-
ఇది మంచి పద్ధతి కాదు.. ముద్రగడ ఆవేదన
కాకినాడ, సాక్షి: కాపుల రిజర్వేషన్ సాధించేందుకు పవన్ కల్యాణ్కు మంచి అవకాశం దొరికిందని.. అలాగే రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించేందుకు ఓ అడుగు ముందుకు వేయమని కాపు ఉద్యమనేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పవన్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారాయన.గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను. దీనికి సంబంధించిన గెజిట్ పేపర్లు ఆయన కు పంపిస్తున్నాను. పవన్ ను ప్రేమించే కాపు,బలిజ యువత నిత్యం బూతు సందేశాలు పెడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. అలా కాదంటారా.. మీ మనుషులను పంపి మా కుటుంబాన్ని చంపేయండి అని అన్నారాయన. -
యోగభాగ్యాలు
● మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందిస్తున్న యోగా ● ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆదరణ ● ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ యోగా ● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవం వచ్చిందిలా.. సనాతన భారతీయ శాస్త్రాల్లో యోగా ఒకటి. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలోనే పతంజలి మహర్షి దీనిని రచించారు. అనేక ప్రక్రియలపై పరిశోధనలు చేసి, స్వానుభవంతో ప్రపంచం ముందుకు తీసుకుని వచ్చారు. 2014 సెప్టెంబరు 27న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదించారు. దీనికి అమెరికా, కెనడా, చైనా సహా 193 దేశాలు మద్దతు పలికాయి. దీంతో, ఈ దినోత్సవానికి నిర్ణీత తేదీ చెప్పాలని ఐక్యరాజ్య సమితి మోదీని కోరింది. ఆయన సూచనల మేరకు ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. కాకినాడ క్రైం/పిఠాపురం/నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ)/ప్రత్తిపాడు: దేహాన్ని, మనసును ఐక్యం చేసే అద్భుత యోగం యోగా. యోగా అంటే అదేదో మునులు ముక్కు మూసుకుని చేసే తపస్సు కాదు. శరీరాన్ని మెలికలు తిప్పి చేసే అద్భుత విన్యాసం. మనసును, శరీరాన్ని సమన్వయంతో సమస్థితిలో ఉంచే మహత్తర ప్రక్రియ. కులమతాలకు అతీతంగా పూర్వీకులు మనకు ప్రసాదించిన ఆరోగ్య రహస్యం. ప్రపంచానికి భారత దేశం అందించిన మహా మంత్రం ఈ యోగ తంత్రం. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకునే వారే కాదు.. నిత్య జీవన యుద్ధంలో తలమునకలయ్యే వారు సైతం యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటున్నారు యోగా గురువులు. నిరంతరం యోగా చేసే వారి జీవిత కాలం అక్షరాలా వందేళ్ల పైనే అని అంటున్నారు. యోగా, ధ్యానం చేస్తున్న 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులు పలువురు నేటికీ ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో శుక్రవారం యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, జిల్లా యోగా అసోసియేషన్లు, పీఠికాపుర యోగా విద్యా పీఠం ఆధ్వర్యాన పిఠాపురం బాదం మాధవరావు ప్రభుత్వ బాలికల హైస్కూలు ప్లస్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో కూడా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు ● యోగా వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలై, అన్ని రకాల రుగ్మతలూ దూరమవుతాయి. శరీరం తేలికవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. మానసిక ప్రశాంతత కలిగి, భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ● శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి, ఊబకాయం, బరువు తగ్గుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. సైనస్, ఎలర్జీ సమస్యలు దూరమవుతాయి. వృద్ధాప్య ఛాయలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు. ● మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి నియంత్రణలోకి వస్తాయి. ● యోగాలో భాగంగా వేసే సూర్య నమస్కారాల్లోని వివిధ భంగిమల ద్వారా అత్యంత శక్తిమంతమైన సూర్యరశ్మి శరీరంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. దీనివలన మెదడు, గుండె, వెన్నెముక, కీళ్లు, ఎముకలు, కండరాలు.. ఇలా శరీరంలోని అన్ని అవయవాలకూ నూతన శక్తి చేకూరుతుంది. శాసీ్త్రయ నిరూపణ ● లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు యోగ సాధకుల అనుభవం, పలు పరిశోధనల ఆధారంగా యోగా వల్ల మెదడు, శరీరంలో వచ్చే మార్పులపై ఓ స్పష్టతకు వచ్చారు. ఒత్తిడిని సమూలంగా నియంత్రించే ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ లేని ఒకే ఒక్క సాధనం యోగా అని శాసీ్త్రయంగా నిర్ధారించారు. ఉదాహరణకు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు శరీరాన్ని అన్ని వైపులకూ వంచుతాం. దీనివలన మెదడులోని ఎమోషనల్ బ్రెయిన్ అనే భాగంలో భంగిమలకు అనుగుణంగా కృత్రిమ ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ భంగిమలో ముందుకు వంగినప్పుడు తలలో రక్త ప్రసరణ జరిగి లాజికల్ బ్రెయిన్ స్పందిస్తే, మరో భంగిమలో ముందుకు వంగడం వల్ల పారా నాడీ వ్యవస్థలో రిలాక్స్ రెస్పాన్స్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియకు కొనసాగింపుగానే పారా సింపాథిటిక్ నాడీ వ్యవస్థలో స్విచ్లు, జంక్షన్లు ఉంటాయి. వివిధ ఆసనాలు వేసే క్రమంలో మెడ, నడుము, కాళ్లు, చేతులు, భుజం వంచడం ద్వారా ఈ స్విచ్లను నియంత్రించి మెదడులో ఒత్తిడి తగ్గుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. ● బ్రెజిల్లోని ఇజ్రాయిలిటా ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైద్య కేంద్రం పరిశోధకులు యోగా వల్ల మెదడులో కలిగే మార్పులను ‘ఫ్రంటైర్స్ ఇన్ ఈజింగ్ న్యూరో సైన్స్’ అనే సంచికలో తాజాగా ప్రచురించారు. యోగా చేసే 45 ఏళ్లు పైబడిన సీ్త్రలలో సెరిబ్రల్ కార్టిక్స్ పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ సెరిబ్రల్ కార్టిక్స్ పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్లే మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ యోగా యాంటీ ఏజింగ్, రివర్స్ ఏజింగ్ టెక్నిక్గా ఉపయోగపడి, సెరిబ్రల్ కార్టిక్స్ పరిమాణం పెంచుతుందని పేర్కొంది. ● మానసిక వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు, జనరల్ ఎండీలు, ఆంకాలజిస్టులు తమ వైద్య సేవల్లో యోగాను అంతర్భాగం చేస్తున్నారు. దీంతో యోగా ఓ థెరపీగా కూడా ఎదిగింది. ● పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్లో కూడా యోగానే మందు. అలాగే క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీని తట్టుకునేందుకు కూడా యోగా సహాయ పడుతుంది. ● చర్మం, జుట్టు ఆరోగ్యానికి, మలబద్ధకం నివారణకు, ప్రసవం సునాయాసంగా జరగడానికి, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో యోగా, ధ్యానం దివ్యౌషధాలు. 67 మంది సర్టిఫైడ్ శిక్షకులు జిల్లాలో అధికారికంగా 67 మంది సర్టిఫైడ్ యోగా శిక్షకులున్నారు. అధికారికంగా నమోదైన యోగా కేంద్రాల సంఖ్య 31. రిజిస్ట్రేషన్ లేకుండా కొనసాగుతున్నవి మరో 36గా అంచనా. మొత్తంమీద జిల్లాలోని సుమారు 42 యోగా కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అలాగే, జిల్లాలోని 411 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కూడా రోగులకు యోగా శిక్షణ ఇస్తున్నారు. గడచిన రెండేళ్లుగా జాతీయ స్థాయి యోగా పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు 17 మంది ఉన్నారు. అనారోగ్యంగా ఉంటే యోగా వద్దు మనసును ప్రశాంతంగా ఉంచుకుని, కేవలం శ్వాస మీదే ధ్యాస పెడుతూ నెమ్మదిగా ఆసనాలు వేయాలి. వేగంగా వేయడం వల్ల ఫలితం ఉండదు. ప్రాణాయామంతో ఆరంభించాలి. దీనివలన ఎక్కువ సమయం యోగా చేయవచ్చు. చివరిలో ప్రశాంతత కోసం శవాసనం వేయాలి. దీనివలన శరీరం రిలాక్స్ అవడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత యోగాసనాలు అస్సలు వేయకూడదు. అందుకే ఎక్కువ మంది ఉదయాన్నే లేచి, పరగడుపున యోగ సాధన చేస్తారు. ఆస నాలకు అరగంట ముందు చిన్న గ్లాసు నీరు తాగవ చ్చు. అనారోగ్యంగా ఉంటే యోగాసనాలు వేయవద్దు. – జ్యోతుల నాగేశ్వరరావు, యోగా గురువు, గొల్లప్రోలు సంపూర్ణ ఆరోగ్యం ప్రతి రోజూ ఒక గంట యోగాసనా లు వేయడం వలన అనేక రోగాలు దరి చేరకుండా చేసుకోవచ్చు. ప్రస్తుత ఒత్తిడి ప్రపంచాన్ని జయించాలంటే యోగా ఒక్కటే మార్గం. ఐదేళ్ల నుంచి 70 సంవత్సరాల వయస్సు పైబడిన వారు కూడా యోగా చేయవచ్చు. – చిట్టూరి చిట్టిబాబు, యోగా శిక్షకుడు, కాకినాడ యోగాకు ప్రత్యేక స్థానం మన సంప్రదాయంలో యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. ఔషధాల వాడకాన్ని తగ్గించి, దేహదారుఢ్యాన్ని, ముఖవర్చస్సును పెంపొందించే శక్తి యోగాకు ఉంది. దీని ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – తాతపూడి బుజ్జి, యోగా గురువు, హెల్దీ యోగా శిక్షణ కేంద్రం, ప్రత్తిపాడు ఉచితంగా యోగా శిక్షణ విశ్రాంత బ్యాంకు ఉద్యోగినైన నేను నా గురువు మహానందికి చెందిన స్వర్గీయ భిక్షమయ గురూజీ స్ఫూర్తితో ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నాను. సొంత సొమ్ము వెచ్చిస్తూ ప్రతి రోజూ కనీసం 40 నుంచి 50 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నాను. కాకినాడ కేంద్రంగా సత్యసాయి ధ్యాన మండలి పేరుతో ఎందరినో యోగా సాధకులుగా తీర్చి దిద్దాను. ప్రతి ఒక్కరూ యోగా సాధకులు కావాలి. తద్వారా పూర్తి శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలి. – దంగేటి సత్యనారాయణ, యోగా శిక్షకుడు, కాకినాడ మహిళలకు ఎంతో మేలు మహిళల ఆరోగ్యానికి యోగా ఓ ఔషధం వంటిది. ఇటీవల మహిళల ఆరోగ్యం, శరీర సౌష్టవంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి. దీనికి సమాధానం యోగానే. రుతుస్రావ సమస్యలు సహా పీసీఓడీ, చర్మం, జుట్టు ఆరోగ్యం, దేహ నిర్మాణానికి యోగా ఎంతో ఉపకరిస్తుంది. ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో నిత్యం పదుల సంఖ్యలో మహిళలు, పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. ఎంతో మంది మహిళలు చక్కటి ప్రయోజనాలు పొందారు. యువతులు యోగాకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలా చేస్తే వైవాహిక జీవితంలో ప్రసవం మొదలు 50 ఏళ్ల వయసులో వచ్చే పోస్ట్ మెనోపాజ్ దశ వరకూ, ఆ పైన సమస్యలేవీ ఉండవు. కొందరు ఉత్సాహంగా మొదలు పెట్టినా కూడా కొనసాగింపు కరువవుతోంది. – ఎస్.ఇందిరాదేవి, యోగా శిక్షకురాలు, జిల్లా స్పోర్ట్ అథారిటీ శిక్షణ కేంద్రం, కాకినాడప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో యోగా జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో యోగా శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 411 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై ఎంఎల్హెచ్పీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వీరు ఆరోగ్య కేంద్రానికి వచ్చే మహిళలు, పిల్లలతో యోగాసనాలు వేయించి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. – డాక్టర్ నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ శుక్రవారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2024ఆధునిక యాంత్రిక జీవనంలో మానవులు ఎన్నో ఆటుపోట్లకు, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ అంతా ఉరుకులు పరుగులే. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైతం కొంత సమయాన్ని కేటాయించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా మానసిక ఆందోళన, చిరాకు, కోపం వంటి వాటికి లోనవుతున్నారు. అవి మనసు పైనే కాకుండా శారీర ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం శూన్యం. ఇది మానసికంగా మరింత కుంగదీస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వారి అనారోగ్య సమస్యలను పటాపంచలు చేసి, మానసిక ప్రశాంతతను చేకూర్చే దివ్యౌషధం యోగా. అంతర్గత చేతనా శక్తిని మనసుకు, శరీరానికి సంపూర్ణంగా అందించి సక్రమమైన జీవన విధానాన్ని అందించే అద్భుత ప్రక్రియ. రకరకాల మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తే, యోగా మాత్రమే దీర్ఘకాలిక ఊరటనందిస్తోంది. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. -
ఆయిల్పామ్ సాగుకు రాయితీలు
తుని రూరల్: జిల్లాలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు తెలిపారు. తుని మండలం డి.పోలవరంలో పతంజలి ఆయిల్పామ్ నర్సరీ, మొక్కతోటలు, తేటగుంట ప్రభుత్వ ఉద్యాన క్షేత్రంలో కొబ్బరి, జీడిమామిడి నర్సరీలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2024–25 సీజన్లో జిల్లావ్యాప్తంగా 3 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ తోటలను విస్తరించనున్నామని తెలిపారు. తుని నియోజకవర్గంలో 350 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డి.పోలవరం నర్సరీలో 1.20 లక్షల ఆయిల్పామ్, తేటగుంట నర్సరీలో 50 వేల కొబ్బరి, 15 వేలు జీడిమామిడి మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచామని వివరించారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు పతంజలి సంస్థ పూర్తి రాయితీతో మొక్కలు అందిస్తుందన్నారు. ఉద్యాన పంటల్లో అంతర పంటలు సాగు చేసే రైతులకు సంవత్సరానికి రూ.5,250 చొప్పున నాలుగేళ్లకు రూ.21 వేలు, ఎరువుల నిర్వహణకు నాలుగేళ్లకు రూ.21 వేలు అందిస్తామని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేశామన్నారు. ఆయిల్పామ్లో వినియోగించే కట్టర్లు, నిచ్చెనలు తదితర పరికరాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తామని, ఈ అవకాశాలను సన్న, చిన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్లికార్జునరావు కోరారు. కార్యక్రమంలో తుని ఉద్యాన అధికారి జి.విజయలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. -
శ్రీసత్యనారాయణం.. చతుర్వేద పారాయణం
● రత్నగిరిపై నిత్యం నాలుగు వేదాల పారాయణ ● సుస్వరంగా చదువుతున్న 11 మంది వేద పండితులు ● సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకూ కొనసాగింపుఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడు వెలసిన రత్నగిరి ప్రతి నిత్యం వేద పారాయణతో పునీతమవుతోంది. ఆలయంలో ప్రతి నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి 11.30 గంటల వరకూ నాలుగు వేదాల పఠనం కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది. వేదపఠనంతో పాటు రోజూ తెల్లవారుజామున జరిగే సత్యదేవుని సుప్రభాత సేవ, ఉదయం ఏడు గంటలకు నిర్వహించే పంచహారతుల సేవ, 9.30 గంటల నుంచి జరిగే స్వామివారి నిత్య కల్యాణం, రాత్రి జరిగే పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకార సేవ, పవళింపు సేవతో పాటు, హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాల్లో కూడా స్వామి, అమ్మవార్లకు వేదపండితులు ఆశీస్సులు సమర్పించే కార్యక్రమం కూడా జరుగుతోంది. ప్రముఖులు, టికెట్టుపై వివిధ సేవల్లో పాల్గొంటున్న భక్తులకు కూడా వేదాశీర్వచనం చేస్తున్నారు. దేవస్థానంలో ఋగ్వేద, సామవేద, యజుర్వేద (శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం), అథర్వ వేదాలకు చెందిన 14 మంది వేద పండితులు ప్రతి రోజూ స్వామివారి సన్నిధిలో విధులు నిర్వహించేవారు. వీరిలో ముగ్గురు గత ఏడాది పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం 11 మంది వేదపండితులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి 11.30 గంటల వరకూ వీరు వంతుల వారీగా నాలుగు వేదాలూ పఠిస్తున్నారు. గురువారం 8.30 నుంచి 9 గంటల వరకూ కృష్ణ యజుర్వేదాన్ని ఉపాధ్యాయుల రమేష్ ఘనపాఠి, చిట్టి శివ ఘనపాఠి, ముష్టి పురుషోత్తం ఘనపాఠి పఠించారు. సుస్వరంగా, కర్ణపేయంగా సాగిన వీరి వేద పఠనానికి భక్తులు ముగ్ధులయ్యారు. వీరి తండ్రులు ఉపాధ్యాయుల నాగ యజ్ఞేశ్వర ఘనపాఠి, చిట్టి ఘనపాఠి, ముష్టి కామశాస్త్రి ఘనపాఠి కూడా దేవస్థానంలో ప్రధాన ఘనపాఠిలుగా విధులు నిర్వహించి, పదవీ విరమణ చేశారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి పలు సన్మానాలు పొందారు. కాగా, మైక్ సిస్టమ్ ద్వారా వేద పఠనం భక్తులందరికీ వినిపించేలా ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను పలువురు కోరుతున్నారు. -
ఉద్యోగులు క్రమశిక్షణ కలిగి ఉండాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజలే ముందు అనే విధానంలో మార్గదర్శకాల విషయంలో రెవెన్యూ ఉద్యోగులు సమయానుకూలంగా అంకిత భావంతో పని చేయాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన తొలి రెవెన్యూ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన రోజును పురస్కరించుకుని ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం నిర్వహించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో రెవెన్యూ, పోలీసు శాఖలు 24 గంటలూ భాగస్వాములు కావాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు మాట్లాడుతూ, రెవెన్యూ విధులు – కర్తవ్యాలపై ప్రభుత్వ మార్గదర్శకాలను దిగువ స్థాయి సిబ్బంది వరకూ అందరికీ పుస్తక రూపంలో అందించామని చెప్పారు. ఈ సందర్భంగా విశ్రాంత డీఆర్ఓ జితేంద్ర, పరిపాలన అధికారి కె.శ్రీనివాసరావు, తహసీల్దార్లు గణేశ్వరరావు, సూర్యనారాయణ, చంద్రశేఖర్లను జేసీ తేజ్భరత్ తదితరులు ఘనంగా సన్మానించారు. శిలాఫలకంపై తెల్ల ప్లాస్టర్లు రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకంపై గుర్తు తెలియని దుండగులు తెల్లని ప్లాస్టర్లు అతికించిన ఘటన నగరంలో గురువారం చోటు చేసుకుంది. ఏడో డివిజన్ గానుగ వీధిలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకంపై వైఎస్సార్ సీపీకి చెందిన నాటి మంత్రులు, ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. వీటిపై గుర్తు తెలియని వ్యక్తులు తెల్లకాగితం అతికించారు. కలెక్టర్, ఇతర అధికారుల పేర్లు అలాగే వదిలేశారు. టీడీపీ శ్రేణుల చేతిలో మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం ధ్వంసం ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై నగర ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం సంస్కృతి అని విమర్శిస్తున్నారు. శిలాఫలకంపై దుండగులు అతికించిన తెల్లని ప్లాస్టర్లను నగరపాలక సంస్థ అధికారులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఖరీఫ్ సాగుకు సమగ్ర కార్యాచరణ
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ నివాస్, వ్యవసాయ అధికారులు ● వ్యవసాయ శాఖ సిద్ధం కావాలి ● కలెక్టర్ నివాస్ ఆదేశం కాకినాడ సిటీ: రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ఖరీఫ్ సన్నద్ధతపై జిల్లా వ్యవసాయ అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, స్టాక్ పాయింట్ల ద్వారా పంపిణీ, భవిష్యత్తు అవసరాలు, విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు, సీసీఆర్సీల పంపిణీ, పొలంబడి వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యకలాపాలు, ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్ కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, ఖరీఫ్లో సుమారు 97,543 హెక్టర్లలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సొసైటీలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేస్తున్న విత్తనాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్లో రైతులకు అమ్ముతున్న విత్తనాలు, ఎరువుల నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షలు నిర్వహించి, వారం రోజుల్లోగా వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్సీ) మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న కౌలు కార్డులు పునరుద్ధరించాలని, కొత్త కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పొలంబడి కార్యక్రమం సక్రమంగా నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి సహజసిద్ధమైన జీవ రసాయన ఎరువుల తయారీ, వినియోగంతో కలిగే లాభాల ప్రయోజనంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు సకాలంలో నాట్లు వేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, కరప, తుని, జగ్గంపేట అదనపు వ్యవసాయ అధికారులు, వివిధ మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. -
పవన్ నిర్ణయం అన్యాయం
అమలాపురం రూరల్: రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉపాధి హామీ పథకం నిధులు హార్టికల్చర్కి అనుసంధానం చేస్తూ సంతకం చేయడం అన్యాయమని, దీనిపై పునరాలోచన చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం అమలాపురం మండలం ఎ.వేమవరం గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కూలీలు పని చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు మెటీరియల్కు, ఇటు హార్టికల్చర్ వంటి పనులకు 80 శాతం నిధులు మళ్లిస్తున్నాయని అన్నారు. ఇక ఉపాధి కూలీలకు పనులు ఏ నిధులతో కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులందరికీ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలన్న లక్ష్యం పక్కదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకానికి దేశవ్యాప్తంగా రూ.రెండున్నర లక్షల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పథకంలో అనేక పనులను కుదించారని కోనసీమ లాంటి ప్రాంతాల్లో చేపట్టేందుకు కేవలం పంటకాలువలు, మురుగు డ్రైన్ల పనులు మాత్రమే ఉన్నాయని, జంగిల్ క్లియరెన్స్, గురపుడెక్క పనులను తొలగించారని చెప్పారు. 200 రోజులు ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించే ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పొలమూరి శ్రీనివాసరావు, పెట్టా ఆనందరావు పాల్గొన్నారు. ● ఉపాధి హామీ నిధులు దారి మళ్లించడం తగదు ● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు -
వైభవంగా శ్రీపుష్పయాగం
20ఆర్జడ్ఎల్85 : ● ముగిసిన శ్రీవారి కల్యాణోత్సవాలు ● ఘనంగా ద్వాదశ ప్రదక్షిణలు మామిడికుదురు: శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ అయిదు రోజుల పాటు కనుల పండువలా సాగిన అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలు గురువారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్పాల సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీబాల బాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉఽభయ దేవేరులతో కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. పసుపు, కుంకుమ, రవికల గుడ్డ అందజేశారు. ముందుగా సుప్రభాత సేవతో అయిదో రోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్ర నామార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. బాల భోగం, నివేదన, వేద పారాయణం హృద్యంగా ఆలపించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యహోమం, నిత్యారాధన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి, తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్థానం ఽకార్య నిర్వహణాధికారిణి గ్రంధి మాధవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ఆద్యంతం కనుల పండువలా జరిగాయి. స్వామి వారి శ్రీపుష్పయాగంలో పాల్గొన్న భక్తులు -
ఇసుక దోపిడీని అరికట్టాలి
డీసీసీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు డిమాండ్ మండపేట: మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలో యథేచ్ఛగా జరుగుచున్న ఇసుక దోపిడీని తక్షణం అరికట్టాలని ఏఐసీసీ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఆయన మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంఽధించిన ఇసుక ర్యాంపుల గట్లపై లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇసుక నిల్వ చేసిందన్నారు. ఆ గుట్టలపై కూటమి నాయకుల కన్ను పడి దోపిడీకి తెర తీశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఫ్రీ ఇసుక విధానం తీసుకొస్తానని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలోని మీ నాయకులు అయినకాడికి దోచుకుతిన్నాక గాని ప్రభుత్వ పాలసీని అమలు చేయరా అని దుయ్యబట్టారు. ఐదు రోజులుగా రాత్రిపగలు తేడా లేకుండా జరుగుతున్న ఇసుక దోపిడీని కలెక్టర్ అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మిన్నకుండి పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు తాను జిల్లా కలెక్టర్కు లేఖ రాశానని వెల్లడించారు. ఇసుక నిల్వలను ఇష్టానుసారం దోచుకుపోతే ఈ వర్షాకాలంలో ఏర్పడే ఇసుక కొరతను ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడూ.. ప్రభుత్వం మీ ఒక్కరి సొత్తేం కాదు.. ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను కామన తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే అధికారులు మర్యాదలు చేసి మరీ చెప్పిన పని చేస్తారని అనడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏ ఒక్క పార్టీకో లేక ఏ ఒక్కో నాయకుడికో సంబంధించింది కాదన్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన హెచ్చరించారు. -
లే అయ్యా.. పనికి వెళదాం
● కారు ఢీ కొని వ్యవసాయ కూలీ మృతి ● మృతదేహం వద్ద హృదయ విదారకంగా విలపించిన భార్య అంబాజీపేట: పనికి వెళ్లే వేళయ్యింది.. లే అయ్యా త్వరగా కూలి పనికి పోదామంటూ మృతుని వద్ద భార్య రోదిస్తున్న తీరు చూపరులకు కంట తడిపెట్టించింది. అప్పటి వరకు కలిసి భార్యాభర్తలిద్దరూ ఇంటి వద్ద ఆనందంగా గడిపి పనికి వెళుతుండగా మార్గమధ్యలో ఆమె భర్తను కారు రూపంలో మృత్యువు కాటేసింది. కముజువారిలంకలో గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పని చేసుకునేందుకు భార్యతో కలిసి నడచి వెళుతున్న ఓ కూలీని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కముజువారిలంకకు చెందిన విత్తనాల నాగేశ్వరరావు (58) తన భార్య వెంకటలక్ష్మితో కలిసి వ్యవసాయ కూలి పనికి వెళుతున్నాడు. ఈ సమయంలో ముక్కామల నుంచి కొత్తపేట వైపు వెళుతున్న కారు నాగేశ్వరరావును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దాంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది నాగేశ్వరరావును పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారని, అతని మృతితో వెంకటలక్ష్మి పరిస్థితి ఏమిటోనని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా తన ఎదుటే భర్త మృతి చెందడంతో వెంకటలక్ష్మి బోరున విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
తెరచుకున్న దుఃఖాణాలు
● ప్రైవేటు స్కూళ్లలో సైడ్ బిజినెస్ ● పెన్సిల్ నుంచి నోట్బుక్స్ వరకు ధరల బాదుడు ● తాము చెప్పిందే ధర, ఇచ్చినవే బుక్స్ ● అడ్డూ, అదుపూ లేని దోపిడీ ● బెంబేలెత్తుతున్న సామాన్యులు ● ఎన్ని ఫిర్యాదులు చేసినా తనిఖీలు చేయని విద్యాశాఖ కాకినాడ సిటీ: జిల్లాలో కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండగా బుక్స్, బ్యాగు, చివరికి షూ సైతం తమ పాఠశాలలోనే తీసుకోవాలనేది ఆ యాజమాన్యాల ఆదేశం. బుక్స్ ఇతర మెటీరియల్ కలిపి రూ.10 వేల నుంచి రూ.14 వేలు దాటుతున్నాయి. వాటి ధర మార్కెట్లో రూ.5 వేలే. ఇదేమని అడిగితే ఇవి తీసుకుంటేనే ఇక్కడ చదవాలనే కండిషన్, లేకుంటే నో అడ్మిషన్, బయటి బుక్స్ తెస్తే, నో పర్మిషన్, జిల్లాలో దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పరిస్థితి ఇదే... జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు. నియంత్రణ లేని ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందుతుందనే అభిప్రాయంతో నగర పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తమ పిల్లలను నగంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్, మెయింటినెన్స్, స్పెషల్ ఫీజులు అంటూ రక్తం పీలుస్తున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలల్లో యథేచ్ఛగా పుస్తకాలు, నోట్బుక్లు కొనాలని అదేశిస్తూ తమ పాఠశాల పేర్లతో ఉన్న బ్యాగులను సైతం విక్రయిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు మొదలు, బ్యాగులు, టై, బూట్లు, షూ వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లా అధికారులు కొలువుండే కాకినాడ నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలా ఉందో చెప్పనవసరం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా విద్యాశాఖ మాత్రం ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. ఆకాశంలో బ్యాగుల ధరలు నర్సరీ నుంచి పదో తరగతి వరకే కాకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకూ బ్యాగు తప్పనిసరైంది. చాలా కంపెనీలు విద్యార్థులను ఆకర్షించేలా వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడల్స్లో బ్యాగులను విడుదల చేస్తున్నాయి. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు కొన్ని పుస్తకాలు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వారికి మాత్రం కచ్ఛితంగా నాణ్యమైన బ్యాగు లేనిదే ముందుకు కదలలేని పరిస్థితి. చిన్న పిల్లల బ్యాగులు దాదాపు రూ.250 నుంచి రూ.600 వరకు, ఆరో తరగతి చదివే పిల్లలకు దాదాపు రూ.1,000 వరకు బ్యాగుల ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం బ్యాగుల ధరలు గతంలో పోల్చితే దాదాపు రూ.310 వరకు పెరిగాయి. యూనిఫాంలు అటువైపుగానే.. విద్యార్థులు తప్పనిసరిగా యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే ధరించాల్సిందే. వీటి ధరలు కూడా గత సంవత్సరంతో పోల్చితే చాలా పెరిగాయి. క్రితం ఏడాది నర్సరీ పిల్లలకు కావల్సిన స్కూల్ యూనిఫాం దాదాపు రూ.600 నుంచి రూ.850 వరకు ఉండగా ఇప్పుడు రూ.1,000 నుంచి రూ.1,200 చేరుకుంది. ఒక విద్యార్థికి కనీసంగా రెండు యూనిఫాంలు ఉండాలి. లేదంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జతను కొనుక్కోవడం, కుట్టించుకోవడం తప్పనిసరి. జిల్లా కేంద్రంలో చాలా దుకాణాల్లో రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది రెడీమేడ్ దుస్తులను వాడితే మరి కొంతమంది కొనుక్కొని కుట్టించుకుంటున్నారు. భగ్గుమంటున్న బూట్ల ధరలు ప్రతీ పాఠశాలలో యూనిఫాం దానికి తగ్గట్టుగా బూట్లు బ్లాక్ కలర్, వైట్ కలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్ కొనుగోలు చేయాలని చె బుతున్నాయి. గతేడాది పలు కంపెనీలకు చెంద ని బూట్లు దాదాపు రూ. 300 నుంచి రూ.450 వరకు ఉండగా ఇప్పుడు 10 నుంచి 20 శాతం వరకు పెరిగి కనీసం రూ.750 లేనిదే మంచి బూట్లు రాని పరిస్థితి నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించొద్దు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పాఠ్య పుస్తకాలు, తదితర వస్తువులు అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధం. ఫీజుల విషయంలో జీవోలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. పాఠశాలల్లో పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మడానికి వీలులేదు. అలాంటివి జరిగితే మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ పుస్తకాల ధరలు ౖపైపెకి.. బయట షాపుల్లో ఓ పుస్తకం ధర రూ.20 ఉంటే పాఠశాలలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉంటుంది. ఇంకొన్ని పాఠశాలల్లో అయితే రూ.40 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒకటో తరగతికి సంబంధించి 11 టెక్ట్స్బుక్స్కు రూ.1,220, 13 నోట్బుక్స్కు రూ.530 మొత్తం రూ.1,750 వసూలు చేస్తుండగా, కొన్నిచోట్ల రూ.5 వేలకు పైగానే తీసుకుంటున్నారు. రెండో తరగతి 11 టెక్ట్స్బుక్స్కు రూ.1,850, 21 నోట్ బుక్స్కు రూ. 760 మొత్తం రూ.2,610 కాగా, మరికొందరు రూ.6 వేలు తీసుకుంటున్నారు. మూడో తరగతి 10 టెక్ట్స్బుక్స్కు రూ.1,990, 22 నోట్బుక్స్కు రూ.660, మొత్తం రూ. 2,560 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. -
కొత్త రకాల సాగులో జాగ్రత్తలు
అమలాపురం రూరల్: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మార్టేరు రూపొందించిన ఎంటీయూ 1310, ఎంటీయూ 1275 రకాలను ఈ ఖరీఫ్ కోసం సిఫారసు చేస్తున్నట్టు అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాంకేతిక సలహా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ నంద కిషోర్ తెలిపారు. ఇందులో ఎంటీయూ 1310 రకం, 140 రోజులు కాల పరిమితి కలిగి ఎకరానికి 35–40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. గింజ రాలిక తక్కువ వుండి, అగ్గి తెగులును, మెడ విరుపు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఎంటీయూ 1275 రకం, 140 రోజులు కాల పరిమితి కలిగి ఎకరానికి 35–40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. కాండం ధృడంగా వుండి, చేను పడిపోదు, గింజ రాలిక తక్కువ. గింజ మధ్యలో సన్నగా వుండి, బియ్యం పారదర్శకంగా ఉండి, ఎక్కువ నిండు గింజలు కలిగి ఉంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడి నిచ్చే ఈ రకం అగ్గి తెగులు, మెడ విరుపు, ఎండాకు, గోధుమ మచ్చ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. నారుమడి పెంపకంలో సూచనలు ● నారుమడిని 10–12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి, చదును చేసి, నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాల్వలు ఏర్పాటు చేయాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని అంటే సుమారు 5 కిలోల యూరియా (విత్తనం చల్లే ముందు 2.5 కిలోలు, విత్తిన 10–15 రోజులకు మరొక 2.5 కిలోలు వేయాలి.) కిలో భాస్వరం అంటే 6 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, 1 కిలో పొటాస్ అంటే 2 కిలోల మ్యూరేట్ ఆప్ పొటాష్ ఎరువులు వేయాలి. ● ప్రతి 5 సెంట్ల నారుమడికి 25 కిలోల విత్తనం, విత్తన శుద్ధి చేసి మొలక కట్టి చల్లాలి. నారుకు ఒక ఆకు పూర్తిగా విచ్చే వరకు ఆరుతడిగా నీరు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి. పొడి విత్తన శుద్ధి ● ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ పొడి మందును విత్తనానికి పట్టించి 24 గంటలు నాన బెట్టి, 24 గంటలు మండి కట్టి, నారుమడిలో చల్లు కోవాలి. తడి విత్తన శుద్ధి ● లీటరు నీటికి గ్రాము కార్బెండజిమ్ పొడి మందును కలిపి, అందులో కిలో విత్తనాలను 24 గంటలు నాన బెట్టి, 24 గంటలు మండి కట్టి, నారుమడిలో చల్లు కోవాలి. ఈ విధంగా చేయటం వల్ల నారుమడి దశలో ఆశించే తెగుళ్లను చాలావరకు నివారించవచ్చు. సస్య రక్షణ ● ఇక నారుమడిలో ఆశించే కాండం తొలిచే పురుగు, ఉల్లి కోడు, హిస్పా పురుగు నివారణకు విత్తిన 10 రోజులకు కార్బొప్యురాన్ 3 జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున నారుమడిలో పలుచగా నీరు వుంచి చల్లాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లేదా క్లోరిఫైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బొప్యురాన్ 3 జి గుళికలు ఇసుకలో కలిపి నారుమడిలో పలుచగా నీరు వుంచి చల్లాలి. కలుపు నివారణ ● నారుమడిలో గడ్డి జాతి కలుపు నివారణకు పైరజో సల్ఫ్యూరాన్ ఇదైల్ 10శాతం డబ్ల్యూపీ 80 గ్రాములు, లేదా ప్రిటిలాక్లోర్ ఫ్లస్ సెప్నర్ 400 మి.లీ. ఒక ఎకరానికి చొప్పున 20 కిలోల పొడి ఇసుకలో కలిపి విత్తిన 3–5 రోజుల లోపు చల్లుకోవాలి. ● నారుమడిలో గడ్డి జాతి వెడల్పాకు కలుపు నివారణకు బిస్ పైరీబాక్ సోడియం 108 ఎస్.ఎల్. 100 మి.లీ. ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15–20 రోజులకు చల్లాలి. రైతులు పైన తెలిపిన సూచనలు పాటిస్తూ ఆరోగ్య వంతమైన నారును పెంచుకోవాలని ఆయన సూచించారు. ఖరీఫ్లో ఎంటీయూ 1310, ఎంటీయూ 1275 సిఫారసు వీటికి చీడ పీడలను తట్టుకునే సామర్థ్యం ప్రయోగాత్మకంగా పరిశీలన అనంతరం నిర్ధారణ జిల్లా సాంకేతిక సలహా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ నంద కిషోర్ -
అమెరికా వెళ్లేందుకు ఉత్తమ మార్గదర్శకత్వం
జేఎన్టీయూకే ఉపకులపతి ప్రసాదరాజు కాకినాడ సిటీ: విదేశాలల్లో స్థిరపడిన జేఎన్టీయూకే పూర్వ విద్యార్థులను యూనివర్శిటీ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు వారి ఆహ్వానం మేరకు చేపట్టిన అమెరికా ప్రయాణం విజయవంతమైందని ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వారా పూర్వ విద్యార్థుల లతో యూనివర్సిటీ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. తద్వారా ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉత్తమ మార్గదర్శకత్వం లభిస్తుందన్నారు. ప్రాయోజిత పరిశోధనా ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమల సహకారాన్ని పొందడంతో పాటు విద్యార్థులకు మెరుగైన ఇంటర్న్షిప్స్ లభిస్తాయన్నారు. యూఎస్ విశ్వవిద్యాలయాలతో కలిసి ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా జాయింట్ ఎంఎస్ ప్రోగ్రామ్లు నిర్వహించేందుకు తగిన చర్యలు చేపడతామని వివరించారు. జేఎన్టీయుకే క్యాంపస్లో విద్యా వాతావరణాన్ని మరింత మెరుగు పర్చేందుకు కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ సహకారం అందించనుండడం అభినందనీయమన్నారు. యూనివర్శిటీకి న్యాక్ ఏ+, కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు లభించడం, విద్యార్థులకు మెరుగైన ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా యూనివర్శిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రా, యూనివర్శిటీ ఆఫ్ మిస్సారీ, టెక్సాస్ ఏ అండ్ ఎం, చికాగో స్టేట్ యూనివర్శిటీ సందర్శించడంతో పాటు చికాగోలోని కాన్సులేట్ జనరల్ను కలిశానన్నారు. పూర్వ విద్యార్థులైన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కావడంతో పాటు వోజిక్ ఏఐలో ఇంటర్న్షిప్ అందించేందుకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థి డాక్టర్ వాసు తదితరులకు అభినందనలు తెలిపారు. యూఎస్ పర్యటనకు తనతో పాటు యూసీఈకే ప్రిన్సిపాల్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, కెనడా నుంచి ప్రొఫెసర్ జేవీఆర్ మూర్తిలతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లినట్టు తెలిపారు. జేఎన్టీయూకే ప్లాటినం జూబ్లీ అండ్ అలూమ్ని సెంటర్ నిర్మాణానికి పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించడంలో కీలకపాత్ర పోషిస్తున్న సీతా ముత్యాలభాస్కరరావును కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు వీసి ప్రసాదరాజు వివరించారు. -
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి
అమరావతి/కాకినాడ, సాక్షి: అన్న మాట ప్రకారం పేరు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్ విడుదలైంది. -
ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రేపు
కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో శుక్రవారం జెన్పాక్ట్ కంపెనీలో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ (వాయిస్ ప్రొసెస్ ఇంగ్లిషు) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి రూ.21 వేల జీతం, ఇన్సింటివ్, పీజీ ఉత్తీర్ణులైన వారికి సంవత్సరానికి రూ.2.5 లక్షలు, ఇన్సింటివ్స్, ఎక్స్పీరియన్స్ అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.5 లక్షలు, ఇన్సింటివ్స్ ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఎంపికైన వారు నానక్రామ్గుడా, హైదరాబాద్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వికాస కార్యాలయంలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. -
నిలిచిన గ్రానైట్ పలకల తొలగింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తూర్పు రాజగోపురానికి ఎదురుగా గల ఘాట్రోడ్ వద్ద మెట్లకు వేసిన గ్రానైట్ పలకలను తొలగించే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ గ్రానైట్ పలకలు విరాళంగా అందచేసిన దాత మాజీ మంత్రి సిద్దా రాఘవరావు బంధువులు వీటి తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ గ్రానైట్ పలకలు ఎండకు బాగా వేడెక్కిపోవడంతో ఈ మెట్ల మీద నడిచే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వీటిని తొలగించే పని చేపట్టారు. అయితే ఈ విషయం తెలిసిన దాత దేవస్థానానికి విచ్చేసి ఈ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ముందుగా విషయం చెబితే ఈ గ్రానైట్ పలకలను తొలగించకుండా ప్రత్యామ్నాయం ఆలోచించేవారమని చెప్పినట్టు సమాచారం. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి బుధవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారం రోజులుగా సూర్యభగవానుడి ప్రతాపంతో భక్తులు అల్లాడిపోయారు. అయితే బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు కొంత ఊరట చెందారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి తరలివచ్చారు. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు నాలుగు వేల మంది భక్తులు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. నేడు స్వామి,అమ్మవార్ల నిజరూప దర్శనం గురువారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు నిజరూపదర్శనం ఇవ్వనున్నారు. ప్రతి రోజు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవార్లు గురువారం కేవలం పుష్పాలంకరణలో శిలారూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
చెక్కనైన పనితేరు
సత్యదేవుని పెద్ద రథంపై స్వామి, అమ్మవారి ఊరేగింపు (ఫైల్)అన్నవరం: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు...’ అంటూ హంపి విజయనగరంలో గల శిల్పకళ అందాల గురించి వర్ణించే సినిమా పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ శిల్పుల పనితనం చూస్తే చెక్కతో రథాలు చేసినారు...వారు దేవతామూర్తులకే కొత్త సొబగులు అద్దినారు’ అని పాడాల్సి వస్తుంది. శిల్పకళను తలదన్నేలా చెక్కపై కూడా అందమైన శిల్పాలు, దేవతామూర్తులు, దేవుళ్లను చెక్కే శిల్పులతో బాటు, దేవతామూర్తులను ఊరేగించే ఎత్తయిన రథాలను రూపొందించే శిల్పులు కూడా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమండకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళా వుడ్ వర్క్స్ అఽధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఆ కోవకు చెందినవారే. పది అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథంతో బాటు 36 అడుగుల ఎత్తయిన రథాలు కూడా నిర్మించిన చరిత్ర వారిది. వీటితోబాటు ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు, వస్తువులు, కళాఖండాలు కూడా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకున్న పనితనం వీరిది. MýS$Ìê-°MìS AW²MýS$ÌS „ýS{†Ä¶æ¬Ë$...-˘ వృత్తికి శిల్పకారులు అలాగని వారేమి అనాదిగా చెక్కతో వస్తువులు, బొమ్మలు, గృహోపకరణాలు తయారు చేసే కులవృత్తి కలిగిన వడ్రంగులో, విశ్వబ్రాహ్మణులో కాదు. కులానికి సముద్రంలో చేపలు పట్టే అగ్నికుల క్షత్రియులు. అయితే గత నాలుగు తరాలుగా దేవతా విగ్రహాలు, రథాలు , ఇతర కళాఖండాలు తయారు చేయడాన్ని వృత్తిగా స్వీకరించినట్టు కొల్లాటి కామేశ్వరరావు, ఆయన కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. సుమారు ఎనిమిది నెలల నుంచి వారు అన్నవరంలోనే ఉండి సత్యదేవుని ఊరేగించేందుకు 14 అడుగుల ఎత్తయిన చిన్న రథం, 34 అడుగుల పెద్ద రథం తయారు చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి తమ అనుభవాలను వివరించారు. రథాల తయారీ చాలా కష్టం దేవుళ్లను ఊరేగించే రథాలు తయారు చేయడం చాలా కష్టమైన పని. అందులో 20 అడుగుల కన్నా ఎత్తు రథం తయారు చేయాలంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. రథాలు, దేవతామూర్తుల విగ్రహాలు, మందిరాలు, దేవుళ్లని ఊరేగించేందుకు వివిధ వాహనాల నిర్మాణంలో నాణ్యమైన బస్తరు టేకునే వాడతాం. కర్ర నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడం. చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ రథం నిర్మించాలి. నిర్మాణ సమయంలో చాలా నిష్టగా కూడా ఉండాలి. – కొల్లాటి కామేశ్వరరావు, ప్రధాన శిల్పి రథాలు, దేవతామూర్తుల తయారీలో సిద్ధహస్తులు కొల్లాటి వంశస్తులు ఇప్పటి వరకు 82 రథాలను రూపొందించి మన్ననలు పొందిన వైనం సత్యదేవునికి రెండు రథాలు అందించిన కామేశ్వరరావు, శ్రీనివాస్ బృందం సత్యదేవుని చిన్నరథం నిర్మాణ వ్యయం రూ.34 లక్షలు. రథం ఎత్తు 14 అడుగులు. వెడల్పు 6.3 అడుగులు. పొడవు 7.5 అడుగులు. ఈ రథం గత మార్చి రెండో తేదీ, రథసప్తమి నాడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ ఆదివారం రత్నగిరి ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఊరేగిస్తున్నారు. సత్యదేవుని పెద్ద రథం నిర్మాణ వ్యయం రూ.1.08 కోట్లు. ఎత్తు 34 అడుగులు. వెడల్పు 14 అడుగులు. పొడవు 23.5 అడుగులు. గత మే నెలలో జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల ఐదో రోజు అనగా మే 22 వ తేదీన అన్నవర పుర వీధుల్లో ఈ రథంపై స్వామిని ఘనంగా ఊరేగించారు. చిన్న రథానికి రత్నగిరిపై ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మిస్తుండగా, పెద్ద రథానికి కొండ దిగువన షెడ్డు నిర్మిస్తున్నారు. పడవల తయారీ నుంచి దేవుళ్ల రథాల వరకు... మా తాత కొల్లాటి వీర్రాజు తొలుత చేపలు పట్టే బోట్లు, పడవలు తయారు చేసేవారు. అలా చిన్న చిన్న గృహోపకరణాలు, దేవతామూర్తుల విగ్రహాలు, రథాల తయారీ ప్రారంభించారు. మా నాన్న కొల్లాటి కామేశ్వరరావు పెద్ద పెద్ద రథాలు తయారు చేయడంలో నిపుణులు. ఆయన వద్ద నుంచి నేను ఈ వృత్తి నేర్చుకున్నాను. నాతో పాటు మరో 20 మంది శిల్పులు దేవతా రథాలు తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకు 82 రథాలు తయారు చేశాం. వాటిలో 43 అడుగుల ఎత్తు కలిగిన అంతర్వేది దేవస్థానం రథం పెద్దది. ఆ తరువాత యానాంలోని మీసాల వేంకటేశ్వరస్వామి దేవస్థానం రథం ఎత్తు 38 అడుగులు. అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో 14 అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథం, 34 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రథం తయారు చేశాం. ఇవి కాకుండా పలు ప్రముఖ దేవస్థానాలకు రథాలు తయారు చేశాం. రథాలే కాకుండా చెక్కతో వివిధ దేవతామూర్తులు, ఇతర గృహోపకరణాలు కూడా తయారు చేశాం. నూతనంగా లోవకొత్తూరులో నిర్మించిన తలుపులమ్మ తల్లి ఆలయం తలుపులు కూడా మేమే తయారు చేశాం. – కొల్లాటి శ్రీనివాస్ -
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
రాజమహేంద్రవరం సిటీ: రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని 65 నుంచి 70 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు బుధవారం తెలిపారు. మృతుడు తెలుపు రంగు హాఫ్ హండ్స్ షర్ట్, నీలం, గోధుమ, నలుపు రంగు లుంగీ, సోనాటా వాచ్, రాజమహేంద్రవరం నుంచి ఐఎల్టీడీ వరకూ ఆర్టీసీ బస్సు టికెట్ లభ్యమయ్యాయన్నారు. రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే కళ్యాణమండపం ఎదురుగా రైల్వే ట్రాక్ మీద జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
హాస్టళ్లలో మెరుగైన వసతులు
కాకినాడ సిటీ: జిల్లాలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, వసతి గృహాల్లో భోజనం, అల్పాహారం మెనూ, స్టడీ అవర్స్ నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లా సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో సుమారు 33 ఎస్సీ, 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగుల బాధ్యత పూర్తిగా సంబంధింత వసతి గృహాలు అధికారులదేనని అన్నారు. తాను రెండేళ్ల పాటు వసతి గృహాంలో ఉండి చదువుకున్నానని, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. 2024–25 విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహం గదుల్లో విద్యుత్, ట్యూబ్లైట్లు, మరుగుదొడ్లలో పరిశుభ్రత, బాత్రూం డోర్లు, సక్రమమైన నీటి సరఫరా, తాగునీరు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేకంగా బాలికల వసతి గృహాల్లోకి అపరిచిత వ్యక్తులు లోపలికి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా పిల్లలు బయటికి రాకుండా చూడాలన్నారు. స్టడీ అవర్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. పదోతరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వసతి గృహాల్లో అమలు చేస్తున్న భోజనం, అల్పాహారం మెనూకి సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్థానిక పీహెచ్సీ వైద్య అధికారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అధికారుల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి, మంచి దృక్పథంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ జేడీ డీవీ రమణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం.లల్లి, జిల్లా సంక్షేమ వసతి గృహాల సమన్వయ అధికారి జి.వెంకటరావు, ఎస్సీ, బీసీ అసిస్టెంట్ సంక్షేమ అధికారులు, వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ నివాస్ సూచన -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెంలో ఉపాధిహామీ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల ప్రకారం గ్రామంలో నరసింహం చెరువులో బుధవారం ఉదయం గ్రామానికి చెందిన కరణం వెంకటేశులు(50) పని చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ కాకర దుర్గారావు, తోటి కూలీలు అతన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎన్సీసీతో ఉజ్వల భవిత ఉమ్మడి రాష్ట్రాల ఎన్సీసీ డీజీపీ ఎయిర్ కమాండర్ రెడ్డి పెద్దాపురం: ఎన్సీసీ ద్వారా ప్రతి విద్యార్థి మెరుగైన భవిష్యత్ సాధించవచ్చని ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఎన్సీసీ డీజీపీ ఎయిర్ కమాండర్ వీఎం రెడ్డి అన్నారు. పెద్దాపురం జవహార్ నవోదయ విద్యాలయలో బుధవారం ఇంటర్ డైరెక్టరేట్ స్పోర్ట్స్ షూటింగ్ కాంపిటేషన్స్ (ఐడిఎస్ఎస్సీ 2024)కు ఎంపికై న క్యాడెట్లను ఆయన కలుసుకున్నారు. పెద్దాపురంలో జరుగుతున్న ఎన్సీసీ క్యాంప్లో ఐడీఎస్ఎస్సీ క్యాంపులో పాల్గొనడానికి అవరసమైన షూటింగ్ ఈవెంట్లను ఆయన పరిశీలించారు. ఎన్సీసీ శిక్షణ భవితకు ఎంతో తోడ్పడుతుందన్నారు. క్యాడెట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూలై రెండవ తేదీ నుంచి 24వ తేదీ వరకు తిరుచిరాపల్లిలో ఐడీఎస్ఎస్ 2024 క్యాంపు నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని ఈవెంట్లలో క్యాడెట్లు పతకాలు సాధించి మంచి కీర్తి, ప్రతిష్టలు తీసుకు రావాలని రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు. -
