తెగిపడిన విద్యుత్ వైర్లు
కొత్తగూడెంఅర్బన్(పాల్వంచ): భద్రాచలం ప్రధాన రహదారిపై లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం వైపు వెళుతున్న సున్నం లోడ్ లారీ స్టీరింగ్ స్ట్రక్ అవడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో విద్యుతత్ స్తంభాన్ని ఢీకొట్టి ఫుట్పాత్పై ఎక్కింది. ఈ క్రమంలో విద్యుత్ ధ్వంసమై వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో విద్యుత్ శాఖకు సుమారు రూ.70 వేల నష్టం వాటిల్లిందని సిబ్బంది తెలిపారు. కాగా లారీ సైతం ఽకట్టర్లు విరిగి ధ్వంసమైంది. ఎన్పీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ వైర్ల మరమ్మతులు చేపట్టారు.
విద్యుదాఘాతంతో రెండు ఆవులు మృతి
అన్నపురెడ్డిపల్లి: విద్యుదాఘాతంతో శుక్రవారం రెండు ఆవులు మృతి చెందాయి. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్లోజి కృష్ణయ్యకు చెందిన ఆవులు మేతకు వెళ్లాయి. ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న నీటి కుంట వద్ద ఆవులు నీరు తాగుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 80 వేల నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment