-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శనివారం) పులివెందుల వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.కాగా, ఎన్నికల్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులతో గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలను, మనకోసం నిలబడ్డ వలంటీర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మన కార్యకర్తలు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మనతోనే నిలబడ్డారు. జెండాలు మోసి కష్టపడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు కూడా తిన్నారు. ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచి భరోసా ఇద్దాం’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (21-06-2024)
-
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, అనకాపల్లి ఎంపీగానూ, పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్తో సరిపెట్టవచ్చని సమాచారం. -
AP Congress: కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు షాక్
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. షర్మిల నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఏపీ కాంగ్రెస్లో ముసలం చోటుచేసుకుంది.కాగా, ఫిర్యాదులో భాగంగా కాంగ్రెస్ నేతలు..‘ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారు. వీరి పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడింది. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్ మాల్ అయ్యాయి. అధిష్టానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించినపుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాం.కానీ, ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ కేడర్, నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. తెలంగాణకు చెందిన షర్మిలకి చెందిన కొందరు అనుయాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి బీ ఫామ్స్ కేటాయించారు. సీడబ్ల్యూసీ మెంబర్స్, సీనియర్ నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, డీసీసీ ప్రెసిడెంట్స్ సూచనలను షర్మిల పరిగణనలోకి తీసుకోలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తాజాగా షర్మిల మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో కొనసాగుతున్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. షర్మిల నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
ఏపీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు.ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్తో సరిపెట్టవచ్చని సమాచారం.అయ్యన్నపాత్రుడి కామెంట్స్.. చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్తో భేటీ (ఫొటోలు)
-
ఇది మంచి పద్ధతి కాదు.. ముద్రగడ ఆవేదన
కాకినాడ, సాక్షి: కాపుల రిజర్వేషన్ సాధించేందుకు పవన్ కల్యాణ్కు మంచి అవకాశం దొరికిందని.. అలాగే రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించేందుకు ఓ అడుగు ముందుకు వేయమని కాపు ఉద్యమనేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పవన్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారాయన.గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను. దీనికి సంబంధించిన గెజిట్ పేపర్లు ఆయన కు పంపిస్తున్నాను. పవన్ ను ప్రేమించే కాపు,బలిజ యువత నిత్యం బూతు సందేశాలు పెడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. అలా కాదంటారా.. మీ మనుషులను పంపి మా కుటుంబాన్ని చంపేయండి అని అన్నారాయన. -
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అన్ని కమిటీలు రద్దు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్లోని అన్ని విభాగాలు రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త కమిటీలతో రాబోతున్నామని ఆమె పేర్కొన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాల్ని చవిచూసింది. దీంతో ఢిల్లీకి షర్మిలను రప్పించుకున్న హైకమాండ్.. ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్టీ పునర్మిర్మాణంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. -
పోలవరంపై రివర్స్ గేర్ ఏం చెబుతుందంటే..
ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!2014 టరమ్లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్మోహన్ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు. -
ముగిసిన ఎమ్మెల్యేల ప్రమాణం.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
అమరావతి, సాక్షి: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీలో 172 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మిగిలిన ముగ్గురి ప్రమాణ స్వీకారంతో పాటు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రొటెం స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యతో నిన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం ముగిశాక.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్తో భేటీ (ఫొటోలు)ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక.. స్పీకర్గా అయ్యన్నపాత్రుడి నామినేషన్ కార్యక్రమం జరిగింది. కూటమి నేతలు నామినేషన్కు మద్దతు ఇవ్వగా.. మెజారిటీ ఉండడంతో అయ్యన్నపాత్రుడి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు.. ఈ ఉదయం అసెంబ్లీ దగ్గర ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు.. భావోద్వేగానిని లోనయ్యారు. అసెంబ్లీ మెట్లకు మొక్కి లోపలకు వచ్చారాయన. ఇక పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం చూసేందుకు ఆయన సోదరుడు, జనసేన రాష్ట్రకార్యదర్శి నాగబాబు వచ్చారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 81 మంది ఎమ్మెల్యేలుఉమ్మడి కృష్ణా జిల్లానుంచి ఆరుగురు కొత్త సభ్యులుఎమ్మెల్యేలలో.. ఇద్దరు మాజీ ఐఏఎస్లుశ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు -
రేపే ‘సాక్షి’ని మూసేయిస్తా
అనంతపురం క్రైం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి నోటికి పనిచెప్పారు. బుధవారం మీడియా సమక్షంలో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఆయన.. ఆ వార్తను ప్రచురించిన, ప్రసారం చేసిన ‘సాక్షి’ మీడియాపై గురువారం నోరుపారేసుకున్నారు. సాక్షి ఆఫీసుకు రేపు ఉదయం 10 గంటలకు మూతేయకపోతే చూడండ్రా.. ఎవరూ అడ్డుకోలేరంటూ బెదిరించారు. గురువారం అనంతపురంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం పేరిట కొందరు పాత్రికేయులను పిలిపించి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. ‘వాళ్లని, వీళ్లని కాదు. మిమ్మల్నే (సాక్షి) బెదిరిస్తున్నా. ఏం పీకుతారు’ అంటూ బరితెగించి మాట్లాడారు. బ్రేక్ ఇన్స్పెక్టర్లను కాదు.. నేరుగా మీకే చెబుతున్నా.. సాక్షిని మూతేయిస్తా. నేను బంద్ చేయించేందుకు వస్తే పోలీసులు కూడా అడ్డుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగారు. ‘మీ కార్యాలయంపై దాడి చేస్తే దిక్కొచ్చే వారెవరున్నారు? నోరు మూసుకుని ఉండాలి. దర్బేష్.. నా కొ.. ల్లారా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఊగిపోయారు. ‘ఆయమ్మను బెదిరించాడు.. ఈయమ్మను బెదిరించాడు అన్నారు కదా.. ఇప్పుడు మిమ్మల్నే అంటున్నా.. మీకెవరు దిక్కున్నారు? మీ సీతారామాంజనేయులు, మీ పేర్ని నాని, మా ఎమ్మెల్యే (పెద్దారెడ్డి) వస్తారా? వాళ్లెవరూ రారు. నేను ఎవరికీ భయపడను. అంతకు ముందు కూడా నేను ‘సాక్షి’ ముందే కూర్చున్నా. మీకు వెనకాల, ముందు ఏముంది? నేను అనుకుంటే అనంతపురం సాక్షి ఆఫీసు మూసేయిస్తా’ అంటూ రెచ్చిపోయారు. ‘వాన్నీ.. వీన్ని బెదిరించను. నేరుగా మిమ్మల్నే బెదిరిస్తున్నా. అప్పట్లో మాకు ఎవరూ ప్రొటెక్షన్ రాలేదు. ఈ రోజు మీపైకి వస్తే మీకు అండగా ఎవరూ రారు. మేమొస్తే ఎవడూ అడ్డుకోలేరు. లక్షలాది మంది జనం మీ కార్యాలయంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవడూ లేడు. నాకు జన బలం ఉంది’ అంటూ బెదిరించారు. -
పేదల ఇళ్లు కూల్చివేత
రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంటలో దళిత వర్గానికి చెందిన సుమారు 65 రేకుల ఇళ్లను అక్రమ నిర్మాణాల సాకుతో గురువారం అధికారులు నేలమట్టం చేశారు. పేదలకు తీరని నష్టాన్ని కలిగించారు. దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేసి ఈ దౌర్జన్య కాండను నిర్దయగా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరింపజేసి, బాధితులెవరూ రాకుండా అడ్డుకున్నారు. తొలుత రేణిగుంట సీబీఐడీ కాలనీ సమీపంలో 25 రేకుల ఇళ్లను, ఆ తర్వాత వివేకానంద కాలనీ సమీపంలో 40 ఇళ్లను కూల్చి వేశారు. బాధితులు లబోదిబోమంటూ ఆర్తనాదాలు చేసినా అధికారులు పెడచెవిన పెట్టి ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఏడాది కిందట రేణిగుంటలో రెవెన్యూ అధికారుల అనుమతులతో రేకుల ఇళ్లను నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ తీసుకుని నివాసం ఉంటున్నారు. బుధవారం రేణిగుంట సీబీఐడీ కాలనీలోని కొన్ని ఇళ్లను ఎంపీడీవో విష్ణుచిరంజీవి వెళ్లి జేసీబీ సాయంతో తొలగించారు. స్థానికులు అడ్డు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే గురువారం ఉదయం భారీగా పోలీసు బలగాలతో రేణిగుంట తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూల్చివేత సాగింది. కళ్లెదుటే ఇల్లు కూల్చి వేయడంతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దళితులంటే అంత చులకనా? అని బాధిత మహిళలు తహసీల్దార్ నాగేశ్వరరావును నిలదీశారు. ఈ ఇళ్లు అక్రమ నిర్మాణాలైతే అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఇంటి పన్నులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చు చేశామని కన్నీటిపర్యంతమయ్యారు. ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు.. ప్రభుత్వం మారగానే, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ఆదేశాలతో దళితుల ఇళ్లను ఇలా కూల్చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. పేద దళితులపై ఎందుకింత పగ?ఇళ్లులేని పేద దళితులు కట్టుకున్న చిన్నపాటి రేకుల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేయడం బాధాకరం. నేను అడ్డుకుంటానని భావించి మా ఇంటి వద్దకు పోలీసులను పంపి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మీకిది తగునా? పెత్తందార్ల ఇళ్ల జోలికి వెళ్లగలరా? ఇలాంటి ఆకృత్యాలు చేసేందుకా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? దళితులపై మీకు ఎందుకింత పగ? – ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు, తూకివాకం, రేణిగుంట మండలంఇళ్ల కూల్చివేత దుర్మార్గంరేణిగుంట వివేకానంద కాలనీలో పేదలు, దళితులు నిర్మించుకున్న ఇళ్లను టీడీపీ నాయకుల ఆదేశాలతో అధికారులు కూల్చి వేయడం దుర్మార్గం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించి ఉంటే ఆ ఇళ్లకు అనుభవ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేశారు? స్థలాలకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపైనా విచారించి చర్యలు తీసుకోవాలి. కరకంబాడి ఎర్రగుట్ట వివాదాస్పద భూమిని సిద్ధల రవి అనే వ్యక్తి ఆక్రమించుకుని పెద్ద ఎత్తున గ్రావెల్ తోలుకుంటుండటం మీకు కనిపించలేదా?– హరినాథ్, సీపీఎం మండల కార్యదర్శి, రేణిగుంట -
ఏపీ నిట్.. ప్లేస్మెంట్స్లో హిట్
తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారికి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేఆఫ్లు కొనసాగుతున్నా.. ఏపీ నిట్ విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. 2022 బ్యాచ్లో 98 శాతం, 2023లో 97 శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏడాదికి 300 మందికి తక్కువ కాకుండా ఉద్యోగాలు పొందడం విశేషం. త్వరలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆరో బ్యాచ్ బయటకు రానుంది. 258 మందికి ఉద్యోగాలుక్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఏకంగా 127 కంపెనీలు నిట్ ప్రాంగణానికి వచ్చాయి. ఆరో బ్యాచ్ విద్యార్థుల్లో ప్లేస్మెంట్స్ కోసం 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 258 మంది (65.82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. సరాసరి వేతనం రూ.7.15 లక్షలుగా ఉంది. బీటెక్ ఫైనలియర్ సీఎస్ఈ చదువుతున్న ఆదర్‡్ష, ఈసీఈ విద్యార్థి ఆకాష్కుమార్ సిన్హా అత్యధికంగా రూ.44.1 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. వీరిని నివిధ కంపెనీ ఎంపిక చేసుకుంది. అలాగే సీఎస్ఈ విద్యార్థి సలాది వెంకట శశిభూషణ్.. పేపాల్ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో, సీఎస్ఈ బ్రాంచ్కే చెందిన స్వామి సక్సేనా జెడ్ఎస్ కేలర్లో రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా డిసెంబర్ వరకు ప్లేస్మెంట్స్ ప్రక్రియ కొనసాగనుంది.480 సీట్ల భర్తీనిట్లో 2024–25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మొదటి రౌండ్లో 480 సీట్లకు అలాట్మెంట్లు పూర్తయ్యాయని రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. నిట్లో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్ల్లో 90 సీట్ల చొప్పున ఉన్నాయన్నారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్ల్లో 60 చొప్పున, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంఎంఈ బ్రాంచ్ల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 480 సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24లోపు ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు ఫీజు చెల్లించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం నిట్లో ప్రత్యేక కేంద్రం పనిచేస్తోందన్నారు. -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కప్పం కడతారా.. కంపెనీ మూసేస్తారా
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తాం అని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో తడాఖా చూపిస్తోంది. కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తరువాత.. ముందు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాలంటే కప్పం కట్టాల్సిందేనని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పెద్దలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎన్నికై నెల రోజులు కూడా కాకుండానే స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగిపోయారు.కంపెనీలకు కళ్లు బైర్లు కమ్మేలా కప్పం రేట్లు నిర్ణయిస్తున్నారు. అందుకు కాదంటే ఫ్యాక్టరీలపై దాడులకు తెగబడతామని, అక్రమ కేసులతో వేధిస్తామని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు రూ.1.50 కోట్లు మామూళ్లివ్వాలని జారీ చేసిన అల్టిమేటం.., అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మూకలు విధ్వంసానికి పాల్పడటం ద్వారా వారి ఉద్దేశాన్ని తేటతెల్లం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీ కూడా గత్యంతరం లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణుజొ చ్చి , కప్పం కట్టేందుకు సమ్మతించడం రాష్ట్రంలో ఇకముందు జరగబోయే అరాచకాలకు సూచికగా నిలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ముందున్నది ముసళ్ల పండుగేనన్నది సుస్పష్టమవుతోంది. ప్రతి లారీకీ డబ్బు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బంటుపల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూళ్లు వసూలు చేసి హడలెత్తించేవి. ఇటీవల ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ఇప్పుడు మామూళ్ల వసూలుకు రంగంలోకి దిగారు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకుని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజూ లోడింగ్, అన్లోడింగ్ వచ్చే లారీకి రూ.వేయి చొప్పున మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు సగటున 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకు రూ.5 లక్షలు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.1.50 కోటి.. ఏడాదికి రూ.18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ల కింద సమర్పించుకోవాలి. లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరించారు. కాదన్నందుకు కంపెనీపై దాడి ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూళ్ల లెక్కలకు యూబీ కంపెనీ ప్రతినిధులకు కళ్లు బైర్లు కమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంతే.. ఈ నెల 15న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ముఠా యూబీ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన కంపెనీ ప్రతినిధులను బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్, పర్చేజ్ మేనేజర్, అడ్మిని్రస్టేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. ఢిల్లీ నుంచి ఒత్తిడితో కేసు నమోదు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాషీ్టకంపై యూబీ కంపెనీ ప్రతినిధులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే వర్గీయులపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూబీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. దాంతో తప్పనిసరై జేఆర్ పురం పోలీసులు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులపై ఈ నెల 16వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు.తమ వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్రంగా పరిగణించారు. యూబీ కంపెనీ ప్రతినిధులపై ఆయన వర్గీయులతో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయించారు. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి యూబీ కంపెనీ ప్రతినిధులపై కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. డీల్ సెట్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడుఈ వ్యవహారంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. ఆయన కంపెనీ ప్రతినిధులు, ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడారు. కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే ‘ఏం చేయాలో ’ చెప్పారు. అచ్చెన్న ‘మంత్రం’ పని చేసింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు వెనుక మంత్రి అచ్చెన్న ఉన్నారన్నది యూబీ కంపెనీ ప్రతినిధులకు అర్థమైంది. టీడీపీ, బీజేపీ కూటమి నేతలు డిమాండ్ చేసిన మామూళ్లు సమర్పించుకుంటే తప్ప ఉత్పత్తి ప్రారంభించలేమని స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో అనివార్యంగా యూబీ కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావు నివాసానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. వారిపై ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్ర ఆగ్రహావేశాలతో చిందులు తొక్కారు. తమను కాదని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఎలా నడుపుతారంటూ మండిపడినట్టు సమాచారం. ఢిల్లీ నుంచైనా, ఎక్కడి నుంచి చెప్పించినా సరే.. ఇక్కడ తాము పచ్చజెండా ఊపితేనే ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకుంటాయని, లేకపోతే లేదని కూడా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో యూబీ కంపెనీ ప్రతినిధులు బంటుపల్లి ముఠా డిమాండ్ చేసిన మేరకు మామూళ్లు ఇచ్చేందుకు సమ్మతించి తిరిగి వచ్చినట్లు ఆ కంపెనీ వర్గాలే చెబుతున్నాయి. కప్పం కడితేనే కంపెనీలు యూబీ కంపెనీ వ్యవహారం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమకు కప్పం కడితేనే కంపెనీలు కార్యకలాపాలు చేపడతాయని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కంపెనీలపై దాడులు, దండయాత్రలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీకే అటువంటి దుస్థితి ఏర్పడితే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. -
‘ఉపాధి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో పవన్కళ్యాణ్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, పనుల పురోగతి, నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసుల వివరాలను అధికారులు పవన్కు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని.. గ్రామాల్లో ప్రొటోకాల్ను అనుసరించి సోషల్ ఆడిట్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చిన్నారుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలిగ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు పవన్కు తెలియజేయగా.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెద్దామని పవన్ అన్నారు. కాగా, తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించిన పవన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడంతో పాటు రక్షిత మంచి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులపై చర్చించారు. -
పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్లోను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్ తరహాలో మన రాష్ట్రంలో కూడా గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆయన గురువారం సచివాలయంలో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధిరాష్ట్ర చిన్న, మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళలు పారిశ్రామికంగా ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్ను త్వరలోనే రూపొందిస్తామని వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం 20 ఆదర్శ మండలాలకు రూ.10లక్షలు చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ ఎస్హెచ్జీలకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించనున్నట్టు బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకంపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్పై తొలి సంతకం చేసినట్టు సవిత తెలిపారు. 2014–19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడో బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు. -
భూములమ్మి రాజధాని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాల నుంచి ప్రారంభించి ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులోని సీఆర్డీఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దక్షిణాదిలో గోదావరి భారీ జల నిధి లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లివ్వచ్చన్నారు. విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా అమరావతికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రజారాజధానిగా అమరావతి ఐదు కోట్ల మందికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే గర్వంగా పనులు చేసుకోవచ్చన్నారు. రాజధానిని వైఎస్ జగన్ అతలాకుతలం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. రాజధానిపై శ్వేతపత్రం.. రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుంచి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగ్ను కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, మంత్రులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపేశారు. రాజధాని ప్రస్తుత పరిస్థితపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది. కన్సార్టియంపైనా విషం చిమ్మారు.. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై బురద జల్లి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే గుంటూరు కేంద్రంగా అమరావతిని రాజధానిగా గుర్తించాం. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్లో ‘ఏ’ అంటే అమరావతి.. ‘పీ’ అంటే పోలవరంగా గుర్తుంటుంది. నదులు అనుసంధానిస్తాం.. ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం లభించింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు. వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.అప్పులెంతో తెలియదు..ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్నిఅణచివేస్తాం. రాజధానిలో నిర్మాణాలను ఉన్మాది బారి నుంచి దేవుడే కాపాడాడు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యకు్తలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలియదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలియదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారుల ప్రవర్తన మార్చుకోవాలి. -
నాన్ సబ్సిడీ సీడ్ పంపిణీ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: నాన్ సబ్సిడీ విత్తన పంపిణీ ఈసారి మరింత ఆలశ్యమయ్యేట్టు కన్పిస్తోంది. ప్రతీ ఏటా సబ్సిడీ విత్తనంతో పాటు నాన్ సబ్సిడీ విత్తనాలను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఎన్నికల వేళ.. ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందుచూపుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైనప్పటికీ, సబ్సిడీ విత్తన పంపిణీ జోరుగా సాగుతోంది. అగ్రి ల్యాబ్్సలో సర్టిఫై చేసిన సీడ్ను ఆర్బీకేల్లో నిల్వ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ పూర్తి కాగా, వేరుశనగ విత్తన పంపిణీ 90 శాతం పూర్తయింది. వరితో సహా ఇతర విత్తనాల పంపిణీ ఊపందుకుంటోంది.ఇప్పటికే 3.11లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీఖరీఫ్ సీజన్ కోసం 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, 6.28 లక్షల క్వింటాళ్ల విత్తనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. 4.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో ఉంచింది. ఇప్పటి వరకు 34,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2,55,899 క్వింటాళ్ల వేరుశనగ, 20,340 క్వింటాళ్ల వరి, 95 క్వింటాళ్ల అపరాలు చొప్పున 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.రెండేళ్లలో 305 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనంసీజన్లో నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారిన పడి, కోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాల బారిన పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ సీడ్నే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. రైతుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు నాన్ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసేది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏటా సీజన్కు ముందే ఒప్పందాలు చేసుకునేది.ఇలా గత రెండేళ్లలో 305.43 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనాన్ని పంపిణీ చేసింది. ఖరీఫ్–2022లో 108.44 క్వింటాళ్ల పత్తి, 2.52 క్వింటాళ్ల మిరప, 2.25 క్వింటాళ్ల సజ్జలు, 37.20 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాల పంపిణీ జరిగింది. గడిచిన ఖరీఫ్–2023లో సైతం 17.38 క్వింటాళ్ల పత్తి, 0.64 క్వింటాళ్ల మిరప, 137 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేసింది.నకిలీల బారిన పడకుండా చర్యలుఈసారి కూడా ఖరీఫ్ సీజన్కు 3 నెలల ముందుగానే పత్తి, మిరప ఇతర పంటల విస్తీర్ణానికి తగినట్టుగా విత్తనాలు సరఫరా చేసేలా కంపెనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా 29 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్లో 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చింది. నకిలీల నివారణకు విస్తృతంగా తనిఖీలు చేసి, ముగ్గురు విత్తన డీలర్లపై 6 ఏ కేసులు నమోదు చేసింది. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేసింది. 2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది.ఫలితంగా ఎక్కడా నాసిరకం అనే మాటే విన్పించలేదు. సీజన్కు ముందే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందానికి ఏర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దీంతో ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తన పంపిణీపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నేటి నుంచి రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నిర్వహించేందుకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల లైవ్ కవరేజ్ను అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ నుంచి మీడియాకు ఇవ్వనున్నట్లు సమాచార శాఖ తెలిపింది. టీడీపీ సీనియర్, ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభ్యులచేత ప్రమాణం చేయించనున్నారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటెం స్పీకర్. స్పీకర్ ఎన్నికకు ఇవాళే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. -
దాడులు కాదు.. సూపర్ 6 అమలు ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.కార్యకర్తలకు అండగా ఉంటాం టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్ జగన్వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివైఎస్ జగన్ ఊరూరా తిరగమన్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది.ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం. – వంగా గీత, మాజీ ఎంపీ అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం. – ఆర్కే రోజా, మాజీ మంత్రి మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారుబద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.మేం జగన్కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు. అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ జగన్ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్తో కళింగ బ్లాక్ నిరి్మంచారు. సూట్ రూమ్లు, కాన్ఫరెన్స్ హాల్తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం. దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?
మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.ఎన్నికల సమయంలో చండీగఢ్లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సుకు నేను వక్తగా వెళ్ళాను. అది ఆఖరి ఘట్టం ఎన్నికల ముందు. చివరి ఘట్టంలో పంజాబు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సదస్సు మే 22న జరిగింది. మరుసటి రోజు అక్కడి మేధావులు పంజాబు గ్రామాల్లో నాకోసం సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను మూడు గ్రామాల్లో జరిగిన మూడు మీటింగుల్లో పాల్గొని మాట్లాడాను. మీటింగులో ఆడా, మగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పంజాబులో ప్రభుత్వ పాఠశాల విద్య పంజాబీ భాషలోనే బోధిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక్క సబ్జెక్టు మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో నడుస్తాయి. పంజాబీలు ఇతర దేశాలకు ఎక్కువ వలసపోతారు కనుక వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అని నేను అడిగాను. వాళ్ళు లేదు అన్నారు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం గురించీ, అది గ్రామాల్లోని పిల్లల్లో తెస్తున్న మార్పుల గురించీ వివరించాను. ‘మా పిల్లలకు కచ్చితంగా అటువంటి ఇంగ్లీషు మీడియం విద్య కావాలి; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ముందు ఈ డిమాండ్ పెడతా’మని వాళ్లు తీర్మానించుకున్నారు. మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు క్యాబినేట్ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఉన్నవారంతా గ్రామీణ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించినవారే. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి శాసించే అమిత్ షా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ళను స్థాపించి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన నారాయణ మళ్ళీ మంత్రి అయ్యారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు చంద్రబాబు ప్రైవేటీకరణలో భాగంగా ఎదిగాయి.ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. కానీ, భారతదేశంలో ప్రైవేట్ పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యావిధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, 2024–25 ఎకడమిక్ సంవత్సర స్కూళ్ల ప్రారంభం ఏకకాలంలో జరిగాయి. అయితే ఈ సంవత్సరానికి కావలసిన బైలింగ్వల్ బుక్స్(ఉభయ భాషా పుస్తకాలు), పిల్లలకిచ్చే డ్రెస్సులు, బూట్లు ఈ ప్రభుత్వం సకాలంలో ఇస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో బీదవారు, అగ్రకులాలలో బీదవారి పిల్లలకు 2029 ఎన్నికల నాటికి ఈ విద్యావ్యవస్థ తమకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వనుందో అర్థమయ్యే దశ వస్తుంది. కానీ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, ఇటు పిల్లల తలిదండ్రుల మీద ఉంది. ఇప్పటి నుండి గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం విద్యా పరిరక్షణ కమిటీలు వేసుకోవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను అధిగమించి విద్యారంగ పరిరక్షణ కోసం కమిటీలు వేసుకుని గ్రామంలోని పిల్లలందరి భవిష్యత్ కాపాడవలసిన బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా ధనవంతులున్నారు. వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదివించగలిగేవారూ ఉన్నారు. ఇటువంటివారు, ఉద్యోగులు, పట్టణాల్లోని ధనవంతులు... బీద బక్క పిల్లలందరికి ఇంగ్లీషు వస్తే తమ పిల్లలు వారితో పోటీ పడాల్సి వస్తుందని భావించి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగస్థులు, కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర ధనవంతులు వ్యతిరేకించడంలో తమ పిల్లల భవిష్యత్ స్వార్థం పనిచేసింది. ఈ స్వార్థం కులాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి రిజర్వేషన్ కేటగిరిలో డబ్బున్నవారు తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించి, ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలు తమ పిల్లలతో పోటీ పడకుండా ఉండాలనే స్వార్థం ఓటు వేసే దగ్గర కూడా పనిచేస్తుంది. ఈ స్వార్థపు వేళ్లను తెంపడం చాలా కష్టం. మార్పు తెచ్చే ప్రభుత్వాలను దింపెయ్యాలనే ఈ ధనిక వర్గం ఓటు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వర్గం, హోదా, ఆధిక్యత... నాణ్యమైన ఇంగ్లీష్ విద్యతో ముడిపడి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్మాణాల్లో కూడా ఈ విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మార్పు తమ వర్గ శత్రువు అనుకునే శక్తులు వీరు. వీరు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్కూలు విద్య ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అది చర్చనీయాంశం అయింది. బహిరంగ సభల్లో సైతం స్కూలు పిల్లలు ఇంగ్లీషు, తెలుగులో వాగ్దాటితో మాట్లాడటం, అదీ బీద కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడటం ఆ యా గ్రామాల్లో, పట్టణాల్లో ధనవంతులు జీర్ణించుకోలేని విషయం. మార్పును అంగీకరించదల్చుకోని విషయం. ఇది వైసీపీ ఓటమికి కొంత దోహదపడి ఉండవచ్చు. ఈ ధోరణిని తిప్పి కొట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రుల తిరుగుబాటు మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో విద్య మీద గ్రామీణ స్థాయిలో చర్యలు, పోరాటాలు జరగలేదు. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి పోరాటాన్ని జరపలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో కొత్త విద్యావిధానాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కూడా సహకరించారు. ఆ విధంగా వీరు బీజేపీ భావజాలానికి మద్దతిచ్చారు. అందుకే రానున్న ఐదేండ్లలో సమాన భాష, పురోగామి భావజాల పాఠశాల విద్య కోసం బలమైన పోరాటం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ పోరాటానికి నేతృత్వం వహించాల్సి ఉంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘ఉక్కు’పాతర.. విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురూ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్ని నిర్వీర్యంచేసే పనుల్ని చాపకింద నీరులా చేసుకుంటూపోతున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే ఎన్డీఏ సర్కారు.. స్టీల్ప్లాంటుపై ‘ఉక్కు’పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ప్లాంట్ ఆస్తులు విక్రయించి.. దివాలా సంస్థగా చూపించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు చేయడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపి... తూతూ మంత్రంగా తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.మూలధన సంక్షోభం పేరుతో..స్టీల్ప్లాంట్ బయట నిరర్థకంగా ఉన్న ఆస్తుల అమ్మకానికి సంస్థ యాజమాన్యం రంగం సిద్ధంచేసుకుంటోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమిస్తూ.. పూర్తిస్థాయి ప్లాంట్ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకే ఆస్తుల వేలం ప్రక్రియ షురూ చేసింది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ప్లాంట్ విక్రయించేందుకు ఉన్న అవకాశాలపైనే దృష్టిసారించింది. రెండ్రోజుల క్రితం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండబోదని స్పష్టంచేశారు. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి.. ప్లాంట్ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. రైతులు, ప్రజలు త్యాగాలు చేసి.. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకు శతవిధాలా యత్నిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ స్తబ్దుగా ఉన్నా.. తాజాగా విశాఖ ఉక్కు స్థలాల అమ్మకాల వ్యవహారాన్ని మళ్లీ వేగవంతం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ప్రైవేటీకరణకు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గడంలేదు. నిజానికి.. పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చు. సెయిల్లో విలీనం చేయడం మరో పరిష్కారం అని తెలిసినా, కేంద్రం ఆ పని కూడా చేయడంలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతూ ‘విశాఖ ఉక్కు’ ఊపిరి తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెరపైకి తెచ్చిన ఉక్కు స్థలాల అమ్మకం వ్యవహారాన్ని తాజాగా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎఎన్ఎల్ ఆస్తుల వేలానికి సిద్ధమవుతోంది.బోర్డు సమావేశంలో వేలం అంశం!ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆస్తుల విక్రయంపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ మెటీరియల్స్ నిల్వచేయడానికి హైదరాబాద్, చెన్నైలలో స్టాక్యార్డుల ఏర్పాటుకోసం కొనుగోలు చేసిన భూములతో పాటు ముంబై, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్ని విక్రయించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల స్టీల్ వినియోగదారుల అవసరాల్ని మూడు దశాబ్దాల కాలంగా హైదరాబాద్, చెన్నైలోని స్టాక్యార్డులు తీరుస్తున్నాయి. ఇతర మెట్రో ప్రాంతాలతో పోలిస్తే.. ఈ స్టాక్ యార్డుల్లో హ్యాండ్లింగ్ చార్జీలు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఇక్కడే విక్రయాలు జరిగేవి. వీటిని విక్రయిస్తే అటు స్టీల్ప్లాంట్కు, ఇటు వినియోగదారులకు నష్టాలే తప్ప ఎలాంటి ఉపయోగంలేదు. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కలు కట్టారు. నిరర్థక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్కు బోర్డు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేందుకు బోర్డు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.ఆదరిస్తే.., అద్భుతాలే కానీ..ఇటీవలే కొంతమేర లాభాలతో పాటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తూ స్టీల్ప్లాంట్ దూసుకుపోతోంది. సొంత గనులు కేటాయించి మూలధన సాయంచేస్తే ఉక్కు కర్మాగారం ఉరకలు వేసే అవకాశాలున్నా.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటులో పూర్తి సామర్థ్యం మేరకు ఉక్కు ఉత్పత్తి చేయకుండా ఆస్తులను అమ్మడానికి ఆసక్తి చూపడంపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. స్థలాలు అమ్మితే విశాఖ ఉక్కు కష్టాలు తీరుతాయా అంటే ముడిసరుకు కొనుగోలు చేయడానికి, పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి సైతం సరిపోవని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. జిందాల్ సంస్థతో ముడిసరుకు సరఫరాకు ఆర్థిక సాయానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ మేరకు బీఎఫ్–3 ప్రారంభించినా, ముడిసరుకు సక్రమంగా అందక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. నిత్యం మూడు బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా 21 వేల టన్నులు ఉత్పత్తి చేసే అవకాశమున్నా, 14 వేల టన్నులకే పరిమితమవుతోంది. ఎన్ఎండీసీ ద్వారా ప్లాంటుకు ప్రతిరోజూ 6 రేక్ల ఇనుప ఖనిజం అందాలి. నాలుగు రేక్లకు మించి అందించడంలేదు. ఇప్పుడిస్తున్న ఇనుప ఖనిజం కేవలం రెండు ఫర్నేస్లకు మాత్రమే సరిపోతోంది. బీఎఫ్–3 పరిస్థితి ఏంటనే దానిపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టిసారించకుండా ఆస్తుల్ని విక్రయించేసి.. స్టీల్ప్లాంట్ని మోడువారేలా చేసి.. ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాలు తెలిసినా టీడీపీ, జనసేన పార్టీలు.. పొత్తు పార్టీ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కదిలించేందుకు భయపడిన బీజేపీ.. ఇప్పుడు మాత్రం వేగంగా పావులు కదుపుతోంది.