అలవికాని హామీలతో అధికారం
మాజీ మంత్రి గొల్లపల్లి, మాజీ ఎమ్మెల్యే రాపాక రాజోలు: అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను తాత్కాలిక భ్రమల్లో ఉంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. బుధవారం తాటిపాకలోని గొల్లపల్లి నివాసం వద్ద గొల్లపల్లి అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. గొల్లపల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, పార్టీ కార్యకర్తలు అధైర్య పడవద్దని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నారు. రాపాక వర ప్రసాదరావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నారు. విజేతలుగా నిలిచిన వారు కక్షపూరితంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల పార్టీ అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీ, కుసుమ చంద్రశేఖరరావు, బొలిశెట్టి భగవాన్, జెడ్పీటీసీ మట్టా శైలజ తదితరులు పాల్గొన్నారు. -
12 వరకు ‘నేను బడికి పోతా’
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో నేను బడికి పోతా, ఎన్రోల్మెంట్ డ్రైవ్, కాంపెయిన్ కార్యక్రమం అమలుపై లైన్ డిపార్టుమెంట్, జిల్లా సెక్టోరల్ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ బుధవారం ప్రాజెక్టు అధికారి చాంబర్లో నిర్వహించారు. నేను బడికి పోతా, ఎన్రోల్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న ప్రారంభమైందని వచ్చే నెల 12వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం గ్రామీణ, ఆవాస ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి ఆరు సంవత్సరాల నిండి ఉన్న అర్హులైన పిల్లలందరినీ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం నమోదు చేయాలన్నారు. 6–14 ఏళ్ల లోపు పిల్లలెవరూ బయట ఉండకూడదని, పాఠశాలల్లో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రాప్ అవుట్ పిల్లలందరినీ తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి సమావేశాలు, శిబిరాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలను అమలు చేయాలని ఆదేశించారు. ఎన్రోల్మెంట్ అండ్ క్యాంపెయిన్ను ఎన్యుమేటర్లుగా సీఆర్పీలు, ఐఇఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, కేజీబీవీసీఆర్టీలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొని గ్రామాల్లో డోర్ టు డోర్ సందర్శనలు చేసి జీరో ఓఎస్సీ ఆవాస ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. లైన్ డిపార్టుమెంట్ అధికారులు విద్యా శిబిరాల నిర్వహణ, విద్య ప్రాముఖ్యతపై పోస్టర్లను సిద్ధం చేసి విడుదల చేయడం, రాష్ట్ర, కేంద్రం అందించే సౌకర్యాలు, పథకాలపై అవగాహన కల్పించాలని రమేష్ సూచించారు. ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్మాస్టర్లు, స్కూల్ హెడ్ మాస్టర్లు విధిగా కార్యాచరణ ప్రణాళిక ద్వారా నేను బడికి పోతా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రోగ్రామ్ను సందర్శించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి టి.ఆమని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణి, జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కె.ప్రవీణ, మెప్మా పీడీ ప్రియంవద, ఉప విద్యాశాఖాధికారి కరి నాయుడు వెంకటేశ్వరరావు, విద్యాశాఖాధికారులు వెంకటేశ్వరరావు, కె హరికృష్ణ, చామంతి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అనుమానంతోనే భార్య హత్య
కాకినాడ రూరల్: మండలం వాకలపూడి ఫిషింగ్ హార్బర్లో ఈనెల 16వ తేదీ తెల్లవారు జామున జరిగిన ఓలేటి సీతమ్మ (26)హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త నరసింహమూర్తే ఆమెను కడతేర్చినట్టు పోలీసులు గుర్తించారు. సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్ హత్య కేసు వివరాలను బుధవారం మీడియాకు వివరించారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓలేటి సీతమ్మ ముఖంపై బలమైన గాయాలతో హత్యకు గురైందని, విచారణలో భర్త నరసింహమూర్తి హంతకుడుగా తేలడంతో బుధవారం అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్ నిమిత్తం స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. సీతమ్మపై ఉన్న విపరీతమైన అనుమానంతో వివాహేతర సంబంధం అంటకట్టి వేధించేవాడని, ఇటీవలి ఎన్నికల్లో ఓ పార్టీపై పందెం వేసి ఓడిపోయి రూ.3.5 లక్షలు సమకూర్చేందుకు బంగారు వస్తువులు ఇవ్వమని ఇబ్బంది పెట్టాడన్నారు. ఈ నేపథ్యంలోనే రాయితో తలపై మోదడంతో సీతమ్మ మృతి చెందిందని, ఉదయం మృతురాలి తల్లికి ఫోన్ చేసి మీ అమ్మాయిని ఎవరో చంపి బంగారు వస్తువులు పట్టుకుపోయాడని సమాచారం ఇచ్చాడు. అల్లుడిపై అనుమానం ఉన్న సీతమ్మ తల్లి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఎస్పీ హనుమంతరావు, పర్యవేక్షణలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, సీఐ సన్యాసిరావు, పోర్టు సీఐ సుమంత్ దర్యాప్తు చేసి నిందితుడు నరసింహమూర్తిని అరెస్టు చేసి అతడి నుంచి బంగారు వస్తువులు, హత్యకు వినియోగించిన రక్తపు మరకలుతో ఉన్న రాయిని స్వాధీనం చేసుకున్నారు. వాకలపూడి హార్బర్పేటలో భర్త అరెస్టు -
కువైట్ బాధితులకు క్షమాభిక్ష
అమలాపురం టౌన్: సరైన ఆధారాలు, అనుమతులు లేకుండా కువైట్ దేశంలో చిక్కుకుపోయిన తెలుగువారు అక్కడి పోలీసు స్టేషన్లు, లేదా భారత దౌత్య కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా సంప్రదిస్తే స్వదేశానికి చేరుకోవచ్చని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ హౌస్ మెయిడ్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ద వరల్డ్ ఫ్రమ్ గోదావరి డెల్టా రీజియన్ చైర్మన్ హోదాలో ఆయన బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వదేశానికి వచ్చే దారిలేని వారికోసం కువైట్ దేశపు రాజు క్షమాభిక్ష ప్రకటించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబీకులు, బంధువులు ఫోన్లు చేసినప్పుడు ఈ విషయం చెప్పాలని కుడుపూడి పేర్కొన్నారు. వాస్తవానికి మార్చి 17వ తేదీ నుంచి జూన్ 17 లోపున అక్రమ వలసదారులు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని క్షమాభిక్షలో పేర్కొన్నప్పటికీ, గడువు పెంచాలని ఆ రాజ కుటుంబంలోని అడ్వకేట్, కువైట్ రాజకుమారి (షెయికా బీబీ అల్సబా)కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించారు. అక్కడి వారు ఇరు తెలుగు రాష్ట్రాలలోని బంధువులకు ఫోన్ చేసినపుడు ఈ క్షమాభిక్ష గురించి చెప్పాలని కుడుపూడి తన ప్రకటనలో పేర్కొన్నారు. లేని పక్షంలో అమలాపురానికి చెందిన సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియల్ను 7013210153 ఫోన్ నెంబరులో సంప్రదించాలని పేర్కొంది. ఈ నెల 30వ తేదీ తుది గడువు అక్కడి పోలీసు స్టేషన్లు, దౌత్య కార్యాలయాల్లో సంప్రదించాలి ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి