-
AP Congress: కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు షాక్
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. షర్మిల నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఏపీ కాంగ్రెస్లో ముసలం చోటుచేసుకుంది.కాగా, ఫిర్యాదులో భాగంగా కాంగ్రెస్ నేతలు..‘ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారు. వీరి పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడింది. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్ మాల్ అయ్యాయి. అధిష్టానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించినపుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాం.కానీ, ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ కేడర్, నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. తెలంగాణకు చెందిన షర్మిలకి చెందిన కొందరు అనుయాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి బీ ఫామ్స్ కేటాయించారు. సీడబ్ల్యూసీ మెంబర్స్, సీనియర్ నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, డీసీసీ ప్రెసిడెంట్స్ సూచనలను షర్మిల పరిగణనలోకి తీసుకోలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తాజాగా షర్మిల మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో కొనసాగుతున్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. షర్మిల నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పూర్తి ఉచితం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ వైద్య సేవలు పూర్తిగా ఉచితమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు స్పష్టంచేశారు. రోగుల నుంచి ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పథకం అమలుపై కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ ఢిల్లీరావు గురువారం జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు వైద్య సహాయం పొందేందుకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఆస్పత్రులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ప్రాథమిక విచారణను పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ను ఆదేశించారు. ఫిర్యాదు చేసిన లబ్ధిదారులు, ఆస్పత్రి యాజమాన్యాలతో కలెక్టర్, కమిటీ సభ్యులు ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా వాస్తవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ పథకం అమలు చేస్తున్న ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ విచారణలో రుజువైతే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.సుమన్, డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని, డీసీహెచ్ డాక్టర్ బి.సి.కె.నాయక్, డాక్టర్ సమరం తదితరులు పాల్గొన్నారు. రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు -
నీతి, నిజాయతీగా పని చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): రెవెన్యూ శాఖ ఉద్యోగులు నీతి, నిజాయతీగా పనిచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం రెవెన్యూ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని సన్మానించి జ్ఞాపికలు అంద జేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ పాలనలో 1786 జూన్ 20వ తేదీన బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఏటా జూన్ 20న రెవెన్యూ డేగా జరుపు కోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారని, ఈ శాఖపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. నీతి, నిజాయతీతో పనిచేసే ఉద్యోగులకు సంపూర్ణ సహకారం అందిస్తామని సూచించారు. అనంతరం డీఆర్వో కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. కలెక్టర్ డి.కె.బాలాజీ అనుమతితో కొత్తగా చేరిన రెవెన్యూ ఉద్యోగులకు సబ్జెక్టుపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. తొలుత ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు తమ సర్వీసులో అనుభవాలను వివరించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బి.శ్రీదేవి, జిల్లా మైనార్టీ అధికారి షంషున్నీసాబేగం, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, సూపరింటెండెంట్లు దుర్గాకిషోర్, తేజేశ్వరరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు ఎం.వి.శ్యామ్నాథ్, పామర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డే వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర -
ఎయిర్పోర్ట్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
