-
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
ఎల్లారెడ్డి: నెలరోజుల క్రితం పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయ తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించిన నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఆలయంలోని సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన మాలోత్ గణేశ్గా గుర్తించామన్నారు. ఆలయ ప్రవేశ ద్వారం తాళం పగులగొట్టిన నిందితుడు లోనికి ప్రవేశించినప్పటికీ నగదు, ఇతర వస్తువులు లభ్యం కాలేదన్నారు. అలాగే లింగంపేట, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, దేవున్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడు గణేశ్ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. స్టాక్యార్డ్ నుంచి ‘థార్’ వాహనం చోరీ డిచ్పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారులో ఉన్న మహీంద్రా షోరూం ఆవరణ నుంచి దుండగులు ‘థార్’ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. షోరూం మేనేజర్ సాయినాథ్, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. షోరూం వెనుక ప్రాంతంలోని స్టాక్యార్డ్లో కొత్త వాహనాలు ఉంచుతారు. రెండు రోజుల క్రితం స్టాక్ యార్డ్ తాళం చెవి కనిపించకుండాపోయింది. బుధవారం రాత్రి సుమారు 8.15 గంటలకు దుండగులు స్టాక్ యార్డ్ వెనుక వైపు ఉన్న ఫెన్సింగ్ను తొలగించి కొత్త థార్ (బ్లాక్ కలర్) వాహనాన్ని ఎత్తుకెళ్లారు. తిరుమల ఇన్స్టిట్యూట్ ప్రహరీ పక్కనుంచి కియా షోరూం మీదుగా ప్రధాన రోడ్డుపైకి చేరుకుని వాహనంతో పాటు పారిపోయారు. గురువారం ఉదయాన్నే తాళం చెవి దొరకడంతో స్టాక్ యార్డ్ తెరిచిన షో రూం సిబ్బంది థార్ వాహనం చోరీకి గురైనట్లు గ్ర హించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిచ్పల్లి సీ ఐ మల్లేశ్, జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి తమ సిబ్బంది తో షోరూం చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురిపై కేసు తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఐదుగురిపై కేసునమోదు చేసినట్లు ఏఎస్సై సంజీవులు గురువారం తెలిపారు. ఇంటి స్థలం విషయంలో గ్రామానికి చెందిన తిరుపతి, సంగయ్యపై అదే గ్రామానికి చెందిన నర్సారెడ్డి, కపిల్, ఆనంద్రెడ్డి, రంజిత్రెడ్డి,ఽ ధర్మారెడ్డి కలిసి దాడిచేశారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాఠశాలల్లో పనులు పూర్తవ్వాలి
బీబీపేట: పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకతి వనము, ఉప్పరపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంను సందర్శించారు. పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. నర్సరీని సందర్శించి ఇంకా మెరుగుపర్చాలని, మొక్కల బ్లాక్లు క్రమపద్ధతిలో పెట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్స్ను అందజేశారు. ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీవో కృష్ణ, డిప్యూటీ ఇరిగేషన్ అర్చన, ఏఈ పవన్ కుమార్ తదితరులున్నారు. అల్బెండజోల్ మాత్రల పంపిణీ బీబీపేట : జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు హరిజనవాడ, మున్నూరుకాపువాడలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. పిల్లలకు కడుపులో నట్టలు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి వంటి వాటితో బాధపడతారని అన్నారు. ప్రభుత్వ వైద్యాధికారిణి భానుప్రియ, సీహెచ్వో ప్రమీల, సూపర్వైజర్ సత్యానంద్, ఆరోగ్యకార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
అస్తవ్యస్తంగా విద్యుత్ శాఖ వ్యవస్థ
నిజామాబాద్నాగారం: విద్యుత్ శాఖలో అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యుత్శాఖలోని టౌన్–3 ఏడీఈ సెక్షన్ పరిధిలో నాగారం సెక్షన్ ఏఈ సంతకం ఫోర్జరీ జరిగింది. ఆ ఉద్యోగి ఈ నెల 25 నుంచి జూన్ 10 వరకు సెలవులో ఉన్నారు. పై స్థాయి అధికారులు నాగారం సెక్షన్కు సంబంధించి ఇన్చార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. సమస్యల నిమిత్తం ఏఈకి ఫోన్చేస్తే ఫోన్ డైవర్ట్లో ఫోర్మెన్ వచ్చేవారు. ఏఈ లేకపోవడంతో ఈ సెక్షన్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం కొత్త మీటర్ మంజూరు చేయాలంటే అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాతే ఇస్తారు. ఈ సెక్షన్లో మాత్రం ఒక్కో కొత్త మీటర్కు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పైగా వసూలు చేయడం పరిపాటిగా మారింది. సింగల్ ఫేజ్ మీటర్లకు ఒకమాదిరిగా, త్రీఫేజ్ మీటర్కు మరొక విధంగా, పత్రాలు లేకుండానే వందల సంఖ్యలో మీటర్లు జారీ చేస్తున్నారు. కొత్త మీటర్ పెట్టాలన్నా, మీటర్లో సమస్యలు వచ్చినా, స్తంభాలు, లైన్లు మార్చడం వంటి పనులు చేయి తడిపితేనే అవుతాయి. లేకుంటే అంతే సంగతులు. పర్యవేక్షణ గాలికి.. ఆయా సెక్షన్ల పరిధిలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేయాల్సిన ఏఈలు, ఏడీఈ తమకేమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు. జిల్లాలో నాలుగు డివిజన్లున్నాయి. డివిజన్స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. అందుకే నగరంలోనే నాగారం సెక్షన్ పరిధిలో ఏఈ సంతకం ఫోర్జరీ వరకు వెళ్లింది. డివిజన్ స్థాయి అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతో కిందిస్థాయిలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. దర్జాగా ఏఈ సంతకం ఫోర్జరీ చేసిన ఉద్యోగులు సెక్షన్ల పరిధిలో పర్యవేక్షణను గాలికొదిలేసిన ఉన్నతాధికారులు ఏఈ సెలవులో ఉన్నప్పుడే జరిగింది నాగారం సెక్షన్ ఏఈ సెలవులో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. ఏఈ సంతకం ఫోర్జరీపై ఉన్నతాధికారులకు వివరించాం. ఎవరి ప్రమేయం ఎంత ఉందో తెలుసుకుంటున్నాం. ఏఈ సెలవులో ఉన్నప్పుడు ఇన్చార్జి బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు. కేవలం నోటిమాట చూసుకొమ్మని మరో ఏఈకి చెప్పాం. నేను కూడా ఈ నెల 5 నుంచి 10 వరకు సెలవులో ఉన్నాను. – శ్రీనివాస్రావు, డీఈ, విద్యుత్ శాఖ విచారణ జరుగుతోంది నాగారం సెక్షన్లో ఏఈ సంతకం ఫోర్జరీపై సీఎండీ వరుణ్రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. దీనిపై క్వాలిటీ కంట్రోల్ ఏడీఈతో విచారణకు ఆదేశాలు ఇచ్చాం. ఈ నెల 21న సాయంత్రం 5 గంటల వరకు నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది. – రవీందర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ -
సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
బాన్సువాడ రూరల్: బోర్లం క్యాంపు తండాలో గురువారం పద్మపాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి సంస్థ కో–ఆర్డినేటర్ రాయల భూపతి వివరించారు. రసాయన ఎరువుల వాడటం వల్ల జరిగే అనర్థాలను తెలియజేశారు. నేలను సారవంతంగా మార్చడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చారు. గ్రామంలో పాలదిగుబడి, వెన్నశాతం పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. విలేజ్ డెవెలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి గ్రామంలో పంటల దిగుబడి పెంచి రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అలు అభివృద్ది, ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కార్యదర్శి పరిపూర్ణ, మాజీ సర్పంచ్ నాన్కుబాయి పీర్యానాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ గెంట్యాల అంజనేయులు,తదితరులున్నారు. -
చెస్,బాక్సింగ్ క్రీడాకారులకు సన్మానం
పిట్లం(జుక్కల్) : కేరళ రాష్ట్రంలోని జూబ్లి మెమోరియల్ హాల్, త్రివేండ్రంలో ఈనెల 7, 8, 9వ తేదీల్లో నిర్వహించిన 12వ చెస్ బాక్సింగ్ జాతీయ చాంపియన్షిప్లో పిట్లం ప్రతిభ హైస్కూల్ నిర్వాహకులు నర్సింగ్రావ్ కూతురు ప్రతిభ సీనియర్ మహిళా విభాగంలో 3 బంగారు పతకాలు సాధించగా ఆమె తమ్ముడు విజయ్ రాఘవేంద్ర రాపు సీనియర్ పురుషుల విభాగంలో వెండి పతకంను సాధించాడు. ఈ సందర్భంగా వారిని గురువారం నారాయణ్ ఖేడ్లోని ఎంపీ నివాసంలో ఎంపీ సురేశ్షెట్కార్ ప్రత్యేకంగా సన్మానించారు. సరైన జీవన విధానానికి యోగా అవసరం భిక్కనూరు: మానవుడి సరైన జీవన విధానానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ యోగాకు సమయం కేటాయించాలన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ సమన్వయకర్తలు డాక్టర్ అంజయ్య, డాక్టర్ హరిత, అధ్యాపకులు మోహన్బాబు, లలిత పాల్గొన్నారు. దర్జాగా నకిలీ విత్తనాల అమ్మకాలు పిట్లం(జుక్కల్) : మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రైతు రామరావ్ పిట్లంలోని ఎరువుల దుకాణంలో ఈనెల 13న రూ. 3,500తో 25 కేజీల సోయా విత్తనాలు కొన్నాడు. సరైన సమయానికి ట్రాక్టర్ దొరకకపోవడంతో ఇంట్లోనే విత్తనాల సంచీ ఉంచాడు. ఈ గురువారం ట్రాక్టర్ దొరకడంతో సంచీ విప్పి చూడగా విత్తనాలకు ఫంగస్ వచ్చింది. దీంతో సదరు దుకాణాదారుడికి విత్తనాలు చూపించగా వేరే విత్తనాలు అందజేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. నకిలీ విత్తనాలు విక్రయించవద్దని అధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్ని మండలాల్లో దర్జాగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. ఎల్హెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడి నియామకం కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) జిల్లా ఉపాధ్యక్షులుగా రోతహన్ మోహన్ నాయక్ను నియమితులయ్యారు. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ బెల్లయ్య నాయక్ బుధవారం నియామకపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోటియా నాయక్, ప్రధాన కార్యదర్శి రాణాప్రతాప్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీలు నిర్మించాలి మాచారెడ్డి : నాలుగు లైన్ల రోడ్డు నిర్మించారు కానీ సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీ నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్థానికులు గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మొరపెట్టుకున్నారు. ఈ మేరకు 50 స్థానికుల సంతకాలతో వినతి పత్రాన్ని అందజేశారు. ఓ మోస్తరు వర్షం పడినా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించారు. -
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు
● ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి: ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మదన్మోహన్ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల నియోజకవర్గస్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు మండలాలలో ప్రభుత్వం పోడు భూములను గిరిజనులకు పట్టాలు చేసి ఇచ్చినా రెవెన్యూ అధికారులు వారిని వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. గిరిజనులు తమకు అందజేసిన పోడు భూములలో ట్రాక్టర్ల ద్వారా సేద్యం చేసుకుంటుంటే రెవెన్యూ, అటవీ అధికారులు అడ్డు చెబుతున్నట్లు తెలిసిందని అన్నారు. నేటి పరిస్థితులలో పశువుల ద్వారా వ్యవసాయం చేయడం సాధ్యపడదని ట్రాక్టర్ల ద్వారా సేద్యం చేసుకుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని రెవెన్యూ అధికారులను నిలదీశారు. విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నారని, దీనిని తిప్పికొట్టేలా విద్యుత్ శాఖ అధికారులు సాధ్యమైనంత వరకు నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో నత్తనడకన సాగుతున్న బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని త్వరిత గతిన పూర్తి చేసేలా అఽధికారులు కృషి చేయాలని కోరారు. మొదటి రోజున పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, విద్యుత్, ఐకేపీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఐసీడీఎస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
వృద్ధుడి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని సుభాష్నగర్కు చెందిన జగదీశ్(53) అదృశ్యమైనట్లు మూడోటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై ప్రవీణ్కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 9న దుకాణానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన జగదీశ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. జగదీశ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి సోద రుడు దేవేందర్ ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు. కామారెడ్డికి చెందిన వివాహిత.. కామారెడ్డి టౌన్: పట్టణంలోని గొల్లవాడకు చెందిన పొన్నాల లక్ష్మి తన ముగ్గురు పిల్లలతో కలిసి కొత్తబస్టాండ్ నుంచి అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. భర్తకు చెప్పకుండా ముగ్గురు పిల్లలతో కలిసి గురువారం ఉదయం 10 గంటలకు కొత్తబస్టాండ్కు వచ్చిన లక్ష్మి ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. ఆమె భర్త స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఏఈ మృతి
బోధన్టౌన్(బోధన్): బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆటోనగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ రూరల్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న రవిచంద్ర(47) మృతి చెందా డు. సీఐ వీరయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని బీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న రవిచంద్ర విద్యుత్ శాఖలో రూరల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా నిజామాబాద్లోని విద్యుత్ కార్యాలయంలోని స్టోర్ రూమ్కి వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా ఆటోనగర్ వద్ద డివైడర్కు ఢీ కొట్టుకుని తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ రవిచంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య పద్మజ విద్యుత్ శాఖలోనే జేఈవోగా విధులు నిర్వర్తిస్తుండగా, మృతుడికి కొడుకు వెంకటప్రసాద్, కూతురు శ్రీజ ఉన్నారు. పద్మజ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు.. మాచారెడ్డి: మండలంలోని భవానీపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం భవానీపేటకు దోమకొండ బాల్రాజ్ (74) బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామంలోని కల్లు డిపోనకు నడుచుకుంటూ వెళ్తుండగా కామారెడ్డి–సిరిసిల్లా రహదారిపై వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. తీవ్రగాయాలపాలైన బాల్రాజ్ను 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కుటుంబ కలహాలతో..
ఎడపల్లి(బోధన్): కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై బోధన్ పట్టణం రాకాసీపేటకు చెందిన బోగేవార్ రమేశ్(35) జానకంపేట శివారులోని అశోక్సాగర్లో దూకి ఆత్మహ త్య చేసుకున్నాడు. లేబర్గా పనిచేసే రమేశ్ అశోక్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోగా, గురువారం నీటిలో మృతదేహం తేలింది. గ్రామస్తు లు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
బాన్సువాడ రూరల్ : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం ఆయన మాతాశిశు అస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనహిత సంస్థ విరాళంగా అందించిన సెల్కౌంటర్, ఆక్సీ జనరేటర్ పరికరాలను ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ వైద్యులు హిమబిందు, అశ్విన్రెడ్డి జనహిత సంస్థ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సుమారు రూ.3లక్షల వైద్య పరికరాలు విరాళంగా అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రఘుపతి రెడ్డి, సతీష్రెడ్డి, అంజిరెడ్డి, ఎజాస్, తిలకేశ్వర్రఘు తదితరులున్నారు. -
పదెకరాలలోపు ఉన్న వారికే రైతుబంధు
● మాచారెడ్డి మండల సభ ఏకగ్రీవ తీర్మానం మాచారెడ్డి: పదెకరాల లోపు ఉండి, అది కూడా సాగు చేస్తున్న వారికి మాత్రమే మాత్రమే రైతుబంధు అందించాలని మాచారెడ్డి మండల సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అందించినట్లు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో కూడిన యంత్రాలు అందించాలని కూడా తీర్మానించారు. ఇరిగేషన్, వైద్య, విద్య, విద్యుత్ అధికారులతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు 10 ఎకరాల లోపు ఉన్నవారికి వ్యవసాయం చేస్తున్న వారికి ఇవ్వాలని రాష్ట్రంలోనే మొదటిసారి ఏకగ్రీవ తీర్మానం చేసిన మండల పరిషత్ ప్రజా ప్రతినిధులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో 132 కేవీ సబ్స్టేషన్ త్వరలో మంజూరు చేయిస్తానన్నారు. చివరి సమావేశం కావడంతో ఎంపీటీసీలను ఎంపీపీలను సన్మానించారు. ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పూల్ చంద్ నాయక్, ఎంపీడీవో గోపి బాబు, తదితరులు ఉన్నారు. -
తండ్రిని చంపిన కొడుకుకు ఐదేళ్ల జైలు
వర్ని: మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బోధన్ సెషన్స్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పు వెలువరించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకల్దాస్ తండాకు చెందిన వినోద్ 2021లో మద్యంమత్తులో తన తండ్రి ధూప్యాను హత్య చేశాడు. సాక్ష్యాధారాలు రుజువుకావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. ఈ కేసులో పబ్లిక్ప్రాసిక్యూటర్ శ్యామ్రావు వాదనలు వినిపించారు. ట్రాక్టర్ డ్రైవర్కు మూడు నెలల శిక్ష.. ఎడపల్లి: అజాగ్రత్త ట్రాక్టర్ నడిపిన డ్రైవర్కు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ బోధన్ అడిషనల్ జేఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి సాయిశివ తీర్పు ఇచ్చారని ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 2017లో మండలంలోని వడ్డేపల్లికి చెందిన భరత్, ఈశ్వర్ సైకిల్పై కిరాణాసామాను కోసం ఎడపల్లికి వెళ్తుండగా మట్టి లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. భరత్ కాళ్లపైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. అలాగే ఈశ్వర్ కాళ్లు, చేతులకు గాయాల్యాయి. బాధితుల కుటుంబసభ్యులు ఫిర్యాదు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, ట్రాక్టర్ డ్రైవర్కు మూడు నెలల జైలు శిక్షతోపాటు పరిహారం కింద ఒకరికి రూ.5 వేలు, మరొకరికి రూ. 10 వేలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
20 రోజుల్లో ఐదు ఆత్మహత్యలు
రామారెడ్డి: రామారెడ్డి పరిధిలో వరుస ఆత్మహత్య లు కలకలం రేపుతున్నాయి. జూన్ 1 నుంచి 20 వరకు మండలంలో ఐదుగురు వ్యక్తు లు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురువారం రామారెడ్డికి చెందిన దండబోయిన నర్సయ్య(78) అనారోగ్యం, కొడుకు కోడలు చనిపోయిన విషయంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన 20 రోజు ల్లోనే ఇసన్ననపల్లి , రామారెడ్డి, అన్నారం గ్రామాలకు చెందిన యువకులు, కన్నాపూర్ తండాకు చెందిన ఓ మహిళ, తాజాగా ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడడం విస్మయానికి గురి చేస్తోంది. ఆత్మహత్యలకు నివారణకు అధికార యంత్రాంగం వీలైనంత తొందరగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ ఐదు ఆత్మహత్యలు గుర్తు చేస్తున్నాయి. ● రామారెడ్డి ఠాణా పరిధిలో కలకలం ● అనారోగ్యంతో గురువారం వృద్ధుడి ఆత్మహత్య -
హైస్కూల్కు కిట్ బహూకరణ
మాచారెడ్డి : మిత్రుని జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎస్బీఐ సిబ్బంది యూనియన్ నాయకులు అభినందనీయులని ఆరేపల్లి హైస్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎం శ్రీనివాస్ కొనియాడారు. ఆ యూనియన్ నాయకుడు తారక్ నాథ్ జ్ఞాపకార్థం గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లి హైస్కూల్ విద్యార్థులకు బ్యాంక్ యూనియన్ నాయకులు సైన్స్ కిట్ అందజేశారు. ఎస్బీఐ యూనియన్ నాయకులు రాజేశ్వర్ రావు, భాస్కర్ రాజు, అనుదీప్, నరేందర్, మహేశ్వర్ రెడ్డి, రాంప్రసాద్ తదితరులున్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలి మాచారెడ్డి : మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సన్న డిమాండ్ చేశారు. గురువారం మాచారెడ్డి మండల కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వక పోతే ఆందోళన చేస్తామన్నారు. రై తు కూలీ సంఘం మండల నూతన కార్యవర్గ సభ్యు లు ఎండీ. ఆలీ, సయ్యద్ అలీ తదితరులున్నారు. నిరుపేద వృద్ధులకు అన్నదానం భిక్కనూరు : మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద ఉన్న హన్మాన్ ఆలయం వద్ద శ్రీ సాయిహనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం కొనసాగింది. ప్రతి గురువారం తమ సంస్థ తరపును నిరుపేదలైన వృద్ధులకు ఇతర గ్రామాల నంచి మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు అన్నదానం చేస్తున్నట్లు శ్రీ హన్మాన్ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. -
భార్య మృతిని తట్టుకోలేక ఆత్మహత్య
ఖలీల్వాడి: భార్య మరణాన్ని జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని మూడోటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పవన్నగర్కు చెందిన ఎర్రోళ్ల శ్యామ్(42) భార్య గౌరి ఈనెల 2వ తేదీన అనారోగ్యంతో మృతి చెందింది. పిల్లలు లేకపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న శ్యామ్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అక్క కేసరి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై తెలిపారు. కడపునొప్పి భరించలేక.. ఖలీల్వాడి: కడుపునొప్పి భరించలేక నగరంలోని మూడోటౌన్ పోలీస్స్టేషన్ పరిఽధిలోని జిల్లాపరిషత్ రోడ్డులో ఉన్న మున్సిపల్ క్వార్టర్స్లో గొండల రాహుల్(28) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నెల రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న రాహుల్ బుధవారం ఆస్పత్రిలో చూయించుకోగా అపెండిసైటిస్ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మహబూబ్నగర్లో మున్సిపల్ మేనేజర్గా పని చేస్తున్న తన తండ్రి వెంకటేశ్వర్లుకు రాహుల్ విషయం తెలుపగా, ఆయన బుధవారం రాత్రి నిజామాబాద్కు బయల్దేరాడు. ఇంటికి చేరుకున్న వెంకటేశ్వర్లు తలుపుతట్టగా రాహుల్ తీయలేదు. అనుమానంతో వెంకటేశ్వర్లు కిటికీలో నుంచి చూడగా రాహుల్ఉరేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు.. నవీపేట: మండలంలోని ఆశాజ్యోతి గ్రామానికి చెందిన ఐటోళ్ల రాజు(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ గురువారం తెలిపారు. జులాయిగా తిరిగే రాజు గత కొంతకాలంగా మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రారంభానికి ముందే పగుళ్లు
డొంకేశ్వర్: మండలంలోని తొండాకూర్–కుద్వాన్పూర్ గ్రామాల మధ్య నిర్మించిన వంతెన మున్నాళ్ల ముచ్చటే అన్నట్లుగా మారింది. రూ.2.30కోట్లతో గతేడాది ప్రారంభమైన వంతెన పనులు ఇటీవల పూర్తయ్యాయి. నిర్మాణ పనులు మొదలైనప్పటి నుంచి కాంట్రాక్టర్ చేపట్టిన పనులు నాసిరకంగా సాగాయనే ఆరోపణలున్నాయి. సమపాళ్లలో సిమెంట్, ఇసుక, కంకర కలుపకపోవడంతో ప్రస్తుతం వంతెనకు ఎక్కడ చూసినా పగుళ్లే కనిపిస్తున్నాయి. మరోపక్క వంతెన ఎత్తుకు తగ్గట్లుగా మొరం పోయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది మారింది. పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్ను ఏమీ అనని ఆర్అండ్బీ అధికారులు బిల్లులు మాత్రం సక్రమంగా చెల్లిస్తుండడం గమనార్హం.నాసిరకంగా తొండాకూర్ వంతెన పనులు -
తగ్గిన కూరగాయల సాగు విస్తీర్ణం
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల ధరలు మండిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం కాలానికి అనుగుణంగా జిల్లాలో స్థానికంగా కాయగూరలు సాగు చేయకపోవడమే. ఒకవేళ సాగు చేసినా మార్కెట్లో సరైన ధర రాకపోవడం, కూలీల కొరత ఉండడంతో కూరగాయల సాగుపై రైతులు వెనక్కి తగ్గుతున్నారు. అలాగే సబ్సిడీపై విత్తనాలు అందించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం కూడా మరో కారణమని చెప్పొచ్చు. దీంతో సులభంగా చేతికందే వరిని సాగు చేయడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వివిధ పంటలు కలిపి 5.30లక్షల ఎకరాల విస్తీర్ణం సాగుభూమి ఉండగా, ఇందులో 80శాతం భూముల్లో వరి సాగవుతోంది. ఒకప్పుడు కూరగాయల పండే భూములు 4వేల ఎకరాలకు మించి ఉండగా, ప్రస్తుతం 1,660 ఎకరాలకు పరిమితమైంది. 1,660 ఎకరాల్లో కూడా కేవలం 500 నుంచి వెయ్యి ఎకరాలలోపు రెగ్యులర్గా కూరగాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర పంటలు సాగవుతున్నాయి. ప్రతి ఏడాది ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చేసరికి సాగు గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో వంద ఎకరాలకుపైగా కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ఇందులో టమాట 50 ఎకరాలు, పచ్చిమిర్చి 20ఎకరాలు, బెండకాయ 30 ఎకరాలు, కొత్తిమీర ఆరు ఎకరాలు, ఇతర కాయగూరలు, ఆకు కూరలు కలిపి ఏడెకరాల్లో మాత్రమే సాగువుతున్నాయి. స్థానికంగా కూరగాయలను సాగు చేసి మార్కెట్లలో విక్రయిస్తున్న రైతులు కొంతమందే ఉంటున్నారు. అయితే, మార్కెట్లలో విక్రయించే కాయగూరల్లో దాదాపు 60 శాతం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే ఉంటున్నాయి. ఒక్కోసారి స్థానికంగా కూరగాయల పంటల విస్తీర్ణం తగ్గిపోవడం, కొరత కారణంగా జిల్లాకు దిగుమతులు సరిగా లేకపోవడంతో టమాట, పచ్చిమిర్చి, ఉల్లి, ఇతర కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే కూరగాయ పంటలు సాగు చేసే రైతులు జిల్లాలో చాలామంది ఉన్నారు. కాయగూరల సాగు విస్తీర్ణం పెరిగితే ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేక ముందుకురాని రైతులు వరి సాగుకే జిల్లాలో అధిక ప్రాధాన్యతపంట మార్పిడితో లాభాలు రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా పంటమార్పిడి చేయాలి. కాలానికనుగుణంగా ఇతర పంటలను సాగు చేస్తే రైతులకు, నేలకు మేలు జరుగుతుంది. కూరగాయలు, పందిరి కాయగూరలు సాగు చేసే రైతులను మా వంతుగా ప్రోత్సాహిస్తున్నాం. సబ్సిడీపై విత్తనాలు ఇచ్చే అంశం ప్రభుత్వం చేతిలో ఉంది. – మధుసూదన్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి నాకు ఐదెకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. గతంలో అరెకరంలో కూరగాయలు వేసే వాడిని. మార్కెట్లో ఒక్కోసారి ధర రావడం రాలేదు. దీంతో కాయగూరల సాగును తగ్గించాను. ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించి మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పిస్తే మళ్లీ సాగు చేస్తా. – కుమ్మరి ముత్యం, రైతు, నికాల్పూర్ -
కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షణ
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని చాలామంది అర్హులైన ప్రజలు రేషన్కార్డుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సుధీర్ఘ నిరీక్షణలో ఉన్న దరఖాస్తుదారులకు ఈసారైనా శుభవార్త వినిపిస్తుందా అనే సందేహం వ్యక్తం అవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కొత్త రేషన్ కార్డుల జారీకి గత ప్రభుత్వం మొగ్గుచూపలేదు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన వారికి రేషన్ కార్డులను జారీ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు పలు సందర్బాలలో రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రకటనలు చేస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కార్యాచరణ ఏదీ మొదలు కాకపోవడంతో రేషన్ కార్డులు జారీ చేస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మూసి ఉన్న రేషన్ పోర్టల్.. జిల్లాలో ఇప్పటి వరకు 3,81,224 తెల్ల రంగు రేషన్ కార్డులు, 20,940 అంత్యోదయ కార్డులు, 1,061 అన్నపూర్ణకార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అందించడానికి ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నా.. రేషన్ పోర్టల్ మూసి ఉండటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలు, ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించినా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఆన్లైన్లో నమోదు చేయలేకపోయారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రత్యేకంగానే దరఖాస్తులను తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పెండింగ్లోనే దరఖాస్తులు... రేషన్కార్డులలో కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన యువతుల పేర్లు నమోదు చేయడం, పుట్టిన వారి పేర్లు ఎక్కించడం, ఏమైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సవరించడం చేయాల్సి ఉంది. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ గతంలో దరఖాస్తులను స్వీకరించింది. బీఆర్ఎస్ పార్టీ రెండుమార్లు అధికారంలోకి వచ్చినా రేషన్ కార్డుల జారీ, మార్పులు చేర్పుల విషయంలో దృష్టి సారించకపోవడంతో దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో మార్పులు, చేర్పులకు సంబంధించి 77,758 దరఖాస్తుల సమస్య పరిష్కారం కాలేదు. రేషన్ కార్డుల జారీ, మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తేనే ఎంతోమంది అర్హులకు లబ్ధి చేకూరుతుందని పలువురు సూచిస్తున్నారు. సంక్షేమ పథకాలను అందించడానికి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో ఈ కార్డుల జారీ అనివార్యం అనే డిమాండ్ వినిస్తోంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. తొమ్మిదేళ్లుగా అర్హులకు తప్పని ఎదురుచూపులు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. కార్యాచరణ ఆరంభం కాకపోవడంతో అయోమయంప్రభుత్వం స్పందించాలి.. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వెంటనే ఆరంభించాలి. అర్హులైన వారికి కార్డులు ఇవ్వడం, మార్పులు చేర్పులను చేయడం కొనసాగించాలి. – తక్కూరి సాగర్, మోర్తాడ్ఉద్యమం చేస్తాం.. కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తాం. కేంద్రం ఉచితంగానే బియ్యం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్డులను జారీ చేస్తే కోటా పెంచి బియ్యంను పంపిణీ చేసే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం చేయకూడదు. – ప్రసాద్, ఎంపీటీసీ, సుంకెట్ -
విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
పిట్లం(జుక్కల్): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిట్లం మండల కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోంది. వ్యాపార వాణిజ్య సముదాయాలు అధికంగా ఉండటంతో పాటు, ఫోర్లైన్ జాతీయ రహదారి నిర్మించడం, సంగారెడ్డి జిల్లాకు చేరువగా ఉండటంతో వ్యాపారపరంగా జోరుగా అభివృద్ధి చెందుతుంది. దీంతో పిట్లం పట్టణంలో ప్రధాన రహదారుల పక్కన, ఆయా కాలనీలలో వ్యాపారస్తులతో పాటు పిట్లంవాసులు ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. గతంలో కంటే చూస్తే ఇళ్ల నిర్మాణం పిట్లం మండల కేంద్రంలో ఒక్క సారిగా పెరిగిపోయింది. గతంలో సంవత్సరానికి 100 నుంచి 2 వందల ఇళ్లు నిర్మాణం అవుతుంటే ప్రస్తుతం సంవత్సరానికి సుమారుగా 300 వందలపై బడి ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. పిట్లం మేజర్ పంచాయతీ కావడతో ఇళ్ల నిర్మాణానికి జీప్లస్2 వరకే అనుమతి ఉంది. అయితే ఇవేమి లెక్క చేయకుండా జీప్లస్3తో పాటు కొన్ని చోట్ల పెంట్హౌస్లు నిర్మిస్తున్నారు. అంతేగాకుండ సెల్లార్లకు అనుమతి లేకున్నా ఇష్టా రాజ్యంగా నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కట్టడంతో డ్రైనేజీ వ్యవస్థ అంత కుప్పకూలుతోంది. పిట్లం పట్టణంలో ఇళ్ల నిర్మాణం చేసుకునే వారు ముందుగా జీపీ నుంచి నిర్మాణం కోసం అనుమతి తీసుకుంటున్నారు. పలువురు ఇంటి నిర్మాణాలకు అనుమతులు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారు. మరి కొందరు ప్రధాన రహదారుల నుంచి కనీసం 33 ఫీట్లు స్థలం సైతం వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన పలువురికి గతంలో పంచాయితీ అధికారులు నామ్కే వాస్తే నోటీస్లు అందజేసి చేతులు దులువుకున్నారు. పంచాయితీ సిబ్బంది నోటీసులు ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పోయా యి కాని చర్యలు మాత్రం ఏమీ చేపట్టలేదు. యజమానులు వారి ఇష్టం వచ్చిన విధంగా నిర్మించుకుంటున్నారు. అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నా చోద్యం చూస్తున్న అధికారులు నామ్కే వాస్తే నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న వైనం -
పదోన్నతులు, బదిలీలకు బ్రేక్!
కామారెడ్డి టౌన్: విద్యాశాఖలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. టెట్ అర్హత సాధించినవారికే పదోన్నతులు ఇవ్వాలంటూ కొందరు ఎస్జీటీలు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ అంశంపై గురువారం వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. నిబంధనల ప్రకారం 2010 కంటే ముందు ఉపాధ్యాయులుగా ఎంపికై నవారికి టెట్ అర్హత అవసరం లేదు. ఆ తర్వాత ఎంపికై నవారికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే టెట్ అర్హత సాధించిన ఎస్జీటీలకే పదోన్నతి కల్పించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. తమకూ పదోన్నతులు ఇవ్వాలని నాన్ టెట్ ఎస్జీటీలూ కోర్టుకు వెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ఇటీవల తీర్పు ఇచ్చింది. టెట్ అవసరం లేదని ఒక బెంచ్, 2010 కంటే ముందు ఎస్జీటీలుగా పనిచేసిన వారికి టెట్ అవసరం లేదని మిగతా వారందరికీ టెట్ తప్పని సరి అని మరో బెంచ్ తీర్పునిచ్చాయి. దీంతో ప్రభుత్వం 2010 ముందున్న ఎస్జీటీకు పదోన్నతి కల్పిస్తూ ప్రక్రియ మొదలు పెట్టింది. ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకునే ప్రక్రియ ఈనెల 15న పూర్తయ్యింది. సోమవారం పదోన్నతుల తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో 874 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. వీరికి మంగళవారం ఆర్డర్ కాపీలను అందించాల్సి ఉంది. అయితే పదోన్నతి పొందామన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. 2017లో ఉద్యోగం పొందిన ఎస్జీటీలు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. పదోన్నతుల అంశంపై ఈనెల 20న హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పదోన్నతులు పొందినవారితోపాటు జిల్లాలో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న 1,400 ఉపాధ్యాయులు కోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టెట్ అర్హత సాధించినవారికే పదోన్నతులు ఇవ్వాలంటూ కోర్టుకు.. రేపు వాదనలు విననున్న న్యాయస్థానం -
No Headline
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు ఉత్తర కొనలో నిర్మల్ జిల్లాకు సరిహద్దులో, 44వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని.. అదే హైవే నుంచి మహారాష్ట్ర సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్కొండ, మెండోరా మండలాల్లో ప్రొఫెషనల్ దొంగల ముఠాలు రెక్కీలు నిర్వహించి మరీ బ్యాంకుల ఏటీఎంలను, బ్యాంకునే లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేశారు. నగదు, బ్యాంకులో బంగారాన్ని దోచుకెళ్లారు. 2022, 2023, 2024లో వరుసగా ఇదే ప్రాంతంలో చోరీలు జరిగాయి. పైగా ఈ మూడు చోరీలూ ఒకే మాదిరిగా ఉండటం గమనార్హం. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఇదే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని మరీ వరుసగా పకడ్బందీగా చోరీలకు పాల్పడుతుండడం విశేషం. అంతర్రాష్ట్ర ముఠాలు పాల్పడిన ఈ చోరీల కేసులను ఛేదించే విషయంలో పోలీసులకు పాట్లు తప్పడం లేదు. ● బాల్కొండ మండలం వ న్నెల్(బి) గ్రామ చౌరస్తా వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ఈ నెల 4న గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి రూ.25 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. రెక్కీ నిర్వహించిన ముఠా కియా వాహనంలో వ చ్చింది. దుండగులు కేవలం 9 నిమిషాల వ్యవ ధిలోనే రూ.25 లక్షల నగదును దోచుకున్నారు. గతంలో పోచంపాడ్లో ఏటీఎంలో చోరీకి పాల్పడిన విధంగానే దుండగులు ముందుగా వచ్చీరావడంతోనే అక్కడి సీసీ కెమెరాలపై నల్లటి రంగును స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. విచారణలో పురోగతి లేదు. ● మెండోరా మండలం పోచంపాడ్లో గత ఏడాది సెప్టెంబర్లో ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.12 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసు విచారణపై ఇప్పటివరకు పురోగతి లేదు. ఆ ఏటీఎం దోపిడీ కోసం దుండగులు జిల్లాలోని ఇందల్వాయి నుంచి కారును చోరీ చేసుకొచ్చారు. కాగా ఇందల్వాయి వచ్చేందుకు దుండగులు వినియోగించిన లారీని, లారీ డ్రైవర్ను మాత్రం పోలీసులు పట్టుకున్నారు. ● మెండోరా మండలం బుస్సాపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2022లో భారీ చోరీ జరిగింది. రుణాల కోసం రైతులు తాకట్టు పెట్టిన 9 కిలోల బంగారాన్ని దుండగులు దోచుకున్నారు. పైగా దుండగులు గ్యాస్ కట్టర్లతో బ్యాంక్లో లాకర్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, రూ.8 లక్షల నగదు దగ్ధమైంది. ఈ బ్యాంకు చోరీ అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఏటీఎంల చోరీ మాదిరిగానే సీసీ కెమెరాలపై నల్లటి రంగును స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కట్టర్తో కటింగ్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఏ1ను మినహా మిగతా ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. దుండగుల ముఠా ఉత్తరప్రదేశ్కు చెందినదిగా గుర్తించారు. కాగా చోరీ అయిన సొత్తు పూర్తిగా రికవరీ కాలేదు. రుణాల కోసం పలువురు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇన్సూరెన్స్ ద్వారా బ్యాంక్ వాళ్లు సెటిల్ చేశారు. -
రక్త చరిత్ర
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తుల కోసం, డబ్బుల కోసం అన్నీ మరచిపోయి అయినవారే గొడవలకు దిగుతున్నారు. క్షణికావేశంలో హత్యలకూ పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఐదు నెలల కాలంలోనే 18 హత్యలు జరిగాయి. ఎక్కువ కేసుల్లో కుటుంబ సభ్యులు, దగ్గరివారే నిందితులు కావడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, కామారెడ్డిబుధవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2024– 9లో u● ఏప్రిల్ 3న మహమ్మద్నగర్ మండలం బూర్గుల్కు చెందిన చాకలి పోచయ్యను సొంత అల్లుడే హత్య చేశాడు. మామ ఆస్తిపై కన్నేసిన అల్లుడు శ్రీకాంత్ ఇద్దరు వ్యక్తులకు రూ. 1.50 లక్షల సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి కూతురు సైతం సహకరించడం గమనార్హం.● బావ, బావమరుదులైన బాబా శేఖర్, రంజిత్ ఇటీవల బైక్ దొంగిలించారు. ఆ బైక్ను తానే సొంతం చేసుకోవాలని భావించిన శేఖర్.. బావమరిదిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. మద్యంలో పురుగుల మందు కలిపి తాగించి హతమార్చాడు. ఈ ఘటన ఈనెల 3వ తేదీన భిక్కనూరు సమీపంలో చోటు చేసుకుంది.● బిచ్కుంద మండలం బండరెంజల్లో ఈనెల 14న అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో కోడలు అంజవ్వ అత్త బాలవ్వ గొంతునులిమి చంపింది. పొలం డబ్బుల విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. చాలా కుటుంబాల్లో డబ్బులు, ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తి కలహాలకు దారితీస్తున్నాయి. కొన్ని సంఘటనల్లో భార్య, భర్తల మధ్య తలెత్తిన విభేదాలు అయితే హత్యకు లేదంటే ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు, బావ బావమర్దులు, అత్తా కోడళ్లు.. ఇలా అయిన వారే హంతకులుగా మారుతున్నారు. ఆవేశంలో హత్యలకు పాల్పడి సమాజంలో ఈసడింపునకు గురవుతున్నారు. హంతకులుగా జైలు పాలవుతున్నారు. కుటుంబంలో నెలకొన్న విభేదాలను కూర్చుండి మాట్టాడుకుని పరిష్కరించుకోవలసిందిపోయి గొడవలను పెంచుకుని హత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భార్య, భర్తలు, తండ్రీ కొడుకులు, అత్తా కోడళ్లు గొడవలు పడి చంపుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. జిల్లాలో సరాసరిన పది రోజులకో హత్య కేసు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది హత్యకు గురయ్యారు. మరికొన్ని సంఘటనల్లో హత్యా ప్రయత్నాలు జరిగాయి. ప్రతి హత్య వెనక ఆస్తి, ఆర్థిక వ్యవహారాలే ఉంటున్నాయి. భూమి గొడవలు, ఆస్తి, డబ్బుల కోసం కుటుంబ సభ్యులే హతమారుస్తున్నారు. గాంధారి మండలం గుజ్జుల్ తండాలో డబ్బుల విషయంలో గొడవలు జరిగి కొడుకును తండ్రి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిట్లం మండలం గద్దగుండు తండాలో భార్యను భర్త గొంతునులిమి చంపాడు. జుక్కల్ మండలం సోపూర్లో భార్యనే భర్తను హతమార్చింది. బిచ్కుంద మండలంలో అత్తను కోడలు గొంతునులిమి చంపేసింది. మద్నూర్ మండలంలో భర్తను భార్య చంపేసింది. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.న్యూస్రీల్జిల్లాలో మూడున్నరేళ్లలో జరిగిన హత్యల వివరాలు..సంవత్సరం హత్యలు 2021 35 2022 37 2023 28 2024(ఇప్పటి వరకు) 18మద్యం మత్తులో హత్యలుభూములు, ఆస్తులు, డబ్బుల విషయంలో కుటుంబాల్లో కలహాలు చెలరేగి హత్యలకు దారితీస్తున్నాయి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మద్యం తాగించి దాడి చేసి చంపేస్తున్నారు. కొన్ని సంఘటనలు క్షణికావేశంలో జరిగినా, దానికి కూడా మద్యం మత్తే కారణమవుతోంది. మద్యం మత్తులో గొడవ పడి ఆవేశంలో దాడి చేయడంతో చనిపోతున్నారు. చాలా సంఘటనల్లో నమ్మించి తీసుకువెళ్లి మద్యం తాగించి హత్య చేస్తున్నారు.భూముల ధరలు పెరగడంతో...మారుమూల గ్రామాలలో సైతం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎందుకూ పనికిరాని భూములు కూడా ఎకరాకు తక్కువలో తక్కువ రూ. 20 లక్షలపైనే పలుకుతోంది. కొన్నిచోట్ల భూముల ధరలు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా పలుకుతున్నాయి. ప్రధాన రోడ్ల వెంట ఉన్న గ్రామాల్లోనైతే ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతుంది. భూముల ధరలు పెరిగినట్టే గొడవలు పెరుగుతున్నాయి. కుటుంబంలో భూమి కోసం అన్నదమ్ములు గొడవలు పడుతున్నారు. తండ్రీకొడుకులు ఆఖరుకు భార్యాభర్తల మధ్య కూడా భూమి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు హత్యలకు దారితీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పదిరోజులకో హత్య మంటగలుస్తున్న మానవ సంబంధాలు ఆస్తి తగాదాలతో దారుణాలు అయిన వారే హంతకులవుతున్న వైనం -
‘భగీరథ’పై ఇంటింటి సర్వే
యాప్లో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బందికామారెడ్డి రూరల్: మిషన్ భగీరథపై రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. తాగు సరఫరా లేని ఆవాసాలు, ప్రాంతాలు, తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకుంది. ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చింది. జిల్లాలో 2.80 లక్షల మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నీరు సరిగా సరఫరా అవుతుందా లేదా అన్న అంశాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. సర్వేలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉందా? నీళ్లు వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? రాకుంటే ఎప్పటి నుంచి రావడం లేదు? తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇంటి యజమాని పేరు, ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. నల్లా ఫొటో తీసుకుంటున్నారు. అన్ని వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ నుంచి వచ్చే నిధుల కోసం రాష్ట ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలో పంచాయతీ కార్యదర్శులతోపాటు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొంటున్నారు.కొత్త ఇళ్లకు కనెక్షన్లు! నూతనంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులను ఈ సర్వే ద్వారా గుర్తించి నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. అలాగే నీరు సరఫరా కాని ఇళ్లను గుర్తించి, ఎందుకు నీరు రావడం లేదో పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ఇంటికి రెండు కనెక్షన్లు ఉంటే ఒకటి తొలగిస్తారు. -
ప్రైవేటు ఆస్పత్రుల నివేదిక సిద్ధం
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు, ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్ల నివేదికను జిల్లా వైద్యశాఖ అధికారులు సిద్ధం చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘కమీషన్లు.. పంపకాలు’ అనే కథనానికి జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. గత 15 రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులను తనిఖీ చేసి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల లెక్క లేదు జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీల విషయంలో వైద్యశాఖ వద్ద ఎలాంటి లెక్కలు లేవు. నిబంధనల ప్రకారం పల్లె, పట్టణాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు ఎలాంటి వైద్య సేవలు అందించరాదు. వీరికి శాఖ నుంచి ఎలాంటి అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు. వివరణ తర్వాతే చర్యలు జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్ని ఉన్నాయో గుర్తించాం. నిబంధనల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటాం. ఆర్ఎంపీ, పీఎంపీలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధారంగానే చర్యలు తీసుకుంటాం. – తుకారం రాథోడ్, డీఎంహెచ్వో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి నోటీసులు జారీ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు -
రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ వాసి మృతి
జక్రాన్పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి బ్రిడ్జి వద్ద ఎన్ఏ 44 రోడ్డుపై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బంకలవాడు బాలాజీ (50)ని మంగళవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. దీంతో అతను ఘటన స్థలిలోనే మృతి చెందాడు. మృతుడు రెండు రోజుల క్రితం నందిపేట మండలం కంఠం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ నుంచి బ్రహ్మణపల్లి జాతీయ రహదారిపైకి రాగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. రైలు కిందపడి ఒకరు..నవీపేట: మండలంలోని ఫకీరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి రైలు కిందపడి ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్కు చెందిన బర్లకాడి సాయిలు (47) మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జాన్ మంగళవారం తెలిపారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలిలో ఇంటి పైకప్పు కప్పేందుకు ముగ్గురు కూలీలతో కలిసి వెళ్లాడని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో రాత్రి ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు దాటుతుండగా నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న రైలు ఢీకొన్నది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.