-
రైతన్న మురిసె..
● రుణమాఫీతో అన్నదాతల్లో ఆనందం ● ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.2000 కోట్లకుపైగా అవసరం ● గతేడాది డిసెంబరు 9లోపు తీసుకున్న వారికే! ● మార్గదర్శకాలు వస్తేనే అమలుపై మరింత స్పష్టత ● ప్రభుత్వం వద్ద ఇప్పటికే లబ్ధిదారుల వివరాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రంలోని రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీపి కబురు తీసుకొచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం కేబినెట్లో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీ మధ్య ఐదేళ్లకాలంలో తీసుకున్న రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏకకాలంలో రుణమాఫీని అమలు చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణాల మాఫీకి దాదాపుగా రూ.31వేల కోట్లకుపైగా నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు ఎంతలేదన్నా రూ.2000 కోట్లకుపై నిధులు అవసరం అవుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలో అధికశాతం చిన్న కమతాలను (ఒకటి, రెండు ఎకరాలు) సాగు చేసే రైతులే ఉన్నారు. వీరిలో పంటల ఆధారంగా ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. చిన్న కమతాలను సాగుచేసే రైతులు దాదాపు 3.5 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరందరూ తమ సామర్థ్యం మేరకు రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారే. మిగిలిన వారిలో ఐదు, పది ఎకరాలకు మించి సాగుచేసే వారిలో కొందరు రూ.2 లక్షల వరకు పంటరుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దరిమిలా.. ఇప్పుడు అధికారులు ఏ జిల్లాలో ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు? అన్న లెక్కలు తీస్తున్నారు. ఇందుకోసం లీడ్ బ్యాంక్ మేనేజర్లు ఇప్పటికే నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారని సమాచారం. మార్గదర్శకాల అనంతరం లబ్ధిదారుల విషయంలో స్పష్టత రానుంది. మార్గదర్శకాలు వస్తేనే.. స్పష్టత.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఒకసారి మార్గదర్శకాలు వస్తే రుణమాఫీ చేసే విధానంపై అందరికీ స్పష్టత వస్తుంది. రైతు భరోసాకు విధించిన తరహాలోనే రైతు రుణమాఫీలోనూ పలు మార్పులు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. అనర్హులను ముందే గుర్తించడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది పేద రైతులకు సాయం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే, ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అన్న విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. అందుకే, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఐదేళ్లకాలంలో చేసినట్లుగా రుణమాఫీ చేసేందుకు సిద్ధమైందని సమాచారం. రైతు రుణమాఫీ, లబ్ధిదారుల గణాంకాలపై సమీక్ష జరిపి త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రుణమాఫీకి కావాల్సిన నిధులు కేటాయిస్తారని సమాచారం. అంచనా బడ్జెట్రైతులుకరీంనగర్సిరిసిల్లజగిత్యాలపెద్దపల్లిరూ.550 కోట్లపైనరూ.500 కోట్లపైనరూ.400 కోట్లపైన90000920008901661022 -
వరదలతో ఇబ్బందులు రాకుండా చూడాలి
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● మెడికల్ కాలేజీలో ఇబ్బందులుంటే చెప్పండి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో వరదలతో ఇబ్బందులు రాకుండా చూడాలని, అవసరమైన పనులకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం రోడ్లు, భవనాల శాఖ ఇంజి నీర్లతో సమీక్షించారు. జిల్లాలో ప్రగతిలో ఉన్న వంతెనలు, రహదారుల వివరాలపై ఆరా తీశారు. ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సుందర్, డీఈఈ శాంతయ్య, ఏఈలు కిరణ్, సతీశ్, నరేందర్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి వైద్యాధికారులతో సమీక్షించారు. మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలని సూచించారు. హాస్టళ్లలో దోమల నివారణ మందులు స్ప్రే చేయాలన్నారు. వైద్యకళాశాల సందర్శన జిల్లా మెడికల్ కాలేజీని కలెక్టర్ సందర్శించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్లు, లెక్చర్హాళ్లు పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకుల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. -
అర్బన్బ్యాంక్ను అగ్రగామిగా నిలపాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు. పద్మశాలి కల్యాణ భవన సంఘంలో శుక్రవారం నూతన పాలకవర్గ ప్రతినిధులకు పార్టీ తరఫున అభినందన సత్కారం ఏర్పాటు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా బ్యాంక్ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను సైతం బ్యాంక్ పురో గతికి దోహదం చేయాల్సిందిగా కోరాలన్నారు. అ నంతరం అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనా రాయణ మాట్లాడుతూ ఆన్లైన్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రా మారావు, జెడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, జిందం కళ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూ డూరి ప్రవీణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ అభయహస్తం అమలు చేయాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం దళితులకు రూ.12 లక్షల అంబేడ్క ర్ అభయ హస్తం అమలు చేయాలని ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. పదిర బస్టాండ్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేశ్ పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శ గంభీరావుపేట(సిరిసిల్ల): సముద్రలింగాపూర్కు చెందిన మల్లవరం మధుసూదన్రెడ్డి కుమారుడు మణిదీప్రెడ్డి ఇటీవల మృతిచెందగా.. వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల మృతిచెందిన మల్లవరం సదాశివరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. -
కార్ఖానాలకు కరెంట్ షాక్
ఇవి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్లోని ఆమంచ సదానందంకు చెందిన సాంచాలు. దశాబ్దాలుగా బట్టను నేసిన సాంచాలను ఇలా లారీలోకి ఎక్కించారు. బీవైనగర్లో నివసించే సదానందంకు 12 జోడీల సాంచాలు ఉండేవి. మూడు కరెంట్ మీటర్లు ఉన్నాయని, ‘సెస్’ అధికారులు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసి వందశాతం బిల్లులు జారీ చేశారు. దీంతో కరెంట్ బిల్లుల బాధను తప్పించుకునేందుకు సదానందం నాలుగు జోడీలు అంటే 8 సాంచాలను రూ.26వేలకు ఒక సాంచా చొప్పున తుక్కు కింద అమ్మేశాడు.సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం 2001 నుంచి 50 శాతం సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇక్కడి వస్త్రోత్పత్తి రంగానికి అండగా నిలవాలని 23 ఏళ్లుగా ప్రభుత్వాలు సబ్సిడీ కొనసాగించాయి. వస్త్రోత్పత్తి సాంచాలను కుటీర పరిశ్రమగా గుర్తిస్తూ.. కేటగిరీ–4లో యూనిట్ విద్యుత్ను రూ.4కు సరఫరా చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతీ యూనిట్కు రూ.2 భరిస్తుండగా.. సాంచాల యజమానులు వినియోగించిన ప్రతీ యూనిట్కు మరో రూ.2 సెస్కు చెల్లించేవారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, విద్యుత్ సబ్సిడీ కొనసాగింది. ప్రస్తుతం 2001లో ఇచ్చిన జీఓ ప్రకారం 10 సాంచాలు(అంటే 10 హెచ్పీల) వరకే ఈ సబ్సిడీని అందించాలని నిర్ణయించారు. కానీ సిరిసిల్లలో నెలకొన్న ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో 10 హెచ్పీల నిబంధనను ఎవరూ అమలు చేయలేదు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి ఎల్ఆర్.ఆర్సీ నంబర్ 895/2014–పి.తేదీ: 20.05.2024 ద్వారా సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి సాంచాలకు సంబంధించిన పరిశ్రమల టారిఫ్ను అమలు చేయాలని, 10 హెచ్పీల నిబంధన అమలులోకి తేవాలని ఆదేశించారు. ఈ మేరకు సిరిసిల్ల సెస్ అధికారులు 10 సాంచాల కంటే ఎక్కువ ఉన్న కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీ లేకుండా వినియోగించిన ప్రతీ యూనిట్కు రూ.7.80 పైసల చొప్పున బిల్లులు వేస్తున్నారు. దీంతో గతంలో ప్రతీ యూనిట్కు రూ.2 చెల్లించిన వస్త్రోత్పత్తిదారులు ఇప్పుడు రూ.7.80 చెల్లించలేక కార్ఖానాలను మూసివేస్తున్నారు. విద్యుత్ వినియోగం తీరిది.. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో 2023 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 5,074 విద్యుత్ సర్వీసుల ద్వారా 25,43,480 యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.50,86,959 విద్యుత్ సబ్సిడీ చెల్లించింది. ఈ సర్వీసులన్నీ వస్త్రోత్పత్తికి సంబంధించిన కేటగిరీ–4లో ఉన్నవే కావడంతో సబ్సిడీని భరించింది. ● 2024 ఏప్రిల్, మే నెలల్లో 2,229 విద్యుత్ సర్వీసుల ద్వారా 8,24,000 యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. దీనికి సంబంధించి రూ.16,48,000 విద్యుత్ సబ్సిడీని చెల్లించింది. జౌళిశాఖ అధికారుల ఆదేశాలతో సెస్ అధికారులు విద్యుత్ బిల్లులను రాయితీ లేకుండా జారీ చేయడంతో విద్యుత్ సర్వీసుల సంఖ్య తగ్గింది. విద్యుత్ వినియోగం, సబ్సిడీ తగ్గిపోయాయి. సిరిసిల్లలో నేడు కార్మికుల సమావేశం సాంచాలు అమ్ముకోవడం, కార్ఖానాలు బంద్ పడడంతో ఉపాధి కోల్పోతున్న కార్మికుల సమస్యలపై చర్చించేందుకు గురువారం సిరిసిల్లలో కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ సబ్సిడీ రద్దుపై, ప్రభుత్వ వైఖరిపై చర్చంచి ప్రత్యక్ష్యంగా పోరాట పంథాను నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఐటీయూ నాయకులు మూషం రమేశ్, కోడం రమణలు వెల్లడించారు.సబ్సిడీ ఇస్తేనే మనుగడ అన్ని సాంచాలకు విద్యుత్ సబ్సిడీ ఇస్తేనే సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు మనుగడ ఉంటుంది. లేకుంటే ఈ సాంచాలపై అంత విద్యుత్ బిల్లు చెల్లిస్తూ వస్త్రోత్పత్తి చేయడం సాధ్యం కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల మూలంగా అన్ని రంగాల లేబర్ చార్జీలు పెరిగాయి. కానీ ఆ మేరకు ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న బట్టకు గిట్టుబాటు ధర లేదు. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవు. – నల్ల ప్రదీప్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల -
బోనాల సంబరాలు
వేములవాడ: పట్టణంలోని పలు కాలనీల్లో గురువారం గ్రామదేవతలకు బోనాల మొక్కులు చెల్లించారు. ప్రతీ ఇంటి నుంచి మహిళలు బోనాలతో తరలివచ్చారు. జాత్రాగ్రౌండ్, పార్వతీపురం, కూరగాయల మార్కెట్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 14వ వార్డు న్యూఅర్బన్కాలనీలో గోత్రాల సంఘం ఆధ్వర్యంలో దుర్గమ్మ బోనాల మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. మున్సిపల్ వైస్చైర్మన్ బింగి మహేశ్, చిలుక రమేశ్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేశ్, తూం మధు, నామాల లక్ష్మీరాజం, గూడూరి మధు, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, అంబటి చందు, అబ్రహం తదితరులు ఉన్నారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
చందుర్తి/వేములవాడఅర్బన్/సిరిసిల్లటౌన్: విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల ని వారణ దినోత్సవంలో భాగంగా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిబాపూలే, కేజీబీవీల్లో చిన్నారులకు గురువారం నులిపురుగుల నివారణమాత్రలు పంపిణీ చేశారు. జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్రావు, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, మున్సిపల్ వైస్చైర్మన్ బింగి మహేశ్ ఉన్నారు. చందుర్తి పీహెచ్సీ తనిఖీ చందుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని, కేజీబీవీని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఏయే మందులు ఉన్నాయని తెలుసుకున్నారు. పీహెచ్సీ భవన పనులు ఆగస్టు రెండోవారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. చందుర్తి తహసీల్దార్ శ్రీనివాస్, వైద్యాధికారి సంపత్, కేజీబీవీ ప్రత్యేకాధికారి కల్పన, ఎంపీవో ప్రదీప్కుమార్ ఉన్నారు. ఒక్క మాత్రతో నులి పురుగులకు చెక్ ఒక్క ఆల్బెండజోల్ మాత్రతో నులిపురుగులకు చెక్ పెట్టొచ్చని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. సిరిసిల్ల గీతానగర్ పీఎస్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఈవో రమేశ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, మున్సిపల్ కమిషనర్ డి.లావణ్య, ప్రోగ్రాం ఆఫీసర్ నయీమ, సీడీపీవో అలేఖ్యపటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చందుర్తి పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
● 10 హెచ్పీకే పరిమితం చేస్తూ తాజాగా చేనేత, జౌళిశాఖ ఆదేశాలు ● బిల్లులు చెల్లించలేక మూతపడుతున్న వస్త్రోత్పత్తి యూనిట్లు ● ఉపాధి కోల్పోతున్న నేతకార్మికులు
ఈయన పేరు దూస వంశీకృష్ణ. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట శివారులో వస్త్రోత్పత్తి కార్ఖానా ఉంది. ఇక్కడ 70 సాంచాలున్నాయి. 12 మంది కార్మికులు బట్ట ఉత్పత్తి చేస్తారు. ప్రగతినగర్లో వంశీకృష్ణకు ఇలాంటి కార్ఖానాలు మరో నాలుగు ఉన్నాయి. మొత్తంగా 55 మంది కార్మికులు ఇతని వద్ద ఉపాధి పొందుతున్నారు. ప్రతీ యూనిట్కు రూ.8 చొప్పున విద్యుత్ బిల్లులు వేశారు. దీంతో విద్యుత్ సబ్సిడీ లేకుండా వస్త్రోత్పత్తి కొనసాగించలేమంటూ.. వంశీకృష్ణ తన కార్ఖానాలను రెండు వారాల క్రితం మూసివేశాడు. ఫలితంగా 55 మంది నేతకార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది సిరిసిల్ల ప్రగతినగర్లో నల్ల ప్రదీప్కు చెందిన సాంచాల కార్ఖానా. ఇక్కడ 94 సాంచాలున్నాయి. దీనికి నెలకు రూ.20 వేల నుంచి రూ.28 వేల వరకు విద్యుత్ బిల్లు వచ్చేది. ఇప్పుడు విద్యుత్ సబ్సిడీ 10 హెచ్పీకే పరిమితం చేయడంతో రూ.లక్ష వరకు బిల్లు వచ్చింది. ఈ లెక్కన ప్రతీ మీటర్ బట్ట ఉత్పత్తికి విద్యుత్ బిల్లు రూ.0.90 పైసలు వచ్చినట్టు. అన్ని సాంచాలకు 50 శాతం సబ్సిడీ ఉంటే.. రూ.0.18 నుంచి రూ.0.20 పైసలు వచ్చేది. ఒకేసారి ఐదింతల బిల్లు రావడంతో ప్రదీప్ వారం క్రితం కార్ఖానా బంద్ చేశారు. దీంతో అతని వద్ద పనిచేసే 30 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. -
కదంతొక్కిన బీడీకార్మికులు
ముస్తాబాద్(సిరిసిల్ల): పింఛన్లు, రేషన్కార్డులు మంజూరు చేయాలని కోరుతూ పోతుగల్ గ్రామంలో గురువారం మహిళలు పోరుబాట పట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా పింఛన్లు పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదన్నారు. 2014 తర్వాత పీఎఫ్ అర్హత పొందిన బీడీ కార్మిక మహిళలకు ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని, కటాఫ్ తేదీని ఎత్తివేయాలని కోరారు. అర్హులైన వారికి రేషన్కార్డులు మంజూరుచేసి, ఆహారభద్రత కల్పించాలన్నారు. ధర్నా అనంతరం ఎంపీడీవో రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కోల కృష్ణ, శ్రీనివాస్రావు, మహేశ్, కార్తీక్రెడ్డి, బూత్ అధ్యక్షులు కనకయ్య, రంజిత్, వినయ్, ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలసిన ‘సెస్’ పాలకవర్గం
సిరిసిల్ల: కలెక్టర్గా ఇటీవల విధుల్లో చేరిన సందీప్కుమార్ ఝాను సెస్ పాలకవర్గం గురువారం కలెక్టరేట్లో కలిసింది. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి కలెక్టర్కు పూలమొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న ఆలయ ప్రసాదాన్ని అందించారు. ‘సెస్’ ఇన్చార్జి ఎండీ ఎల్.శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దేవరాజం, రవీందర్రెడ్డి, జి.నారాయణరావు, ఆకుల గంగరాజం, కొట్టెపల్లి సుధాకర్, మాడుగుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భూ వివాదాలు సృష్టిస్తే కేసు● చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు చందుర్తి(వేములవాడ): గ్రామాల్లో అక్రమంగా భూవివాదాలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో భూవివాదంపై వచ్చిన ఫిర్యాదుపై గురువారం సీఐ విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే అక్రమాలకు పాల్పడినట్లు గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. భూమి ఎలా పట్టాకు వచ్చిందో వివరాలు తీసుకురావాలని సీఐ కోరడంతో ఫిర్యాదుదారుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అకారణంగా ఇతరుల భూమి హద్దులు తొలగించినా, అక్రమంగా సాగుచేసినా పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి సిరిసిల్లఎడ్యుకేషన్: నిబంధనలు ఉల్లంఘించి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ బాధ్యులు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, ఇతర స్టేషనరీ విక్రయిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అలాంటి స్కూళ్లను సీజ్ చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్కుమార్, నాయకులు రజనీకాంత్, శ్రీకాంత్, మహేశ్ పాల్గొన్నారు. నేడు జిల్లాకు కేటీఆర్ సిరిసిల్ల: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లకు వస్తున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు కుంబాల మహేందర్రెడ్డి గురువారం తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో ఉదయం 11 గంటలకు అంబేడ్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరిస్తారు. సిరిసిల్ల పద్మశాలి కల్యాణ మండపంలో ఉదయం 11.30 గంటలకు జరిగే సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఈమేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. యోగా దినోత్సవం సిరిసిల్లక్రైం/సిరిసిల్లకల్చరల్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్ద శుక్రవారం యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో యోగా ఔత్సాహికులు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే యోగా దినోత్సవానికి వైద్యాధికారులు, ఆయుష్ ఆరోగ్య మందిర్ ఎంఎల్హెచ్పీలు, సిబ్బంది హాజరుకావాలని డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, ఆయుష్ నోడల్ అధికారి నీరజ కోరారు. ఇందిరా పార్క్ యోగా సేవా సమితి, వాకర్స్ అసోసియేషన్, ఆదియోగి యోగా సాధనాలయం, నిత్య యోగ సాధనా సమితి తదితర సంస్థలు సైతం యోగ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. -
సమస్యల ‘ధరణి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం భూ సమస్యల్లేకుండా దిద్దుబాటు చర్యలు చేపడుతుండగా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం గుదిబండలా మారింది. సమస్యలు పరిష్కరించి, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం, రికార్డుల్లో సవరణలు చేయాల్సి ఉండగా కావాలనే కొర్రీలు పెడుతున్నారు. మట్టిని నమ్ముకున్న కర్శకులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రాజెక్టులతో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ సమస్యలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. రేపూమాపంటూ ఏళ్లుగా రైతులను తిప్పుకోవడం వీరికే చెల్లింది. పలు సమస్యలకు ధరణిలో ఆప్షన్లు లేకపోగా ఉన్నవి అమలు చేయడంలో శ్రీమామూలుశ్రీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకరిద్దరు కలెక్టర్లు భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తుండగా మిగతావారు నిర్లక్ష్యం చేయడం ఆందోళనకర పరిణామం. ఏళ్లుగా నాన్చడమే.. రెవెన్యూ అధికారులు సాధారణంగా పరిష్కరించే సమస్యలను కూడా ధరణితో ముడిపెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఈ తరహా కేసులు ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో తిరస్కరించిన దరఖాస్తులు వేలల్లో ఉండటం గమనార్హం. తహసీల్దార్లు, ఆర్డీవోలకు పలు ఆప్షన్లపై అధికారం ఇచ్చినప్పటికీ అర్జీలు కుప్పలుగా పేరుకుపోతుండటం విమర్శఽలకు తావిస్తోంది. గత ప్రభుత్వం ఎల్ఆర్యూపీ కార్యక్రమం చేపట్టిన సమయంలోనే ఇవన్నీ పరిష్కరించాల్సి ఉండగా ఏళ్లగా నాన్చుతున్నారు. ఇక, ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో అత్యధికం ఇవే ఉండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి జరుగుతుండగా సుమారు 200 వరకు అర్జీలొస్తున్నాయి. వీటిలో 70 నుంచి 90 వరకు ఇవే ఉండటం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. మార్పులకు అవకాశంలోనూ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో పలు ఆప్షన్లకు అవకాశమిచ్చింది. అయినా, అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. పట్టాదారు పాసుపుస్తకంలో అక్షర దోషాలు ఉన్నా, పొరపాటున వేరే పేరు పడినా సరిచేసుకోవచ్చు. మహిళకు బదులు పురుషుడు, పురుషుడికి బదులు మహిళ అని అచ్చు తప్పు దొర్లినా, రిజర్వేషన్ కేటగిరీ, ఆధార్ నంబర్ తప్పుగా నమోదైనా సరిచేసుకోవచ్చు. అలాగే, పట్టా, సీలింగ్, భూదాన్, అసైన్డ్ వంటివి తప్పుగా నమోదైతే మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి ఏ విధంగా సంక్రమించిందనే వివరాల్లో తప్పులుంటే, వాస్తవ భూమి కంటే పాసుపుస్తకంలో తక్కువగా నమోదైతే మార్చుకునే వీలుంది. దీనివల్ల ఎక్కువ, తక్కువ సమస్యలు తొలగిపోనున్నాయి. భూమి వర్గీకరణ మాగాణి, తరి, మెట్ట వంటి వివరాల మార్పిడి చేసుకోవచ్చు. వారసత్వం, అన్న, తమ్ముడు, సొంతం, కుమారుడు వంటివి, ఏదైనా సర్వే నంబర్ లేదా సబ్ డివిజన్ నంబర్ కనిపించకపోవడం, ఆ మేరకు విస్తీర్ణం తక్కువగా నమోదైతే మార్చుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సర్వే నంబర్లను ఎంచుకోవచ్చు. ఏదైనా కారణంతో భూమి 1బీ ఖాతాలో చేరి, ఆ తర్వాత పరిష్కారమైతే వాటిని పట్టా నమోదుకు అవకాశం ఇచ్చారు. కానీ, సదరు అర్జీల్లోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఉమ్మడి జిల్లా రైతులు వాపోతున్నారు. తారస్థాయికి భూవివాదాలు.. ఒకప్పుడు ఎకరాకు రూ.20 లక్షలున్న భూములు ఇప్పుడు రూ.కోటి పలుకుతున్నాయి. దీంతో భూ వివాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎప్పటికప్పుడు సమస్యల్లేకుండా చొరవ తీసుకోవాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం. ఒకరి భూమి మరొకరి పేరిట నమోదైతే సరిచేసేందుకు ఆప్షన్లు లేవు. నాలుగైదు దశాబ్దాల కిందట భూములు అమ్ముకున్నవారి పేర్లు ధరణిలో వస్తున్నాయి. దీంతో వారు భూములు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటుండగా వంశపారంపర్యంగా వచ్చిన భూములు ఇతరుల పేర్లపై ధరణిలో నమోదయ్యాయి. పక్కాగా ఉన్న పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయి. దీంతో రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందలేని దుస్థితి నెలకొంది. చాలా సర్వే నంబర్లు మిస్సయ్యాయి. ఏళ్లుగా రైతుబంధుకు దూరమవుతున్నారు.కరీంనగర్జగిత్యాలపెద్దపల్లిరాజన్నసిరిసిల్లజిల్లాల వారీగా ధరణి అర్జీల తీరుఇతని పేరు కస్తూరి కీర్తికుమార్. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు గ్రామం. అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ఏళ్ల తరబడి తిరుగుతున్నాడు. తండ్రి కొనుగోలు చేసిన భూమిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే భూ వివరాలు తప్పుగా నమోదు చేశారు. సర్వే నంబర్ 924/ఆ/ 2/1లో 12 గుంటల భూమి రావాల్సి ఉండగా 2 గుంటలు మాత్రమే ధరణిలో చూపిస్తోంది. మీసేవలో దరఖాస్తు చేసుకోమంటే (అప్లికేషన్ నంబర్ 2200130452) 2022 అక్టోబర్ 31న చేశాడు. ఇప్పటివరకు పరిష్కారం కాకపోగా రిజెక్ట్ చేయడం మళ్లీ దరఖాస్తు చేయడం తంతుగా సాగుతోంది. ఇది కేవలం కీర్తికుమార్ సమస్యే కాదు. ఉమ్మడి జిల్లా అంతటా భూ సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. తిరస్కరణలే ఎక్కువ.. పరిష్కారం అంతంతే అప్పులిచ్చేందుకు బ్యాంకుల నిరాకరణ ప్రజావాణిలో అత్యధికం భూ సమస్యలే496924386235786326248972690324771554925025316213542122221244520690తిరస్కరణపరిష్కరించాల్సినవిపరిష్కారందరఖాస్తులు -
పవర్లూమ్స్లో కార్మికులు ఎంతమంది ?
● చేనేత, జౌళిశాఖ అధికారులతో కలెక్టర్ సిరిసిల్ల: జిల్లాలో పవర్లూమ్స్ ఎన్ని ఉన్నాయి.. వాటిపై ఆధారపడిన కార్మికులు ఎంత మంది ఉన్నారని కలెక్టర్ సందీప్కుమార్ ఝా చేనేత, జౌళిశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లో బుధవారం చేనేత, జౌళిశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశ్రమ గురించి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నేతకార్మికులకు ఏయే ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని ప్రశ్నించారు. టెక్స్టైల్, అపెరల్ పార్క్లతోపాటు ఇంకా ఏయే పరిశ్రమలు ఉన్నాయని ఆరా తీశారు. జౌళిశాఖ ఆర్డీడీ అశోక్రావు, సిరిసిల్ల ఏడీ సాగర్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన సిరిసిల్ల ఆర్డీవో కలెక్టర్ సందీప్కుమార్ఝాను సిరిసిల్ల ఆర్డీవో ఎల్.రమేశ్ కలిసి పూలమొక్క అందించారు. -
అభిమానం.. పూలవర్షం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్టౌన్: కేంద్ర సహాయమంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టిన బండి సంజయ్కుమార్కు ఘన స్వాగతం లభించింది. ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. కరీంనగర్లోని కమాన్వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. బుధవారం ఉదయం శనిగరం వద్దకు చేరుకోగానే బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. మోదీ, బండి సంజయ్ నినాదాలతో మారుమోగింది. శనిగరం నుంచి కరీంనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా జనసందోహంతో స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ శనిగరంలో ‘బండి సంజయ్’ ఎదుట కర్రసాము చేస్తూ వినూత్న స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమాదేవి, ఆమె సోదరుడు రాణా ప్రతాప్ ట్రాక్టర్లపై మోదీ, అమిత్ షా, బండి సంజయ్ కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానం చాటారు. కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేస్తూ వందలాది వాహనాలతో కరీంనగర్ వద్దకు వచ్చిన బండి సంజయ్కు ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా నుంచి ఓపెన్ టాప్ వాహనంలో కమా న్ వద్దకు చేరుకున్నారు. అక్కడికి రాగానే వాహనంలో నుంచి కిందకు దిగి నేలపై ప్రణమిల్లారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు, గుర్తింపునిచ్చిన తెలంగాణ ప్రజలకు ‘సెల్యూట్ కరీంనగర్... సెల్యూట్ తెలంగాణ’ అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. గీతాభవన్ చౌరస్తాలో పలువురు ముస్లిం నాయకులు సంజయ్కు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బుల్డోజర్లతో పూలవర్షం కురిపించారు. అధికారులు, పోలీసుల స్వాగతం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్దకు వచ్చిన సంజయ్కు కరీంనగర్ కలెక్టర్, అదనపు కలెక్టర్ పూలమాలలు అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అక్కడి నుంచి చైతన్యపురిలోని మహాశక్తి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన బండి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు... బీజేపీ కార్యకర్తలు పెట్టిన భిక్షేనని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్రమంత్రిని సన్మానించిన నేతలు బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ను ఘనంగా సన్మానించారు. పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్, మీడియా కన్వీనర్ కటకం లోకేశ్, గాజే రమేశ్ తదితరులు సన్మానించారు. రాజన్నకు కోడెమొక్కు.. అంజన్న దర్శనం వేములవాడ/సిరిసిల్ల: రాజన్నను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో రామకృష్ణ ప్రసాదాలు అందించి, సత్కరించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, గౌతమి, ఎస్పీ అఖిల్మహాజన్, ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈవో రామకృష్ణ స్వాగతం పలికారు. జిల్లా పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అంతకుముందు కొండగట్టు అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మార్కండేయస్వామి దర్శనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ సిరిసిల్లలో మార్కండేయస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా సిరిసిల్లకు వచ్చిన బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు పాత బస్టాండు వద్ద భారీగా స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో గజమాల వేశారు. పట్టణ వీధుల్లో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మార్కండేయస్వామిని దర్శించుకున్న సంజయ్కుమార్ను స్థానిక వస్త్రోత్పత్తిదారులు, పద్మశాలీ సంఘం నాయకులు సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పార్టీ నాయకులు రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. బండి సంజయ్కి ఘన స్వాగతం కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి జిల్లాలో పర్యటన కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి కృతజ్ఞతలు తెలిపిన బండి వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నల దర్శనం -
అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
● వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి ● రుద్రంగిలో కార్డెన్సెర్చ్రుద్రంగి(వేములవాడ): నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపడుతున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం కార్డన్సెర్చ్ చేపట్టారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని సూచించారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలు కొంటే కేసుల పాలవుతారని హెచ్చరించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించా రు. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తుండాలని సూచించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వివిధ రకాల ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి సరఫరా, అనుమానిత వ్యక్తుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, బీమా, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి, కోనరావుపేట, చందుర్తి ఎస్సైలు సిరిసిల్ల అశోక్, ఆంజనేయులు, శ్రీకాంత్, రుద్రంగి హెడ్కానిస్టేబుల్ బాల్రెడ్డి, 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
వేములవాడ: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్లో దేవాదాయశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్శాఖ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సహకారంతో పట్టణ పరిధిలో 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శాంతిభద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లా పోలీస్శాఖ శాంతి సామాజిక కార్యక్రమాలు చేస్తూ అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సీసీ కెమెరాలుంటే నేరం చేసేందుకు భయపడతారన్నా రు. కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయన్నారు. డీఎస్పీ నాగేంద్రాచారి, ఆలయ ఈఈ రాజేశ్, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్సైలు మారుతి, అంజయ్య పాల్గొన్నారు. ● ఎస్పీ అఖిల్ మహాజన్ -
పిల్లల బాధ్యత పెద్దలదే..
తప్పని తెలియదు పిల్లలు బండి నడపొద్దని, ఇది తప్పని మాకు తెలియదు. మా అన్న కొడుకు చరణ్సింగ్ బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బండి తీసుకుపోయిండ్రు. పోరగాండ్లు బండ్లపై వేగంగా వెళ్తుంటారు. చాలా సార్లు ప్రమాదాలు జరిగి చనిపోయారు. వాళ్లకు బండి ఇవ్వడం నేరమని తెలిసింది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగనివ్వం. – జనార్దన్నాయక్, సీతారాంతండా, గర్జనపల్లి పిల్లలకు బండి ఇవ్వడం తప్పే మాది బోయినపల్లి మండలం తడగొండ. మా అబ్బాయి అశ్విత్ డ్రైవింగ్ చేస్తాడు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్నాడని పోలీసులు బండి స్వాధీనం చేసుకున్నారు. ఫైన్ వేసి వదిలేస్తారని అనుకున్నాం. కానీ ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో చాలా విషయాలు తెలిశాయి. నిజంగానే పిల్లలకు బండి ఇవ్వడం తప్పే. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. – స్వర్ణలత, తడగొండమైనర్ల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి మైనర్ పిల్లల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ ఉండదు. అందుకే ప్రభుత్వం 18 ఏళ్లు దాటితేనే డ్రైవింగ్ లైసెన్స్, ఓటు హక్కు ఇస్తుంది. మెచ్యూరిటీ లేకుండా పిల్లలు బండి నడిపితే ప్రమాదాలకు కారణమవుతారు. కరీంనగర్లో ఓ మైనర్ డ్రైవింగ్ కారణంగా రోడ్డు పక్కన పడుకున్న ముగ్గురి ప్రాణాలు పోయాయి. తల్లిదండ్రులుగా పిల్లలకు బండి ఇవ్వవద్దు. ఇస్తే కేసులు తప్పవు. – కె.నాగేంద్రాచారి, డీఎస్పీ, వేములవాడ సిరిసిల్ల: పిల్లల బాధ్యత ఖచ్చితంగా పెద్దలదేనని, వారి ప్రవర్తనను పరిశీలిస్తూ.. మంచి మార్గంలో నడిపించాలని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తూ 361 మంది పట్టుబడగా.. వారికి, వారి తల్లిదండ్రులకు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పిల్లలకు బండి ఇవ్వవద్దని, ఎవరైనా ఇస్తే ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. పుణెలో రోడ్డు ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రిని, తాతను జైలుకు పంపించారని గుర్తు చేశారు. పిల్లలు బండి నడపకుండా పెద్దలు కట్టడి చేయాలని, 18 ఏళ్ల తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుందని స్పష్టం చేశారు. మైనర్ల డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలు జరిగి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మరోసారి మైనర్లకు బైక్లు ఇస్తే వారి తల్లిదండ్రులపైనే కేసులు పెడతామని హెచ్చరించారు. ఒక్కసారి కేసు నమోదైతే పిల్లలకు ఉద్యోగాలు రావని, పాస్పోర్టు రాదని స్పష్టం చేశారు. కొందరు పిల్లలు గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు తప్పకుండా కఠినంగానే ఉండాలన్నారు. మరోసారి పిల్లలకు బైక్ ఇవ్వబోమని తల్లిదండ్రులతో వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ప్రమాణం చేయించారు. సిరిసిల్ల రూరల్, చందుర్తి సీఐలు సదన్కుమార్, గాండ్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. పిల్లలు వినకుంటే 100కు కాల్ చేయండి గంజాయి మత్తుకు లోనుకాకుండా చూడాలి ఎస్పీ అఖిల్ మహాజన్ మైనర్ల బైక్ డ్రైవింగ్పై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ -
కళాకారులకు స్థలం కేటాయించండి
వేములవాడ: కళాకారుల భవన నిర్మాణానికి ఐదు గుంటల స్థలం కేటాయించాలని స్థానిక కళాకారులు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్కు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల స మయంలో కళాకారులకిచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 5 గుంటల స్థలాన్ని త్వరగా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. వేములవాడ నృత్యకళానితన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యెల్ల పోశెట్టి, గౌరవ అధ్యక్షుడు బొడ్డు రాములు, కళాకారులు సావనపల్లి శ్రీనివాస్, వారాల దేవయ్య, బుర్ర శంకరయ్య, మాన్వాడ లక్ష్మీనారాయణ, కనపర్తి హన్మండ్లు, రమేశ్, గుమ్మడి రాజేశం పాల్గొన్నారు. ఆలయ ఉద్యోగులకు వైద్యపరీక్షలు వేములవాడ: రాజన్న ఆలయ ఉద్యోగులకుబుధవారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఓపెన్స్లాబ్లో ఈవో రామకృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఏఈవోలు ప్రతాప నవీన్, హరి కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టెక్స్టైల్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనిల్కుమార్ సిరిసిల్ల: సిరిసిల్ల శివారులోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ పారిశ్రామిక వేత్తల అసోసియేషన్ అధ్యక్షుడిగా అన్నల్దాస్ అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆంకారపు కిరణ్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా వేము ల శ్రీనివాస్, కోశాధికారిగా యెల్లె లక్ష్మీనారా యణ, సహాయ కార్యదర్శిగా కట్టెకోల శివశంకర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పారిశ్రామికవేత్తలు కల్యాడపు సుభాశ్, వాసం శ్రీనివాస్ అభినందించారు. స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలు సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అకాడమీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి అజ్మీర రాందాస్ బుధవారం ప్రకటనలో తెలి పారు. ఓయూ క్యాంపస్లోని సైక్లింగ్ రెజ్లింగ్ అకాడమీ, హనుమకొండలోని రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్, ఖమ్మంలోని అథ్లెటిక్స్ అకాడమీ, వనపర్తిలోని హాకీ అకాడమీ, సరూర్నగర్, సిరిసిల్లలోని వాలీబాల్ అకాడమీలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 16 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికల పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జనన ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆరు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో జూన్ 24, 25 తేదీల్లో హాజరుకావాలని సూచించారు. గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ సస్పెన్షన్ సిరిసిల్ల: గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్, బిల్కలెక్టర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చే శారు. జూనియర్ అసిస్టెంట్ శిరీష గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్ను రూ.12,93,921 సబ్ ట్రెజరీ ఆఫీస్లో జమ చేయకుండా, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు. బిల్కలెక్టర్ శ్రీహరి గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్ను రూ.2,40,100 సబ్ట్రెజరీ ఆఫీస్లో జమచేయకుండా దుర్వినియోగానికి పాల్ప డ్డట్లు వివరించారు. మండల పంచాయతీ అధికారి విచారణ నివేదిక ప్రకారం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 23 నుంచి పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలనవేములవాడఅర్బన్: పాలిసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 23 నుంచి చేపడుతున్నట్లు అగ్రహారం కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్ తెలిపారు. ఈనెల 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో స్లాట్బుక్ చేసుకోవాలని, 23 నుంచి 25 వరకు పరిశీలన ఉంటుందని తెలిపారు. -
నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం
సిరిసిల్లటౌన్: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ పూజరి గౌతమి తెలిపారు. బుధవారం నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. 1 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఆ ల్బెండజోల్ మాత్రలు వేయిస్తామన్నారు. డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు మాట్లాడుతూ 1 నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రను పొడిగా చే సి స్పూన్ నీటిలో, 2 నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఒక మాత్రను పొడి చేసి ఒక స్పూన్ నీటిలో కరిగించి వేయాలని సూచించారు. 3 నుంచి 19 ఏళ్ల వారు ఒక మాత్రను చప్పరించాలని సూచించారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు డీపీవో వీరబు చ్చయ్య, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఈవో రమేశ్కుమార్, డీఐఈవో మోహన్, డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, డాక్టర్ నయీమ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ వల.. సామాన్యుల విలవిల
● బ్యాంకు సింబల్స్తో మెస్సేజ్లు ● ప్రముఖ డాక్టర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.14.72 లక్షలు లూటీ ● పోలీస్ అధికారులుగా ఫోన్చేసి మరో వ్యాపారికి టోకరా ● హైకోర్టు జడ్జి బంధువు అంటూ.. రూ.92 లక్షల మోసంసిరిసిల్ల: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జిల్లాకు చెందిన పలువురు నిలువు దోపిడీకి గురయ్యారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులకు, ఉద్యోగులకు, రైతులకు ఓ ప్రముఖ బ్యాంకు సింబల్తో మెస్సేజ్లు రాగా.. పొరపాటున క్లిక్ చేయడంతో వారి ఖాతాల్లోని డబ్బును కొల్లాగొట్టారు. డాక్టర్ ఖాతా నుంచి రూ.14.72 లక్షలు అతనో ప్రముఖ డాక్టర్. సిరిసిల్లలో సొంత భవనం కొనుగోలు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల సొంతింటిపై రూ.15లక్షలు బ్యాంకు ద్వారా లోను తీసుకున్నారు. ఆ డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉండగా.. సైబర్నేరగాళ్లు ఇటీవల ఉదయం 10.22 గంటలకు ఫోన్ చేశారు. అప్పటికే నిద్రలేమితో ఉన్న డాక్టర్ ఆ ఫోన్ ఎత్తగా.. హిందీలో మొదలైన సంభాషణ తెలుగు ట్రాన్స్లేటర్ ద్వారా కొనసాగింది. బోగస్ పాన్కార్డ్, ఆధార్కార్డులు చూపుతూ ముంబైలో హవాలా డబ్బులు రూ.200కోట్లు మీరు లావాదేవీలు నడిపారంటూ బెదిరిచారు. తనకు సంబంధం లేదని చెబుతుండగానే పోలీస్ అధికారి స్థాయిలో మరొకరు లైన్లోకి వచ్చి మీరు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫోన్ కట్ చేయకుండా కట్టడి చేస్తూనే అతని బ్యాంకు ఖాతా నంబర్లను హ్యాక్ చేశారు. అరగంటలోనే బ్యాంకు ఖాతాలోని రూ.14.72లక్షలు మాయమైనట్లు మెస్సేజ్ వచ్చింది. ఇదంతా సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించిన సదరు డాక్టర్ జిల్లా ఎస్పీ అఖిల్మహాజన్ను సంప్రదించారు. సంఘటన జరిగిన అరగంటలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ రూ.3లక్షలు విత్డ్రా కాకుండా పోలీసులు కట్టడి చేశారు. కానీ అప్పటికే రూ.11.72లక్షలు డ్రా అయినట్లు నిర్ధారణ అయింది. తన డబ్బులు రికవరీ చేయాలని సదరు డాక్టర్ బుధవారం మరోసారి ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి వేడుకున్నారు. హైకోర్టు జడ్జి బంధువు అంటూ... సంజీవయ్యనగర్లో నివసించే ఓ వ్యక్తికి సంబంధించిన భూమి వివాదంలో ఉంది. ఆ భూమికి సంబంధించిన కేసును హైదరాబాద్ హైకోర్టులో వేస్తానని, తమ సమీప బంధువు హైకోర్టు జడ్జి అని నమ్మించి ఒకరు రూ.5లక్షలు తీసుకున్నాడు. భూమి మార్కెట్ విలువ ఆధారంగా కోర్టు ఫీజులు చెల్లించాలని మ రోసారి రూ.25లక్షలు, ఇంకోసారి రూ.10లక్షలు ఇలా ఆరు నెలల వ్యవధిలో రూ.92 లక్షలు కాజేశాడు. గంభీరావుపేట మండలం కోళ్లమద్దికి చెందిన సదరు వ్యక్తి మాటలు నమ్మి అప్పులు చేసి రూ.92లక్షలు సమర్పించాడు. తీరా కోర్టు కేసు విషయం ఆరా తీయగా.. అంతా ఉత్తదే అని తేలింది. దీంతో సదరు మోసగాడిపై సిరిసిల్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ మోసగాడిని, అతని తండ్రిని పిలిచి విచారించగా.. తీసుకున్న డబ్బులు ఖర్చు అయ్యాయని, తన వద్ద ఏమీ లేదని ఆ ఇద్దరు చేతులెత్తేయడం గమనార్హం. మెస్సేజ్లకు స్పందించొద్దు జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులకు ప్రముఖ బ్యాంకు సింబల్తో మెస్సేజ్లు వస్తున్నాయి. యాసంగి సీజన్లో వడ్లు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉండగా.. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సింబల్స్తో మెసేజ్లు పంపించి డబ్బులు లూటీ చేయాలని భావిస్తున్నారు. ఆ మెసేజ్లకు ఎవరూ స్పందించొద్దని బ్యాంకు అధికారులు కోరుతున్నారు. -
మేము నిక్కర్ వేసుకోలేం..
● సర్కారు బడుల్లో 6, 7వ తరగతుల విద్యార్థుల విముఖత ● గతేడాది యూనిఫాంలో ప్యాంట్ అందజేత ● ఈసారి నిక్కర్ల పంపిణీ ● పాఠశాలలకు సివిల్ డ్రెస్లోనే వస్తున్న పిల్లలు ● జిల్లాలో 6,800 మంది విద్యార్థులుముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ, 7వ తరగతుల విద్యార్థులు నిక్కర్ ఉన్న యూనిఫాం వేసుకోలేమని అంటున్నారు. తాము పెరిగామని.. ఈ వయసులో స్కూళ్లలో నిక్కర్లు ఎలా ధరించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు ఇస్తోంది. 6, 7వ తరగతుల విద్యార్థులకు మాత్రం ప్యాంట్ల స్థానంలో రెండు నిక్కర్లు సరఫరా చేస్తోంది. గతేడాది వాటిపై పిల్లలు విముఖత చూపడంతో నిక్కర్లకు బదులు ఒక ప్యాంట్ అడ్జస్ట్ చేసి, ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరంలోనూ అలాగే చే యాలని భావించినప్పటికీ, ఐకేపీ మహిళా సంఘాలకు యూనిఫాం క్లాత్ అందించడం, వారు ఒక జత డ్రెస్సు కుట్టి ఇవ్వడం జరిగిపోయింది. మరో జత కుట్టి, త్వరలో ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. క్రమశిక్షణకు ఆటంకం అంటున్న టీచర్లు విద్యార్థుల్లో చాలామంది నిక్కర్ వేసుకొని, స్కూల్ కు రావడానికి ఇష్టపడటం లేదు. షర్ట్ మాత్రమే వే సుకొని, ప్యాంట్ ఏదో ఒక కలర్ది వేసుకొని, వెళ్తున్నారు. ఇది పాఠశాలల్లో క్రమశిక్షణకు ఆటంకంగా మారిందని టీచర్లు అంటున్నారు. పేద విద్యార్థులు ఇటు నిక్కర్ వేసుకోలేక, అటు తల్లిదండ్రులు కొని చ్చే మామూలు ప్యాంట్లు వేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలోని 120 హైస్కూ ళ్లలో ఆరోతరగతి చదివే విద్యార్థులు 3,600 మంది, ఏడోతరగతి చదివేవారు 3,200 మంది ఉన్నారు. మొత్తం 6,800 మంది విద్యార్థులకు అధికారులు ఇప్పటికే ఒక జత యూనిఫామ్ అందజేశారు. కా గా, జిల్లాలోని సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి 41,680 మంది పిల్లలు చదువుతున్నారు. కొంతమంది బయట కొనుగోలు.. అధికారులు విద్యార్థులకు నిక్కర్లకు బదులుగా ఒక ప్యాంట్ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత మూడేళ్లలో ఇదే విధానం కొనసాగించారు. ఈ విద్యాసంవత్సరం యూనిఫామ్స్ బాధ్యతను డీఆర్డీఏ ఐకేపీ మహిళా సంఘాలకు అప్పగించింది. వారు తీసుకున్న కొలతల మేరకు నిక్కర్లు కుట్టి, పంపించారు. చేసేది లేక కొంతమంది తల్లిదండ్రులు బయట దుకాణాల్లో ప్యాంట్లు కొనుగోలు చేసి, తమ పిల్లలకు ఇస్తున్నారు. 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ప్యాంట్ కావాలి నేను నిక్కర్ వేసుకోను. పోయిన సంవత్సరం ప్యాంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే కావాలి. మా క్లాస్లో అందరూ ప్యాంట్లే వేసుకుంటామంటున్నరు. నిక్కర్లంటే ఇష్టపడటం లేదు. సార్లు ఇప్పుడు కూడా ప్యాంట్లే ఇస్తే బాగుండేది. – అనురాగ్, ఏడోతరగతి, ముస్తాబాద్ నిబంధనల మేరకే.. నిబంధనల మేరకే విద్యార్థులకు యూనిఫామ్స్ సరఫరా చేశాం. గతేడాది అంతర్గత ఒప్పందం వల్ల రెండు నిక్కర్లకు బదులు ప్యాంట్ అందించాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ సిగ్గు పడాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా నిక్కర్లు ధరించవచ్చు. – రమేశ్కుమార్, డీఈవో సిగ్గుగా ఉంది నిక్కర్ వేసుకోవాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. ప్యాంట్ ఇస్తే మంచిగుండు. స్కూల్కు వచ్చేటప్పుడు నేను వేరే ప్యాంట్లు వేసుకుంటున్న. ఆరోతరగతిలో ప్యాంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇస్తామని చెప్పి, నిక్కర్ ఇచ్చారు. – డి.ప్రభుదాస్, ఏడోతరగతి, ముస్తాబాద్ -
శరవేగంగా రైల్వే ట్రాక్
● అంకుసాపూర్ శివారులో కొనసాగుతున్న పనులు ● జిల్లాలోని 17 గ్రామాల్లో భూసేకరణ దాదాపు పూర్తి ● తాడూరు శివారులో రైల్వేస్టేషన్ ● మధ్యమానేరు బ్యాక్ వాటర్ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి ప్రతిపాదన ● కొత్త రైలుమార్గంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు మేలు రైల్వేలైన్ స్వరూపం ఇదీ..సిరిసిల్ల: జిల్లా ప్రజల చిరకాల వాంఛ రైలు మార్గం. కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ నిర్మాణానికి రూ.350 కోట్ల బడ్జెట్ కేటాయించడంతో నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ శివారులో రైల్వేట్రాక్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి రైలు మార్గం ఇప్పటికే సిద్దిపేట వరకు పూర్తవగా.. రైలు నడుస్తోంది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వైపు రైలుమార్గం నిర్మాణంలో ఉంది. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, ధార్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణాలను కలు పుతూ కరీంనగర్ శివారులోని కొత్తపల్లి నుంచి హైదరాబాద్ నగర శివారులోని మనోహరాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగుతున్న పనులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కొత్తపల్లి వరకు 74 కిలోమీటర్లు జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల నుంచి సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల మీదుగా కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు 74 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మించాల్సి ఉంది. సిరిసిల్ల పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు వెంట సమాంతరంగా ఈ నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించారు. దీనివల్ల విలువైన భూములు కోల్పోవడంతోపాటు రైల్వేలైన్కు అవతలి వైపు ఉన్న భూములకు రవాణా కష్టాలు తప్పవని భావించి, రైలు రూట్ను మార్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రం తాడూరు శివారులో రైల్వేస్టేషన్ నిర్మించాలని, మానేరు వాగు మీదుగా మధ్యమానేరు బ్యాక్వాటర్ ఉండే ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి మీదుగా వేములవాడ వరకు రైల్వేలైన్కు కొత్తగా ప్రతిపాదనలు చేశారు. రైల్వేలైన్ రూట్ మారడంతో భూసేకరణ సులభమవుతుందని భావిస్తున్నారు. సిద్దిపేట రైలుమార్గం పూర్తి.. రైల్వేలైన్ కోసం సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ఇప్పటికే 374 ఎకరాల భూములను సేకరించారు. వీటికి రూ.7.83 కోట్లు పరిహారంగా ఇచ్చారు. ఈ రైల్వేలైన్కు 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. దీనికయ్యే ఖర్చులో 33 శాతం, భూసేకరణ బాధ్యత వందశాతం రాష్ట్ర ప్రభుత్వానిదే. రైల్వేమార్గం కోసం కేంద్రం విధించిన అన్ని షరతులకు అంగీకరించి, కొత్త రైలు మార్గాన్ని సాధించారు. ఇప్పటికే సిద్దిపేట వరకు రైలు మార్గం పూర్తయింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రైల్వేట్రాక్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ భూసేకరణ దాదాపు పూర్తయింది. బహుళ ప్రయోజనాలు.. కొత్త రైలుమార్గంతో వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్లకు, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న సన్నిధికి రైలుమార్గం దరిచేరుతుంది. రోడ్డు మార్గం తప్ప మరో రవాణా వసతి లేని ఈ పట్టణాలకు రై లుమార్గం బహుళ ప్రయోజనాలను అందించనుంది. భక్తులు నేరుగా వేములవాడ చేరేందుకు ఉపయోగపడుతుంది. వస్త్రవ్యాపారాన్ని విస్తరించడంలో సిరిసిల్ల ప్రజలకు మేలు చేస్తుంది. వ్యాపార, వాణిజ్య పరంగా జిల్లా ప్రగతికి దోహదపడనుంది. అవసరమైన భూమి 740 ఎకరాలు రైల్వేలైన్ కోసం జిల్లాలోని 17 గ్రామాల్లో 740 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో ఇప్పటికే రెవెన్యూ అధికారులు సిరిసిల్ల నియోజకవర్గ పరిధి లో భూసేకరణ పూర్తి చేయగా.. వేములవాడ పరి ధిలో కొంతమేర పెండింగ్లో ఉంది. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో రైల్వేలైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైలు మార్గం : మనోహరాబాద్(మేడ్చల్ జిల్లా)–కొత్తపల్లి(కరీంనగర్ జిల్లా) దూరం : 162 కిలోమీటర్లు అంచనా వ్యయం : రూ.1,162 కోట్లు బడ్జెట్ కేటాయింపులు : 350 కోట్లు గత బడ్జెట్లో కేటాయింపు : రూ.165 కోట్లు ఇప్పటివరకు పూర్తయిన రైలు మార్గం : మనోహరాబాద్–సిద్దిపేట పూర్తి చేయాల్సింది : సిద్దిపేట–కొత్తపల్లికేంద్ర మంత్రి ‘బండి’పై ఆశలు కరీంనగర్ ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కుమార్పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రైల్వేలైన్ నిర్మాణంలో ఉండగా.. మరిన్ని నిధులు సాధించి, వేగంగా పూర్తి చేయిస్తారని ఆశిస్తున్నారు. మంత్రి చొరవ చూపితే.. సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్కు రైలు పరుగులు తీయనుంది. -
నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి ‘బండి’ రాక
సిరిసిల్లటౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని, స్థానిక కార్యకర్తలతో సమావేశమవుతారని నాయకులు తెలిపారు. రాజన్న ఆలయ ఈవో సెలవుల పొడిగింపు వేములవాడ: రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అనారోగ్య కారణాలతో ఈ నెల 16వ తేదీ వరకు సెలవు పెట్టారు. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జి ఈవోగా రామకృష్ణను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ నెల 17న తిరిగి విధుల్లో చేరాల్సిన ఈవోకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగించారని ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. అప్పటివరకు ఇన్చార్జి ఈవోనే ఉంటారని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీ త్వరగా ప్రారంభించాలిసిరిసిల్ల: ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ ఏడాది త్వరగా ప్రారంభించాలని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 వేలకు పైగా సొసైటీలకు సర్కారు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ నెలలో టెండర్లు పిలవనుందని, డిసెంబర్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు, అనంతగిరి, ఎగువ మానేరు రిజర్వాయర్లలో, 440 చెరువుల్లో చేపపిల్లలు వదలాల్సి ఉందన్నారు. ఈ ఏడాది కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. వేములవాడలో భారీ వర్షంవేములవాడ: వేములవాడలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం దాదాపు గంటన్నరపా టు వాన పడటంతో వాతావరణం ఒక్కసారి గా చల్లబడి, ఊపిరి పీల్చుకున్నారు. 7 నుంచి గ్రూప్–2 గ్రాండ్ టెస్టులుసిరిసిల్ల కల్చరల్: జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్–2 పరీక్షకు సంబంధించి గ్రాండ్ టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైందని సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి టెస్ట్ జూలై 7న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2, 9న ఉదయం పేపర్–3, మధ్యాహ్నం పేపర్–4 నిర్వహిస్తామన్నారు. రెండో గ్రాండ్ టెస్ట్ జూలై 15, 16వ తేదీల్లో, మూడో టెస్ట్ 22, 23న, నాలుగో టెస్ట్ 30, 31వ తేదీల్లో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు సిరిసిల్లవాసికి అవార్డుసిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన శ్రీకాళహస్తీశ్వర మ్యారేజ్ బ్యూరో యజమాని బైరి రాజమల్లు రాష్ట్రస్థాయిలో బంగారు నంది అవార్డు అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతి కళావేదికలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు అవార్డు అందించి, సత్కరించారు. తాను పేదింటి ఆడపిల్లలకు ఎలాంటి ఫీజు లేకుండా పెళ్లిళ్లు కుదుర్చుతున్నట్లు రాజ మల్లు పేర్కొన్నారు. సిరిసిల్లవాసికి అవార్డు రావడంపై స్థానిక మ్యారేజ్ బ్యూర్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
మస్కట్ అడవిలో పస్తులుంటున్నం
● గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని చీకోడువాసి ఆవేదన ● తనలా మరో 25 మందిదీ ఇదే బాధ ● కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చిన బాధితుడుముస్తాబాద్(సిరిసిల్ల): అప్పులు చేసి.. ఎన్నో ఆశలతో గల్ఫ్ బాట పట్టిన తమను ఏజెంట్ మోసం చేశాడని ఓ వలసజీవి ఆవేదన వ్యక్తం చేశాడు. తాము మస్కట్లో అడవిలో ఉంటూ తినడానికి తిండిలేక పస్తులుంటున్నామని మంగళవారం కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామానికి చెందిన సారంపల్లి బాబ మస్కట్ వెళ్లేందుకు సిరిసిల్ల కు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్కు అప్పు చేసి, రూ.లక్ష ఇచ్చాడు. అప్పుడు అతను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని అని చెప్పాడు. 15 రోజుల క్రితం అక్కడికి వెళ్లాక అడవిలో తుమ్మ చెట్లు కొట్టే పని చెప్పారు. తినడానికి తిండి లేదు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదు. కనీస వసతులు లేకుండా అడవిలో ఇబ్బందులు పడుతున్నామని, తనలాగా ఇక్కడ రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మరో 25 మంది ఉన్నారని బాబు తన కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఎలాగైనా తమను స్వస్థలాలకు వచ్చేలా చూడాలని కోరాడు. ఈ విషయమై ఎస్సై శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. చీకోడుకు చెందిన బాబు ఏజెంట్ చేతిలో మోసపోయాడన్న విషయం తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
రంగరాయిని చెరువు కబ్జాపై విచారణ
కోనరావుపేట(వేములవాడ): వట్టిమల్ల శివారులోని కమ్మరిపేటతండా రంగరాయిని చెరువును ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. ‘రంగరాయిని చెరువు కబ్జా’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. చెరువును ఆక్రమించి సాగు చేయడం, ఫలితంగా సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు నీరందని పరిస్థితిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెరువులో వేసిన బోర్లు, సాగవుతున్న పొలాలు, చేలు, చెరువును చదును చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి, చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. బోర్లు వేసి, పంటలు సాగు చేస్తున్నవారి వివరాలను సేకరించి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏఈ సాగర్ తెలిపారు. వర్క్ ఇన్స్పెక్టర్ బాలమల్లయ్య, తండావాసులు ఉన్నారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
వేములవాడఅర్బన్: అంగన్వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు కోరారు. వేములవాడ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో ఎల్లయ్యకు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు. టీచర్లు, హెల్పర్లు చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు, హెల్పర్లకు రూ.21 వేలు ఇవ్వాలన్నారు. సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని, టీచర్లకు ట్యాబ్లు ఇవ్వాలని, బీఎల్వో డ్యూటీలను రద్దు చేయాలని విన్నవించారు. -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
● వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి రుద్రంగి(వేములవాడ): వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, బైక్పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. నంబర్ ప్లేట్ లేని, మైనర్లు డ్రైవింగ్ చేసే, డ్రైవింగ్ లైసెన్సు, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత గంజాయి వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చదువు, క్రీడలపై దృష్టిసారించాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో మార్పుల ను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. హెడ్ కానిస్టేబుల్ బాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.