విమానాశ్రయం(గన్నవరం): విమానాశ్రయ విస్తర ణకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. స్థానిక ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ టెర్మినల్లో గురువారం విమానాశ్రయ విస్తరణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు చిన్నఅవుటపల్లి పరిధిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ప్లాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు కౌలు పరిహారం బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసిత కుటుంబాలకు గృహ నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ఆర్అండ్ఆర్ స్థలంలో విద్యుత్, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయలు కల్పించాలని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ వల్ల రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన యాజమానులకు అజ్జంపూడి పరిధిలో కేటాయించిన లేఅవుట్ అభివృద్ధికి ఏపీసీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ఏలూరు కాలువపై చేపట్టిన కొత్త వంతెన నిర్మాణానికి అవరోధాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, గుడివాడ ఆర్డీఓ పద్మావతి, ఎయిర్పోర్ట్ డెరెక్టర్ ఎల్.లక్ష్మీకాంత్రెడ్డి, జనరల్ మేనేజర్ (సివిల్) కె.రామాచారి, తహసీల్దారు పవన్కుమార్, సీఆర్డీఏ తహసీల్దారు పాపాయమ్మ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులు సమర్పించారు. వేసవి సెలవుల నేపథ్యంలో 16 రోజులకు రూ.3.23 కోట్ల మేర కానుకలు, మొక్కుబడుల ద్వారా ఆదాయం సమకూరింది. ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు పర్యవేక్షణలో మహా మండపం ఆరో అంతస్తులో గురువారం కానుకల లెక్కింపు జరిగింది. రూ.3,23,75,523 నగదు లభమైంది. రోజుకు సరా సరిన రూ.20.23 లక్షల మేర ఆదాయం లభించిందని ఆలయ ఈఓ పేర్కొన్నారు. 694 గ్రాముల బంగారం, 6.264 కిలోల వెండితో పాటు విదేశీ భక్తులు డాలర్ల రూపంలో అమ్మవారికి కానుకలను సమర్పించారు. 516 యూఎస్ఏ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, వెయ్యి కొరియా ఒన్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 ఓమన్ బైంసాలు లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు ఎస్ఫీఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్య యోగం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రతి ఒక్కరికీ ఉరుకులు, పరుగుల జీవన విధానం తప్పనిసరిగా మారింది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి వాటితో మానసిక ప్రశాంతత కొరవడింది. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సనాతన జీవన విధానంలో భాగమైన యోగాపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. యోగాతో లభించే ప్రయోజ నాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. కేంద్ర ప్రభుత్వం యోగాను ప్రోత్సహిస్తోంది. ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యోగాపై విస్తృత అవగాహన కలిగిస్తోంది. శారీరక, మానసిక ఆరోగ్యం ● నిత్యం యోగా చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ● దేహం, మనస్సు, భావోద్వేగాలకు గురికా కుండా, మన దైనందిన జీవితంలో వత్తిడికి గురికాకుండా ఆనందంగా గడిపేందుకు యోగా సాధన చాలా ముఖ్యమైనది. ● యోగాతో రక్త ప్రసరణమెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యానికి హాని కలిగించే కొలస్ట్రాల్, హై బీపీ, ఒబెసిటీని అదుపులో ఉంచేందుకు దోహదపడుతుంది. ● శ్వాసపై ధ్యాసే ధ్యానం. ఇది మానసిక ప్రశాంతతకు చక్కటి ఔషధం. ● యోగా నేరుగా మధుమేహ నియంత్రణకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ● నిర్ధిష్ట యోగాసనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా మెరుగుపరుస్తాయి. వయస్సులో నిమిత్తం లేదు ● యోగాను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా చేయొచ్చు. ● పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికీ యోగా వారి జీవితంలో ఒక భాగం కావాలి. ● పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాల్లో యోగాను చేర్చారు. ● కార్పొరేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బందికి వత్తిడి ఉపశమనం కోసం యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. యోగాసనాలతో ప్రయోజనం యోగాతో పాటు పలు రకాల ఆసనాలు, యోగా థెరపీతో పలు రకాల వ్యాధులు, నొప్పులతో బాధపడుతున్న స్వస్థత చేకూరుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వారితో భుజంగ ఆసనం, మరికొన్ని ఆసనాలు చేయిస్తారు. అంతేకాకుండా ఆస్తమా, సైనస్, ఎలర్జీలకు ప్రాణాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, గర్భిణులకు ప్రీ నాటల్ యోగా వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గర్భిణులు ఆసనాలు చేయడం ద్వారా గర్భస్థ శిశువుకు సమతుల్యంగా రక్తప్రసరణ, బ్రీతింగ్ జరుగుతుంది. ఇలా అనేక రకాల ఆసనాలు ప్రజలకు ఉన్న సమస్యలను బట్టి అందుబాటులో ఉన్నాయి. యోగాతో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం శారీరక, మానసిక సమస్యలు దూరం గుండె ఆరోగ్యానికి మంచి మందు పలు వ్యాధులకు యోగాసనాలు, యోగా థెరపీతో చికిత్స -
నూతన కార్యవర్గం ఎన్నిక
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ మార్వాడీ కాన్ఫరెన్స్ నూతన కార్యవర్గాన్ని విజయవాడలో ఎన్నుకున్నారు. నగరంలోని మహేశ్వరి భవన్ లోని ఆలిండియా మార్వాడీ కాన్ఫరెన్స్, ఏపీ శాఖల సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రీజినల్ అధ్యక్షుడిగా ఓంప్రకాష్ అగర్వాల్, కార్యదర్శిగా బాలకిషన్ లోయా ఎన్నికయ్యారు. విజయవాడ శాఖ అధ్యక్షుడిగా సుభాష్చంద్ర గుప్తా, కార్యదర్శిగా సురేష్ సోలంకి, ఉపాధ్యక్షులుగా గోపాల్శర్మ, శ్యామ్సింగ్ బలావత్, సంజయ్ మెహతా, సహాయ కార్యదర్శిగా వినోద్ కుమార్ రాజ్ పురోహిత్, కోశాధికారిగా రమేష్ అగర్వాల్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజస్థానీ సంప్రదాయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. -
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఒకటి నుంచి 333 వరకు మెరిట్ ర్యాంక్ పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగింది. మొదటి ర్యాంకు పొందిన ఎ.అఖిల్ సర్టిఫికెట్లను పరిశీలించిన ఐటీఐ కౌన్సెలింగ్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఫిట్టర్ ట్రేడ్ను కేటాయిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 191 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరవగా 172 మందికి వివిధ కళాశాలల్లో పలు ట్రేడ్లను కేటాయించారు. శుక్రవారం 334 నుంచి 646 మెరిట్ నంబరు పొందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కనకారావు పేర్కొన్నారు. -
భూసేకరణ జాప్యమే సమస్య
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ – మచిలీ పట్నం జాతీయ రహదారి (ఎన్హెచ్–65) విస్తరణ పనులకు భూ సేకరణ సమస్యే అడ్డంకిగా మారింది. రహదారి విస్తరణ, పెండింగ్ పనుల కోసం జాతీయ రహదారుల సంస్థ గత ఏడాది రూ.30 కోట్లతో టెండర్లు పిలిచింది. రహదారి మధ్యలో అసంపూ ర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ బెంజిసర్కిల్ నుంచి పెనమలూరు మండలం పోరంకి వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ పనుల కోసం రూ.7.5 కోట్లు కేటాయించారు. భూ సేకరణపై విజయవాడ కార్పొ రేషన్, తాడిగడప మునిసిపాలిటీ అధికారులు చొరవ చూపకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ వరకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎన్టీఆర్ సర్కిల్లో 250 మీటర్ల పనులు ప్రారంభించారు. అయితే ఆ పనులకూ భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో కార్పొరేషన్ అధికారులు జాప్యం చేశారు. దీనికితోడు ఆ ప్రాంతంలో భూగర్భ డ్రెయినేజీ లేదు. దీంతో కొద్ది పాటి వర్షం పడినా డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. మురుగు, వర్షపునీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. బెంజిసర్కిల్ వద్ద వాహనాలు భారీ సంఖ్యలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో త్వరిత గతిన పనులు పూర్తిచేయాల్సి ఉంది. భూసేకరణ సమస్యతోపాటు, రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ లైన్లను మార్చితే రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలవుతుందని జాతీయ రహదారుల సంస్థఅధికారులు పేర్కొంటున్నారు. నష్ట పరిహారంలో జాప్యం బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ వరకు మూడు కిలోమీటర్ల మేర వరకు రహదారిని 100 అడుగుల వెడల్పున విస్తరించాల్సి ఉంది. జాతీయ రహదారుల సంస్థ రోడ్డు విస్తరణతోపాటు డ్రెయిన్ల నిర్మాణం చేపట్టింది. అయితే నిర్వాసితులకు నష్ట పరిహారం విషయంలో జాప్యం జరిగింది. 2016లోనే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నష్ట పరిహారానికి సంబంధించి కొందరు బాధితులు కోర్టుకు వెళ్లటంతో పనుల నిర్వహణలో జాప్యం జరిగింది. మొత్తం 219 మందికి నష్ట పరిహారం అందాల్సి ఉంది. వారిలో 121 మందికి మాత్రమే టీడీఆర్ (ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్) బాండ్లు అందాయి. మిగిలిన వారికి భూ యాజమాన్య ధ్రువీకరణ, వారసత్వ సమస్య తదితర కారణాలతో పరిహారం అందలేదు. రోడ్డు విస్తరణలో 97 భవ నాలు పోతుండగా బాధితుల్లో 53 మంది స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నష్టపోతున్న నిర్వాసితులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో టీడీఆర్ బాండ్లు తీసుకున్న వారు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బాండ్లు ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడ – మచిలీపట్నం హైవే విస్తరణలో జాప్యం రూ.7.5 కోట్లతో పనులు చేపట్టిన జాతీయ రహదారుల సంస్థ బెంజిసర్కిల్ నుంచి 6 కి.మీ. మేర నిలిచిన విస్తరణ పనులు వర్షంపడితే రోడ్లపైనే పొంగిపొర్లుతున్న మురుగు నీరు విద్యుత్ లైన్లతో ఇబ్బందులు విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ), రెవెన్యూ, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కల్టెకర్ ఎస్.ఢిల్లీరావు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయా లని ఆదేశించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ సమస్యను కొలిక్కి తీసుకొచ్చేందుకు వీఎంసీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఆటోనగర్ నుంచి పోరంకి వరకు పనులు సాగుతున్నా, విద్యుత్తు లైన్లు అడ్డంకిగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను మార్చాల్సి ఉంది. భూసేకరణ, విద్యుత్ లైన్ల మార్పిడికి తాడిగడప మునిసిపాలిటీ అధికారులు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న భూమిలోనే పనులు చేపట్టడంతో జాతీయ రహదారి వంకర్లు తిరుగుతోంది. -
పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ హోదాలో ఢిల్లీరావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ హోదాలో ఆయన సతీమణి పి.ప్రశాంతి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి కంకిపాడు: ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ టి.సురేంద్ర జయవర్ధన సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆర్బీఐ, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర జయవర్ధన మాట్లాడుతూ.. ప్రజలు డిపాజిట్ ఖాతాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎ.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ.. డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ వి.అశోక్కుమార్ పర్యవేక్షించారు. కేడీసీసీ బ్యాంకు మేనేజర్ పీహెచ్.జాహ్నవి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ జి.రామాంజనేయులు, కంకిపాడు ఏఎస్ఐ తాతాచార్యులు, వణుకూరు ఇండియన్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ప్రవల్లిక, డీఆర్డీఏ ఏపీఎం శ్రీనివాసరావు, రిసోర్సు పర్సన్ కె.శ్రీనివాసరావు, ట్రైనీలు కై లే సునీల్, టి.హేమారావు పాల్గొన్నారు. కేవీకే శాస్త్రవేత్త రేవతికి రెండు బంగారు పతకాలు ఘంటసాల: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కె.రేవతి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదగా రెండు బంగారు పతకాలు అందుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ స్నాతకోత్సవం గురువారం జరిగింది. కీటక విభాగంలో మూడు సంవత్సరాలు పీహెచ్డీ చేసిన డాక్టర్ రేవతి పది పాయింట్లకు 9.36 పాయింట్లు సాధించారు. విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించడమే కాక మహిళల్లో అందరికంటే అత్యధిక పాయింట్లు సాధించారు. రెండు విభాగాల్లో రెండు బంగారు పతకాలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదగా అందుకున్నట్లు రేవతి తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తగా రెండు బంగారు పతకాలు సాధించిన డాక్టర్ రేవతికి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.శ్రీలత, ఇతర శాస్త్రవేత్తలు, రైతులు అభినందనలు తెలిపారు. కార్తికేయుని సేవలో ఉండి ఎమ్మెల్యేమోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణంరాజు గురువారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్కుమార్శర్మ, సతీష్శర్మ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వెంట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ (రాజా), జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, స్థానిక నాయకులు రావి రత్నగిరి, నడకుదుటి జనార్దనరావు, మోర్ల రాంబాబు, చందన రంగారావు, కోసూరు రామాంజనేయులు ఉన్నారు. -
రైతులకు మెరుగైన సేవలు అందించాలి
అగ్రికల్చర్ డెప్యూటీ డైరెక్టర్ ఎస్వీవైఎస్ మనోహర్ గుడివాడరూరల్: త్వరలో మొదలు కానున్న ఖరీఫ్ సాగులో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని జిల్లా అగ్రికల్చర్ డెప్యూటీ డైరెక్టర్ ఎస్వీవైఎస్ మనోహర్ సూచించారు. స్థానిక వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయంలో గుడివాడ డివిజన్ వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందితో ఏడీఏ నిమ్మగడ్డ రమాదేవి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో విత్తనాల పంపిణీ, మట్టి నమూనాల సేకరణ, పీఎం కిసాన్ తదితర అంశాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది ప్రతిరోజు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి సాగులో యాజమాన్య పద్ధతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. ఖరీఫ్ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా కార్యాలయ ఏవోలు సి.శాంత, బి.సురేష్బాబు నాయక్, జి.సురేఖ, వ్యవసాయశాఖ అధికారులు బి.అనంతలక్ష్మి, త్రినాథ ఆంజనేయరావు, ఎన్.భానుప్రకాష్, పి.ప్రియాంక, సబ్ డివిజన్లోని వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వరిలో వెదతో ఎంతో ప్రయోజనం
గూడూరులో విత్తనాలు వెదజల్లే విధానాన్ని పరిశీలించిన కృష్ణా కలెక్టర్ గూడూరు: వరిలో విత్తనాలు వెదజల్లే విధానం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. గురువారం గూడూరులోని రైతు డొక్కు గోవిందరాజులు వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ ద్వారా విత్తనాలు వెదజల్లే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. చేతితో వెదజల్లే విధానం, ట్రాక్టర్(సీడ్ డ్రిల్) ద్వారా వరివిత్తనాలు వెదజల్లే విధానానికి వ్యత్యాసం, లాభనష్టాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల రైతులు సాగు ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. కూలీల కొరత వల్ల వ్యవసాయ పనులు ఆలస్యం అవుతుండటంతో యంత్రాలను ఉపయోగించడం ద్వారా కూలీల కొరతను కూడా అధిగమించవచ్చని వివరించారు. ఈ దిశగా ప్రభుత్వాలు కూడా రైతులను ప్రోత్సాహిస్తున్నాయన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు కూడా సమకూర్చుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి.కె.బాలాజీ రైతుగా మారి స్వయంగా వరి విత్తనాలు వెదజల్లారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.పద్మావతి, ఏడీఏ మణిధర్, ఏఓ జి.వి,శివప్రసాద్, తహసీల్దార్ ఎస్.ఎస్.శాంతి, రైతులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జి.కొండూరు: స్కూటీపై వస్తున్న ముగ్గురు యువకులు ట్రాక్టర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరానికి చెందిన షేక్ అబ్దుల్ నబీ(21) తన ఇద్దరు స్నేహితులు షేక్ ఉస్మాన్, షేక్ సుభానీతో కలిసి స్కూటీపై బుధవారం రాత్రి 9గంటల సమయంలో జి.కొండూరు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బట్టీలలోకి మలుపు తీసుకొంటుండగా ట్రక్కు వెనుక భాగంలో స్కూటీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ నబీ తలకు తీవ్ర గాయం కాగా అతని ఇద్దరు స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అబ్దుల్ నబీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ షబ్బీర్ అహ్మద్ పరిశీలించారు. మృతుడి తండ్రి షేక్ గాలిషాహిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
హోటల్పై దాడి.. సామగ్రి ధ్వంసం
చిల్లకల్లు(జగ్గయ్యపేట): స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనున్న రామారావు హోటల్పై నలుగురు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పక్కనే 15 ఏళ్లుగా రామిశెట్టి రామారావు హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వల్లెపు లక్ష్మయ్య, వేముల వంశీ, గుంజా రాము, వేముల వీరయ్యలు ఫూటుగా మద్యం తాగి హోటల్కు వచ్చారు. ఆ సమయంలో హోటల్ మూసి ఉండటంతో వంట మాస్టర్ రంగస్వామి, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. హోటల్ మూశామని టిఫిన్ లేదని చెప్పటంతో ఆగ్రహంతో హోటల్ సిబ్బందిపై దాడి చేయటంతో పాటు హోటల్లోని విలువైన ఫ్రిజ్, టేబుళ్లు, క్యాష్ కౌంటర్, తదితరాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేఽశారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉండటంతో పెద్ద శబ్దం వస్తుండటంతో పోలీసులు అక్కడకు వచ్చే సరికి పరారయ్యారు. హోటల్ యజమాని రామారావు, వంట మాస్టర్తో కలిసి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశామని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ సతీష్ చెప్పారు. వైఎస్సార్ సీపీ నాయకుడు కావటంతోనే.. రామారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడు కావటంతోనే టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే యువకులు ధ్వంసం చేశారని పలువురు అంటున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో సైతం కొందరు హోటల్ వద్దకు వచ్చి రామారావుపై దాడికి పాల్పడ్డారు. కూటమి విజయం తర్వాత హోటల్ను ధ్వంసం చేశారని అంటున్నారు. -
చెక్ బౌన్స్ కేసులో నిందితులకు జైలు శిక్ష
విజయవాడస్పోర్ట్స్: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ విజయవాడ 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 3వ అదనపు మెట్రో పాలిటన్ మేజిస్రేట్ కోర్టు న్యాయమూర్తి గురువారం నామాల జ్యోతి తీర్పు చెప్పారు. 32వ డివిజన్కు చెందిన గోన వెంకటేశ్వర్లు మూడేళ్ల కిత్రం అయోధ్యనగర్కు చెందిన ఉడుముల తిరుపతిరెడ్డికి రూ. 9లక్షలను అప్పుగా ఇచ్చాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించేందుకు తిరుపతిరెడ్డి ఇచ్చిన రెండు చెక్లు బౌన్స్ కావడంతో బాధితుడు వెంకటేశ్వర్లు రెండేళ్ల క్రితం న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు తిరుపతిరెడ్డికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అప్పుగా తీసుకున్న నగదును సక్రమంగా 90 రోజుల్లోపు బాధితుడికి చెల్లించాలని, అలా చేయని పక్షంలో జైలు శిక్షను మరో ఆరు నెలలు అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. బందరులో మరో నిందితుడికి ఆరు నెలలు జైలు చిలకలపూడి(మచిలీపట్నం): చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి ఎన్. మేరీ గురువారం తీర్పు చెప్పారు. బందరు మండలం జొన్నలవారిమోడీ గ్రామానికి చెందిన అడ్డాల నాగరాజు సమీప గ్రామమైన సత్రంపాలెంలో ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెద్దిబోయిన శ్రీనివాసరావుకు రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు చెల్లించే నిమిత్తం 2018లో శ్రీనివాసరావు విజయబ్యాంకు చెక్కును అందజేశారు. నాగరాజు బ్యాంకులో చెక్కును బ్యాంకులో సమర్పించగా ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో నాగరాజు కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ చెక్ మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించారు. -
రైతు బజార్లలో టమాటా విక్రయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టమాటా ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు రైతు బజార్ల ద్వారా అందించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి టమాటాను కొనుగోలు చేసి లాభం నష్టం లేని విధంగా వినియోగదారులకు అందిస్తోందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్తో కలిసి మార్కెట్లో టమాటా, ఉల్లిపాయలు, ఇతర కూరగాయల లభ్యతతో పాటు వాటి ధరలపై సమావేశంలో చర్చించారు. టమాటా ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతు బజార్ల ద్వారా అందించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. మార్కెటింగ్ శాఖ ప్రతి జిల్లాకు రూ. 5 లక్షలతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా అధిక ధరలు గల కూరగాయలను తక్కువ ధరకు లభ్యమయ్యే చోట కొనుగోలు చేసి వాటిని రైతు బజార్ల ద్వారా లాభం, నష్టం లేని విధంగా వినియోగదారులకు అందిస్తుందన్నారు. హోల్సేల్ మార్కెట్లు ఉన్న చిత్తూరు జిల్లాలోనే కిలో రూ. 60 నుంచి రూ. 88 వరకు ధర పలుకుతోందని.. ధరలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా అందిస్తామన్నారు. సమావేశంలో మార్కెటింగ్ డెప్యూటీ డైరెక్టర్ ఎం.దివాకర్, మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక, జిల్లా అగ్రి ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ కె. మంగమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.బాలాజీ కుమార్, ఇన్చార్జ్ డీఎస్వో, ఏఎస్వో సి.లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
రైలు ఢీకొని వృద్ధురాలు మృతి
గుడివాడరూరల్: రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నందివాడ మండలం జనార్దనపురం శివారు టెలీఫోన్నగర్లో నివాసముండే కర్రే ప్రేమ్లీల(63) ఈనెల 19వ తేదీన కూరగాయలు కొనుగోలు చేసేందుకు గుడివాడ వచ్చి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు నందివాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుడివాడ మండలం మల్లాయపాలెం రైల్వే ట్రాక్ వద్ద రైలు ఢీకొని మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించామని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడివాడ రైల్వే పోలీసులు తెలిపారు. -
జాతీయ రహదారి భూ సేకరణ అస్తవ్యస్తం
అధికారులతో సమావేశంలో నిర్వాసితులు హనుమాన్జంక్షన్ రూరల్: జాతీయ రహదారి 216హెచ్ విస్తరణ, హనుమాన్జంక్షన్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని పలువురు నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వేలేరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో 216హెచ్ జాతీయ రహదారి విస్తరణ భూసేకరణపై రెవెన్యూ, కేంద్ర రహదారులు, రవాణా శాఖ అధికారులు గురువారం నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ పెడన–లక్ష్మీపురం రోడ్డును 216హెచ్ జాతీయ రహదారిగా మార్చి బందరు పోర్టుకు ప్రధాన రహదారిగా నిర్మించ తలపెట్టిన విషయం విదితమే. ఈ రహదారికి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమాన్జంక్షన్ వద్ద 11 కిలోమీటర్లు మేర బైపాస్ రోడ్డు నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సర్వే నిర్వహించి, భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల అభ్యంతరాలను స్వీకరించేందుకు వేలేరులో నిర్వహించిన సమావేశానికి గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, కేంద్ర ప్రభుత్వ రహదారులు, రవాణా శాఖ మచిలీపట్నం ప్రాజెక్టు డైరెక్టర్ బి.సాయి శ్రీనివాస్, బాపులపాడు తహసీల్దార్ అంకం శ్రీనివాస్, సర్వే డీఐ నరసింహరావు హాజరయ్యారు. కనీస సమాచారం లేకుండా.. భూసేకరణ నోటిఫికేషన్లో ప్రైవేట్ భూములను కూడా ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారని, రైతుల అనుమతి, కనీస సమాచారం లేకుండా వారి భూముల్లో కాంక్రీట్ పిల్లర్లు వేశారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం–2013 మేరకు నష్ట పరిహారం అందజేయాలని, వ్యవసాయ బోర్లు, పామాయిల్, ఇతర పంట మొక్కలకు కూడా పరిహారం మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు వేలేరు నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. భూసేకరణ నోటిఫికేషన్లోని తప్పులను సవరిస్తూ మరొక సప్లమెంటరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని, నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం మంజూరు చేస్తామని ఆర్డీవో పద్మావతి చెప్పారు. మాజీ సర్పంచ్ వేములపల్లి శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ ఆవిర్నేని భవానీ శంకర్, మండల సర్వేయర్ ఫణి కుమార్, వీఆర్వో రమేష్ పాల్గొన్నారు. -
కూటమి విజయానికి నేనే కారణం
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అవనిగడ్డ: గత ప్రభుత్వంపై రోజూ తాను చేసిన పోరాటమే కూటమికి విజయం సాధించి పెట్టిందని ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా అవనిగడ్డలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, తెలుగుభాష పరిరక్షణ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం గత ప్రభుత్వంపై తాను చేపట్టిన పోరాటాన్ని గమనించిన ప్రజలు ఓటు రూపంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అద్భుతమైన విజయం అందించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నూతన ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ యువనేతలు మండలి వెంకట్రామ్ (రాజా), అశ్వినికుమార్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్టు
నెమలి(గంపలగూడెం): ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలిలో గంజాయి తాగడంతో పాటు, విక్రయానికి పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నెమలికి చెందిన యువకులు మనుబోలు ఏడుకొండల గుణశేఖర్, ఆదిమళ్ల వీరబాబు, మరొక మైనరు, తెలంగాణ రాష్ట్రం వైరాకు చెందిన యువకుడు గుంతి గోపిచంద్ కలిసి గత కొంతకాలంగా గంజాయికి బానిసలయ్యారు. తెలంగాణ రాష్ట్రం సీలేరు నుంచి వారికి కావలసిన గంజాయి తెచ్చుకొంటున్నారు. కాగా గంజాయి కొనుగోలుకు అవసరమైన నగదు సమకూరని పరిస్థితిలో మరో ముందడుగు వేసి విక్రయాలు చేయడం ప్రారంభించారు. స్థానికంగా తమ స్నేహితులకు అదనపు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు తిరువూరు సీఐ అబ్దుల్ నబీ విచారణ చేశారు. విషయం నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. నెమలి బరియల్ గ్రౌండ్ ప్రాంతంలోని రేకుల షెడ్డు వద్ద ఉండగా ఆకస్మికంగా దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో మైనర్ను విజయవాడ హోంకు, మిగిలిన ముగ్గురిని తిరువూరు కోర్టులో హాజరు పరచగా.. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ వివరించారు. -
కాలువల్లోకి అల్లుకుపోతున్న నిర్లక్ష్యం
అవనిగడ్డ: డ్రెయిన్లలో కనబడే గుర్రపుడెక్క పంటకాలువల్లోకి విస్తరించింది. గత ఏడాది అక్కడక్కడ కనబడిన గుర్రపుడెక్క నేడు చాలా ప్రాంతాలకు పాకింది. వీటిని ఆదిలోనే నివారించకుంటే సాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని 53వేల ఎకరాలకు సాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అల్లుకుపోతోంది.. దివిసీమలోని ప్రధాన పంటకాలువల్లో గుర్రపు డెక్క రోజురోజుకి అల్లుకుపోతోంది. గత ఏడాది అక్కడక్కడ మాత్రమే ఒకటి రెండు గుర్రపుడెక్క దుబ్బులు కనబడ్డాయి. ప్రస్తుతం ఇవి చాలా చోట్లకు విస్తరించాయి. నడకుదురు నుంచి మోపిదేవి ప్రధాన పంటకాలువతో పాటు అవనిగడ్డ నుంచి పులిగడ్డ పంటకాలువ, నాగాయలంక, కోడూరు ప్రధాన పంటకాలువలతో పాటు విశ్వనాథపల్లి, మందపాకల, పెదకళ్లేపల్లి వంటి పిల్ల కాలువలకు గుర్రపుడెక్క పాకింది. అరికట్టకుంటే పెను సవాలే.. గుర్రపుడెక్కను ఆదిలోనే అరికట్టడం సులువు. ఇవి మిగిలిన ప్రాంతాలకు విస్తరించినా, ఏపుగా పెరిగినా వీటిని నిర్మూలించడం చాలా కష్టతరమని కొంతమంది రైతులు చెబుతున్నారు. కూలీలతో శుభ్రంగా లాగించి ఎండిన తర్వాత తగులబెట్టడం ద్వారా వీటిని సమూలంగా నిర్మూలించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. తొలగించకుంటే కష్టం.. ఇప్పటికే పలుచోట్ల పంటకాలువలో గుర్రపుడెక్క బాగా పెరిగింది. ముఖ్యంగా కోడూరు మండలం మాచవరం – జయపురం మధ్య గుర్రపుడెక్క పలుచోట్ల అల్లుకుపోయింది. విశ్వనాథపల్లి పంటకాలువలో కొన్ని ప్రాంతాల్లో బాగా పెరిగిపోయింది. పంటకాలువకు సాగునీటిని విడుదల చేయక ముందే గుర్రపుడెక్కను తొలగించాల్సిన అవసం ఉంది. లేదంటే సాగునీరు విడుదల చేసిన తరువాత నీటిలో వీటిని తొలగించడం చాలా కష్టం. ఇది అంతకంతకు విస్తరిస్తుందని, దీనివల్ల సాగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దివిసీమ పంటకాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రధాన పంట కాలువల్లోకి పాకుతున్న గుర్రపుడెక్క తొలగించకుంటే సాగునీటికి ఇబ్బందులే 53వేల ఎకరాలకు పొంచి ఉన్న ప్రమాదం అనుమతులు రాగానే కెమికల్ స్ప్రే.. గుర్రపుడెక్క తొలగింపునకు కెమికల్ స్ప్రే చేయించేందుకు అంచనాలు పంపించాం. అనుమతి రాగానే కెమికల్ స్ప్రే చేయించి తొలగిస్తాం. తర్వాత ఎక్కడన్నా మిగిలితే మనుషులతో ఏరించే చర్యలు తీసుకుంటాం. సాగునీటి సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. – రావెళ్ల రవికిరణ్, ఇరిగేషన్ డీఈ, పులిగడ్డ -
సికిల్సెల్ వ్యాధి అడ్డుకట్టకు ప్రణాళిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సరైన అవగాహనతో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని నిర్మూలించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట ప్రణాళిక అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి జూలై 3 వరకు గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు, డీఆర్వో వి.శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జె.సునీత, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వైద్యాధికారులతో కలిసి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన మిషన్–వ్యాధి సమగ్ర సమాచారానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు, మ్యాన్యువల్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై 15 రోజుల పాటు పాఠశాలలతో పాటు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తుందని.. ఇది అంటు వ్యాధి కాదని స్పష్టం చేశారు. రక్త పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉన్న వ్యక్తి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సకాలంలో గుర్తించి సరైన వైద్యం తీసుకోవడం ద్వారా రోగి జీవన నాణ్యతను పెరుగుతుందన్నారు. సెల్ ఎనీమియా వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్ష, సికిల్ సెల్ ఎనీమియా చికిత్స తదితర అంశాలపై డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక, క్షేత్రస్థాయి అధికారుల సమన్వయం తదితర అంశాలను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జె.సునీత తెలియజేశారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ బీసీకే నాయక్, డీఐవో డాక్టర్ అమృత, డీఎంవో డాక్టర్ మోతీబాబు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ జె.సుమన్, ఆర్బీఎస్కే కార్యక్రమ అధికారి డాక్టర్ మాధవి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఇందుమతి, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు -
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించాలనే లక్ష్యంతో బందరు నియోజకవర్గంలో రూ. 225 కోట్లతో 200 పనులు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం చెరువుల ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రెయిన్లలో తూటికాడ తొలగింపు పనులను త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో రూ. 17 కోట్లతో 63 పనులు ప్రతిపాదించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వర్షాకాలం వచ్చినప్పటికీ ఇంత వరకు పనులు చేపట్టకపోవటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని పేర్కొన్నారు. ముందుగానే అవసరమైన ఇండెంట్లు పెట్టాలన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు అందించిన పెట్టుబడి సాయం వివరాలపై ఆరా తీశారు. పోర్టు పనుల పురోగతిపై.... బందరు పోర్టుకు సంబంధించి పనుల పురోగతిపై వివరాలు సేకరించారు. రూ. 5,156 కోట్లతో నాలుగు బెర్త్లతో 13 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 2025 అక్టోబరు నాటికి మొదటి దశ పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 709 కోట్ల పనులు చేసినట్లు వివరించారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0 ద్వారా రూ. 57.33 కోట్ల నిధులు మంజూరయ్యాయని పట్టణంలో తాగునీటి సరఫరా పరిస్థితి మెరుగుపరచటం వంటి పనులు వెంటనే చేపట్టాలన్నారు. కలెక్టర్ డీకె బాలాజీ మాట్లాడుతూ శాఖాపరంగా అమలవుతున్న కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో ఎం.వాణి, అధికారులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
మండలాల వారీగా ధాన్యం కొనుగోలు వివరాలు
మండలం రైతుల సంఖ్య కొనుగోలు చేసిన ధాన్యం (మెట్రిక్ టన్నుల)జమ చేసిన నగదు (రూ. కోట్లలో)అవనిగడ్డ 35 266.080 0.59 బంటుమిల్లి 3308 22705.320 49.62 బాపులపాడు 3448 29171.360 63.76 చల్లపల్లి 1775 13779.440 30.34 గన్నవరం 3076 30950.080 67.87 ఘంటసాల 3011 26036.800 57.34 గుడివాడ 2809 25111.280 54.86 గుడ్లవల్లేరు 2848 25842.160 56.44 గూడూరు 1807 13953.520 30.53 కంకిపాడు 3210 36974.560 80.85 కోడూరు 267 2280.800 5.02 కృత్తివెన్ను 1195 8909.760 19.47 మచిలీపట్నం 2199 17758.720 38.82 మోపిదేవి 1380 10519.560 23.16 మొవ్వ 3084 27621.080 60.59 నాగాయలంక 82 695.960 1.53 నందివాడ 890 7798.600 17.05 పామర్రు 3544 34124.960 74.63 పమిడిముక్కల 3977 31067.440 68.27 పెడన 1496 10735.400 23.47 పెదపారుపూడి 2339 22661.200 49.51 పెనమలూరు 1197 12160.880 26.71 తోట్లవల్లూరు 2057 14445.080 31.75 ఉంగుటూరు 5363 50669.920 110.76 ఉయ్యూరు 1964 19033.920 41.79 మొత్తం 56361 495273.880 1084.73 -
పోర్టు పనులు వేగవంతం చేయండి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): బందరు పోర్టు పనులను వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పోర్టు, రెవెన్యూ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణ పనులను అవరోధం లేకుండా సమస్యలను పరిష్కరించుకుంటూ పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. భూ సమస్యల వల్ల పనులు ఆలస్యం కాకూడదని అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్టు నిర్మాణంతో పాటు అనుసంధాన రహదారుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపులు పెండింగ్ ఉంటే వెంటనే వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూలై 5వ తేదీన తిరిగి పోర్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానన్నారు. ఈ సమీక్షలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏపీ మారిటోరియం బోర్డు డైరెక్టర్ విద్యాశంకర్, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ తేజేశ్వరరావు, తహసీల్దార్లు సతీష్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పోర్టు పనులను పరిశీలించిన కలెక్టర్... మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను కలెక్టర్ డీకె బాలాజీ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పోర్టు రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్ బెర్త్ నిర్మాణ ప్రాంతాల పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత రోడ్డు, రైలు మార్గంలో జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు ఆ మార్గంలోని భూ సమస్య ప్రాంతాలను పరిశీలించారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలకు సమస్య పరిష్కారమైందని మిగిలిన అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.విద్యాశంకర్, మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ జనరల్ మేనేజర్ తులసీదాస్, రైడ్స్ టీమ్ లీడర్ విశ్వనాథం, బందరు ఆర్డీవో ఎం.వాణి, తహసీల్దార్ సతీష్ తదితరులు ఉన్నారు.