-
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
బొగ్గు గనుల కేటాయింపు..అవసరమైతే ప్రధానితో భేటీ అవుతాం : భట్టి
సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (A) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కబొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పాల్గొన్న భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి.రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడనున్నాయి.ఇలా 2032 నాటికి ఐదు భూ గర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు,2037-38 నాటికి మరో 5 గనులు మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము అని అన్నారు.సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు,మరో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ విషయాలు వివరించా. కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచెర్ల బ్లాక్-2కు అవునుమతి ఇవ్వాలని కోరాను.ఇప్పుడు కిషన్ రెడ్డిని కోరుతున్నాం. సింగరేణి సంస్థ బతకాలన్న, అందులో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కొత్త గనులు కేటాయించడం అవసరం ఉందన్నారు.గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్న భట్టి విక్రమార్క.. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుందని తెలిపారు. -
పోచారం ఇంట్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ పోచారం ఇంటికెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. 12 మంది నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంట్లోకి బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు హంగామా సృష్టించారు.తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు.పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సింగరేణి వివాదం.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు.‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్రెడ్డి తెలిపారు. -
వరుస ఘటనలే నిదర్శనం.. కాంగ్రెస్, బీజేపీపై జగదీష్రెడ్డి విమర్శనాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ. ఏ సందర్బం వచ్చిన తెలంగాణ హక్కులను పరిరక్షించేది కేసీఆరే. తెలంగాణ హక్కుల్ని కాంగ్రెస్ ధారాదత్తం చేస్తోంది. వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా ప్రవర్తించింది. కేసీఆర్పై ఎదురు దాడి చేసి తప్పించుకుందామనుకుంటుంది కాంగ్రెస్. సింగరేణి బొగ్గు గనుల విషయంలో కూడా ప్రత్యక్ష కార్యాచరణ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బొగ్గు గనుల వేలంపై రేవంత్ రెడ్డి మాట మార్చారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎదురు దాడి మొదలు పెట్టారు.’’ అంటూ జగదీష్రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ ఉన్నప్పుడే సింగరేణి అమ్మారంటూ భట్టి విక్రమార్క చెప్తున్నారు. అబద్ధపు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు. దేనికో లొంగిపోయి బీజేపీ, కాంగ్రెస్లు కలిసిపోయాయి. బహిరంగంగా ఫొటోలు దిగి పెడుతున్నారు కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వెనక కలిసి, ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు.’’ అని జగదీష్రెడ్డి దుయ్యబట్టారు. -
పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్పై చర్యలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ఉండగానే బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.కాగా, ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. -
కాంగ్రెస్లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ: దానం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆ ఎస్ను ముంచాయని మండిపడ్డారు. ఈ మేరకు గాంధీభవన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడాఉంటుందని తెలిపారు.మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు దానం నాగేందర్. చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, కేటీఆర్లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని జోస్యం చెప్పారు. అయితే హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని విమర్శించారు.కాగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు విషయం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లడమే కారణం. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. -
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లోకి పోచారం.. ఇంటి వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన కాంగ్రెస్ పార్టీ చేరారు.కాగా, తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం, రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం ఓకే చెప్పారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు పోచారం అండగా నిలిచారు. పోచారం సలహాతో రైతులకు మేలు జరుగుతుందని ఆయనను కలిశాను. మాను అండగా నిలవాలని కోరాము. పార్టీలో శ్రీనివాస రెడ్డికి తగిన గౌరవం ఇస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని కామెంట్స్ చేశారు.మాజీ స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ‘రైతుల కష్టాల తీరాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. కొత్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రైతులకు మద్దతుగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్ రెడ్డి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను. నేను ఆశించే పదవులు ఏమీ లేవు. ఆరు నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోంది. నా రాజకీయ జీవితం కాంగ్రెస్లోనే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తాను’ అని అన్నారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
తమిళనాట కల్తీ మద్యం కాటు.. తెలంగాణ సర్కార్పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తెలంగాణకు చౌకైన మద్యం బ్రాండ్లను తెస్తున్నారు. రాష్ట్రంలో తమిళనాడు కల్తీ సారా ఘటనలు రాకూడదు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. Let’s make sure this doesn’t happen in Telangana Hope the Congress Govt is taking note and will not introduce cheap brands and risk the lives of people https://t.co/Qbx4edURQB— KTR (@KTRBRS) June 21, 2024 -
సింగరేణిని ముంచే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కంపెనీపై కేంద్ర ప్రభుత్వం కత్తిపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కత్తికి సాన పట్టినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాఖ్యానించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లపాటు చేసిన కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై చేస్తున్న కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లమన్నారు. వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని సీఎంగా కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని, నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి స్పందిస్తూ వేలం లేకుండా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోల్ బ్లాక్ల వేలానికి మద్దతు తెలుపుతోందని, దీనికి కేసుల భయమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేసేందుకే... ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, గుజరాత్లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015లో ఐదు కోల్ బ్లాక్లను కేటాయించిందని, అదేవిధంగా తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే... ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదని ప్రశ్నించారు.ఈ ప్రక్రియలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే వేలం కార్యక్రమం ముందుకు పెట్టారని, ఈ వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.నాడు అంధకారంలోకి దక్షిణాదిసింగరేణి కారి్మకుల సత్తా ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశామని, అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచి్చందని కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు రావాలని, కానీ మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారని వాఖ్యానించారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించే ప్రయత్నాలను సాగనివ్వమని, 2028లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ వేలం దక్కించుకున్న కంపెనీలను సహించబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలంపై రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని బీఆర్ఎస్ బొంద పెట్టింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.అయితే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.అనుచరులకు దక్కేలా...2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.సింగరేణికే కేటాయించాలి: తుమ్మలవేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 సీట్లలో గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 సీట్లలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీభాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 36 శాతం ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల తరఫున పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కార్యకర్తలకు శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నానన్నారు. గురువారం రాత్రి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు యాదవ్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం, కృతజ్ఞతా సభను నిర్వహించారు. అంతకు ముందు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు నగరంలోని ప్రధాన వీధుల మీదుగా దాదాపు మూడు గంటల పాటు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సన్మాన సభలో కిషన్రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేయాలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భగ భగమండిన ఎండల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి, అంకితభావంతో విజయం కోసం కృషి చేశారంటూ కిషన్రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ జెండా చేతబూని, గ్రామగ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో పనిచేస్తాం: కె.లక్ష్మణ్ తొలుత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..పలువురు నేతల త్యాగాల పునాదులపై పార్టీ నిలబడిందని చెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరం సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా పార్టీ కోసం ›ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు నిజమైన నివాళి అందిస్తామని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఘనంగా సన్మానం పార్టీ కార్యాలయంలో పండిట్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. తొలుత కె.లక్ష్మణ్ను కిషన్రెడ్డి, ఆ తర్వాత కిషన్రెడ్డిని లక్ష్మణ్ సన్మానించారు. అనంతరం బండి సంజయ్ను కిషన్రెడ్డి సత్కరించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కిషన్రెడ్డి, సంజయ్లు కలిసి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పైడి రాకేష్రెడ్డి, పాల్వాయి హరీ‹Ùబాబు, కాటిపల్లి వెంకట రమణారెడ్డిలను సత్కరించారు. అమ్మవారి దయవల్లే గెలుపు: బండిగురువారం రాత్రి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కిషన్రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ చ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్ అని, అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని అన్నారు. ఈ రోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టం మరువలేనిదన్నారు. కార్యకర్తలతో పాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. ఒకప్పటి సామాన్య కార్యకర్తలు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉండటం ఒక్క బీజేపీలోనే సాధ్యమని సంజయ్ అన్నారు. -
అధికారంలో ఉన్నా.. ఆశ తీరలేదేం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను కనీసం 11–12 చోట్ల గెలుస్తామని.. పరిస్థితి సానుకూలంగా ఉంటే 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. తక్కువలో తక్కువగా 10 స్థానాలైనా గెలుస్తామని భావించింది. కానీ ఫలితాలు గతం కంటే మెరుగే అయినా.. 8 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది. అదే సమయంలో బీజేపీ కూడా ఇదే సంఖ్యలో సీట్లు సాధించింది. దీంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశమున్నా ఎందుకిలా జరిగిందని అధిష్టానం పోస్టుమార్టం ప్రారంభించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు రాజ్యసభ మాజీ చైర్మన్ కురియన్, అసోం ఎంపీ రకీబుల్ హసన్, పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్లతో కమిటీని ఏర్పాటు చేసింది. నిజానికి లోక్సభ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి నివేదిక వెళ్లింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా తన నివేదికను అందించారు. కాంగ్రెస్ అధిష్టానం వాటిని కాదని కమిటీని ఏర్పాటు చేయడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏం చేస్తారు.. ఎక్కడికి వెళ్తారు?ఇటీవలి లోక్సభ ఎన్నికల పనితీరుపై సమీక్షతోపాటు వచ్చే లోక్సభ ఎన్నికల కోసం రూపొందించే కార్యాచరణ కోసమే కొత్తగా త్రిసభ్య కమిటీని నియమించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఆ కమిటీ త్వరలోనే తెలంగాణకు వచ్చి పని ప్రారంభిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీ మూడు అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని అంటున్నారు. ‘అధికారం, అన్ని వనరులు ఉండి కూడా బీజేపీతో అంత గట్టిగా ఎందుకు పోటీపడాల్సి వచ్చింది? తూర్పు, దక్షిణ తెలంగాణల్లో పట్టు నిలుపుకొన్న పార్టీ.. పశ్చిమ, ఉత్తర తెలంగాణల్లో ఎందుకు నిలబడలేకపోయింది? పార్టీ నాయకులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారా లేదా?’ అన్న కోణాల్లో పోస్టుమార్టం జరుగుతుందని నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా తక్కువ తేడాతో ఓడిపోయిన మెదక్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ ఎంపీ స్థానాల విషయంలో ఏం జరిగిందనేది తేల్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈ మూడు చోట్ల గట్టెక్కేవాళ్లమని పేర్కొంటున్నారు. ఈ స్థానాలు దక్కించుకోలేక పోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమనే అంశంపై.. పార్టీ ముఖ్య నేతలతోపాటు ఆయా చోట్ల పోటీచేసి ఓడిన అభ్యర్థులతోనూ మాట్లాడనున్నట్టు తెలిసింది. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఏ మేరకు ఉపయోగపడిందనే కోణంలోనూ త్రిసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుందని సమాచారం. అన్ని విషయాల్లో ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఈ కమిటీ హైకమాండ్కు నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా టీపీసీసీ ప్రక్షాళన జరుగుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని నేతలు అంటున్నారు.22న ‘నామినేటెడ్’ ఉత్తర్వులు?లోక్సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 22వ తేదీన వచ్చే అవకాశముందని తెలిసింది. వాటితోపాటు మరో 17 పోస్టులను కలిపి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావించినా.. ఈ 17 పోస్టులకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాలేదని సమాచారం. వీలునుబట్టి మొత్తం పోస్టులకు, లేదా ఇప్పటికే ప్రకటించిన 37 పోస్టులకు ఉత్తర్వులు వస్తాయని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, లోక్సభ ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగా నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరిగినా.. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య నామినేటెడ్ పందేరంలో తలెత్తిన విభేదాల కారణంగానే జాప్యం జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడా ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య నెలకొందని, నామినేటెడ్ ఉత్తర్వులకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి. -
బొగ్గు గనుల వేలం ప్రకటనను వెంటనే ఆపేయాలి: భట్టి
సాక్షి, ఖమ్మం: బొగ్గు గనుల ప్రైవేట్ పరంపై బీజేపీ బిల్ పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేసి మద్దతు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బిల్కు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు బావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకుని వచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు.బొగ్గు బావులు వేలంలో పక్క వాళ్లకు వెళ్లకుండా అడ్డుకోలేకపోయిన బీఆర్ఎస్.. గోదావరి లోయలోని బొగ్గుగనులు తీసుకోవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.. తమ అనుచర కాంట్రాక్టర్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ వల్లనే రెండు బొగ్గు గనుల ప్రభుత్వానికి రాకుండా పోయాయి’’ అని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.తెలంగాణ మీద ప్రేమ వున్నట్లు గా మాట్లాడుతున్న బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి.. శ్రావణపల్లి బొగ్గు వేలం కాకుండా చూడాలి.. తెలంగాణ ఆస్తులను కాపాడాలి. అన్ని పార్టీల తో కలసి ప్రధాన మంత్రి వద్దకు వెళ్తాం. తెలంగాణను పదేళ్లు నాశనం చేసిన బీఆర్ఎస్ ఇంకా అలానే వ్యవహరించాలని చూస్తుంది. సింగరేణి వేలంపై కేసీఆర్, కేటీఆర్లతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. -
ED Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
Updates..👉 నిజాంపేటలో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే అల్లుడి చంద్రశేఖర్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో మూడు కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే, పలు ఆస్తులను సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.👉ఇక, అంతకుముందు గడువు పూర్తైనా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో క్వారీలను అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.👉తెలంగాణలో మరోసారి ఈడీ సోదాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో, తీవ్ర కలకలం చోటుచేసుకుంది. 👉కాగా, ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షతోనే తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని బండి సంజయ్ అన్నారు. ‘‘కార్యకర్తలారా..ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు తిన్నరు.. కేసులు ఎదుర్కొన్నారు..జైళ్లకు వెళ్లారు..రక్తం చిందించారు... ప్రజాసంగ్రామయాత్రలో నాతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలు లెక్క చేయకుండా 155 రోజులు 1600 కిలోమీటర్లకుపైగా నడిచారు.పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారు..అందుకే ఈరోజు నాకీ పదవి వచ్చింది..ఈ పదవి మీరు పెట్టిన భిక్షే.. ప్రజలు, కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నా’’అని సంజయ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి అయ్యాక బుధవారం తొలిసారి కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే ఇది కేవలం బీజేపీవల్లే సాధ్యమైందని, మహాశక్తి అమ్మవారి ఆశీస్సులు అండగా ఉన్నాయన్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై ప్రయోగించిన లాఠీదెబ్బలతోపాటు జైలుకు పంపడం ద్వారా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. కేంద్ర మంత్రి పదవిని తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. రాజన్నకు కోడె మొక్కు చెల్లింపు వేములవాడ: ‘ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నేనేంటో చూపిస్తా’ అని బండి సంజయ్కుమార్ అన్నారు. దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్ సర్కార్దేనని విమర్శించారు. ‘సెల్యూట్ తెలంగాణ’ పేరిట కేంద్ర మంత్రులు, ఎంపీలకు నేడు సన్మానం సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురువా రం కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లతోపాటు పార్టీ ఎంపీలకు సన్మానం చేయనున్నారు. కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కిషన్రెడ్డి తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సా యంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలను ర్యాలీగా పార్టీ కార్యాలయం వరకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీని సత్కరిస్తారు. అనంతరం లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సభను నిర్వహిస్తారు. తర్వాత చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించే ‘మహా హారతి’కార్యక్రమంలో వీరంతా పాల్గొంటారు. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
సాక్షి, నూఢిల్లీ: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ పెత్తనమేదీ ఉండదని తెలిపారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. బుధవారం కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదు. అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విష ప్రచారం. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుంది. 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానిది ఏమీ ఉండదు. దేశంలో 12 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) ఉన్నాయి. దేనినైనా ప్రైవేట్ పరం చేశామా? అలాంటిది సింగరేణిని ఎలా చేస్తాం? ఎలాంటి పక్షపాతం వహించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ మేరకే నడుచుకుంటాం. సింగరేణిలో జరిగే అవినీతిని బోర్డు మీటింగుల్లో లేవనెత్తుతాం. దేశంలో బొగ్గు మాఫియా చాలా పెద్దది. ప్రధాని మోదీ వచ్చాక మాఫియా ఆగడాలు, అవినీతి తగ్గాయి. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబులిటీ కాదు. అక్కడ లభించే ఇనుప ఖనిజంలో పరిశ్రమలకు సరిపడే నాణ్యత లేదు. ఫీజిబులిటీ లేకే ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, ఆలి్వన్, హెచ్ఎంటీ బేరింగ్స్ వంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడ్డాయి. తెలిసి కూడా మరో ఫ్యాక్టరీ ఎలా పెడతాం? ఇది కోపంతోనో, రాజకీయ ప్రయోజనాల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం లేదంటూ అప్పటి సీఎం కేసీఆర్ ఆరోపించారు. బయ్యారంలో దొరికే ఖనిజాన్ని ఇంకే అవసరాలకు ఉపయోగించుకోవచ్చనే దానిపై అధికారులతో చర్చిస్తా. గనుల వేలంలో పాల్గొనక రాష్ట్రానికి నష్టం గనులు జాతీయ సంపద. అవి ప్రజలకే చెందాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పార్లమెంటులో చట్టం చేశారు. ఈ క్రమంలో గనుల వేలం పారదర్శకంగా జరుగుతోంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదు. దాంతో రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరిగింది. అది ఎంతనే వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి కొందరు రాష్ట్ర పోలీసులు తప్పు చేశారు. జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలు కూడా తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారు. వారి మీద రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తే ఎలా? న్యాయం జరగదు. సీబీఐ లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. ఇలాంటి అంశాలపై సమాజంలోని వ్యక్తులు పిటిషన్లు వేయాలి. పార్టీపరంగా మేం వేయం. నయీం ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? ఏమున్నాయి? చట్టపరంగా ఎంత వసూలు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలి. ఇక మేడిగడ్డ, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఈ రెండు అంశాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. కాళేశ్వరంపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగదు. ఈ విషయం ఇంకా పెండింగ్లోనే ఉందని, రాద్ధాంతం చేయవద్దని గతంలోనే చెప్పాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభ్యర్థన మేరకు మరో రూ.3 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలన్న డిమాండ్పై ఇంకా అధికారికంగా రివ్యూ చేయలేదు. దీనిపై అధికారులతో చర్చిస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని బొగ్గు గనులు కొనుక్కోవచ్చు. పోలవరం మాది. అంటే కేంద్రానిది. దానిని పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయిస్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ నిర్ణయం. మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్ష పదవికే ఎక్కువ ప్రాధాన్యం. మంత్రివర్గంలో ఉన్న వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు. యోగ్యత ఉన్నవారు ఎవరైనా మంత్రివర్గంలో ఉంటే.. రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు. శివరాజ్ సింగ్కు ఇవ్వాలనుకుంటే రాజీనామా చేయిస్తారు. అందులో ఇష్యూ ఏమీ లేదు. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తాత్కాలికంగానే ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులయ్యారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న వేళ నేను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నాను. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అక్కడి పరిస్థితులపై పనిచేశా. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారని అనుకుంటున్నా. -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: హరీశ్రావు
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. .. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. .. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భట్టి కౌంటర్హరీష్రావు చేసిన ట్వీట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘‘గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా?. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది’’ అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి భట్టి.. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. -
ఇరకాటంలో కేసీఆర్.. భ్రమలో తెలంగాణ సర్కార్?!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై రెండు విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం,మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకు అయినా తొమ్మిదినర్రేళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష ధోరణి కావచ్చు..కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్ లను నియమిస్తుంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్ లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండుపాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకుని ఉండవచ్చు.ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్ కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది.విశేషం ఏమిటంటే.. విద్యుత్ విషయంలోకాని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాని ఆ రోజుల్లో కేసీఆర్ కు విశేషమైన పేరు వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంట్ కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కాని ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైమ్ లో కొత్తగా భద్రాద్రి,యాద్రాద్రి పేర్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అబినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా,వేగంగా పూర్తి చేయించిన తీరు అందరిని ఆబ్బురపరచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయక పోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని, సాగు నీటి సమస్య తీర్చాలన్న కీర్తి కాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పధకం నిర్వహణకు బాగా వ్యయం అవుతుందని అంచనా వేసినా, రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరగడంతో కేసీఆర్ కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీల తీవ్రమైన విమర్శలు కురిపించేవి. ఎన్నికలలో ఓటమితో అవన్ని కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే.. ఏదో కిందా,మీద పడి దానిని హాండిల్ చేసి ఉండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒకరకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది.దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా రెండు కమిషన్ లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా, జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా పన్నెండు పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అబిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని,నిరసనను తెలియచేశారు.తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు.దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జె సి షా అనే . జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ ను వేసింది. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పు పట్టినా, దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు. షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరా గాంధీ, సంజయ్ గాందీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు కాని ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్దపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తున్నదా?లేక పరిశోధన చేస్తున్నదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్ కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనత ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం,ఆమెను అరెస్టు చేయడం,కోర్టు వదలిపెట్టడం వంటి పరిణామాలు, మధ్యలో ఒక రోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి. ఈలోగా మొరార్జీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిర సాయంతోనే ప్రధాని కావడం,ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి తిరిగి ఆమె ప్రభుత్వపగ్గాలు అందుకున్నారు. దాంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప ,రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు.ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఎపిలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆద్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978 లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కు సంబంధించి ఒక కమిషన్ ను నియమించింది. వెంగళరావు టైమ్ లో నక్సల్స్ పై జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను నియమించింది.కొంతకాలం విచారణ జరిగినా, ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు.కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణల నిగ్గు తేల్చడానికి కమిషన్ లను ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టిడిపి చేసిన ఆరోపణలకు సంబందించి విచారణ సంఘాన్ని నియమించారు.దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజుతన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ది సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ ను నియమించారు.దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరుకావల్సి వచ్చింది.పాతబస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అబియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్ లు వేశారు.ఏలేరు భూ పరిహార స్కామ్ పై ఆయన కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబందించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు . దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం.కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టనివారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.అదే టైమ్ లో వర్తమాన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్ గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫారస్ లు చేస్తుంది.దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం అవుతుంది. తాను చత్తీస్గడ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి,యాదాద్రి లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న.ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99 శాతం ప్రాజెక్టులు ఏవీ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దాని వల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటివాటివల్ల పవర్ ప్లాంట్ లు జాప్యం అయితే తామేమీ చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
విద్యుత్ కమిషన్ విచారణ పారదర్శకంగా జరగడం లేదు: జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్పై మాజీ మంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు.. ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసీఆర్ లేఖ రూపంలో చెప్పారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుంది. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి’’ అని జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. బండి సంజయ్కు కనీస పరిజ్ఞానం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఐదేళ్ల నుంచి చెబుతున్నాం’’ అని జగదీష్రెడ్డి అన్నారు. -
భద్రాద్రి పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కష్టమే: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ జన సమతి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు. కేంద్రం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలుపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు అందజేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.అనంతరం, కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది. విద్యుత్ శాఖను రూ.80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు చేసుకున్నారు.వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గఢ్తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకుంది. ఒప్పందం రద్దు కారణంగా ప్రభుత్వంపై రూ.250కోట్ల అదనపు భారం పడింది. విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధం. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు విద్యుత్ శాఖ అధికారి రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కమిషన్ ముందు పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒప్పందం ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్కు ఎందుకు వెళ్లారనే సమాచారం ఇచ్చాం. ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఈ ఒప్పందం వల్ల రూ.2600 కోట్ల నష్టం జరిగింది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే సప్లై చేయలేదు. అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారు. తర్వాత తప్పు తెలుసుకుని రద్దు చేసుకోవాలనుకుంటే కుదరలేదు.ఇరు రాష్ట్రాల డిస్కంల ఒప్పందాల ద్వారా ఎంఓయూ చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారు. 2010లో తయారు చేసుకున్న పలు యంత్రాలను టెక్నాలజీని బీహెచ్ఈఎల్.. ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావు అని మా అభిప్రాయం. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు.. సరైన లొకేషన్ కూడా కాదు.యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుంది. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారు. కాంపిటేటివ్ బిడ్డింగ్లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేళ్లుగా చెయ్యలేదు. ఈ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. రూ.635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో తొమ్మిది వేలు, యాదాద్రి రవాణా వల్ల రూ.1600 కోట్లకు పైగా నష్టం జరుగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
20న కిషన్రెడ్డి, బండి సంజయ్కి సన్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.ఈ భేటీకి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్కుమార్ 19న నగరానికి చేరుకుని కరీంనగర్కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. సన్మాన కార్యక్రమం ఇలా... గురువారం (20న) సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు కేంద్రమంత్రులు, ఎంపీలను ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీకి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (యూపీ నుంచి ప్రాతినిధ్యం)ను ఘనంగా సన్మానించనున్నారు. బేగంపేట నుంచి ఓపెన్టాప్ జీప్లలో వారిని కార్యాలయం వరకు వాహనాల కాన్వాయ్లో మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. మోదీకి ధన్యవాద సభ ఇక రాష్ఠ్రం నుంచి ఎనిమది మంది ఎంపీలను గెలుచుకోవడం పట్ల.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద సభ నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల తర్వాత పార్టీ జాతీయనేతల ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పెద్దఎత్తున మోదీ ధన్యవాద సభ’నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారు ల, రాష్ట్ర కార్యదర్శుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఎంపీలకు స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. 21న అన్ని మండలాల్లో యోగా డే కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సెల్యూట్ తెలంగాణ’ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) రాష్ట్రంలో 88 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కాసం తెలియజేశారు. -
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. -
కాళ్ల మీద పడినా కనికరించడం లేదు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రజా దర్బార్లో కాంగ్రెస్ నేతల కాళ్ల మీద పడుతున్నా కనికరించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పుతోందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో సోమవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు కొత్త హామీలు కోరుకోవడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ముందు తాము పెడుతున్న ఐదు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి మరో ఐదు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. టీజీపీఎస్సీతో పాటు డీఎస్సీ పరీక్షలకు నడుమ కనీసం రెండు నెలల వ్యవధి ఉండేలా చూడాలన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామనే హామీ నిలబెట్టుకోవాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘నీట్’పై కేంద్ర మంత్రులు స్పందించాలి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, నీట్ పరీక్ష విధానం, గ్రేస్ మార్కులు ఇవ్వడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని హరీశ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను.. పార్టీ మారను తాను పార్టీ మారుతున్నట్లు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. వ్యూస్ పెంచుకునేందుకు ఒక నాయకుడి నిబద్ధత, నిజాయతీ దెబ్బతీయొద్దు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను, పార్టీలోనే కొనసాగుతాను. ఇలాంటి వార్తలు మానుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తా అని హరీశ్రావు హెచ్చరించారు.