-
రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?
స్వీటీ అనే పేరు చెప్పగానే అందరికీ అనుష్క శెట్టినే గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి తెలుగులో మూవీస్ చేస్తోంది. 'బాహుబలి'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తోంది. అలాంటిది ఈమెకు కొన్నాళ్ల క్రితం ఏకంగా రూ.5 కోట్ల ఆఫర్ వచ్చిందట. కానీ దాన్ని స్వీటీ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ దీని సంగతేంటి?కన్నడ బ్యూటీ అనుష్క.. నాగార్జున 'సూపర్' సినిమాతో నటిగా మారింది. కెరీర్ ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్గా చిన్నా పెద్దా హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 'బాహుబలి' ఈమెకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. కానీ 'సైజ్ జీరో' మూవీ ఎప్పుడైతే చేసిందో ఈమెకు అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం బరువు పెరిగింది కానీ తగ్గలేకపోయింది. దీంతో పూర్తిగా బయట కనిపించడమే మానేసింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)గత కొన్నాళ్ల నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వస్తున్న అనుష్క.. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో తలో మూవీ చేస్తోంది. ఇవి రెండు కూడా కాస్త డిఫరెంట్ మూవీస్. అయితే కొన్నాళ్ల క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారట. కానీ అనుష్క నో చెప్పేసిందట.ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. దీనిబట్టి చూస్తే అనుష్క ఎన్నాళ్లు నటిస్తుందో తెలియదు గానీ ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం పాత్ర ప్రాధాన్యమున్న మూవీసే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అనుష్క.. కోట్లు విలువ చేసే ఆఫర్ వదులుకుందనే న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ) -
ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు చేదు వార్త. అదేంటి త్వరలో 'కల్కి' రిలీజ్ కానుంది. ఈ టైంలో బ్యాడ్ న్యూస్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి ప్రమోషన్స్ చేస్తున్నారు. అలా ఓ విషయమై ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నారా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సాధారణంగా చిన్నా పెద్దా సినిమాల విడుదల ముందు ఎవరికి తగ్గట్లు వాళ్లు గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేస్తారు. కానీ ఇప్పుడు 'కల్కి' నిర్మాతలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించట్లేదని, ఇలాంటి ఈవెంట్ ఏం ఉండట్లేదని సమాచారం. శుక్రవారం సాయంత్రం కూడా యూట్యూబ్లో మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనిబట్టి కూడా ఈవెంట్ ఏం నిర్వహించరని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్లే.'కల్కి'కి అసలు ప్రమోషన్స్ చేయట్లేదని ఓ వైపు అభిమానులు బాధ పడుతున్నప్పటికీ.. చిత్రబృందం మాత్రం షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లు బుజ్జి, ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇలా సింపుల్గా చేసేస్తున్నారు. చూడాలి మరి 'కల్కి' నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తున్నారో?(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?
కూతురి ప్రేమను అర్థం చేసుకుని నచ్చినవాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తన పెద్ద కూతురు ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆమె ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్.. తంబిరామయ్యతో మాట్లాడాడు. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో ఈ మధ్యే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం చెన్నైలో ఎంతో వేడుకగా రిసెప్షన్ సెలబ్రేట్ చేశారు.కోట్లాది కట్నంతన గారాల కూతుర్ని అత్తారింటికి సాగనంపిన అర్జున్.. అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట! అర్జున్కు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ కూతుర్లే! అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అస్సలు వెనకడుగు వేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యాక్టరే కాదు సింగర్ కూడా!అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. విరున్ను అనే ద్విభాషా(మలయాళ, తమిళ) చిత్రం చేస్తున్నాడు. అలాగే తీయవర్ కులైగళ్ నాదుంగ, విడాముయుర్చి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకనిర్మాత కూడా! అలాగే చిట్టుకురువి (పరశురామ్), కట్టున అవలా కట్టువేండ (జైసూర్య) వంటి పలు సాంగ్స్ సైతం పాడాడు. సర్వైవర్ తమిళ్ షోతో హోస్ట్గానూ మారాడు.చదవండి: సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..! -
బేబీ బంప్తో దీపికా పదుకొణె.. ఆ బ్రేస్లెట్ ధరెంతో తెలుసా?
కల్కి సినిమాకు కౌంట్డౌన్ మొదలైంది. కేవలం వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ముంబైలో బుధవారం గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా దీపికా పదుకొణె కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. బేబీ బంప్తో కనిపించిన దీపికను చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తను స్టేజీపైకి వస్తుంటే బిగ్బీ చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ప్రభాస్ ఆమెను కూర్చోమని చెప్పి కుర్చీ వేయించాడు. ఈ ఈవెంట్లో దాదాపు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లోనే మెరిశారు. దీపికా సైతం టైట్ బ్లాక్ డ్రెస్లో కనిపించింది. సింపుల్గా ఉండేందుకే మొగ్గు చూపిన ఈ బ్యూటీ తన ఎడమ చేతికి వజ్రాల బ్రేస్లెట్ ధరించింది. దీని ధర 1 కోటి 16 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ ఆభరణం తన లుక్కే మరింత అందాన్ని తీసుకొచ్చింది.ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, బిగ్బీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కోటగిర వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా -
ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్ చరణ్.. కారణం ఇదేనా..?
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. రీసెంట్గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఇతర నటీనటులు ఎవరు..? వంటి అప్డేట్స్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న RC16 ప్రాజెక్ట్ ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అని తెలుస్తోంది.ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పూర్తిగా తన మేకోవర్ను మార్చుకోనున్నారట. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లు కనిపించాలంటే మరింత కసరత్తులు తప్పవని ఆయన భావించారట. అందుకోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు చరణ్ సిద్ధం అవుతున్నారట. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన వెంటనే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ చరణ్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత RC16 షూటింగ్ అక్టోబర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, అందుకోసం ప్రత్యేక మేక్ఓవర్ తప్పదని మేకర్స్ ప్లాన్ చేశారని టాక్. రామ్ చరణ్ కోరుకున్న శారీరక రూపాన్ని పొందాలంటే కనీసం రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిందేనని సూచించారట. దానికి కోసం ఆస్ట్రేలియాను ఎంపిక చేశారట.జాన్వీకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. రెహమాన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. RC16 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 'పెద్ది' అనే టైటిల్ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. -
ఇళయరాజా ముందు ధనుష్ భారీ డిమాండ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది. -
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
సౌత్ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా 'జోడి' (తమిళ్) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ సిమ్రన్కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దీంతో కమెడియన్గా కొనసాగిన సునీల్తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ సల్మాన్ చేతికి!
దక్షిణాది డైరెక్టర్లకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ దర్శకులు మురుగదాస్, అట్లీ లాంటోళ్లు అక్కడ హిట్స్ కొట్టారు. ఏఆర్ మురుగదాస్.. 'గజిని'తో సక్సెస్ అందుకోగా, అట్లీ 'జవాన్'తో వెయ్యి కోట్ల వసూళ్లు మూవీ తీశాడు. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఇతడు మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇదే ఇప్పుడు సల్మాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)అల్లు అర్జున్తో కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది సెట్స్పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
ఎండాకాలం అయిపోయింది. సమ్మర్లో బ్లాక్బస్టర్ కొట్టిన సినిమాలంటూ పెద్దగా ఏవీ లేవు. ఇంతలోనే వర్షాకాలం మొదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందూ చాంపియన్, ముంజా వంటి కొత్త సినిమాలు బాలీవుడ్లో రిలీజయ్యాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ముంజా. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. రెండు వారాల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఈ యూనివర్స్లో వచ్చిన ముంజా సినిమాను చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. మౌత్టాక్తోనే వసూళ్లు పెరుగుతున్నాయి. ఆదిత్య సర్పోడర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాడ్డాక్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న ఈ చిత్రం జూలైలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్ -
'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!
హీరో మరీ కమర్షియల్ అయిపోయారు. ఎంతలా అంటే హిట్ పడటమే లేటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా తామేం తక్కువ అని కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలా అంత ఫేమ్ లేని హీరోలే కోట్లు తీసుకుంటుండగా, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు మాత్రం తన రెమ్యునరేషన్తో షాకిస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సినిమాల చూస్తే కచ్చితంగా అతడికి ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే మంచి మూవీస్ చేయడమే కాదు చాలా వేగంగా వాటిని పూర్తి చేస్తాడు. ప్రతి మూడు నాలుగు నెలలకు పహాద్ మూవీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే 'పుష్ప 2'లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారు. దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఎందుకంటే రోజుకి రూ.12 లక్షల్ని రెమ్యునరేషన్గా ఫిక్స్ చేసిన ఫహాద్.. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందట. షూట్ క్యాన్సిల్స్ చేయకుండా కచ్చితంగా ముందు జాగ్రత్తగా ఉంటారని బహుశా ఫహాద్.. 'పుష్ప' నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా మనోడి ఇంత ప్లానింగ్తో ఉన్నాడు కాబట్టే వరస మూవీస్ చేస్తూ హిట్ కొడుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
ఏషియన్ గ్రూప్స్తో మరో స్టార్ హీరో మల్టీఫ్లెక్స్ ప్లాన్
టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో కొద్దిరోజుల్లో సందడి చేయనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే ఆయన పెరిగారు. అందుకే తన సోదరి నిఖితతో కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా నితిన్ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్లో మల్టీఫ్లెక్స్ థియేటర్ను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ పేజీ నుంచి ఒక ఫోటో విడుదలైంది.మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్స్ ఇప్పటికే ఏషియన్ సినిమాస్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని మల్టీఫ్లెక్స్లు నిర్మించారు. త్వరలో బెంగళూరులో AMB ప్రారంభం కానుంది. దిల్సుఖ్నగర్లో రవితేజ ART కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే, హీరో నితిన్ కూడా సంగారెడ్డి ప్రాంతంలో ఏషియన్ నితిన్ సితార పేరుతో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్యాన్ పేజీలలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఓపెనింగ్ కానున్నట్లు సమాచారం.నితిన్ సినిమాల విషయానికి వస్తే.. తమ్ముడు త్వరలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్హుడ్' చిత్రంలో కూడా నితిన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by N I T H I I N ✨⚡ (@teamnithiin_) -
సమంతకు లక్కీ ఛాన్స్.. హిట్ డైరెక్టర్తో అక్కడ తొలి సినిమా
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంతకు మరో లక్కీ ఛాన్స్ వరించిందన్నది తాజా సమాచారం. ఈమెకు నటిగా లైఫ్ ఇచ్చింది దర్శకుడు గౌతమ్మీనన్ అన్న విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో ఏమాయ చేసావే అనే తెలుగు చిత్రం ద్వారా సమంత నాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత సమంత తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యారు. కాగా ఇటీవల మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత నటనకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఖుషీ చిత్రం తరువాత ఈమె నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరచే విషయమే అవుతుంది. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ నటి సమంతకు అవకాశం కల్పించినట్లు సమాచారం. అయితే ఇది తెలుగు, తమిళం చిత్రం కాదు. మలయాళం చిత్రం అన్నది గమనార్హం. దర్శకుడు గౌతమ్ మీనన్ తొలిసారిగా మాలీవుడ్లో చిత్రం చేయనున్నారు. ఇందులో మమ్ముట్టి కథానాయకుడిగా నటించి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సమంత నాయకిగా నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా సమంతకు కూడా మలయాళంలో ఇదే తొలి చిత్రం అవుతుందన్నది గమనార్హం. ఇంతకు ముందు ఇందులో నటి నయనతార నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కారణాలేమైనా, ఇప్పుడీ అవకాశం నటి సమంతను వరించిందన్నమాట. ఈ చిత్రంతో సమంత చిన్న బ్రేక్ తరువాత రీ ఎంట్రీ అవుతున్నారన్న మాట. ఇది ఈ నెల 15వ తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా నటి సమంత కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, తనను కథానాయకిగా ప్రమోట్ చేసుకోవడానికి చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. -
దీపావళికి ఐదు సినిమాలు.. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కూడా!
దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సందర్భాల్లో భారీ చిత్రాలు తెరపైకి వస్తుంటాయి. అదే విధంగా ఈ దీపావళికి తమిళంలో పాంచ్ పటాక్గా ఐదు చిత్రాలు బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. వాటిలో విడుదలై– 2 చిత్రం ఒకటని తెలుస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో హాస్యనటుడు సూరి కథానాయకుడిగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన చిత్రం విడుదలై. గతేడాది మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దీనికి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్రెడ్.కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే ఇదే దీపావళికి మరో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి, సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రాలతో పాటు, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఎల్ఐసీ, కవిన్ హీరోగా నటిస్తున్న కిస్ చిత్రాలు దీపావళి రేసుకు సిద్ధం అవుతున్నాయని సమాచారం. మరి అప్పటివరకు వీటిలో ఏది బరిలో ఉంటుందో, ఏది తప్పుకుంటుందో చూడాలి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
'జబర్దస్త్' కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి గెటప్ శీను.. ఇప్పుడు హీరో అయ్యేంత వరకు వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటుడిగా చేస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్గా 'రాజు యాదవ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రిలీజ్కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్)గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకుడు. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ వస్తుంది.'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్) -
కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. అయితే, మరికొన్ని గంటల్లో కల్కి ట్రైలర్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కల్కి ట్రైలర్ జూన్ 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్స్లలో కూడా కల్కి ట్రైలర్ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. అందుకు ఇప్పటికే ఆ థియేటర్స్ లిస్ట్ను కూడా మేకర్స్ రెడీ చేసినట్లు సమాచారం.కల్కి సినిమా జూన్ 27న విడుదల కానున్నడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలను ఆహ్వానించే పనిలో కల్కి టీమ్ ఉందట. జూన్ 23న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. -
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'సీతారామం' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకుర్. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్తో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో వరసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)ఇప్పుడు 'కాంచన' సినిమాల సిరీస్లో హీరోయిన్గా మృణాల్కి ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. 'ముని', 'కాంచన' చిత్రాలతో తనకంటూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్.. వాటితో వరస హిట్స్ కొడుతున్నాడు. ఈ మూవీస్లో డ్యాన్సులు వేయడం, హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండదు.అయితే 'కాంచన 4' మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మృణాల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆమె ఒప్పుకొంటుందా? లేదా అనేది చూడాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాల్కి తమిళ డెబ్యూ అవుతుంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
బాలీవుడ్లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!
శ్రీలీల.. టాలీవుడ్లోకి వచ్చి వరసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతానికైతే తెలుగు వరకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తెలుగు వరకు అయితే ఈమె చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే ఉంది. మరోవైపు తమిళంలోనూ ఆఫర్స్ వచ్చాయని అంటున్నారు. కానీ ఇంకా ఫైనల్ అయినట్లు లేదు. ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్లు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుందని టాక్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల.. తెలుగు-కన్నడ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. టీనేజ్లో ఉండగానే కన్నడ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కానప్పటికీ కేక పుట్టించే డ్యాన్సింగ్ స్కిల్స్ ఉండటంతో వరస ఛాన్సులు వరించాయి. అలా అరడజనుకు పైగా మూవీస్ చేసింది. కానీ 'ధమాకా' తప్పితే చెప్పుకోదగ్గర హిట్ ఈమెకు పడలేదు.రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందని అన్నారు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయిందంటున్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా అనుకుంటున్నారట. ఇది కన్ఫర్మ్ అయి, హిట్ కొడితే మాత్రం శ్రీలీల పంట పండినట్లే!(ఇదీ చదవండి: బిగ్బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!) -
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి యూత్ ఫేవరెట్ క్రష్ అయిపోయింది. అందంతో, నటనతో కట్టిపడేసిన ఈ బ్యూటీ అంతకుముందు కూడా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది. కానీ యానిమల్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో కొత్తిల్లు కొనుగోలు చేసింది.ముంబైలో కొత్తిల్లుసెలబ్రిటీలు నివాసముండే బాంద్రాలోనే తనకంటూ ఓ ఇంటిని సంపాదించుకుంది. ఇది రెండంతస్థుల ఇల్లని, సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. రూ.14 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకుందట! ఇప్పటికే స్టాంప్ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30,000 చెల్లించిందట. మొత్తానికి తృప్తి.. షారుక్ ఖాన్, సల్మాన్, రేఖ, రణ్బీర్ కపూర్- ఆలియా భట్.. వంటి స్టార్స్ ఉండే స్థలానికి త్వరలోనే మకాం మార్చనుందన్నమాట!ఆ సినిమాతో పాపులారిటీతృప్తి డిమ్రి.. ఉత్తరాఖండ్ వాసి. మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. తన కెరీర్ టర్న్ అయింది మాత్రం బుల్బుల్ చిత్రంతోనే! కాలా చిత్రంతో మరింత ఫేమ్ రాగా యానిమల్ మూవీతో ఆ క్రేజ్ పీక్స్కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్ హిట్ హారర్ మూవీ 'భూల్ భులాయా'కు సీక్వెల్గా వస్తున్న 'భూల్ భులాయా 3'లో నటిస్తోంది. వీటితో పాటు 'బ్యాడ్ న్యూస్', 'ధడక్ 2' చిత్రాల్లో భాగమైంది.చదవండి: తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు -
బిగ్బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!
బిగ్బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్గా వీరి వివాహం జరిగింది. హనీమూన్కు నెదర్లాండ్కు వెళ్లి వచ్చారు.ట్విస్ట్ ఇచ్చిన జంటసోషల్ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్, నివేదిత గౌడ స్పందించనేలేదు.బిగ్బాస్ షోలో..కాగా చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్లే, పొగరు, చూ మంతర్ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్బాస్ ఐదో సీజన్లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్లో నివేదిత కూడా పార్టిసిపేట్ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. -
సౌత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నారు. జాకీష్రాఫ్, సంజయ్దత్, బాబీ డియోల్ వంటి స్టార్ నటులు దక్షిణాదిలో విలన్గా లేదంటే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా దక్షిణాది తెరపై మెరవబోతున్నట్లు ఓవార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్.దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తన 23వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు బిజుమీనన్, తుపాకీ చిత్రం ఫేమ్ విద్యుత్ జమ్వాల్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్ఖాన్ హీరోగా సిఖిందర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే సల్లూభాయ్ను తమిళంలో శివకార్తికేయన్తో చేస్తున్న చిత్రంలో అతిథి పాత్రలో నటింపజేస్తున్నట్లు టాక్. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
లారెన్స్ సినిమాలో అతిథిగా సూర్య?
రాఘవ లారెన్స్.. గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుంచి నృత్య దర్శకుడిగా, ఆ తరువాత కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన జిగర్తండ డబులెక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథను రాసి, సొంతంగా నిర్మిస్తున్న 'బెంజ్' చిత్రంలో లారెన్స్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారట!ప్రస్తుతం ఈయన కంగువ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన చేతిలో వాడివాసల్ తదితర చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా చివరి ఘట్టంలో సూర్య రోలెక్స్ అనే అతిథి పాత్రలో మెరిసి పెద్ద ఇంపాక్ట్నే కలిగించారు. ఇదే పాత్రతో సూర్య హీరోగా పూర్తి చిత్రాన్ని చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు కూడా. తాజాగా ఈయన రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో రోలెక్స్ తరహా పాత్రలో అతిథిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్ -
హీరోయిన్ శోభితతో నాగచైతన్య వెకేషన్.. బార్లో..
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ లవ్లో ఉన్నారని చాలాకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికితోడు వీరిద్దరూ జంటగా పలుమార్లు వెకేషన్కు వెళ్లారు. ఒకే లొకేషన్లో విడివిడిగా ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు. ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ను బట్టి వీరు కలిసే ట్రిప్పుకు వెళ్లారని అభిమానులు ఇట్టే పసిగట్టేవారు.తాజాగా ఈ జంట మరోసారి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూరప్లోని ఓ బార్లో వైన్ టెస్టింగ్ సెషన్లో చై, శోభిత పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. 'వీళ్లు ఎప్పటినుంచో కలిసే తిరుగుతున్నారు. ఇప్పటికీ ట్రిప్పులకు జంటగానే వెళ్తున్నారు', 'యూరప్లో ఈ సమయంలో వైన్ తాగితే భలే ఉంటుంది..', 'చై, శోభిత మంచి ఫ్రెండ్స్ అనుకుంటా..' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా చై ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శోభిత విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సితార అనే సినిమా చేస్తోంది. Naga Chaitanya and Sobhita spotted in Europe at a wine tasting few days ago 🍷👀byu/Eternal-Wisdom-9999 inBollyBlindsNGossip చదవండి: భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు! -
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలోకి వచ్చిన మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. తేదీ మాత్రం కన్ఫర్మ్ అని అంటున్నారు. తమిళంలో రెండేళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ.. తాజాగా తెలుగులో రిలీజైంది. ఇప్పుడు మూవీ లవర్స్ కోసం డిజిటల్గా అందుబాటులోకి వచ్చేయనుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మిరల్'. 2022 నవంబరులో తమిళంలో రిలీజైంది. ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే గత నెల 17న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైంది. హడావుడి లేకుండా వచ్చి అంతే ఫాస్ట్గా వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేయబోతుంది.తమిళ వెర్షన్ ఇదివరకే ఆహాలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఇదే ఓటీటీలోకి జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుందని సమాచారం. అదే రోజు హన్సిక నటించిన '105 మినిట్స్' మూవీ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై క్లారిటీ వస్తే ఈ వీకెండ్ మూవీ లవర్స్ టైమ్ పాస్ చేసేయొచ్చు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) -
ధనుష్తో కియారా రొమాన్స్
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడు ధనుష్. ఈయన నటుడు మాత్రమే కాకుండా గాయకుడు, గీత రచయిత, కథకుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడుగా రాణిస్తున్నారు. తాజాగా ఈయన తమిళంలో రాయల్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించారు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కథానాయకుడుగా ధనుష్ 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా తెలుగులో కుబేర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ నటుడు నాగార్జున ముఖ్యపాత్రను పోషిస్తుండగా, రష్మికమందన్న నాయకిగా నటిస్తున్నారు. కాగా ధనుష్ ఇంతకుముందు రంజనా, షమితాబ్, అత్రాంగి రే వంటి హిందీ చిత్రాల్లో నటించి అక్కడ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసింది. తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో కథానాయకిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈమె ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్ సరసన నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.