-
ఎన్టీఏను రద్దు చేయాల్సిందే...
ఖమ్మంమయూరిసెంటర్: నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి బాధ్యులను శిక్షించడమేకాక ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్, పీడీఎస్యూ, పీవైఎల్, పీడీఎస్యూ, ఎన్ఎస్యూ సంఘాల జిల్లా కార్యదర్శులు తుడుం ప్రవీణ్, బషీరుద్దీన్, ఇటికాల రామకృష్ణ, యడ్లపల్లి సంతోష్, నానబాల రామకృష్ణ, వి.వెంకటేశ్, ఎన్వీ రాకేశ్, మస్తాన్, రమేశ్, ఆసిఫ్ ఆధ్వర్యాన శుక్రవారం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి జెడ్పీసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రధాని, కేంద్ర మంత్రులు స్పందించకపోవడం సరికాదన్నారు. ఇకనైనా సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు చింతల రమేశ్, మంద సురేశ్, దాశోజు శ్రావణ్, మడుపల్లి లక్ష్మణ్, పొనుకుల సుధాకర్, లక్ష్మణ్, ఉమాశంకర్, క్రాంతి, సంగీత, బొల్లం మహేశ్, ఉదయ్కిరణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు -
రైలు ఎక్కబోయి జారిపడి..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం రైలు ఎక్కుతూ కాలుజారి కింద పడి టీవీ షో స్క్రిప్ట్ రైటర్, సహాయ నటుడు మృతి చెందాడు. ఆర్పీఎఫ్, రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మేదర మహ్మదీన్ హైదరాబాద్ వెళ్లేందుకు తెల్లవారుజామున భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్కు వచ్చాడు. కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతుండగా కాలు జారి ప్లాట్ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు కదులుతుండగా ప్లాట్ఫాం, రైలు మధ్య శరీరం మూడు, నాలుగు సార్లు తిరిగింది. గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు అతని చేతులు పట్టుకుని పైకి లాగారు. దీంతో మహ్మదీన్ పైకి లేచి నడుచుకుంటూ తనకు ఏమి కాలేదని పేర్కొన్నాడు. అయినా ఆర్పీఎఫ్ పోలీసులు 108 వాహనంలో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా మహ్మదీన్ ప్లాట్ఫాం, రైలుకు మధ్య నలిగిపోయి అతని శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంపై మాత్రం నామమాత్రపు గాయాలే ఉన్నాయి. ప్లాట్ఫాం నుంచి 108 వాహనం వరకు, ఆస్పత్రిలో కూడా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తి మృతి చెందడం విస్మయానికి గురిచేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.టీవీ షో స్క్రిప్ట్ రైటర్ మృతి -
రామయ్యకు స్వర్ణకవచాలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించా రు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం జరగనున్న జ్యేష్టాభిషేకానికి శుక్రవారం అంకురార్పణ చేశారు. పవిత్ర గోదావరి నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తీర్థబిందె తీసుకొచ్చారు. జ్యేష్ట పౌర్ణమి, ఏరుపాక పౌర్ణమిని పురస్కరించుకుని రామాలయంలో ప్రతీ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. బేడా మండపంలో 81 కలశాల్లో సమస్త నదీ జలాలను ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం చేస్తామని, ఈ సందర్భంగా నిత్యకల్యాణం రద్దు చేశామని పేర్కొన్నారు -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
చర్ల: ఏఓబీ సరిహద్దు ప్రాంతంలోని మల్కనగిరి జిల్లాలో శుక్రవారం పోలీసు బలగాలు మావోయిస్టుల డంప్ను గుర్తించాయి. ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలగండి సమీప అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు డంప్ను గుర్తించాయి. బెజ్జంకివాడ రిజర్వ్ ఫారెస్టులో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న బీఎస్ఎఫ్ 142 బెటాలియన్, స్పెషల్ ఫోర్స్కు చెందిన భద్రతా బలగాలు గుర్తించన ఈ భారీ డంప్లో 3 ఎస్బీఎంఎల్ తుపాకులు, 1 ఎస్బీఎంఎల్ బ్యారల్, 4 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 98 జిలిటెన్ స్టిక్స్, 2 డైవర్షనల్ మైన్స్, 1 సోలార్ ప్యానల్, 1 ట్వల్వ్ ఓల్డ్స్ కెపాసిటీ గల బ్యాటరీ, 3 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, 3 మేల్ ఫీమెల్ ఎలక్ట్రిక్ స్విచ్లు, 10 సైలెన్ బాటిళ్లు, 12 చిన్న మెడికల్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని గ్రామాల్లో మావోయిస్టులకు మంచి పట్టు ఉండడంతో పాటు, పార్టీకి సానుభూతిపరులు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఒడిశా పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని డంప్లు లభ్యమయ్యే అవకాశం ఉండడంతో కూబింగ్ ముమ్మరం చేయడంతో పాటు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నట్టు అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కలప అక్రమ రవాణాపై విచారణగుండాల: మండలంలోని కాచనపల్లి రేంజ్ పరిధిలోని పెద్దతోగు బీట్ నుంచి కలప అక్రమ రవాణా ఘటనపై అటవీశాఖ టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్ఓ ప్రసాద్ శుక్రవారం విచారణ నిర్వహించారు. రెండు రోజులుగా పెద్దతోగు బీట్ పరిధిలో పర్యటించిన ఆయన పోడు భూముల్లో టేకు మొట్లను పరిశీలించి కొలతలు వేశారు. కలప రవాణాకు సంబంధించి పోడు రైతులను విచారించారు. అటవీశాఖ సిబ్బందితో మాట్లాడి రవాణాకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ చేపట్టామని, పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. -
మద్యం మత్తులోనే బడికి...
ములకలపల్లి: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. ఎవరు ఏం అనుకుంటారోనన్న కనీస ఆలోచన లేకుండా మద్యం మత్తులోనే పాఠశాలకు రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆయనను తీసుకెళ్లి పశువుల పాకలో పడుకోబెట్టారు. మండలంలోని తిమ్మంపేట గ్రామపంచాయతీ పరిధి రాజీవ్నగర్ కాలనీ ప్రాఽథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పత్తిపాటి వీరయ్య శుక్రవారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో వీరయ్య అతిగా మద్యం సేవించి తూలుతూ పాఠశాలకు రాగా.. విద్యార్థులు ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు చేరుకుని ఆయనను మోసుకెళ్లి సమీపంలోని పశువుల కొట్టంలో పడుకోబెట్టారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే ఉన్న వీరయ్య.. ఆ తర్వాత లేచి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఇన్చార్జ్ ఎంఈఓ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు.టీచర్ను పశువుల పాకలో పడుకోబెట్టిన స్థానికులు -
కేటీపీఎస్ తుక్కుపై విచారణ జరిపించాలి
కొత్తగూడెంఅర్బన్(పాల్వంచ): కాలం చెల్లిన కేటీపీఎస్ పాత ప్లాంట్(ఒఅండ్ఎం) నుంచి తుక్కు తరలింపుపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, మరోసారి విచారణ చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత ప్లాంట్ను సందర్శించి అధికారులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ తుక్కు తరలింపు ద్వారా ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.484 కోట్లకే టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన జెన్కో విజిలెన్స్ విచారణ కాకుండా ఇండిపెండెంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలన్నారు. అప్పటి వరకు తరలింపు పనులను నిలుపుదల చేయాలన్నారు. కాంప్లెక్స్లో మరో ప్లాంట్ ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈ పి.వెంకటేశ్వరరావు, అధికారులు కిరణ్కుమార్, తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ ఎ.స్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాథం, పూర్ణచందర్ రావు, సాయిబాబు, డి.సుధాకర్, ఉప్పుశెట్టి రాహుల్, మురళి, కిరణ్, అన్నారపు వెంకటేశ్వర్లు, శేఖర్, గిరి, విజయ్, జకరయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆస్పత్రిలో తనిఖీకొత్తగూడెం అర్బన్(సింగరేణి): కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ఆస్పత్రిని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీఎంఓ సుజాతతో సమావేశమై కార్మికులకు అందుతున్న వైద్యం, డైట్ తదితర అంశాలపై చర్చించారు. అలాగే, పరికరాలు, ఇతర అంశాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకుడు వంగా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
అన్నదాతకు ‘మద్దతు’
●పలు పంటలకు కనీస మద్దతు ధర సవరించిన కేంద్రం ●వరిపై ఉన్న ధర రూ.117 పెంపు ●ఇప్పటికే రాష్ట్రం నుంచి రూ.500 బోనస్ ప్రకటన ●ఇంకొన్ని పంటలకు కూడా ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం ●అయినా పెరిగిన పెట్టుబడులతో గిట్టుబాటు కాదంటున్న రైతాంగంఖమ్మంవ్యవసాయం: ఏటేటా పంటల సాగు పెట్టుబడి పెరుగుతోంది. అయినా కష్టనష్టాలకోర్చి సాగు చేస్తున్న పంటలకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన ఏటా మాదిరిగానే ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. దేశంలో పండించే 17 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను సవరించగా.. ఇవి ప్రస్తుత వానాకాలం నుంచే అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్నకు సైతం కేంద్రం పెంచిన కనీస మద్దతు ధరలు వర్తించనున్నాయి. ఇవికాక పెసర, మినుము, కంది, మినుము వంటి పంటలను కూడా రైతులు సాగు చేస్తుండగా మద్దతు ధర పెరిగింది. వరికి అ‘ధనమే’.. ఖమ్మం జిల్లాలో 7 లక్షలకు పైగా ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా రైతులు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. గత ఏడాది వరి గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,203గా, సాధారణ రకానికి రూ.2,183గా ధర నిర్ణయించారు. ఈ ఏడాది వీటిపై రూ.117 పెంచడంతో గ్రేడ్–ఏ వరి రకం ధర రూ.2,320కు, సాధారణ రకం రూ.2,300కు చేరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయాన వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రైతులకు అదనంగా ఇది వర్తించనుంది. అయితే, గత ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వ మద్దతు ధర కన్నా ప్రైవేట్ వ్యాపారులు రకాల ఆధారంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించారు. పత్తి క్వింటాకు రూ.7,521 ఉమ్మడి జిల్లాలో రైతులు పత్తి దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆశించిన ధర లేక ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం కొంత మేరకు తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది పత్తికి కేంద్రం తేమ శాతం ఆధారంగా రూ.7,020 గరిష్ట ధర ప్రకటించగా.. ఈ ఏడాది మరో రూ.521 పెంచడంతో రూ.7,521కి చేరింది. జిల్లాలో 2022–23 సంవత్సరంలో పత్తి క్వింటాకు రూ.13 వేల వరకు ధర పలికినా ఆ తర్వాత రూ.10 వేల వరకు పడిపోయింది. గత ఏడాది సీజన్లో నాణ్యమైన పత్తికి రూ.6 వేలకు మించి దక్కలేదు. దీంతో ప్రభుత్వం సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి లేక రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యాన కేంద్రం క్వింటాకు రూ.501 ధర పెంచినా గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు ఎరువుల ధరలకు తోడు పురుగుమందుల ధరలు కూడా బాగా పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు గతంలో రూ.1,300 ఉంటే ఇప్పుడు రూ.1,900కు చేరాయి. గతంలో రూ.900కు లభించిన పొటాష్ ధర రూ.1,650కు, డీఏపీ ధర రూ.1,350కు చేరింది. ఫలితంగా పంట సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు, పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని రైతులు పేర్కొంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. భూమికి కౌలు చెల్లింపుతో పాటు, పెట్టుబడులు పెట్టాల్సి ఉండడంతో అంతగా మిగిలేదేమీ ఉండదని వారు వాపోతున్నారు. పంటల వారీగా పెరిగిన మద్దతు ధర (రూ.ల్లో) పంట గత ఏడాది ఈ ఏడాది పెంపు వరి గ్రేడ్–ఏ 2,203 2,320 117 సాధారణ రకం 2,183 2,300 117 పత్తి 7,020 7,521 501 మొక్కజొన్న 2,090 2,225 135 కందులు 7,000 7,550 550 పెసలు 8,558 8,682 124 మినుములు 6,950 7,400 450 వేరుశనగ 6,377 6,783 406 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అంచనా (ఎకరాల్లో) పంట ఖమ్మం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరి 2,83,983 1,71,196 పత్తి 2,01,834 1,75,619 మొక్కజొన్న 40,000 60,254 పెసర 15,357 155 మినుము 436 205 వేరుశనగ 270 2,083 కంది 1,005 15,122 -
గిరిజన సంఘాన్ని బలోపేతం చేయాలి
వైరా: తండాలు, గూడేల వరకు గిరిజన సంఘాన్ని బలోపేతం చేసి గిరిజనుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. వైరా శాంతినగర్లో నిర్వహిస్తున్న సంఘం రాష్ట్రస్థాయి రాజకీయ సామాజిక చైతన్య శిక్షణ తరగతులు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. గిరిజన సంఘం పోరాట ఫలితంగానే గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ప్రకటించిందని తెలిపా రు. అలాగే, పోడు రైతులకు పట్టాలిచ్చేలా అటవీ హక్కు చట్టాన్ని రూపొందించడంలోనూ కీలక పాత్ర పోషించామని చెప్పారు. కాగా, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో తండాలను నేరుగా అభివృద్ధి చేయాలని, తండాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, కర్ణాటక తరహాలో తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్నాయక్, నాయకులు బానోత్ బాలాజీ, గుగులోత్ పంతునాయక్, భూక్యా బన్సీలాల్, శ్రీనివాస్నాయక్, కృష్ణనాయక్, వాంకుడోత్ అమర్సింగ్, బానోత్ హరిచంద్, అజ్మీరా శోభన్, మధు, జ్యోతి, విజయ, వెంకన్న, కిషన్, రాము తదితరులు పాల్గొన్నారు. -
రూ.79 లక్షలు పలికిన ఆశీలు టెండర్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆశీలు (పార్కింగ్), సంత, గోదావరి ఫెర్రీ, పంచాయతీ దుకాణాలకు శుక్రవారం వేలంపాట నిర్వహించారు. డీఎల్పీఓ సుధీర్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా, ఆశీలును రూ.79 లక్షలకు రాములు అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. గతేడాది ఇదే కాంట్రాక్టర్ రూ.54.90 లక్షలకు వేలం పాట పాడుకున్నాడు. గతేడాది టెండర్లు మార్చితోనే ముగియగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు నెలల గడువు పొడిగించారు. అందుకు టెండర్పై 40 శాతం పెంచి ఆశీలుకు రూ.19.40 లక్షలు, ఫెర్రీ రూ.6.25 లక్షలు, వారపు సంత రూ.35 వేలు, మూడు దుకాణాలకు రూ.85 వేలు గ్రామ పంచాయతీ అధికారులు వసూలు చేశారు. గోదావరి నదిలో ఉండే బోట్లు (ఫెర్రీ) గత ఏడాది రూ.18 లక్షల 75 వేలు పలకగా, ఈసారి రూ.16.90 లక్షలు పలికింది. చర్ల రోడ్డులో నిర్వహించే వారపు సంత గతేడాది రూ.1.76 వేలు పలకగా, ఈ ఏడాది రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. మూడు దుకాణాలు రూ. 3 లక్షలు పలికాయి. ఈ ఏడాది 9 నెలలకు టెండర్ నిర్వహించగా రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. -
సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా పాట..
గాయకుడు, రచయిత మిట్టపల్లి సురేందర్ కొత్తగూడెంటౌన్: బొగ్గు గని నుండి పుట్టుతున్న అగ్గిధారల్.. గనులెన్నో తవ్వుతున్న గడ్డపారల్.. సింగరేణి యువకుల్ అంటూ సాగే పాట సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా ఉంటుందని ప్రముఖ కవి, గాయకుకు మిట్టపల్లి సురేందర్ తెలిపారు. ఆయన సింగరేణిపై రాసిన పాట చిత్రీకరణలో పాల్గొనేందుకు కొరియోగ్రాఫర్లు, గాయకులు, నటీనటుల ఎంపిక కోసం కొత్తగూడెంలో శుక్రవారం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు యువతీ, యువకులు ప్రదర్శన ఇచ్చారు. అనంతరం సురేందర్ మాట్లాడుతూ ఇటీవల మిట్టపల్లి స్టూడియో నుండి విడుదలైన అమ్మపాడే జోల పాట ఘన విజయాన్ని సాధించిందని తెలిపారు. ఈనేపథ్యాన సింగరేణిపై రాసిన పాట సైతం అందరికీ గుర్తుండిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. రచయిత, కొరియోగ్రాఫర్ కళ్యాణ్, సుమిత్రతో పాటు హనుమండ్ల మధు, రాయికం సంతోష్, గాజుల శ్రీనివాసరావు, మిట్టపల్లి స్టూడియో సీఈఓ పుల్ల సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా భూమికి రక్షణ కల్పించాలిమాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర కరకగూడెం: తన భూమికి రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్, ఆదివాసీ జాతీయ సంఘాల జేఏసీ అధ్యక్షుడు చందా లింగయ్య దొర కోరారు. మండల కేంద్రంలోని తన భూమిలోకి వెళ్లే రహదారిని ఓ వ్యక్తి ట్రాక్టర్ ద్వారా దున్ని, సరిహద్దుల ఫెన్సింగ్ స్తంభాలను ధ్వంసం చేశారని వాపోయాడు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2003లో మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజనేతర వ్యక్తి నుంచి 10 కుంటల భూమి కొని, తన భూమిలోకి రోడ్డు నిర్మించుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి తమ స్వాధీనంలోనే ఉంటున్నా, ఓ వ్యక్తి రోడ్డును దున్ని, ఫెన్సింగ్ పోల్స్ ధ్వంసం చేశాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై, అతనికి సహకరించిన మరో వ్యక్తిపై అట్రాసిటీ, 1/70 చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, పరిశీలిస్తున్నామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. గిరిజనులు, అటవీశాఖ సిబ్బందికి మధ్య వాగ్వాదందుమ్ముగూడెం : మండలంలోని గౌరారం గ్రామ శివారులో అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య శుక్రవారం వాగ్వాదం నెలకొంది. అటవీశాఖ సిబ్బంది అటవీశాఖ భూముల్లో ట్రెంచ్ కొట్టేందుకు జేసీబీ వాహనం తీసుకుని వెళ్లారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని అటవీశాఖ సిబ్బందిని నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం నెలకొంది. రేంజర్ కనకమ్మ జోక్యం చేసుకుని పట్టాలు తీసుకువస్తే అటవీహక్కుల చట్టం కమిటీల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని సూచించడంతో గిరిజనులు వెనక్కి తగ్గారు. చర్లలో.. చర్ల రూరల్: బట్టిగూడెం గ్రామస్తులు, న్యూడెమోక్రసీ నాయకులు సతీష్కు అటవీశాఖ అధికా రులకు మధ్య శుక్రవారం స్వల్పంగా తోపులాట జరిగింది. ప్లాంటేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్న అటవీ భూమిలోకి రావడంతో తోపులాట జరిగిందని ఎఫ్ఆర్వో ఉపేంద్ర తెలిపారు. నాటుసారా స్వాధీనందుమ్ముగూడెం : మండలంలోని నర్సాపురంలో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గోపయ్య అనే వ్యక్తి నర్సాపురం గ్రామానికి వచ్చి నాటుసారా విక్రయిస్తుండగా, మహిళలు పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సారా ప్యాకెట్లను అక్కడే వదిలేసి పారిపోయాడు. మహిళల ఫిర్యాదు మేరకు గోపయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. వ్యక్తి అదృశ్యంపాల్వంచరూరల్: వ్యక్తి అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని యానంబైల్ గ్రామానికి చెందిన శిరసాని వెంకటరమణ పట్టణంలోని గట్టాయిగూడెంలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్లో పని ఉందంటూ ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే సెల్ఫోన్ స్విచ్చాప్ వస్తోంది. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లేదు. వెంకటరమణ భార్య మీనాక్షి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
తెగిపడిన విద్యుత్ వైర్లు కొత్తగూడెంఅర్బన్(పాల్వంచ): భద్రాచలం ప్రధాన రహదారిపై లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం వైపు వెళుతున్న సున్నం లోడ్ లారీ స్టీరింగ్ స్ట్రక్ అవడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో విద్యుతత్ స్తంభాన్ని ఢీకొట్టి ఫుట్పాత్పై ఎక్కింది. ఈ క్రమంలో విద్యుత్ ధ్వంసమై వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో విద్యుత్ శాఖకు సుమారు రూ.70 వేల నష్టం వాటిల్లిందని సిబ్బంది తెలిపారు. కాగా లారీ సైతం ఽకట్టర్లు విరిగి ధ్వంసమైంది. ఎన్పీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ వైర్ల మరమ్మతులు చేపట్టారు.విద్యుదాఘాతంతో రెండు ఆవులు మృతిఅన్నపురెడ్డిపల్లి: విద్యుదాఘాతంతో శుక్రవారం రెండు ఆవులు మృతి చెందాయి. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్లోజి కృష్ణయ్యకు చెందిన ఆవులు మేతకు వెళ్లాయి. ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న నీటి కుంట వద్ద ఆవులు నీరు తాగుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 80 వేల నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపాడు. -
2.28 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
దుమ్ముగూడెం : మండలంలోని లక్ష్మీనగరం స్టేట్బ్యాంకు వద్ద ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం 2.28 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎకై ్సజ్ అధికారుల కథనం ప్రకారం.. ఎకై ్స జ్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ తిరుపతి, ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు భద్రాచలంలోని ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు ఆపకుండా వెళ్తుండగా వెంబడించారు. సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన దుమ్ముగూడెం పోలీసులు లక్ష్మీనగరం బ్యాంక్ వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి ఉంచారు. దీంతో మరోదారి లేక కారు చిక్కుకుపోయింది. కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు భద్రాచలం నుంచి వచ్చిన ఎకై ్సజ్ అధికారులు కారును తనిఖీ చేయగా, కారులో 2.28 క్వింటాళ్ల గంజాయి లభ్యమైంది. వాహనాన్ని, గంజాయిని స్వాధీనం చేసుకుని భద్రాచలం ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన క్రిష్టఫర్, శివ గురు, రకుల్ బోస్ సీలేరు నుంచి చైన్నెకు తరలిస్తున్నట్లు తేలింది. రెండు సెల్ ఫోన్లు, రూ.5,500 నగదు, శ్రీలంక, బంగ్లాదేశ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.65 లక్షలు ఉంటుందని, నిందితులపై కేసు నమోదు చేశామని భద్రాచలం ఎకై ్సజ్ సీఐ రహీమున్నీషా బేగం తెలిపారు. ఈ దాడిలో ఎకై ్సజ్ సిబ్బంది బాలు, సుధీర్, హరీష్, హనుమంతరావు, విజయ్, వెంకట్ పాల్గొన్నారు. మణుగూరులో మరో 14 కేజీలు.. మణుగూరు టౌన్: మణుగూరు మీదుగా మోటార్సైకిల్పై హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బైక్పై మణుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయి తీసుకెళ్తున్నారనే సమాచారం అందడంతో ఎస్ఐ మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాజుపేట క్రాస్రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతానికి చెందిన గురుకిల, పోదు వంతల్ అదే ప్రాంతానికి చెందిన రాహుల్ కుమార్ సూచన మేరకు మోటార్సైకిల్పై హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పట్టకున్నారు. వారి నుంచి రూ.3.40లక్షల విలువైన 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ పరారీలో ఉన్నాడని, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. భద్రాచలంలో.. భద్రాచలంఅర్బన్: అక్రమంగా కారులో గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్న క్రమంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎకై ్సజ్ పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
నకిలీపై నజర్
● కల్తీ విత్తనాల నియంత్రణకు టాస్క్ఫోర్స్ కమిటీలు ● విత్తన షాపుల్లో విస్తృతంగా తనిఖీలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. గత యాసంగి సీజన్లో ములకలపల్లి, పాల్వంచ తదితర మండలాల్లో నకిలీ విత్తనాలు వేసిన కొందరు రైతులు నష్టపోయారు. ఆయా రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాల ఎదుట ఆందోళన చేయడంతో పాటు, కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో విచారణ జరిపించినా.. ఆ రైతులు వేసిన విత్తనాలు కల్తీవా, మంచివా అనే విషయం ఇప్పటికీ తేల్చలేదు. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ శాఖతో పాటు కొత్తగూడెం కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో రైతు వేదికను ఎంపిక చేసి రైతునేస్తం పేరిట వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా విత్తనాల ఎంపికపై పలు సూచనలు చేశారు. వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించిన జిల్లా అధికారులు.. ఇల్లెందు, అశ్వారావుపేట కేంద్రాలుగా రెండు టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల వారు సభ్యులుగా ఉండే ఈ కమిటీలు జిల్లా వ్యాప్తంగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బిల్లులు తీసుకోవాలి.. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న విత్త్తనాలు నాణ్యమైన కంపెనీలవేనా అని పరిశీలిస్తున్నారు. పలు రికార్డులు, ఇన్వాయిస్ ఫైళ్లు, ఫారం సీ బిల్లు పుస్తకాలు, ప్రస్తుత నిల్వలను తనిఖీ చేస్తున్నారు. విత్తనాలు ఎమ్మార్పీకి మించి విక్రయించినా, నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టినా కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు విధిగా బిల్లులు తీసుకోవాలని, పంట దిగుబడి వచ్చేంతవరకు విత్తనాల బిల్లులు భద్రపర్చుకోవాలని సూచిస్తున్నారు. కమిటీలో పోలీసులు కూడా సభ్యులుగా ఉండడం, ఎస్పీ రోహిత్రాజ్ తరచుగా విత్తన, ఎరువుల వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేస్తుండడంతో నకిలీ విత్తనాలు విక్రయించే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని తెలుస్తోంది. జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి పంటల సాగులో రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. తద్వారా వారికి ఆర్థిక పరిపుష్టి లభి స్తుంది. ఈ దిశగా ఇప్పటికే రైతులకు అవగా హన కల్పించాం. నకిలీ విత్తనాలు, ఎరువుల నివారణకు టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. – వి బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి విత్తన కొనుగోళ్లలో అవగాహన ఉండాలి విత్తన కొనుగోళ్లలో రైతులకు అవగాహన అవసరం. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా రైతులతో విత్తన మేళాలు నిర్వహించి చైతన్య పరుస్తున్నాం. కేవీకే శాస్త్రవేత్తలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. – డాక్టర్ వి. లక్ష్మీనారాయణమ్మ, కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్కేవీకే ఆధ్వర్యంలో విత్తన మేళా.. విత్తనాల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కూడా రైతులకు దోహదపడింది. నాణ్యమైన విత్తనాలు ఎక్కడ లభి స్తాయి, ఎలాంటివి ఎంపిక చేసుకోవాలి తదితర అంశాలపై ఈ మేళాలో అవగాహన కల్పించారు. -
టమోత మోగుతోంది..
ఖమ్మంవ్యవసాయం/నేలకొండపల్లి: టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేక పోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. నెల క్రితం రైతు బజార్లలో కిలో రూ. 25కు లభించిన టమాటా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. ఖమ్మం హోల్సేల్ మార్కెట్కు నిత్యం 300 టన్నుల మేర టమాటాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి లేక వ్యాపారులు ఆర్డర్ చేసినా 100 టన్నులకు మించి రావడం లేదు. దీంతో కిలో ఒక్కింటికి రూ.65 నుంచి రూ.70 చొప్పున హోల్సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నట్లు చెబుతుండగా.. అది రిటైల్ వ్యాపారులు, రైతుబజార్లు, గ్రామాలకు చేరే సరికి రూ.80 మొదలు రూ.100కు చేరుతోంది. దిగుమతి.. ఎగుమతి ఖమ్మం పరిసర మండలాలేక కాక భద్రాద్రి జిల్లాలో సాగు చేసిన టమాటాను ఖమ్మం నగరంలోని హోల్సేల్ మార్కెట్లో, రైతుబజార్లలో విక్రయించేవారు. ఏప్రిల్ వరకు స్థానికంగా పంట లభ్యత ఉన్నా యాసంగి సాగు కాలం పూర్తికావడంతో ఆతర్వాత ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో హోల్సేల్ వ్యాపారులు టమాటాను ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే కాక కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో షేడ్నెట్ల కింద టమాటా సాగు చేస్తుండగా ఇక్కడి వ్యాపారులు తెప్పించి ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు టమాటా సరఫరా చేస్తున్నారు. స్థానికంగా పంట లేకపోవటంతో టమాటా ధరకు రెక్కలొచ్చినట్లు చెబుతున్నారు. జనవరిలో కేజీ రూ.20 పలికిన టమాటా ధర ఫిబ్రవరిలో కూడా అలాగే కొనసాగగా మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ.25, మే నెలలో రూ.30కి చేరింది. అనంతరం ఈనెల రెండో వారంలో రూ.50కి అంతకంతకు పెరుగుతూ ఇప్పుడు రూ.100కు చేరడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు వెనకడుగు వేస్తున్నాయి. రైతుబజార్లలో కిలో రూ.80కి చేరిన ధర బయటైతే రూ.100 పలుకుతున్న వైనం స్థానికంగా లభ్యత లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి -
అంగన్వాడీల్లోనూ యూనిఫామ్..
● జిల్లాలో మొదట 626 కేంద్రాల్లో అమలు ● జూలై మొదటి వారంలో పంపిణీకి ఏర్పాట్లు ● తొలివిడతలో 7,200 మంది చిన్నారులకు.. ● జిల్లాకు చేరిన నాలుగు రకాల వస్త్రాలు ● తయారీ బాధ్యత మహిళా సంఘాలకు భద్రాచలంఅర్బన్ : అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇకపై యూనిఫామ్ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే నాలుగు రకాల క్లాత్ జిల్లాకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో యూనిఫామ్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫామ్ అందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఒక జత ఇవ్వగా, త్వరలో రెండో జత ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకే ఇస్తుండగా.. ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు కూడా యూనిఫామ్ ఇవ్వనున్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు చదువుతుంటారు. జిల్లాలో మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, తొలుత స్కూళ్ల ప్రాంగణాల్లో ఉన్న 626 అంగన్వాడీల్లోని 7,200 మంది చిన్నారులకు యూనిఫామ్ అందించనున్నారు. మిగతావి రెండో దశలో అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రంగుల్లో క్లాత్.. చిన్నారుల యూనిఫామ్కు సంబంధించి ఇప్పటికే డిజైన్ ఫైనల్ చేశారు. ఎరుపు, యాష్ కలర్, నీలం, తెలుపు రంగుల్లో క్లాత్ ఉంటుంది. జిల్లాకు ఇప్పటికే 7,759 మీటర్ల వస్త్రం చేరుకోగా వీటిలో యాష్ ఫ్లోరల్ 5,385 మీటర్లు, బ్లూ రంగు క్లాత్ 1,394 మీటర్లు, తెలుపు వస్త్రం 980.4 మీటర్లు ఉన్నాయి. ఎరుపు రంగ వస్త్రం ఇంకా జిల్లాకు చేరుకోలేదు. మహిళా సంఘాలతో స్టిచింగ్.. యూనిఫామ్ తయారీ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకు అప్పగించగా డీఆర్డీఓ పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టే పనిలో మహిళా సంఘాలు బిజీగా ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీల పని కూడా దొరకడంతో మరింత బిజీ కానున్నాయి. కుట్టు కూలి కింద బాలికల యూనిఫామ్ జతకు రూ.60, బాలురకు రూ.80 చొప్పున చెల్లించనున్నారు. గతంలో ప్రైవేట్ టైలర్లకు అప్పగిస్తే అధిక సమయం తీసుకోవడంతో మహిళా సంఘాలకే పని కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బడులు, అంగన్వాడీలు ఎంతో అభివృద్ధి చెందాయి. ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్కారు బడుల్లో మంచి విద్య అందుతోంది. ఇక అంగన్వాడీ కేంద్రాలను సైతం బలోపేతం చేసేందుకు ఇప్పుడు యూనిఫామ్ సిస్టమ్ తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి యూనిఫామ్ పంపిణీ.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫామ్ కోసం జిల్లా కు నాలుగు రకాల క్లాత్ వచ్చింది. వీటిని మహిళా సంఘాల ద్వారా కుట్టించేందుకు చర్యలు చేపట్టాం. తొలుత ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నడుస్తున్న 626 అంగన్వాడీల్లో అమలు చేస్తాం. వచ్చే నెల నుంచి యూనిఫామ్ పంపిణీ చేస్తాం. అంగన్వాడీలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. – వేల్పుల విజేత, ఐసీడీఎస్ పీడీ -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కొత్తగూడెంటౌన్: యోగాతో మానవునికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రశాంత జీవనానికి మార్గం చూపుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు దిన చర్యలో యోగాను భాగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గొల్లపూడి భానుమతి, జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, న్యాయమూర్తులు కె.సాయిశ్రీ, వి.శివనాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి, న్యాయవాదులు మెండు రాజమల్లు, రాజేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలో..కొత్తగూడెంరూరల్: జిల్లా వైద్య కళాశాలలో యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ మాట్లాడుతూ.. యోగాతో అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. శ్వాసను నియంత్రించేందుకు ఉపకరిస్తుందని, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేసేలా చూస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ యోగా చేయడం అవసరమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు, రాజేకుమార్, ఎం వెంకటేశ్వర్లు, డాక్టర్ వనిత, డీపీఎం దుర్గ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్వసంత్ -
పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి పంచామృతాభిషేకం, పూజలు, చండీహోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామిని అర్చకులు ఊరేగేంపుగా తీసుకొచ్చారు. హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారితో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణానికి మణుగూరుకు చెందిన గుగులోతు హతీరామ్ – పద్మ దంపతులు రూ.5,116 విరాళం అందజేసినట్లు ఈఓ తెలిపారు. అదను చూసి విత్తనాలు వేయాలిజిల్లా వ్యవసాయ శాఖాధికారి బాబూరావు టేకులపల్లి : రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదను చూసి విత్తుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూ రావు అన్నారు. మండలంలోని తొమ్మిదోమైలు తండాలో శుక్రవారం ఆయన పర్యటించారు. అక్కడక్కడ మొలకెత్తిన పత్తి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ఇప్పుడే విత్తనాలు వేస్తే వర్షాలు లేక అవి మొలకెత్తవని, తద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని చెప్పారు. నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓలు శ్రావణి, విశాల ఉన్నారు. డ్రైవింగ్ టెస్ట్లో 829 మంది ఉత్తీర్ణతకొత్తగూడెంఅర్బన్(సింగరేణి): సింగరేణిలో ఖాళీగా ఉన్న 68 ఈపీ ఆపరేటర్(కేటగిరీ–4) పోస్టుల భర్తీకి ఈనెల 18 నుంచి శుక్రవారం వరకు సంస్థ వ్యాప్తంగా అధికారులు డ్రైవింగ్ పరీక్ష నిర్వహించారు. ఇందులో 1,706 మంది పాల్గొనగా 829 మంది ఉత్తీర్ణత సాధించారని జీఎం(పర్సనల్) బీ.ఆర్.దీక్షితులు తెలిపారు. వీరికి ఈనెల 30న కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించి సాధించే మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా నియామకాలు చేపడతామని వెల్లడించారు. -
ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. పలు శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆయన డీఆర్డీఓ విద్యాచందనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 697 పాఠశాలల ఆవరణ లేదా తరగతి గదిలో స్టీల్ ట్యాంక్ ఏర్పాటుచేసి దానికి సెడ్మెంట్ ఫిల్టర్ను అమర్చాలని సూచించారు. దీంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని, వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించవచ్చని అన్నారు. విద్యార్థులు భోజన సమయంలో చేతులు, భోజనానంతరం ప్లేట్లు కడుక్కునేందుకు వీలుగా స్టీల్ వాష్బేసిన్లు ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదుల్లో ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు బిగించాలని, వైరింగ్ మొత్తం కన్సిల్డ్ పద్ధతిలో చేయించాలని సూచించారు. మరుగుదొడ్లలో టైల్స్ కాకుండా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేయించి రెడాకై ్సడ్ వేయాలని అన్నారు. ప్రతీ పాఠశాల ఆవరణలో మునగ, చింత, కరివేపాకు, ఉసిరి, వెలక్కాయ వంటి ఎత్తయిన చెట్లు నాటాలని, పిల్లల అహ్లాదం కోసం మల్లె, మందార, కనకాంబరం, నందివర్ధనం, గులాబీ మొక్కలు పెంచాలని చెప్పారు. ఆరోగ్య రీత్యా తులసి, ఇన్సూలిన్ ప్లాంట్, రణపాల, నేల ఉసిరి, తిప్పతీగ మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఓ వెంకటేశ్వరాచారి, ఆర్అండ్బీ డీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ డీఈ రవికుమార్, మెప్మా పీడీ రాజేష్, సెర్ప్ డీపీఎం నాగజ్యోతి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. అథ్లెట్కు అభినందన.. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఈనెల 15 నుంచి 17 వరకు జరిగిన జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లాకు చెందిన తోలెం శ్రీతేజ హెప్టాత్లోన్ ఈవెంట్లో రాష్ట్రం తరఫున పాల్గొని 4,136 పాయింట్లతో జాతీయస్థాయిలో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ పాటిల్ శుక్రవారం శ్రీతేజను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. తాను కూడా అథ్లెటిక్స్లో ఢిల్లీలో సాధన చేశానని, 400 మీటర్ల పరుగుపందేన్ని 53 సెకనల్లో పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. అథ్లెటిక్స్లో బాగా సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీతేజకు అథ్లెటిక్స్ షూ అందజేయాలని జిల్లా క్రీడల అధికారి సంజీవరావును ఆదేశించారు. శ్రీతేజ కోచ్ పి.నాగేందర్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ను కూడా కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో క్రీడా కార్యాలయ సూపరింటెండెంట్ ఉదయ్కుమార్, తిరుమలరావు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
భూమాయపై ఆరా..!
● వివరాలు సేకరించిన రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అధికారులు ● ఫైల్ మాయం కాలేదని తహసీల్దార్ వెల్లడిఆ భూములు రద్దు చేశారు కేయూ గురుకులానికి సర్వే నంబర్లు 1228లో 50 ఎకరాలు కేటాయించిన మాట వాస్తవమే. దీనికి సంబంధించిన ఫైల్ మాయం కాలేదు. ఈ భూములు కేటాయించాక గురుకుల పాఠశాల ఏర్పాటు కాకపోవడంతో 2010లో నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ వి.ఉషారాణి భూకేటాయింపులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయా భూముల్లో ఉన్న ఆక్రమణదారుల వివరాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటాం. – కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ అశ్వారావుపేటరూరల్: కాకతీయ యూనివర్సిటీ గురుకుల పాఠశాలకు సంబంధించిన విలువైన భూములపై రెవెన్యూ శాఖ జిల్లా ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆరా తీశారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘పేట’లో భూమాయ శీర్షికన ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. దీంతో భూ ఆక్రమణదారుల్లో ఆందోళన మొదలైంది. అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని అల్లిగూడెం గ్రామ సమీపంలో సర్వే నంబర్ 1228/206, 1228/207ఏ ద్వారా గురుకుల పాఠశాలకు 50 ఎకరాలు కేటాయించగా, నాటి తహసీల్దార్ ప్రద్యుమ్నా రెడ్డి ఆధ్వర్యంలో 2008 జనవరి 6న పంచనామా చేసి, సరిహద్దులు నిర్ధారించారు. ఈ భూమిని కాకతీయ యూనివర్సిటీ అధికారులకు స్వాధీనం చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో గురుకులం ఏర్పాటు రద్దు కాగా, ఈ భూములను కొందరు ఆక్రమించారు. భూములకు సంబంధించిన కీలక ఫైల్ ఎట్టకేలకు బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ప్రభుత్వ భూముల వివరాలు కావాలని స.హ.చట్టం ద్వారా ఓ పౌరుడు దరఖాస్తు చేస్తే, స్థానిక రెవెన్యూ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆ ఉద్యోగి తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సదరు పౌరుడు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. భూ ఆక్రమణలపై అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైతం దృష్టి సారించారని ప్రచారం సాగుతోంది. -
ప్రవేశాల సంఖ్య పెంచాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి సులోచనారాణి సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు విద్యార్థులకు ఈఏపీ సెట్, నీట్లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని సక్రమంగా నిర్వహించాలని, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. -
‘పేట’లో భూమాయ!
● కబ్జాకు గురైన కేయూ గురుకుల భూములు ● సర్వే నంబర్ 1228లో 50 ఎకరాలు కేటాయింపు.. ● భూ వివరాలు తెలపాలని స.హ చట్టం ద్వారా ఓ పౌరుడి వినతి ● ప్రస్తుతం ఆ ఫైలే లేదంటూ అధికారుల సమాధానం అశ్వారావుపేటరూరల్: రెవెన్యూ శాఖలో జరిగే భూ మాయలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. ఆ శాఖలోని కొందరు ఇంటి దొంగలు భూ ఆక్రమణదారులతో చేతులు కలిపి విలువైన ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కాకతీయ యూనివర్సిటీ గురుకులానికి కేటాయించిన భూముల ఫైల్ మాయమైంది. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1228లో వేలాది ఎకరాల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో చాలావరకు కబ్జాకు గురి కాగా, ఆక్రమణదారులంతా దర్జాగా సాగు చేసుకుంటున్నారు. కాగా ఈ కబ్జా వ్యవహారానికి భూ రికార్డుల ప్రక్షాళనలో కూడా మోక్షం కలగలేదు. గురుకుల భూములు స్వాహా ! నియోజకవర్గాల విభజనకు ముందు అశ్వారావుపేట మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఉండేది. కాగా, నాటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్.. ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువు అందాలనే ఉద్దేశంతో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన గురుకుల పాఠశాలను అశ్వారావుపేట మండలానికి మంజూరు చేయించడంతో పాటు స్థలా కేటాయింపునకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. యూనివర్సీటీ నిబంధనల ప్రకారం గురుకులం ఏర్పాటుకు ఒకేచోట అనువైన స్థలం కేటాయించాల్సి ఉండడంతో అశ్వారావుపేట మండలం అల్లిగూడెం సమీపంలో సర్వే నంబర్ 1228లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఈ స్థలాన్ని పరిశీలించిన కేయూ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే ఆ తరుణంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగి, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విడిపోయి 2009లో అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. దీంతో రాజకీయ సమీకరణలు మారి గురుకులం ఏర్పాటు ప్రక్రియ మరుగున పడింది. ఇదే అదునుగా కొందరు రాజకీయ పెద్దలు, ప్రముఖులు ఈ భూమిపై కన్నేసి దొడ్డిదారిన హక్కు పత్రాలు పొందడం బహిరంగ రహస్యమే. గతంలో ఇక్కడ పని చేసిన తహసీలార్లు కూడా రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలు వచ్చాయి. పాఠశాలకు కేటాయించిన ఫైల్ను సైతం మాయం చేసి, అసలు గురుకుల భూముల వ్యవహారమే లేనట్లు చేయడం కొసమెరుపు. స. హ.చట్టంతో.. గురుకులం ఏర్పాటు వ్యవహారంపై అశ్వారావుపేటకు చెందిన ఒకరు ఈనెల 1న స.హ చట్టం కింద స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. 1228 సర్వే నంబర్లో గురుకులం ఏర్పాటుకు ఎన్ని ఎకరాలు కేటాయించారు.. ఈ భూమి సరిహద్దులు, విస్తీర్ణం బై నంబర్, ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉందనే వివరాలు తెలపాలని దరఖాస్తు ద్వారా కోరారు. అయితే గురుకులానికి సంబంధించిన ఫైలే తమ వద్ద లేదంటూ అధికారులు ఈనెల 12న ఆర్సీ నంబర్:బీ/343/2024 ద్వారా దరఖాస్తుదారుడికి సమాధానం ఇచ్చారు. కాగా, ఈ భూముల వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి పెడితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు.నా దృష్టికి రాలేదు గురుకుల పాఠశాలకు భూముల కేటాయింపుపై నాకు అవగాహన లేదు. పూర్తి వివరాలు తెలుసుకుంటా. త్వరలోనే దీనిపై సమగ్ర వివరాలు సేకరించి వెల్లడిస్తా. స.హ. చట్టం దరఖాస్తులు డీటీ పర్యవేక్షిస్తుంటారు. ఇది నా దృష్టికి రాలేదు. – కృష్ణ ప్రసాద్, అశ్వారావుపేట తహసీల్దార్ -
పెండింగ్లో అద్దె బిల్లులు
●పది నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు కిరాయి చెల్లించని వైనం ●ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ టీచర్లు కొత్తగూడెంటౌన్: పది నెలలుగా అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు పేరుకుపోయాయి. మరోవైపు కిరాయి చెల్లించాలంటూ టీచర్లపై ఓనర్లు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 782 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, మరో 493 కేంద్రాలు ఉచిత భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 10 నెలల అద్దె బకాయి.. జిల్లాలో 785 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్కు ఏరియాను బట్టి రూ.1000 నుంచి రూ. 4 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒకటి, రెండు లేదా మూడు గదులలో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కానీ కేంద్రాలకు పది నెలల నుంచి అద్దె చెల్లింకపోవడతో ఇంటి యజమానులతో ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. సమాధానం చెప్పలేక తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఒకటి, రెండు నెలలు అద్దెలు తమ వేతనాల నుంచి చెల్లిస్తున్నామని వాపోతున్నారు. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యంతోనే అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే చెల్లిస్తాం అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు దాదాపుగా తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వల్ల గతంలో రావాల్సిన బిల్లులు అలస్యమయ్యాయి. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. త్వరలోనే బకాయిలు చెల్లిస్తాం. –వేల్పుల విజేత, జిల్లా సంక్షేమశాఖ అధికారి -
కుళ్లిన గుడ్లు పంపిణీ
భద్రాచలం అర్బన్: పట్టణంలోని ముదిరాజ్ బజార్లో అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్లు వెలుగుచూశాయి. ఈ నెలలో లబ్ధిదారులకు గుడ్లు అందించగా, రెండు కుటుంబాలకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. దీంతో బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు గురువారం అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎమ్మార్పీఎస్ నాయకులు అంగన్వాడీ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ టీచర్, కాంట్రాక్టర్ కుమ్మకై ్క నాసిరకం గడ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెల్లం సమ్మక్క, కొంచర్ల కుమారి, గద్దల కృష్ణవేణి, కొప్పుల నాగమణి, ఎస్కే సల్మా, ఇల్లందుల హేమలత, చిప్పనపల్లి సమత తదితరులు పాల్గొన్నారు. కాగా కేంద్రంలోని గుడ్లను వెనక్కు తీసుకెళ్లాలని కాంట్రాక్టర్కు సూచించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ సావిత్రి తెలిపారు. ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో చర్ల వాసులు?చర్ల: చర్లకు చెందిన ఐదుగురు వ్యక్తులను గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల చర్లకు చెందిన ఓ యువకు డు మావోయిస్టులకు అవసరమైన సామగ్రి తీసుకెళ్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. అతడిని విచారించాక, పోలీసులు చర్లకు వచ్చి మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని బీజాపూర్ తరలించినట్లు తెలిసింది. అల్లుడిపై మామ కొడవలితో దాడిమణుగూరుటౌన్/మంగపేట: భార్యను తీసుకెళ్లేందుకు అత్తగారింటికి వచ్చిన అల్లుడిపై మామ కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం రామచంద్రునిపేటలో గురువారం జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన నాంపెల్లి విజయ్ పినపాక మండలం బయ్యారంలో రెస్టారెంట్ నడుపుతున్నాడు. నెల రోజుల క్రితం విజయ్తో భార్య గొడవపడి తన పుట్టినిల్లు అయిన మంగపేట మండలం రామచంద్రునిపేటకు వచ్చింది. ఈ క్రమంలో విజయ్ గురువారం భార్యను తీసుకెళ్లేందుకు తన తల్లితో కలిసి కారులో వచ్చారు. ఈ క్రమంలో మామఅల్లుడు వెంకన్న, విజయ్లు గొడవపడ్డారు. అల్లుడి విజయ్పై మామ వెంకన్న కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విజయ్ను చికిత్స నిమిత్తం మణుగూరుకు, అక్కడి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. డీర్ పార్కులో మూషిక జింక మృతిపాల్వంచరూరల్: డీర్ పార్కులో పెరుగుతున్న మూషిక జింక మృతిచెందిన విషయం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. మండల పరిధిలోని కిన్నెరసాని డీర్ పార్కులో ప్రత్యేక షెడ్ నిర్మించి, ఆరేళ్లుగా ఐదు మూషిక జింకలను పెంచుతున్నారు. ఈ నెల 7న ఒక మూషిక జింక మృతి చెందగా, వెటర్నరీ వైద్యుడితో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక జింక మృతికి కారణం తెలుస్తుందని రేంజర్ శ్రీనివాసరావు తెలిపారు. విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతిగుండాల: మేతకు వెళ్లిన రెండు గేదెలు విద్యుదాఘాతంలో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేకుంది. ఆళ్లపల్లి మండలం అనంతోగు పంచాయతీ తిర్లాపురం గ్రామానికి చెందిన పడిగె సుశీల, పూసం పద్మలకు చెందిన పాడి గేదెలు బుధవారం మేతకు వెళ్లాయి. కాగా గురువారం సాయంత్రానికి కూడా రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. గురువారం తెల్లవారు జామున గ్రామ సమీపంలో కరెంటు తీగలు తెగిపడి ఉండడంతో ఆ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గుర్తించారు. రైతులకు సుమారు రూ. రెండు లక్షల నష్టం జరిగిందని, వారిని ఆదుకోవాలని ఆళ్లపల్లి వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. -
వ్యవసాయ భూమి ఆక్రమణ
అశ్వారావుపేటరూరల్: ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా రేకుల షెడ్డు వేసిన ఘటన గురువారం జరిగింది. బాధిత రైతు కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన రైతు బత్తుల తిరుమలేష్కు ఆసుపాక రెవెన్యూ మౌజా సర్వే నంబర్లు 281/అ విస్తీరణం 21 కుంటలు, సర్వే నంబరు 288/అ విస్తీరణం 1.03 కుంటలు.. మొత్తం 1.24 కుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇది అతని పూర్వీకుల నుంచి వచ్చింది. ఇందుకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, ధరణి డిజిటల్ పట్టాదారు పాసుబుక్ సైతం పొందాడు. ఈ భూములు వినాయకపురం గ్రామంలోని ప్రధాన సెంటర్కు సమీపంలో, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నాయి. అయితే భూములతో సంబంధం లేని అదే గ్రామానికి చెందిన నల్లపు నరసింహారావు, నల్లపు లక్ష్మీపతి, చిట్రోతు శ్రీనివాసరావు, చిట్రోతు సీతారాంబాబు, చిట్రోతు సత్యలక్ష్మీ, చిట్రోతు రాణి, బరపాటి రంగారావు అనే వ్యక్తులు కలిసి తన భూమిలోకి అక్రమంగా వచ్చి రేకుల షెడ్డు వేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలను అలంకరించారు. ఆ తర్వాత అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన జెడ్పీ చైర్మన్చుంచుపల్లి: నూతనంగా జిల్లాకు బదిలీపై వచ్చిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్ను జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు గురువారం ఐడీఓసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి సత్వర పరిష్కారం చూపాలని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కలెక్టర్ను కోరారు. ప్రజాప్రతినిధులుగా తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా భాస్కర్ బాధ్యతలు కొత్తగూడెంరూరల్: ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా ఎల్.భాస్కర్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అధికారులు విధుల్లో సమయపాలన పాటించాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని అన్నారు. ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు మధు, వరుణ్, రాకేష్, ఆర్. చైతన్య డిప్యూటీ డీఎంహెచ్ఓ ఫైజ్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పీహెచ్సీ పరిధిలోని పెద్ద తండాలో జాతీయ నులిపురుగల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 1 నుంచి 19 సంవత్సరాల వారికి విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయించాలని, అప్పుడే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. జిల్లాలో గురువారం మాత్రలు వేసుకోని వారు ఈనెల 27న తీసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ సోనా, డాక్టర్ స్వప్న, ఈఓ రాంప్రసాద్ పాల్గొన్నారు.