన ఏజెన్సీ ప్రాంతంలోని 103 గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో యోగా శిక్షణ ఇచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యాన సింగపూర్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. అంధ, చెవిటి, మూగ విద్యార్థులకు సైతం యోగ విద్యను అందించారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ అనుమతితో ఓఎన్జీసీ ఆర్థిక సహకారంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 30 మంది ఖైదీలకు 9 నెలల పాటు యోగా శిక్షణ అందించారు. యోగా అనేది కేవలం ఫ్యాషన్ కోసం నేర్చుకునేది కాదని, మహర్షులు అందించిన గొప్ప వరమని పతంజలి శ్రీనివాస్ అంటారు. యోగాతో అనేక శారీరక, మానసిక రుగ్మతులను పొగట్టవచ్చని చెబుతారు. 43 ఏళ్లుగా యోగా శిక్షణ తాళ్లపూడికి చెందిన యోగా గురువు నక్కా వెంకటేశ్వరరావు 43 ఏళ్లుగా అలుపెరగకుండా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. గాయత్రీ యోగా సేవా సమితి స్థాపించి వయస్సుతో నిమిత్తం లేకుండా ఇప్పటి వరకూ 15 వేల మందికి ఉచితంగా యోగా నేర్పించారు. ఉచితంగా జిమ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యోగా, ఆటలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. ఆయన 1985లో విశాఖపట్నంలో యోగా శిక్షణ పొందారు. పతంజలి యోగాలో కుండలి, ఓంకారం, ప్రాణాయామం, సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ, విలోమ, నాడీ సాధన, కపాలభాతిలో లౌలీ క్రియ, సూర్య నమస్కారాలతో పాటు హలాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం, పశ్చిమోత్తానాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, హంసాసనం, మయూరాసనం, తాడాసనం, వజ్రాసనం, బద్ధపద్మాసనం, వృక్షాసనం, పర్వతాసానం వంటివి వేయడంలో ఈయన దిట్ట. వెంకటేశ్వరరావు 62 ఏళ్ల వయస్సులోను 60కి పైగా ఆసనాలను అలవోకగా వేస్తారు. స్వతహాగా సైకిల్ మెకానిక్ అయిన ఆయన మొదట్లో ఏమీ చదువులేదు. యోగా నేర్చుకున్నాక క్రమంగా పదో తరగతి తరువాత డిగ్రీ ప్రైవేటుగా చదివారు. పాఠశాల విద్యార్థులకు నిరంతరం ఉచితంగా యోగా నేర్పిస్తారు. యోగాతో పాటు, ధ్యానం, నేత్ర సంచలన, స్థిర సంచలన, హస్త సంచలన వంటివి సాధన చేయిస్తారు. ఈసారి పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొనగా 100 మందికి బహుమతులు అందజేస్తున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. గిరిజన విద్యార్థులకు యోగా నేర్పుతున్న పతంజలి శ్రీనివాస్శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2024ఆధునిక యాంత్రిక జీవనంలో మానవులు ఎన్నో ఆటుపోట్లకు, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ అంతా ఉరుకులు పరుగులే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైతం కొంత సమయాన్ని కేటాయించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా మానసిక ఆందోళన, చిరాకు, కోపం వంటి వాటికి లోనవుతున్నారు. అవి మనసు పైనే కాకుండా శారీర ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం శూన్యం. ఇది మానసికంగా మరింత కుంగదీస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వారి అనారోగ్య సమస్యలను పటాపంచలు చేసి, మానసిక ప్రశాంతతను చేకూర్చే దివ్యౌషధం యోగా. అంతర్గత చేతనా శక్తిని మనసుకు, శరీరానికి సంపూర్ణంగా అందించి సక్రమమైన జీవన విధానాన్ని అందించే అద్భుత ప్రక్రియ. రకరకాల మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తే, యోగా మాత్రమే దీర్ఘకాలిక ఊరటనందిస్తోంది. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. యోగా దినోత్సవం వచ్చిందిలా.. సనాతన భారతీయ శాస్త్రాల్లో యోగా ఒకటి. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలోనే పతంజలి మహర్షి దీనిని రచించారు. అనేక ప్రక్రియలపై పరిశోధనలు చేసి, స్వానుభవంతో ప్రపంచం ముందుకు తీసుకుని వచ్చారు. 2014 సెప్టెంబరు 27న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదించారు. దీనికి అమెరికా, కెనడా, చైనా సహా 193 దేశాలు మద్దతు పలికాయి. దీంతో, ఈ దినోత్సవానికి నిర్ణీత తేదీ చెప్పాలని ఐక్యరాజ్య సమితి మోదీని కోరింది. ఆయన సూచనల మేరకు ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. చిన్నతనం నుంచే.. తాళ్లపూడికి చెందిన కిలాని వర్షిత తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి రమేష్ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే నిత్యం యోగా సాధన చేస్తోంది. గురువు నక్కా వెంకటేశ్వరరావు వద్ద ప్రతి రోజూ ఉదయం యోగా సాధన సాగిస్తోంది. నిరంతర సాధనతో పలు కఠినమైన ఆసనాలను సైతం అలవోకగా వేస్తూ ఔరా అనిపించుకుంటోంది. ప్రాణాయామం, ధ్యానం, ఓంకారం, వజ్రాసనం, పర్వతాసనం, చక్రాసనం, నౌకాసనం, సర్పాసనం వంటివి వేస్తుంది. యోగా ద్వారా జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా ఒత్తిడి లేకుండా చదువుకోగలుగుతున్నానని వర్షిత చెబుతోంది. నాడు గ్యాంగ్ స్టర్.. నేడు యోగా స్టార్ ఉత్తరాఖండ్లోని ఫితోడ్గఢ్ గ్రామంలో ఉన్నత కుటుంబంలో జన్మించాడు ప్రతాప్సింగ్. అతడి తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్సింగ్ చిన్నప్పుడే కల కన్నాడు. కానీ, పోలియో కారణంగా ఆ కల నెరవేరలేదు. దీనికి తోడు సవతి తల్లి సూటిపోటి మాటలు భరించలేక చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడు. ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్స్టర్ వద్ద చేరాడు. 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్లు చేశాడు. ప్రతాప్సింగ్ గ్యాంగ్ ఆగడాల కారణంగా ఢిల్లీ కళ్యాణ్పూర్లో అడుగు పెట్టాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్లే. అతి సమీపానికి వెళ్లి, గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్తుందనే పేరొచ్చింది. పలు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్ సింగ్ ఏలూరు జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఖైదీల్లో పరివర్తన తీసుకుని రావడానికి 2017లో యోగా నేర్పించారు. తొమ్మిది నెలల కాలంలో సంపూర్ణ శిక్షణలో భాగంగా యోగా, ధ్యానం నేర్చుకున్న ప్రతాప్సింగ్ పరివర్తన చెందాడు. చెడు మార్గాన్ని వీడి.. యోగా గురువుగా మారాడు. -
ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రేపు
కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో శుక్రవారం జెన్పాక్ట్ కంపెనీలో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ (వాయిస్ ప్రొసెస్ ఇంగ్లిషు) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి రూ.21 వేల జీతం, ఇన్సింటివ్, పీజీ ఉత్తీర్ణులైన వారికి సంవత్సరానికి రూ.2.5 లక్షలు, ఇన్సింటివ్స్, ఎక్స్పీరియన్స్ అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.5 లక్షలు, ఇన్సింటివ్స్ ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఎంపికైన వారు నానక్రామ్గుడా, హైదరాబాద్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వికాస కార్యాలయంలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. -
శాటిలైట్సిటీలో వ్యక్తి హత్య
పాత కక్షలే కారణం రాజమహేంద్రవరం రూరల్: అష్టాచమ్మ ఆటలో వివాదంతో పాటు, పాతకక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన శాటిలైట్సిటీ గ్రామం రాజీవ్గృహకల్ప సముదాయంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం శాటిలైట్సిటీ రాజీవ్గృహకల్ప సముదాయానికి చెందిన మార్గాని నాగేశ్వరరావు (45) కూలి పని చేసుకుంటాడు. అదే ప్రాంతానికి చెందిన కై రం వెంకన్న, కై రం వీరన్నలకు నాగేశ్వరరావుతో పాతకక్షలు ఉన్నాయి. మంగళవారం వారు గృహకల్ప వద్ద అష్టాచమ్మ ఆడుతున్నారు. ఈ సందర్భంగా పాత అప్పు కోసం వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వెంకన్న, వీరన్నలను చంపేస్తానని నాగేశ్వరరావు కత్తి పట్టుకుని తిరిగాడు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో వారి మధ్య గొడవ జరిగి వెంకన్న భార్య విషయమై నాగేశ్వరరావు అమర్యాదగా మాట్లాడాడు. దీంతో నాగేశ్వరరావు వద్ద ఉన్న కత్తిని వెంకన్న లాక్కుని అతనిని పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావు సోదరుడు వీర్రాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై బి.శ్రీను కేసు నమోదు చేయగా, బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శివగణేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
కువైట్ బాధితులకు క్షమాభిక్ష
అమలాపురం టౌన్: సరైన ఆధారాలు, అనుమతులు లేకుండా కువైట్ దేశంలో చిక్కుకుపోయిన తెలుగువారు అక్కడి పోలీసు స్టేషన్లు, లేదా భారత దౌత్య కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా సంప్రదిస్తే స్వదేశానికి చేరుకోవచ్చని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ హౌస్ మెయిడ్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ద వరల్డ్ ఫ్రమ్ గోదావరి డెల్టా రీజియన్ చైర్మన్ హోదాలో ఆయన బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వదేశానికి వచ్చే దారిలేని వారికోసం కువైట్ దేశపు రాజు క్షమాభిక్ష ప్రకటించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబీకులు, బంధువులు ఫోన్లు చేసినప్పుడు ఈ విషయం చెప్పాలని కుడుపూడి పేర్కొన్నారు. వాస్తవానికి మార్చి 17వ తేదీ నుంచి జూన్ 17 లోపున అక్రమ వలసదారులు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని క్షమాభిక్షలో పేర్కొన్నప్పటికీ, గడువు పెంచాలని ఆ రాజ కుటుంబంలోని అడ్వకేట్, కువైట్ రాజకుమారి (షెయికా బీబీ అల్సబా)కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించారు. అక్కడి వారు ఇరు తెలుగు రాష్ట్రాలలోని బంధువులకు ఫోన్ చేసినపుడు ఈ క్షమాభిక్ష గురించి చెప్పాలని కుడుపూడి తన ప్రకటనలో పేర్కొన్నారు. లేని పక్షంలో అమలాపురానికి చెందిన సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియల్ను 7013210153 ఫోన్ నెంబరులో సంప్రదించాలని పేర్కొంది. ఈ నెల 30వ తేదీ తుది గడువు అక్కడి పోలీసు స్టేషన్లు, దౌత్య కార్యాలయాల్లో సంప్రదించాలి ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి -
నిలిచిన గ్రానైట్ పలకల తొలగింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తూర్పు రాజగోపురానికి ఎదురుగా గల ఘాట్రోడ్ వద్ద మెట్లకు వేసిన గ్రానైట్ పలకలను తొలగించే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ గ్రానైట్ పలకలు విరాళంగా అందచేసిన దాత మాజీ మంత్రి సిద్దా రాఘవరావు బంధువులు వీటి తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ గ్రానైట్ పలకలు ఎండకు బాగా వేడెక్కిపోవడంతో ఈ మెట్ల మీద నడిచే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వీటిని తొలగించే పని చేపట్టారు. అయితే ఈ విషయం తెలిసిన దాత దేవస్థానానికి విచ్చేసి ఈ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ముందుగా విషయం చెబితే ఈ గ్రానైట్ పలకలను తొలగించకుండా ప్రత్యామ్నాయం ఆలోచించేవారమని చెప్పినట్టు సమాచారం. రత్నగిరికి పోటెత్తిన భక్తులు రత్నగిరి సత్యదేవుని ఆలయానికి బుధవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారం రోజులుగా సూర్యభగవానుడి ప్రతాపంతో భక్తులు అల్లాడిపోయారు. అయితే బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు కొంత ఊరట చెందారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి తరలివచ్చారు. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నేడు స్వామి,అమ్మవార్ల నిజరూప దర్శనం గురువారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు నిజరూపదర్శనం ఇవ్వనున్నారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు గురువారం కేవలం పుష్పాలంకరణలో శిలారూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
రేపటి మహా జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 21న స్వామివారి మూలవిరాట్టుకు నిర్వహించే సప్తనదీ జలాలతో మహా జ్యేష్ఠాభిషేకానికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆలయానికి చేర్చిన సప్తనదీ జలాల కలశాలను మీడియాకు ప్రదర్శించారు. కావేరి, సింధు, నర్మదా, సరస్వతి, గోదావరి, యమున, గంగా నదుల జలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరించామని చెప్పారు. జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ నక్షత్ర మహా పర్వదినం సందర్భంగా విశేషమైన అభిషేకం నిర్వహిస్తున్నట్టు, భక్తులు ఈ అభిషేకం, మహాశాంతి హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అపరాధ రుసుం ఎత్తివేయాలి
కొరిటెపాడు(గుంటూరు): అదనపు పొగాకు పంటపై అపరాధ రుసుం ఎత్తివేయాలని కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల రైతు సంఘాల ప్రతినిధులు బుధవారం గుంటూరు జీటీ రోడ్లోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్బాబులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు మాట్లాడుతూ అదనంగా పండించిన పొగాకు పంటకు అపరాధ రుసుం లేకుండా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాలకు ఒక కమ్యూనిటీ హాలు నిర్మించాలని సూచించారు. స్పందించిన పొగాకు బోర్డు చైర్మన్, ఈడీలు చిడిపోతు యశ్వంత్కుమార్, అద్దంకి శ్రీధర్బాబులు మాట్లాడుతూ అపరాధ రుసుంపై ఇప్పటికే ఢిల్లీ లోని వాణిజ్య శాఖకు సిఫార్సు చేయడం జరిగిందని వెల్లడించారు. అనంతరం ప్రస్తుతం జరుగుతున్న వేలం విధానంపై చర్చించారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఐదు వేలం కేంద్రాల రైతు సంఘాల నాయకులు సత్రం వెంకట్రావు, వీవీఎస్ ప్రకాశరావు, అట్లూరి సతీష్, తదితరులున్నారు. -
చెక్కనైన పనితేరు
సత్యదేవుని చిన్నరథం నిర్మాణ వ్యయం రూ.34 లక్షలు. రథం ఎత్తు 14 అడుగులు. వెడల్పు 6.3 అడుగులు. పొడవు 7.5 అడుగులు. ఈ రథం గత మార్చి రెండో తేదీ, రథసప్తమి నాడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ ఆదివారం రత్నగిరి ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఊరేగిస్తున్నారు. సత్యదేవుని పెద్ద రథం నిర్మాణ వ్యయం రూ.1.08 కోట్లు. ఎత్తు 34 అడుగులు. వెడల్పు 14 అడుగులు. పొడవు 23.5 అడుగులు. గత మే నెలలో జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల ఐదో రోజు అనగా మే 22 వ తేదీన అన్నవర పుర వీధుల్లో ఈ రథంపై స్వామిని ఘనంగా ఊరేగించారు. చిన్న రథానికి రత్నగిరిపై ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మిస్తుండగా, పెద్ద రథానికి కొండ దిగువన షెడ్డు నిర్మిస్తున్నారు. అన్నవరం: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు...’ అంటూ హంపి విజయనగరంలో గల శిల్పకళ అందాల గురించి వర్ణించే సినిమా పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ శిల్పుల పనితనం చూస్తే చెక్కతో రథాలు చేసినారు...వారు దేవతామూర్తులకే కొత్త సొబగులు అద్దినారు’ అని పాడాల్సి వస్తుంది. శిల్పకళను తలదన్నేలా చెక్కపై కూడా అందమైన శిల్పాలు, దేవతామూర్తులు, దేవుళ్లను చెక్కే శిల్పులతో బాటు, దేవతామూర్తులను ఊరేగించే ఎత్తయిన రథాలను రూపొందించే శిల్పులు కూడా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమండకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళా వుడ్ వర్క్స్ అఽధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఆ కోవకు చెందినవారే. పది అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథంతో బాటు 36 అడుగుల ఎత్తయిన రథాలు కూడా నిర్మించిన చరిత్ర వారిది. వీటితోబాటు ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు, వస్తువులు, కళాఖండాలు కూడా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకున్న పనితనం వీరిది. MýS$Ìê-°MìS AW²MýS$ÌS „ýS{†Ä¶æ¬Ë$...-˘ వృత్తికి శిల్పకారులు అలాగని వారేమి అనాదిగా చెక్కతో వస్తువులు, బొమ్మలు, గృహోపకరణాలు తయారు చేసే కులవృత్తి కలిగిన వడ్రంగులో, విశ్వబ్రాహ్మణులో కాదు. కులానికి సముద్రంలో చేపలు పట్టే అగ్నికుల క్షత్రియులు. అయితే గత నాలుగు తరాలుగా దేవతా విగ్రహాలు, రథాలు , ఇతర కళాఖండాలు తయారు చేయడాన్ని వృత్తిగా స్వీకరించినట్టు కొల్లాటి కామేశ్వరరావు, ఆయన కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. సుమారు ఎనిమిది నెలల నుంచి వారు అన్నవరంలోనే ఉండి సత్యదేవుని ఊరేగించేందుకు 14 అడుగుల ఎత్తయిన చిన్న రథం, 34 అడుగుల పెద్ద రథం తయారు చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి తమ అనుభవాలను వివరించారు. రథాల తయారీ చాలా కష్టం దేవుళ్లను ఊరేగించే రథాలు తయారు చేయడం చాలా కష్టమైన పని. అందులో 20 అడుగుల కన్నా ఎత్తు రథం తయారు చేయాలంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. రథాలు, దేవతామూర్తుల విగ్రహాలు, మందిరాలు, దేవుళ్లని ఊరేగించేందుకు వివిధ వాహనాల నిర్మాణంలో నాణ్యమైన బస్తరు టేకునే వాడతాం. కర్ర నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడం. చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ రథం నిర్మించాలి. నిర్మాణ సమయంలో చాలా నిష్టగా కూడా ఉండాలి. – కొల్లాటి కామేశ్వరరావు, ప్రధాన శిల్పి రథాలు, దేవతామూర్తుల తయారీలో సిద్ధహస్తులు కొల్లాటి వంశస్తులు ఇప్పటి వరకు 82 రథాలను రూపొందించి మన్ననలు పొందిన వైనం సత్యదేవునికి రెండు రథాలు అందించిన కామేశ్వరరావు, శ్రీనివాస్ బృందం పడవల తయారీ నుంచి దేవుళ్ల రథాల వరకు... మా తాత కొల్లాటి వీర్రాజు తొలుత చేపలు పట్టే బోట్లు, పడవలు తయారు చేసేవారు. అలా చిన్న చిన్న గృహోపకరణాలు, దేవతామూర్తుల విగ్రహాలు, రథాల తయారీ ప్రారంభించారు. మా నాన్న కొల్లాటి కామేశ్వరరావు పెద్ద పెద్ద రథాలు తయారు చేయడంలో నిపుణులు. ఆయన వద్ద నుంచి నేను ఈ వృత్తి నేర్చుకున్నాను. నాతో పాటు మరో 20 మంది శిల్పులు దేవతా రథాలు తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకు 82 రథాలు తయారు చేశాం. వాటిలో 43 అడుగుల ఎత్తు కలిగిన అంతర్వేది దేవస్థానం రథం పెద్దది. ఆ తరువాత యానాంలోని మీసాల వేంకటేశ్వరస్వామి దేవస్థానం రథం ఎత్తు 38 అడుగులు. అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో 14 అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథం, 34 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రథం తయారు చేశాం. ఇవి కాకుండా పలు ప్రముఖ దేవస్థానాలకు రథాలు తయారు చేశాం. రథాలే కాకుండా చెక్కతో వివిధ దేవతామూర్తులు, ఇతర గృహోపకరణాలు కూడా తయారు చేశాం. నూతనంగా లోవకొత్తూరులో నిర్మించిన తలుపులమ్మ తల్లి ఆలయం తలుపులు కూడా మేమే తయారు చేశాం. – కొల్లాటి శ్రీనివాస్ -
పాత అలైన్మెంట్తోనే బైపాస్ నిర్మించాలి
మామిడికుదురు: పాశర్లపూడి 216వ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు. 2014లో చేసిన అలైన్మెంట్ను కాదని 2016లో చేసిన అలైన్మెంట్ ప్రకారం రోడ్డు పనులు చేస్తున్నారంటూ పనులను అడ్డుకున్నారు. కొంత మందికి అనుకూలంగా నిరుపేదలకు వ్యతిరేకంగా అలైన్మెంట్లో మార్పులు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల ఆరు, పది సెంట్లు ఉన్న తమ భూములు కోల్పోతున్నామంటూ ఆవేదన చెందారు. ఈ సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆర్జీ పంపించామని బాధితులు పేర్కొన్నారు. -
ఒకటి నుంచి సీపీఐ సమావేశాలు
ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం) : జూలై 1, 2, 3 తేదీల్లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు విశాఖపట్నంలో జరగనున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది .ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐను బలోపేతం చేయడం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేద్దామని ిపిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర స్ధాయి సమావేశాల్లో పార్లమెంట్, శాసనసభ ఎన్నికల రివ్యూ, పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం తదితర అంశాలపై నివేదికలు ప్రవేశపెడుతున్నారని అందులో భాగంగా జిల్లా పార్టీ నిర్మాణం ప్రజాసంఘాల అంశాలు చర్చించి జిల్లా కార్యవర్గం ఒక డాక్యుమెంట్ ప్రవేశపెడుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వి.కొండలరావు, కుండ్రపు రాంబాబు, రేఖ భాస్కరరావు పాల్గొన్నారు. అవగాహనతోనే నివారణ తుని రూరల్: అవగాహన ద్వారానే సికిల్ సెల్ ఎనీమియా నివారించుకోవచ్చని ఆ విభాగం నిర్మూలన మిషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ప్రభాకర్ అన్నారు. బుధవారం వి.కొత్తూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం విజయలక్ష్మి అధ్యక్షతన సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి అనువంశికంగా సక్రమిస్తుందన్నారు. ఇది వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఎర్ర రక్తకణాల రుగ్మత అన్నారు. దీని లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. రక్తహీనత, కళ్లు పసుపు రంగులోకి మారడం, తీవ్రమైన వొళ్లు, కీళ్ల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, తరుచుగా అంటువ్యాధులు సోకడం, గర్భాధారణలో సమస్యలు, అవయవ వైఫల్యం లక్షణాలు కనిపిస్తాయన్నారు. వ్యాధి నిర్ధారణకు జీరో నుంచి 40 సంవత్సరాలు వయసు గల వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్బంగా పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా మలేరియా అధికారి భాస్కరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయశాంతి, ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము, నాయకులు సుర్ల లోవరాజు, యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్, చింతంనీడి అబ్బాయి, డాక్టర్లు పి.శాంతి, జి.నీరజ, వినోద్ పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రేపు కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో శుక్రవారం జెన్పాక్ట్ కంపెనీలో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ (వాయిస్ ప్రొసెస్ ఇంగ్లిషు) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి రూ.21 వేల జీతం, ఇన్సింటివ్, పీజీ ఉత్తీర్ణులైన వారికి సంవత్సరానికి రూ.2.5 లక్షలు, ఇన్సింటివ్స్, ఎక్స్పీరియన్స్ అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.5 లక్షలు, ఇన్సింటివ్స్ ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికై న వారు నానక్రామ్గుడా, హైదరాబాద్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులందరూ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని శుక్రవారం వికాస కార్యాలయం, కాకినాడలో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్లు జిరాక్స్లతో హాజరుకావాలన్నారు. -
No Headline
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీలో సీఎం చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మళ్లీ భంగపాటు ఎదురైందా? మంత్రి వర్గ విస్తరణలో చేదు అనుభవం మిగిలిందా? కనీసం అసెంబ్లీ స్పీకర్గా అయినా అవకాశం కల్పిస్తారన్న ఆశలు అడియాసలయ్యాయా..? మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడం వెనుక మతలబు దాగుందా..? టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా.. తనకంటే జూనియర్లు, మొదటిసారి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారికి సైతం మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు పార్టీలో ఆయన గుర్తింపును హరిస్తున్నారా? కంటితుడుపు చర్యగా ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేసి చేతులు దులుపుకోనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. అమాత్య యోగానికి దూరం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఆయన ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. అనంతరం పార్టీ మీదున్న అభిమానంతో చాలాకాలం తర్వాత బాబు జట్టులోకి వచ్చారు. పార్టీలో ఉన్నా.. తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన వ్యవహార శైలిని చంద్రబాబునాయుడు జీర్ణించుకునే వారు కాదు. తనకు ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్ అన్న కారణంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. పార్టీపై ఉన్న అభిమానంతో గోరంట్ల సైతం టీడీపీలో అలాగే కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏడవ సారి ఎమ్మెల్యేగా, రాజమహేంద్రవరం రూరల్ నుంచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్న గోరంట్లకు ఈసారి చంద్రబాబు కేబినెట్లో అమాత్య పదవి దక్కడం ఖాయమని గోరంట్లతో పాటు ఆయన వర్గీయులు సైతం ఎంతో ఆశపడ్డారు. సీనియర్ నేతకు సరైన గుర్తింపు దక్కుతుందని సంతోషపడ్డారు. మంత్రుల పేర్లు ప్రకటించే వరకూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. వారి ఆశలను చంద్రబాబు అడియాసలుగా మిగిల్చేశారు. మంత్రి వర్గంలో బుచ్చయ్యకు చోటు దక్కలేదు. ఈ పరిణామంతో లోలోపల కుమిలిపోయిన బుచ్చయ్య పార్టీపై ఉన్న విధేయతతో మిన్నకుండిపోయారు. మంత్రి పదవి దక్కని సీనియర్ నేతకు అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పిస్తారన్న చర్చ నడిచింది. పోనీలే స్పీకర్తో అయినా సరిపెట్టుకుందామనుకుంటే చంద్రబాబు మరో బాంబు పేల్చారు. స్పీకర్ ఆశలూ గల్లంతు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్వీకర్గా ఎంపిక చేశారు. ఈ మేరకు ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని కోరారు. అందుకు బుచ్చయ్య అంగీకరించారు. గురువారం ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 21వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు. స్పీకర్ పదవికి ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అదే జరిగితే తనను వరిస్తుందనే ఆశతో ఉన్న స్పీకర్ పదవి సైతం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామంతో బుచ్చయ్య వర్గీయుల్లో అగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిసారీ సీనియర్ నేతకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా పట్టించుకోకపోవడంపై చంద్రబాబుపై బుచ్చయ్య వర్గం గుర్రుగా ఉంది. ఆది నుంచీ అంతే? దివంగత ఎన్టీఆర్ ఉన్నంత వరకు గోరంట్లకు పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఆయన మరణాంతరం చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో మంత్రి పదవి రాని సమయంలో పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని బుచ్చయ్య తీవ్రంగా ఆరోపించారు. స్వపక్షంపై చేసిన వ్యాఖ్యలను గమనించిన బాబు అప్పటి నుంచి బుచ్చయ్యను పక్కనబెట్టేశారు. లోకేష్ ఎంట్రీతో మరింతగా... యువగళం పాదయాత్ర, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లడంతో తనయుడు లోకేష్ టీడీపీ రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా మారారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసును దగ్గరకు తీయడంతో బుచ్చయ్య ప్రభావాన్ని తగ్గిస్తూ వచ్చారన్న విమర్శలు వెల్లువెత్లాయి. బాబు జైల్లో ఉన్న 52 రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా బాబుతో ములాఖత్ ఏర్పాటు చేయలేదంటే పార్టీలో బుచ్చయ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. రూరల్ ఎమ్మెల్యే సీటుపైనా హైడ్రామా! రాజమహేంద్రవరం రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గోరంట్లకు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీటు కేటాయించడంపై హైడ్రామా నడిచింది. స్వప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రూరల్ సీటును జనసేనకు కట్టబెట్టడంతో తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు బుచ్చయ్య పడిన పాట్లు వర్ణనాతీతం. సీటు సాధించుకునేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. చేసేది లేక దుర్గేష్ను నిడదవోలుకు పంపించి.. రాజమహేంద్రవరం రూరల్ బుచ్చయ్యకు కేటాయించక తప్పని పరిస్థితి అధిష్టానానికి తలెత్తింది. టీడీిపీ సీనియర్ నేతకు ఆది నుంచీ అవమానాలే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీలో ప్రాధాన్యం కరవు ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందని భావించిన గోరంట్ల ప్రాధాన్యం ఇవ్వని చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్ పదవైనా వరిస్తుందని ఆశించిన కేడర్ ప్రొటెం స్పీకర్తో సరిపెట్టిన సీఎం చంద్రబాబు చంద్రబాబు వ్యవహార శైలిపై బుచ్చయ్య వర్గంలో కలవరం బాబు జైల్లో ఉన్నపుడు సైతం సమన్వయ కమిటీలో దక్కని చోటు -
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
రాజమహేంద్రవరం సిటీ: రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని 65 నుంచి 70 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు బుధవారం తెలిపారు. మృతుడు తెలుపు రంగు హాఫ్ హండ్స్ షర్ట్, నీలం, గోధుమ, నలుపు రంగు లుంగీ, సోనాటా వాచ్, రాజమహేంద్రవరం నుంచి ఐఎల్టీడీ వరకూ ఆర్టీసీ బస్సు టికెట్ లభ్యమయ్యాయన్నారు. రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే కళ్యాణమండపం ఎదురుగా రైల్వే ట్రాక్ మీద జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
అనుమానంతోనే భార్య హత్య
కాకినాడ రూరల్: మండలం వాకలపూడి ఫిషింగ్ హార్బర్లో ఈనెల 16వ తేదీ తెల్లవారు జామున జరిగిన ఓలేటి సీతమ్మ (26)హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త నరసింహమూర్తే ఆమెను కడతేర్చినట్టు పోలీసులు గుర్తించారు. సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్ హత్య కేసు వివరాలను బుధవారం మీడియాకు వివరించారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓలేటి సీతమ్మ ముఖంపై బలమైన గాయాలతో హత్యకు గురైందని, విచారణలో భర్త నరసింహమూర్తి హంతకుడుగా తేలడంతో బుధవారం అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్ నిమిత్తం స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. సీతమ్మపై ఉన్న విపరీతమైన అనుమానంతో వివాహేతర సంబంధం అంటకట్టి వేధించేవాడని, ఇటీవలి ఎన్నికల్లో ఓ పార్టీపై పందెం వేసి ఓడిపోయి రూ.3.5 లక్షలు సమకూర్చేందుకు బంగారు వస్తువులు ఇవ్వమని ఇబ్బంది పెట్టాడన్నారు. ఈ నేపథ్యంలోనే రాయితో తలపై మోదడంతో సీతమ్మ మృతి చెందిందని, ఉదయం మృతురాలి తల్లికి ఫోన్ చేసి మీ అమ్మాయిని ఎవరో చంపి బంగారు వస్తువులు పట్టుకుపోయాడని సమాచారం ఇచ్చాడు. అల్లుడిపై అనుమానం ఉన్న సీతమ్మ తల్లి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఎస్పీ హనుమంతరావు, పర్యవేక్షణలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, సీఐ సన్యాసిరావు, పోర్టు సీఐ సుమంత్ దర్యాప్తు చేసి నిందితుడు నరసింహమూర్తిని అరెస్టు చేసి అతడి నుంచి బంగారు వస్తువులు, హత్యకు వినియోగించిన రక్తపు మరకలుతో ఉన్న రాయిని స్వాధీనం చేసుకున్నారు. వాకలపూడి హార్బర్పేటలో భర్త అరెస్టు -
అలవికాని హామీలతో అధికారం
మాజీ మంత్రి గొల్లపల్లి, మాజీ ఎమ్మెల్యే రాపాక రాజోలు: అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను తాత్కాలిక భ్రమల్లో ఉంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. బుధవారం తాటిపాకలోని గొల్లపల్లి నివాసం వద్ద గొల్లపల్లి అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. గొల్లపల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, పార్టీ కార్యకర్తలు అధైర్య పడవద్దని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నారు. రాపాక వర ప్రసాదరావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నారు. విజేతలుగా నిలిచిన వారు కక్షపూరితంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల పార్టీ అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీ, కుసుమ చంద్రశేఖరరావు, బొలిశెట్టి భగవాన్, జెడ్పీటీసీ మట్టా శైలజ తదితరులు పాల్గొన్నారు. -
సిరులు వెదజల్లు
ఎన్నో ఉపయోగాలు ● తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి కూలీల కొరతను అధిగమించవచ్చు. ● సాగునీటి ఎద్దడిని అఽధిగమించవచ్చు. ● పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతంగా మారుతుంది. ● మొక్కలో సాంధ్రత పెరిగి పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఏర్పడుతుంది. ● సాధారణ సాగులో ఎకరం వరి నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. ● వెదజల్లు పద్ధతిలో కేవలం 12 నుంచి 18 కేజీలు మాత్రమే అవసరమవుతాయి. ● సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా కలుపు మొక్కలను సైతం ఎరువుగా మలుచుకోవచ్చు. ● నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు. దీని వల్ల సుమారు రూ.3 వేలు ఆదా అవుతుంది. ● ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలమూరు: గత రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై అనుసరించిన పారదర్శక విధానాలతో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. అధునాతన, పురాతన పద్ధతులను మేళవింపు ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ రబీ సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పాటు సరైన గిట్టుబాటు ధర లభించడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్కు సమాయత్తమవుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడి తగ్గించేందుకు వారంతా వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో 1,68,780 ఎకరాల్లో 96572 మంది రైతులు వరిసాగు చేపట్టారు. ఈ సాగులో 73 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా 21 శాతం మంది ఎంటీయూ 1318, ఆరు శాతం మంది 1064 రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో 33 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. అలాగే ప్రస్తుతం వివిధ గ్రామాల్లో 900 క్వింటాళ్ల విత్తనాలు ఆర్బీకేల్లో నిల్వచేయగా మిగిలిన విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేసింది. ఈ సీజన్లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగునే ఎంచుకోగా మిగిలిన రైతులు నాటే పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దష్ట్యా వ్యవసాయ శాఖ సూచనలతో ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని రైతులు సమాయత్తమవుతున్నారు. అధికారులు సైతం వెదజల్లు సాగే మేలని సూచిస్తుండడం గమనార్హం. కలుపు యాజమాన్యం ఇలా.. రబీ తొలిదశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్యను అధిగమించవచ్చు. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మిల్లీ లీటర్లు లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇఽథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలుచగా నీరు పెట్టి కలుపు మందు పిచికారీ చేయాలి. ఆ తరువాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మద్ధ తొక్కడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు. నీటి యాజమాన్యం.. విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి ఎక్కువ పిలకలు పెట్టే అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో.. దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలుచటి నీటి పొర ఉండేలా చూసుకుని మడి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీ మీటర్ల దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెంటీ మీటర్ల దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెంటీ మీటర్ల దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి విత్తు సక్రమంగా జరుగుతుంది. ఈ పద్ధతిపై అన్నదాతల ఆసక్తి పెట్టుబడి ఆదాతో పాటు అధిక దిగుబడి డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు కనీస జాగ్రత్తలు పాటించాలి వెదజల్లు విధానంలో సాగు చేసే రైతులు విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి. విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసుకుని బయటకు పంపాలి. వారం రోజుల తరువాత ఒకసారి పంటకు సాగునీటిని అందజేసి మరుసటి రోజు తొలగించాలి. దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడు దిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల మందు ఒకసారి చేనుకు దమ్ము చేయాలి. నాలుగు రోజులు ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలువలను ఏర్పాటు చేయాలి. కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు. – బోసుబాబు, వ్యవసాయాధికారి, కోనసీమ అంబేడ్కర్ జిల్లా -
కడియపులంకలో భారీ చోరీ
కడియం: మండలంలోని కడియపులంకలో భారీ చోరీ జరిగింది. పది కాసుల బంగారం, వెండి వస్తువులతో పాటు, లక్ష రూపాయల నగదు కూడా మాయమైంది. ఘటనకు సంబంధించి కడియం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడియపులంకకు చెందిన కర్రి వెంకటేశ్వరరావు ఇంటి తాళాలు పగులగొట్టి బెడ్రూమ్లోని బీరువాలో ఉన్న పది కాసుల బంగారం, వెండి, లక్ష రూపాయల నగదును దోచుకువెళ్లారు. వేంకటేశ్వరరావు తన ఇంటికి సమీపంలోనే ఉన్న అత్తవారింటికి మంగళవారం రాత్రి వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన జరిగింది. చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దక్షిణ మండలం డీఎస్పీ అంబికా ప్రసాద్, కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ బి. తులసీధర్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరకుని బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దళితులకు రెండు పదవులేనా! అమలాపురం రూరల్: కూటమి మంత్రి వర్గంలో దళితులకు కేవలం రెండు పదవులతో సరిపెట్టడం తగదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మోకాటి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాలలకు, మాదిగలకు రెండేసి చొప్పున హోం మంత్రితో సహా నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నడిపూడిలో నడిపూడి జగ్జీవన్ రామ్ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటిమంది దళితులు ఉన్నారని, ఆ మేరకు పదవులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు దళితులకు చెందిన 27 పథకాలను పునరిద్దరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కాప నాగభూషణం, చాట్ల సత్యనారాయణ, తొత్తరమూడి ప్రభాకరరావు, మందా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెరువులో చేపల చోరీపై ఫిర్యాదు గోకవరం: మండలంలోని కృష్ణునిపాలెం గ్రామంలోని వీరయ్య చెరువులో చేపల చోరీపై కసు నమోదు చేసినట్టు ఎస్సై కె.నాగరాజు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ పరిధిలో ఉన్న వీరయ్యచెరువులో 2021వ సంవత్సరంలో చేపలు పెంచుకోడానికి వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన దిబ్బ శ్రీను హెచ్చుపాటకు తీసుకున్నాడు. ఇటీవల చెరువులో పంచాయతీ పరిధిలోని కొత్తూరుకు చెందిన మరిడిరాజు, గంగరాజు, సురేష్ అక్రమంగా చేపలు పట్టుకున్నారని పాటదారుడు కార్యదర్శికి ఫిర్యాదు చేశాడు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామ స్మరణలు, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాళ్కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు భక్తులు గోవింద నామ స్మరణతో గోదావరి నదిలో తలారాస్నానం చేసి పునీతులయ్యారు. చక్రస్నానం ఆద్యంతం వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానం ముఖ్య అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవురులతో కొలువు తీరిన శ్రీవారికి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు వసంతాలు చల్లుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. శ్రీవారికి సహస్రనామార్చన, బాల భోగం నివేదన, వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణం, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి గ్రంధి మాధవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలబాలాజీకి వసంతోత్సవం నదీ స్నానంతో పులకించిన భక్తులు -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెంలో ఉపాధిహామీ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల ప్రకారం గ్రామంలో నరసింహం చెరువులో బుధవారం ఉదయం గ్రామానికి చెందిన కరణం వెంకటేశులు(50) పని చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ కాకర దుర్గారావు, తోటి కూలీలు అతన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎన్సీసీతో ఉజ్వల భవిత ఉమ్మడి రాష్ట్రాల ఎన్సీసీ డీజీపీ ఎయిర్ కమాండర్ రెడ్డి పెద్దాపురం: ఎన్సీసీ ద్వారా ప్రతి విద్యార్థి మెరుగైన భవిష్యత్ సాధించవచ్చని ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఎన్సీసీ డీజీపీ ఎయిర్ కమాండర్ వీఎం రెడ్డి అన్నారు. పెద్దాపురం జవహార్ నవోదయ విద్యాలయలో బుధవారం ఇంటర్ డైరెక్టరేట్ స్పోర్ట్స్ షూటింగ్ కాంపిటేషన్స్ (ఐడిఎస్ఎస్సీ 2024)కు ఎంపికై న క్యాడెట్లను ఆయన కలుసుకున్నారు. పెద్దాపురంలో జరుగుతున్న ఎన్సీసీ క్యాంప్లో ఐడీఎస్ఎస్సీ క్యాంపులో పాల్గొనడానికి అవరసమైన షూటింగ్ ఈవెంట్లను ఆయన పరిశీలించారు. ఎన్సీసీ శిక్షణ భవితకు ఎంతో తోడ్పడుతుందన్నారు. క్యాడెట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూలై రెండవ తేదీ నుంచి 24వ తేదీ వరకు తిరుచిరాపల్లిలో ఐడీఎస్ఎస్ 2024 క్యాంపు నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని ఈవెంట్లలో క్యాడెట్లు పతకాలు సాధించి మంచి కీర్తి, ప్రతిష్టలు తీసుకు రావాలని రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు. -
బోర్లతో బ్లో అవుట్లు
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బ్లో అవుట్లుగా మారిన ఆక్వా బోర్లు..ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది. ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి. -
నీట్ స్కామ్పై ఈడీ విచారణ జరపాలి
రాజమహేంద్రవరం సిటీ: వైద్య కళాశాలల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష నిర్వహణ వెనుక భయంకరమైన స్కామ్ దాగి ఉందని ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ ఆరోపించారు. హర్యానాలోని ఓ పరీక్ష కేంద్రంలోనే ఎనిమిది మందికి హై మెరిట్ ర్యాంకులు రావడం, 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించడం అనుమానాస్పదంగా ఉందన్నారు. సుమారు 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఈ స్కామ్పై విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ శిక్షణ ద్వారా నిత్యం 15 నుంచి 18 గంటలు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ ఇటువంటి స్కామ్ల వల్ల నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్లో సీటు వస్తే విద్యార్థులు మెరిట్గానే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించగలరని, ఇటువంటి స్కామ్లతో అర్హత సాధించే వారు అందించే వైద్య సేవల వలన ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అర్హత లేని వాళ్లు ర్యాంకులు పొంది చదువుకుంటే ప్రజలకు వైద్యం ఏవిధంగా అందుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని, దీనికి అనుగుణంగా కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని సాగర్ డిమాండ్ చేశారు. -
నా భర్త ఆచూకీ తెలపండి
ఐ.పోలవరం: వేటకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లంతైన తన భర్త పెమ్మాడి కాయరాజు ఆచూకీ తెలియజేయాలని పెమ్మాడి సత్యకల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐ.పోలవరం ఇన్చార్జి ఎస్సై డి.సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17వ తేదీన భైరవపాలెం రేవు నుంచి ఫైబర్ తెప్పపై సూరాడ ప్రభుదాసు, ఎరిపిల్లి అప్పలరాజు, కర్రి వెంకటేశ్వర్లు, పెమ్మాడి గాలిబాబులతో కలసి పెమ్మాడి కాయరాజు వేటకు వెళ్లాడు. తిరిగి మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటలకు భైరవపాలెం మొగ దగ్గరికి వచ్చేసరికి తెప్పపై కూర్చున్న కాయరాజు అకస్మాత్తుగా పడిపోయాడు. తెప్పపై వెనక్కి వెళ్లి గాలించగా ఆచూకీ లభించలేదు. సముద్రంలో గల్లంతయ్యాడని వేటకు వెళ్లినవారు తెలిపారు. శస్త్ర చికిత్సకు రూ.1.35 లక్షల సాయం అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కంచర్ల భైరవమూర్తికి లంగ్స్ మార్పిడి చికిత్స కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి రూ.1.35 లక్షలు సాయంగా సమకూర్చారు. ఈ మొత్తాన్ని రోగి భైరవమూర్తి సోదరుడు అయ్యప్పకు జిల్లా ఆర్య వైశ్య సంఘం నాయకులు తాటిపాకలో అందించారు. ప్రస్తుతం భైరవమూర్తి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో లంగ్స్ మార్పిడి కోసం చికిత్స పొందుతున్నాడు. అతని వైద్యం కోసం రూ.60 లక్షలు ఖర్చు అవుతున్న క్రమంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రి పినిపే విశ్వరూప్ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి జగన్ సీఎం సహాయ నిధి నుంచి రూ.20 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ నాయకులు లక్కింశెట్టి బాబులు, నంబూరి సత్యనారాయణమూర్తి, కంచర్ల కృష్ణ మోహన్, పసలపూడి సతీష్, సింగంశెట్టి కుయార్, పచ్చిగోళ్ల సోమరాజు పాల్గొన్నారు. -
చెవిటి, మూగ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెవిటి, మూగ విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని రాజమహేంద్రరంలోని ప్రియదర్శిని ఆశ్రమం కరస్పాండెంట్ కె.స్వప్నవర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రవేశాలు పొందిన వారికి భోజనం, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, అన్ని విద్యా, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నామని వివరించారు. విద్యార్థులకు ఆశ్రమంలోని ప్రత్యేక ఉపాధ్యాయులు స్పీచ్ థెరపీ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు. అలాగే, స్వయం ఉపాధి పొందే విధంగా ఉచిత కంప్యూటర్ విద్య, టైలరింగ్, కుట్లు, అల్లిక ల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. వివరాలకు 0883–2438288, 70365 72300, 9989 22 4050 ఫోన్ నంబర్లలో లేదా నేరుగా కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని స్వప్నవర్మ కోరారు.