ఎయిర్‌పోర్ట్‌ పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Published Fri, Jun 21 2024 1:48 AM | Last Updated on Fri, Jun 21 2024 1:48 AM

ఎయిర్‌పోర్ట్‌ పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

విమానాశ్రయం(గన్నవరం): విమానాశ్రయ విస్తర ణకు సంబంధించి పెండింగ్‌ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. స్థానిక ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్సిట్‌ టెర్మినల్‌లో గురువారం విమానాశ్రయ విస్తరణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు చిన్నఅవుటపల్లి పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద కేటాయించిన ప్లాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ.. విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు కౌలు పరిహారం బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిర్వాసిత కుటుంబాలకు గృహ నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌ స్థలంలో విద్యుత్‌, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయలు కల్పించాలని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ వల్ల రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన యాజమానులకు అజ్జంపూడి పరిధిలో కేటాయించిన లేఅవుట్‌ అభివృద్ధికి ఏపీసీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నూతనంగా నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ఏలూరు కాలువపై చేపట్టిన కొత్త వంతెన నిర్మాణానికి అవరోధాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, గుడివాడ ఆర్డీఓ పద్మావతి, ఎయిర్‌పోర్ట్‌ డెరెక్టర్‌ ఎల్‌.లక్ష్మీకాంత్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్‌ (సివిల్‌) కె.రామాచారి, తహసీల్దారు పవన్‌కుమార్‌, సీఆర్డీఏ తహసీల్దారు పాపాయమ్మ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement