-
No Headline
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడ్డాయి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం, చిత్తూరులో ఆ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితాలొచ్చిన రోజే చిత్తూరులో విధ్వంస ఘటనలు మొదలయ్యాయి. ఆఫీసర్స్ లేన్ వీధిలో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ భవనంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. తాళాలు వేసిన భవనంలోకి చొరబడి ఫర్నిచర్, కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. చివర్లో భవనంలోకి పెట్రోలుపోసి నిప్పంటించారు. గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన ఈ ఘటనతో భవనం రెండో అంతస్తులో అద్దెకుంటున్న కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టాయి. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహించి ఉంటారు..?. ఇక దాని తరువాత రెండు చికెన్ సెంటర్లు, ఓ హోటల్పై దాడి చేశారు. మరో బేకరీని నేలమట్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడి వద్ద పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ను ఫోన్లో అంతు చూస్తామని బెదిరించారు. ఓ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడి ఇంటి వద్దకు వెళ్లి వేట కత్తులు చూపిస్తూ రోడ్డుపై వెళుతున్న వాళ్లను భయభ్రాంతులకు గురిచేశారు. తాజాగా గంగనపల్లెలో ఓ ఇంటిపై రాళ్లదాడికి దిగారు. చుడా మాజీ చైర్మన్ కారును ధ్వంసం చేశారు. ఎస్ఆర్.పురానికి చెందిన ఓ యువకుడ్ని కిడ్నాప్చేసి గొడ్డును బాదినట్టు బాదారు. -
No Headline
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు కొందరు పగతో రగిలిపోతున్నారు. మనిషి జన్మనెత్తి క్రూరజంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నిద్దురలేస్తే నెత్తురు కళ్లజూడడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వేటకొడవళ్లు, మారణాయుధాలతో రావణకాష్టం సృష్టిస్తున్నారు. ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని చితకబాదుతున్నారు. వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసులు సైతం చూసీచూడనట్టు వదిలేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. -
విస్తరిస్తున్న విషసంస్కృతి
● ఎన్నికల తర్వాత గొడవలు.. దాడులు ఎప్పుడూ లేదు ● చిత్తూరులో చాపకిందనీరులా పాకుతున్న గూండాగిరి ● శాంతిభద్రతల రక్షణలో పోలీసుల వైఫల్యం ● కేసులతో యువత భవితకు దెబ్బ ● నేతలు కల్పించుకుంటేనే శాంతియుత వాతావరణం చిత్తూరు అర్బన్: చిత్తూరు రాయలసీమలో ఉన్నా, ఫ్యాక్షన్ గొడవలు, పగ, ప్రతీకార దాడులకు దూరంగా ఉంటుంది. విద్యావంతులు ఎక్కువగా ఉన్న చిత్తూరులో వీలైనంత వరకు గొడవల జోలికి ఎవ్వరూ వెళ్లరు. కానీ ఎప్పుడూలేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నిక ఫలితాలొచ్చినప్పటి నుంచి చిత్తూరులో గొడవలు పెరిగిపోయాయి. ‘నువ్వు ఎన్నికల్లో ఆ పార్టీ నేత కోసం పనిచేసి, మమ్మల్ని కవ్వించావు. అందుకే ఈ దాడులు’ అన్నట్లు గెలిచిన నేతకు చెందిన అనుచరులు గొడవలు చేస్తున్నారు. దీనివల్ల తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ.. ఊరిని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడదామనుకుంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కచ్చితంగా చెడ్డపేరు తెస్తుంది. పైగా భవిష్యత్తులో మరో పార్టీ నాయకుడు గెలిస్తే ప్రతీకార దాడులకు దారితీసే విష సంస్కృతికి దారి చూపినట్లు అవుతుంది. -
No Headline
నీట్ పరీక్షను రద్దు చేయాలి నీట్ పరీక్షను తక్షణం రద్దు చేసి తిరిగి పారదర్శకంగా నిర్వహించాలి. విద్యార్థులకు ఏడాది నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నా ఇతర పార్టీలు మిన్నుకుండడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాష్ట్రం ప్రభుత్వం నీట్ లేకేజీపై స్పందించాలి. ఎన్టీఏ సంస్థ మోదీ కనుసన్నలలో పనిచేస్తోంది. అందుకే నీట్, నెట్ పరీక్షా పేపర్లు లీకేజీ అవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. –రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి -
No Headline
పార్లమెంట్ను ముట్టడిస్తాం నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం జరగకుంటే దేశా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలసి ఢిల్లీలోని పార్లమెంట్ను ముట్టడిస్తాం. మోదీ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ను తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలి. నీట్ లీకేజీలో ప్రధాన పాత్ర వహించిన ఎన్టీఏ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆగ్రహానికి గురికాకముందే కేంద్రం నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలి –నవీన్కుమార్, ఏఐఎస్ఎఫ్, జిల్లా అధ్యక్షులు, తిరుపతి -
అధ్యక్షుడికి వీడ్కోలు
తిరుపతి లీగల్: తిరుపతి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు ఏ.పార్థసారథి శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంఆర్ పల్లి సమీపంలోని వినియోగదారుల కమిషన్ కార్యాలయంలో తిరుపతి న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సన్మాన సభను ఏర్పాటు చేశారు. పార్థసారథి సేవలను సిబ్బంది కొనియాడారు. ఆయనకు జ్ఞాపిక అందజేసి ఆత్మీయంగా సత్కరించారు. కమిషన్ సభ్యులు శశిధర్రెడ్డి, స్నేహలత, తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గోపీచంద్, ప్రధాన కార్యదర్శి మార్టిన్, ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు గురుప్రసాద్, గొట్టి సుబ్రమణ్యం, ప్రేమ్కుమార్, సుదర్శన్బాబు, జాన్ పాల్గొన్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే! ● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● వాకాడు మండలంలో విషాదం తడ: పరిశ్రమలో ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఓ యువకుడు బస్సు కింద పడి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. వాకాడు మండలం, నెల్లిపూడి గ్రామానికి చెందిన బైన వంశీ(28) మాంబట్టు అపాచీ కంపెనీలో గురువారం ఉద్యోగంలో చేరాడు. శుక్రవారం తొలి రోజు విధులకు హాజరయ్యేందుకు గ్రామం నుంచి స్కూటీపై బయలుదేరాడు. ఈ క్రమంలో కాదలూరు గ్రామ పరిధిలోని పాములకాలువ సమీపంలో సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోకి చెందిన బసును దాటేక్రమంలో అదుపు తప్పి బస్సుకింద పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తడ ఎస్ఐ పీ.నరశింహారావు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
No Headline
కూటమి నేతలు మౌనం వీడరా? రాష్ట్రంలో సుమారు 66వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వమే పేపర్ లీకేజీ అయిందని ఒప్పుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి నేతలు కనీసం స్పందించక పోవడం విడ్డూరంగా ఉంది. కూటమి నేతల పిల్లలు సైతం నీట్ పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు. విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. పెదవి విప్పండి. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. –ఎం.ప్రేమ్కుమార్, వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు -
ఇన్చార్జ్ కలెక్టర్గా ధ్యాన్చంద్ర బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ రాష్ట్ర భూగర్భ గనులశాఖ కమిషనర్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ ధ్యాన్చంద్ర ఇన్చార్జి కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు కలెక్టరేట్ ఉద్యోగులతోపాటు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు గజ మాలతో కలెక్టర్ ప్రవీణ్కుమార్ను సత్కరించారు. ఆ మేరకు ఆయన శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్గా డాక్టర్ సుమతి తిరుపతి సిటీ : స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహా పరిశోధనా సంచాలకులుగా డాక్టర్ వీ.సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర దక్షిణ మండలం పరిధిలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు, బోధనేతర సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గతంలో ఏడీఆర్గా పనిచేసిన డాక్టర్ సి రమణ ప్రధానశాస్త్ర వేత్తగా బదిలీపై వెళ్లారు. 24 మంది డీబార్ తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో 24 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో చిత్తూరు జోన్కు సంబంధించి 13 మంది, తిరుపతి జోన్లో ఐదుగురు, మదనపల్లి జోన్లో ఆరుగురు మాస్కాఫియింగ్కు పాల్పడుతుండగా హైపవర్ ఇన్స్పెక్షన్ కమిటీ డీబార్ చేసినట్లు ఆయన వివరించారు. గరుడుడిపై గురువితడు.. తిరుపతి రూరల్: మండలం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అశేష భక్తుల గోవింద నామస్మరణల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు గరుడ వాహనంపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అడుగడుగునా భక్తులు కర్పూ హారతులు సమర్పించారు. గరుడ వాహన సేవలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. వ్యాధుల నివారణకు చర్యలు తిరుపతి అర్బన్: వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో వాటి నివారణకు సంబంధించి అవగాహన కల్పించాలని ఇన్చార్జ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యాన్చంద్ర సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నెల రోజుల పాటు డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. అన్ని శాఖలు సమష్టిగా ఇంటింటా డయేరియా నివారణకు తీసుకోవాల్సి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్ఓ శ్రీహరి, డిప్యూటీ సీఈఓ ఆది శేషారెడ్డి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి శాంతకుమారి, డివిజనల్ పంచాయతీ అధికారిణి రూపారాణి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ భాస్కర్రెడ్డి, డిప్యూటీ డీఈఓ బాలాజీ పాల్గొన్నారు. -
భారత్కు మహా‘యోగ’ం!
భారత్లో పుట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని పలువురు వక్తలు కొనియాడారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభం ఏర్పేడు ఐఐటీలో కేంద్రీయ విద్యాలయాన్ని శుక్రవారం డైరెక్టర్ కేఎన్.సత్యనారాయణ ప్రారంభించారు. – 8లోదాడుల సంస్కృతి ఇలాగే కొనసాగితే మున్ముందు చిత్తూరులో భయానక పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. గెలిచిన నాయకులు తమకు ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన చేస్తున్న సమయంలో.. జరుగుతున్న హింసాత్మక ఘటనలు పార్టీలతో పాటు నాయకులకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుందని గ్రహించలేకపోతున్నారు. గొడవలు చేస్తున్న వ్యక్తులు వాళ్ల నాయకుడి ప్రమేయం లేకుండానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు కొన్ని ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తీరా గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతూ అప్పటికే జరగాల్సిన నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికారం చేతుల్లో ఉంటే ఊరిని అభివృద్ధి వైపు కాకుండా.. రౌడీయిజం చేస్తూ పెత్తనం చెలాయించొచ్చనే చెడు భావన యువతను పెడదారివైపు నడిపించే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రజలు ఎన్నుకున్న నాయకులు వాళ్ల కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా అలాంటివి చేస్తే పోలీసులు తీసుకునే చర్యలకు తాము అడ్డుపడమని కచ్చితంగా చెప్పాలి. వీలైతే తనకోసం పనిచేసే కార్యకర్తకు ఆర్థికంగా నిలదొక్కుకునే దారులు చూపిస్తే.. సమాజం కూడా హర్షిస్తుందనే విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రెండు ఘటనలు మినహా.. మిగిలిన వాటిల్లో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇదేమిటంటే ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతున్నారు. ఫిర్యాదు రాలేదని సమాజంలో హత్యలు, గొడవలు, విధ్వంసాలు చేయడం సరైన చర్యలేనా..? అనేది పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు గొడవలు జరిగే అవకాశం ఉందని ముందుగా గ్రహించడానికి పనిచేసే నిఘా సంస్థల్లోని పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారనే అపవాదు మిగిలిపోయింది. రెండు, మూడు ఘటనల్లో నిందితులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి నేర చరిత్ర లేని యువకులు ఈ ఘటనలతో పోలీసుల రికార్డుల్లోకి ఎక్కినట్లయ్యింది. – 8లో– 8లోపరిష్కారం ఏమిటి? -
అమరావతిలో పైరవీల జోరు
ఎమ్మెల్సీ, తుడా కోసం పోటీసాక్షి, తిరుపతి: అమరావతి కేంద్రంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీటీడీ, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయ పాలకమండలి, తిరుపతి తుడా అధ్యక్ష పదవులతో పాటు ఎమ్మెల్సీ కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు జోరుగా పైరవీలు నెరుపుతున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో అతిముఖ్యమైన తిరుపతి తుడా చైర్మన్ పదవి కోసం ఆ మూడు పార్టీల నేతలు ఎవరికి వారు ఢిల్లీ నుంచి తెలంగాణ, ఏపీలోని ముఖ్యనేతలను కలిసి తనకు ఇప్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ పదవులపై అమరావతిలో పెద్ద చర్చే నడుస్తోంది. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల కోసం ఉమ్మడి జిల్లాతో పాటు స్థానికేతరులు అనేక మంది పోటీపడుతున్నారు. ప్రధాని నుంచి కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణలోని మంత్రుల నుంచి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు నుంచి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సీనియర్ల జాబితాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్ల విషయంలో జిల్లా వాసులకు ప్రాధాన్యత కల్పిస్తారనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారంలో అమరనాథ్రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. ఇంకా తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ పేరు కూడా తెరపైకి వస్తోంది. అదేవిధంగా బీజేపీ కోటాలో ఈ సారి టీటీడీ చైర్మన్ పదవి తమవారికే ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు పట్టుబడుతున్నారు. కమలనాథుల జాబితాలో శ్రీకాళహస్తి మాజీ ట్రస్ట్బోర్డు చైర్మన్ కోలా ఆనంద్, తిరుపతి నుంచి భానుప్రకాష్రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో కోలా ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతనికి ఢిల్లీ, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ అగ్రనేతల ఆశీర్వాదం మెండుగా ఉంది. బోర్డు మెంబర్ల విషయానికి వస్తే టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబు, నందమూరి కుటుంబానికి నమ్మకస్తుడిగా ముద్రపడిన ఎన్టీఆర్ రాజు కుమారుడు శ్రీధర్వర్మ ముందు వరుసలో ఉన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ రాజు 1984 నుంచి 1988 వరకు బోర్డు మెంబర్గా ఉన్నారు. 1983లో తిరుపతి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి, ఎన్టీఆర్ కోసం రాజు పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో టీటీడీ పాలకమండలిలో నాటి సీఎం ఎన్టీఆర్ రాజుకి స్థానం కల్పించారు. 2014–19 టీడీపీ హయాంలో టీడీపీ బోర్డు మెంబర్గా శ్రీధర్వర్మ పేరు దాదాపు ఖరారు అయ్యింది. అయితే సమీకరణలో భాగంగా వేరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ రాజుకు మాట ఇచ్చారని తెలిసింది. అందులో భాగంగా బోర్డు మెంబర్ల జాబితాలో శ్రీధర్వర్మ పేరు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి ట్రస్ట్బోర్డు చైర్మన్ పదవి కోసం అనేక మంది స్థానిక టీడీపీ నాయకులు, మరో వైపు బీజేపీ నాయకులు, జనసేన శ్రేణులు పట్టుబడుతున్నారు. ఆ జాబితాలో ఎస్సీవీ దిలీప్, చంచయ్యనాయుడు, రేణిగుంట టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రమణ్యంరెడ్డి, కోట వినూత పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా కాణిపాకం పాలకమండలి అధ్యక్ష పదవి కోసం అనేక మంది స్థానికులు పోటీపడుతున్నారు. టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్ల కోసం పోటాపోటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రేసులో పలువురు నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రస్ట్బోర్డు కోసం స్థానికుల పట్టు తిరుపతి తుడా కోసం ప్రయత్నాలు ముమ్మరం ఆ రెండు ఎమ్మెల్సీల కోసం తిరుపతి, శ్రీకాళహస్తి నేతల పోటీ తిరుపతి తుడా చైర్మన్ కోసం అనేక మంది పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, భానుప్రకాష్రెడ్డితో పాటు పలువురు నాయకులు పోటీపడుతున్నారు. తిరుపతి నాయకులే కాకుండా.. తుడా పరిధిలో ఉన్న వారు సైతం ఈ సారి చైర్మన్ పదవి తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు తెలిసింది. తుడా చైర్మన్ కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. తుడా చైర్మన్ పదవి వస్తే.. అదనంగా టీటీడీ బోర్డు ఎక్స్అఫిషియో మెంబర్ అవ్వొచ్చనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మతో పాటు కోలాఆనంద్ పేరు కూడా వినిపిస్తోంది. ఎస్సీవీ నాయుడు టీడీపీ తరుఫున నుంచి పోటీపడుతుంటే.. సుగుణమ్మ జనసేన, కోలా ఆనంద్ బీజేపీ కోటాలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ముగ్గురూ ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ల ఆశించి భంగపడ్డారు. వీరి త్యాగాన్ని గుర్తించి ఎమ్మెల్సీ లేదా టీటీడీ, తుడాలో ఏదో ఒకటి ఇవ్వకపోతారా? అని వారి వర్గీయులు ధీమాగా ఉన్నారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పదవుల కోసం జిల్లాకు చెందిన నాయకులు ఎవరికి వారు పైరవీలు ప్రారంభించారు. -
ఐఐటీలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
ఏర్పేడు: మండల కేంద్రం సమీపంలోని ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయాన్ని డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ శువ్రారం ప్రారంభించారు. తరగతి గదులు, స్పోర్ట్స్, మ్యూజికల్ గదులను ప్రారంభించారు. ముందుగా విద్యార్థులతో ప్రార్థ్ధన, ప్రతిజ్ఞ, జెండా ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఐఐటీ తిరుపతి ఆధ్వర్యంలో గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ 5 వరకు తరగతులను ప్రాజెక్ట్ మోడ్లో ప్రారంభించినట్లు వివరించారు. ప్రతి విభాగంలో 32 మంది విద్యార్థులు ఉంటారని తెలిపారు. ఐఐటీ తిరుపతి రిజిస్ట్రార్ సుమిత్ బిస్వాస్, డిప్యూటీ రిజిస్ట్రార్ చమన్ మెహతా, ఐసర్ అసోసియేట్ ప్రొఫెసర్ కనగశేఖరన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మానసిక ఒత్తిడిని దూరం చేసేదే యోగా
సూళ్లూరుపేట: మానసిక ఒత్తిడిని జయించాలంటే యోగా ఒక్కటే చక్కని మార్గమని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీహరికోటలోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో షార్ ఉద్యోగులు, అధికారులు శుక్రవారం యోగాభ్యాసం చేశారు. ఆసనాలు వేసి భారతీయ సంస్కృతిలో పుట్టిన యోగాను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా భారతీయ సంతతికి చెందింది కాబట్టి అందరూ ప్రతినిత్యం ఓ గంట సమయాన్ని కేటాయించుకుని యోగా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. యోగాసనాలతో పాటు ధ్యానం, ఆహార నియమాల విషయంలో కూడా పద్ధతిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో షార్ కంట్రోలర్ శ్రీనివాసులురెడ్డి, అన్ని విభాగాల డిప్యూటీ డైరెక్టర్లు, షార్ ఉద్యోగులు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ -
జాతరోత్సాహం!
● ముగిసిన పోలేరమ్మతల్లి జాతర ● ఉప్పొంగిన బంగారుపేట ● భక్తిశ్రద్ధలతో అమ్మవారి విరూపోత్సవం ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెంకటగిరి రూరల్ : పట్టణంలోని బంగారుపేటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలేరమ్మ జాతర శుక్రవారం తెల్లవారుజామున ఘనంగా ముగిసింది. గురువారం రాత్రి ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బంగారుపేట పొలిమేర్ల చుట్టూ బలి కార్యక్రమం చేపట్టారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం చేపట్టారు. ఇందులో కేరళ వాయిద్యాలు, కాంతార నృత్యాలు, డీజే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా కట్టుకున్నాయి. అనంతరం ఆర్వీఎం ఉన్నత పాఠశాల సమీపంలో ఆసాదులు తప్పెట్లు.. తాళాల మధ్య అమ్మవారి విరూపోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. -
No Headline
మోదీ పాలన అవినీతిమయం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. నీట్ నిర్వహణలో అవినీతి అక్రమాలు జరగలేదని బుకాయించింది. తాజాగా కేంద్ర మంత్రి అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకోవడం సిగ్గు చేట్టు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారినా కేంద్ర ఇప్పటికీ నీట్ పరీక్షపై నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. తక్షణం కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. –హరీష్, ఏఐఎస్ఈసీ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్ -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. భక్తుల క్యూ బాటగంగమ్మ ఆలయం వద్దకు చేరింది. గురువారం అర్ధరాత్రి వరకు 62,756 మంది స్వామివారిని దర్శించుకోగా, 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
● రోడ్డున పడుతున్నా... కూటమి స్పందించదా? ● నీట్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి ● బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నీట్, నెట్ పేపర్లు లీక్ ● మోదీ పాలన అవినీతి, కుంభకోణాల మయం ● రాష్ట్రంలో 66 వేల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం ● కేంద్రాన్ని నిలదీస్తున్న విద్యార్థి సంఘాల నేతలు తిరుపతి సిటీ: ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. నీట్ లేకేజీ వ్యవహరంపై తక్షణం సమగ్ర విచారణ జరిపించాలి. లేకుంటే ఆందోళనలు మిన్నంటిస్తాం’ అంటూ విద్యార్థి సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. గత రెండు రోజులుగా ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూ, ఏఐఎస్ఈసీ, ఏఐడీఎస్ఓ తదితర విద్యార్థి సంఘాలు నగరంలోని ప్రధాన కూడళ్లు, వర్సిటీల ఎదుట నిరసనలు, ధర్నాలతో కదం తొక్కుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఎస్వీయూలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సంఘం నాయకులు మల్లికార్జున, షేక్ జావెద్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన అనేక మంది విద్యార్థులకు 720కి 720 రావడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 వేల మంది విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లితే కనీసం రాష్ట్రంలో కూటమి నేతలు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇటువంటి కుంభకోణాలు జరగుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీ పాలన అవినీతి కుంభకోణాల మయమన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మూల్యం చెల్లించక తప్పదు విద్యార్థుల ఆగ్రహానికి గురికాకముందే కేంద్రం నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే భారీ మూల్యం తప్పదు. పేపర్ను లీకేజీ చేసి రూ.32లక్షలకు అమ్ముకుని 24లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసిన కేంద్ర మంత్రి తక్షణం రాజీనామా చేయాలి.ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. ప్రతి పోటీ పరీక్షల పేపర్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లీకేజీ అవుతోంది. నీట్ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి నిందుతులను కఠినంగా శిక్షించాలి. –జే.మల్లికార్జున, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
శ్రేష్టలో మెరిసిన నేత్విక
– జాతీయ స్థాయిలో 353వ ర్యాంక్ పెళ్లకూరు: కేంద్ర సర్కారు అట్టడుగు స్థాయిలో ఉన్న పేద విద్యార్ధులను శ్రేష్టతో ప్రోత్సహిస్తోంది. దళిత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంటర్నేషనల్ రెసిడెన్షియ ల్ స్కూల్లో చదువుకొనే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే శుక్ర వారం వెలువడిన శ్రేష్ట ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో (స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్ ఇన్ హైస్కూల్) తాళ్వాయిపాడు జెడ్పీ హైస్కూ ల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వంకపూరి నేత్విక జాతీయ స్థాయిలో 353వ ర్యాంక్ సాధించింది. ఇటీవల ప్రకటించిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షీప్టెస్ట్)లో కూడా విద్యార్థిని అర్హత పొందింది. అలాగే నేత్విక సోదరుడు గ్రేష్వంత్ 2022లో శ్రేష్ట ఎంట్రన్స్లో 541ర్యాంక్ సాధించి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఉన్న శ్రీమహర్షి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు పొంది చదువుకుంటున్నాడు. అన్నా, చెల్లెలు ఇద్దరూ అటు ఎన్ఎంఎంఎస్లోనూ, ఇటు శ్రేష్ట లోనూ ప్రతిభ కనపరచడం విశేషం. యూజీ, పీజీ ప్రవేశాలకు గడువు పొడిగింపు తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీలో యూజీ(శాస్త్ర), పీజీ(ఆచార్య) కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 వరకు చివరి గడువుగా ప్రకటించినా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈనెలాఖరు వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 21 విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులతో పాటు టెంపుల్ మేనేజ్మెంట్, జోతిష్యం, వాస్తు, మ్యాన్స్క్రిప్ట్ సబ్జెక్టుల్లో డిప్లొమో కోర్సులకు, మరో ఏడు విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు వేదిక్ వర్సిటీ అధికార వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. నేడు, రేపు న్యాయమూర్తులకు వర్క్షాప్ తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు శని, ఆదివారాలు చిత్తూరులోని జెడ్పీ మీటింగ్ హాల్లో వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లా కోర్టు నుంచి తిరుపతి కోర్టులకు ఉత్తర్వులు అందాయి. వివిధ అంశాలపై రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించనున్నారు. న్యాయమూర్తులు వర్క్షాపునకు వెళ్లనుండడంతో ఆయా కోర్టుల పరిధిలోని ప్రాంతాల్లో అత్యవసర ఎఫ్ఐఆర్లు, రిమాండ్లు, మరణ వాంగ్మూలాలను ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్(తహసీల్దార్లు)లు చూసుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
భారత్కు మహా‘యోగ’ం!
తిరుపతి సిటీ: యోగాను ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఘనత భారత దేశానిదేనని మహిళా వర్సిటీ వీసీ డీ భారతి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలసి అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరిగా దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్గా తెలియజేశారు. ఈ కార్యక్రమంలతో రిజిస్ట్రార్ రజిని, ప్రొఫెసర్ విద్యావతి పాల్గొన్నారు. ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో.. ఎస్వీ అగ్రిక్చలర్ కళాశాలో యోగా గురువు విజయ్కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది యోగాసనాలు వేశారు. ఎస్పీడబ్ల్యూ కళాశాలలో.... యోగా దినోత్సవాన్ని ఎస్పీడబ్ల్యూ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ టీ నారాయణమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు యోగాసనాలతో అలరించారు. ముఖ్యఅతిథిగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.వాణి హాజరై యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. యోగాతో వ్యాధుల నియంత్రణ తిరుపతి సిటీ: నిత్యం యోగా సాధనతో అనేక వ్యాధులను నియంత్రించవచ్చని, రుగ్మతులను రూపుమాపడంలో యోగా ఆయుధం వంటిదని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగిన అంతర్జాతీయ యోగా సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, శారీరక దృఢత్వానికి యోగా దివ్యౌషధంగా పనిచేస్తుందన్నారు. వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ యోగా శాస్త్రం మనకు లభించిన గొప్ప సంపదన్నారు. యోగా ప్రయోజాలను వివరించారు. మహిళా వర్సిటీ వీసీ డి.భారతి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యోగా అలవర్చుకోవాలన్నారు. యోగా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు యోగాసనాలు వేశారు. వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, స్వీమ్స్ మెడిసన్ హెచ్ఓడీ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ రమాశ్రీ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీలో.. ఎస్వీ వేదిక్ వర్సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ భగవంతుని ఆరాధనతో సమానంగా యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. మానిసిక ప్రశాంతతకు, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఆధునిక సమాజంలోని ప్రతి వ్యక్తికి అవసరమని తెలిపారు. అనంతరం వీసీ రచించిన ఆకాశం నవ్వుతోంది కవితా సంపుటిని అతిథులు ఆవిష్కరించారు. వేదిక్ విద్యార్థులు వేసిన యోగాసనాలను ముఖ్యఅతిథులు పరిశీలించి అనుసరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడిసన్ విభాగం హెచ్ఓడీ అల్లాడి మోహన్, ప్రముఖ కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాధాగోవింద త్రిపాఠి, డీన్ రాధేశ్యామ్, డాక్టర్ పి.నీలకంఠం, రామ్నారాయణ, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతావని అందించిన అమూల్య బహుమతి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో ప్రాచీన భారతావని మానవాళికి అందించిన అమ్యూల్య బహుమతి యోగా అని పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక డృఢత్వాన్ని పొందవచ్చన్నారు. దైనందిక జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని తద్వారా మంచి ఆరోగ్యం, చక్కని మానవ సంబంధాలు, మంచి ఆలోచనలను పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులు, సెజ్ కార్యాలయ సిబ్బంది, స్ధానిక పోలీసులు, చిన్మయ, అకార్డ్ స్కూల్ విద్యార్థులు, పరిసర గ్రామాలు ప్రజలు పాల్గొన్నారు. శ్రీసిటీలో ఘనంగా యోగా దినోత్సవం సత్యవేడు: శ్రీసిటీలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీసిటీ జనరల్ మేనేజర్ సన్యాసిరావు ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు స్థానిక విజిటర్ సెంటర్ ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించారు. 200 మంది పాల్గొన్నారు. జీఎం మాట్లాడుతూ సమాజం కోసం యోగా థీమ్గా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగా గురువు, ఏపీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.కోదండం ప్రత్యేక అతిథి పాల్గొని సూర్యనమస్కారాలు, వివిధ శ్వాస ప్రక్రియల్లో శిక్షణ ఇస్తూ ప్రయోజనాలను వివరించారు. పోలీసులకు యోగా ఎంతో అవసరం తిరుపతి క్రైమ్: నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరమని జిల్లా ఎస్పీ హర్షవర్థన్రాజు తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా కార్యక్రమానికి పోలీసు సిబ్బంది హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. పోలీసులతో ఆత్మీయ సమావేశం ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరుపతిలో ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎస్పీ హర్షవర్థన్రాజు తిరుమల, తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా పోలీసు అధికారులు నిర్వహించారని కొనియాడారు. ఈ మేరకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ ఏఎస్పీలతో కలిసి సిబ్బందికి భోజనాలు స్వయంగా వడ్డించారు. సమావేశంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు. -
పేదల ఇళ్లు కూల్చివేత
రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంటలో దళిత వర్గానికి చెందిన సుమారు 65 రేకుల ఇళ్లను అక్రమ నిర్మాణాల సాకుతో గురువారం అధికారులు నేలమట్టం చేశారు. పేదలకు తీరని నష్టాన్ని కలిగించారు. దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేసి ఈ దౌర్జన్య కాండను నిర్దయగా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరింపజేసి, బాధితులెవరూ రాకుండా అడ్డుకున్నారు. తొలుత రేణిగుంట సీబీఐడీ కాలనీ సమీపంలో 25 రేకుల ఇళ్లను, ఆ తర్వాత వివేకానంద కాలనీ సమీపంలో 40 ఇళ్లను కూల్చి వేశారు. బాధితులు లబోదిబోమంటూ ఆర్తనాదాలు చేసినా అధికారులు పెడచెవిన పెట్టి ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఏడాది కిందట రేణిగుంటలో రెవెన్యూ అధికారుల అనుమతులతో రేకుల ఇళ్లను నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ తీసుకుని నివాసం ఉంటున్నారు. బుధవారం రేణిగుంట సీబీఐడీ కాలనీలోని కొన్ని ఇళ్లను ఎంపీడీవో విష్ణుచిరంజీవి వెళ్లి జేసీబీ సాయంతో తొలగించారు. స్థానికులు అడ్డు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే గురువారం ఉదయం భారీగా పోలీసు బలగాలతో రేణిగుంట తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూల్చివేత సాగింది. కళ్లెదుటే ఇల్లు కూల్చి వేయడంతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దళితులంటే అంత చులకనా? అని బాధిత మహిళలు తహసీల్దార్ నాగేశ్వరరావును నిలదీశారు. ఈ ఇళ్లు అక్రమ నిర్మాణాలైతే అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఇంటి పన్నులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చు చేశామని కన్నీటిపర్యంతమయ్యారు. ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు.. ప్రభుత్వం మారగానే, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ఆదేశాలతో దళితుల ఇళ్లను ఇలా కూల్చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. పేద దళితులపై ఎందుకింత పగ?ఇళ్లులేని పేద దళితులు కట్టుకున్న చిన్నపాటి రేకుల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేయడం బాధాకరం. నేను అడ్డుకుంటానని భావించి మా ఇంటి వద్దకు పోలీసులను పంపి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మీకిది తగునా? పెత్తందార్ల ఇళ్ల జోలికి వెళ్లగలరా? ఇలాంటి ఆకృత్యాలు చేసేందుకా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? దళితులపై మీకు ఎందుకింత పగ? – ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు, తూకివాకం, రేణిగుంట మండలంఇళ్ల కూల్చివేత దుర్మార్గంరేణిగుంట వివేకానంద కాలనీలో పేదలు, దళితులు నిర్మించుకున్న ఇళ్లను టీడీపీ నాయకుల ఆదేశాలతో అధికారులు కూల్చి వేయడం దుర్మార్గం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించి ఉంటే ఆ ఇళ్లకు అనుభవ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేశారు? స్థలాలకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపైనా విచారించి చర్యలు తీసుకోవాలి. కరకంబాడి ఎర్రగుట్ట వివాదాస్పద భూమిని సిద్ధల రవి అనే వ్యక్తి ఆక్రమించుకుని పెద్ద ఎత్తున గ్రావెల్ తోలుకుంటుండటం మీకు కనిపించలేదా?– హరినాథ్, సీపీఎం మండల కార్యదర్శి, రేణిగుంట -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమృత్ సరోవర్తో భూగర్భ జలాల పెంపు
ఏర్పేడు: ఉపాధిహామీలో ఏర్పాటు చేసే అమృత్ సరోవర్తో భూగర్భ జలాలు పెరుగుతాయని డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని అముడూరులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. కూలీల మస్టర్లను తనిఖీ చేశారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైతుల వ్యవసాయ పొలాల్లో నీటి గుంటలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా చేస్తే రైతుల వ్యవసాయ బోర్లు, బావులకు భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చేలా పనుల్లో కొలతలను ఇవ్వాలని సూచించారు. పని ప్రదేశంలో కూలీలకు నీరు, నీడ, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రోజూ ఏర్పేడు మండలంలో 4 వేలు మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఉపాధిహామీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు మామిడి, పూలు, మునగ తోటల పెంపకం చేపట్టేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో దేవరి, సీడీసీఎల్ఆర్సీ చంద్రశేఖర్రాజు, జేఈ బాలాజీరావు, బీఎఫ్టీ వెంకటాద్రి, క్షేత్ర సహాయడు రవిచంద్ర, కూలీలు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో ప్రతీకార దాడులు
రేణిగుంట తహసీల్దార్ను నిలదీసిన మహిళలు ● చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు నగరానికి చెందిన హరి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి చేసి అతని సిగరెట్ గోడౌన్ కాల్చివేశారు. ఈ దాడుల్లో రూ.60లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ● చిత్తూరు నగరానికి చెందిన రెండు చికెన్ బిర్యానీ దుకాణాలను ధ్వంసం చేసి రూ.10 లక్షలు నష్టపరిచారు. ● ఎస్ఆర్ పురంలో వైఎస్సార్ సీపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేసి రూ.12 లక్షల వరకు నష్టపరిచారు. చిత్తూరులో కన్నన్ అనే వ్యక్తి బేకరీపై దాడి చేసి రూ.2లక్షలు నష్టం కలిగించారు. ● జీడీ నెల్లూరులో గౌతమి, గిరి, మోహన్, మురళి, కర్ణ ఇళ్లు ధ్వంసం చేశారు. ఈ విధ్వంసంలో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం కలిగింది. ● పూతలపట్టులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బాబు, జయపాల్, నిరంజన్, కిరణ్, భారతి, లోకేష్పై దాడులు చేసి వారి ఇళ్లు, ఆటోలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో రూ.7 లక్షలు నష్టం వాటిల్లింది. ● యాదమరిలో బాబు, అలీ, అఫ్జల్, గుల్వీర్, ఉస్మాన్, మున్నీ, కబీర్, జాకీర్, సలీమ్, గౌస్బాషకు చెందిన లారీ, దుకాణం, బైక్, ఐదు ఇళ్లను ధ్వంసం చేశారు. రేణిగుంట వివేకానంద కాలనీలో సుమారు 40 ఇళ్లను కూల్చివేశారు. దీంతో ఇళ్లు నిర్మించుకున్న పేద దళిత మహిళలు అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని పోలీసు బలగాలు దగ్గరకు రాకుండా కట్టడి చేశారు. తర్వాత తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇళ్లన్నీ నేల మట్టం చేశారు. నిర్మాణాల తొలగింపు పూర్త య్యాక, అక్కడి నుంచి బయల్దేరుతున్న తహసీల్దార్ను బాధిత మహిళలు అడ్డుకున్నారు. ‘గతంలో తాము ఇళ్లు నిర్మించుకుంటున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు.. ఎందుకు చోద్యం చూశారు.. ఇప్పుడెందుకు వచ్చి కూలగొట్టి మా బతుకులను వీధినపడేస్తున్నారు.. అప్పులు చేసి రేకుల ఇళ్లు నిర్మించుకుంటే ఏమిటీ దౌర్జన్యం’ అంటూ నిలదీశారు. శాపనార్థాలు పెట్టారు. అయితే అధికారులు అక్రమ కట్టడాల సాకుతో కూల్చివేసిన ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బాధితులకు అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఇంటి పన్నులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. -
‘నీట్’గా ముంచేస్తారా?
‘బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాల్సిన ఎన్టీఏ సంస్థ అవినీతిలో కూరుకుపోయింది. దేశ వ్యాప్తంగా సుమారు 24లక్షల మంది విద్యార్థుల జీవితాలను బీజేపీ సర్వనాశనం చేసింది. నీట్లో 720కి 720 మార్కులు 67మందికి రావడం ఎలా సాధ్యమం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి స్కాంలు, కుంభకోణాలు జరగడం సిగ్గుచేటు. రూ.30 లక్షల ముడుపుల కోసం కక్కుర్తిపడి ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్ను లీక్ చేసి విద్యార్థులను నట్టేట ముంచారు’ అంటూ విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించాయి. తిరుపతి సిటీ: నీట్ పేవర్ లీకేజీపై నిరసనలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కథంతొక్కాయి. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ముడుపులకు కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం మానుకోవాలని హితవు పలికాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతున్నా సీఎం, డెప్యూటీ సీఎంలు చంద్రబాబు, పవన్ నోరు మెదపకపోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు అక్బర్, రవి మండిపడ్డారు. గురువారం తిరుపతి ఎమ్ఆర్ పల్లి దండిమార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ బాధిత విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాత్రిపగలు కష్టపడి చదివి లక్షల రూపాయలు కోచింగ్కు వెచ్చించి డాక్టర్ కావాలన్న విద్యార్థుల ఆశలను బీజేపీ, ఎన్టీఏలు నాశనం చేశాయని ధ్వజమెత్తారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్తో పాటు ఎన్టీఏ చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, డెప్యూటీ సీఎంలు చంద్రబాబు, పవన్ వెంటనే మౌనం వీడి నీట్ స్కాంపై స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సూచించారు. నీట్ను రద్దు చేసి రాష్ట్రాల ఆధ్వర్యంలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రంగప్ప, రమేష్ నాయక్, జిల్లా నాయకులు నాగేంద్ర, మౌనిక, భార్గవ్, శివ, బాల, సునీల్, సాయి, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు ఎస్వీయూలో కదం తొక్కిన ఏఐఎస్ఎఫ్ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్లో ప్రధాన సూత్రధారులను గుర్తించి వెంటేనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, రాష్ట్ర నాయకులు చిన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు చేసి తిరిగి మళ్లీ పరీక్షను నిర్వహించాలని కోరుతూ ఎస్వీయూలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. ప్రపంచ యుద్ధాలను ఆపే సత్తా తమకుందని ప్రగల్భాలు పలికే మోదీ ప్రశ్నపత్రాల లీకేజీని ఎందుకు ఆపలేక పోయారని ఎద్దేవా చేశారు. పేద, బడుగు బలహీలన వర్గాల విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా శ్రమించి పరీక్ష రాస్తే వారి జీవితాలు గాడాంధకారంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను శిక్షించకపోతే దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో పార్లమెంట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పార్టీలకతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గళం విప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్, కార్యదర్శి ప్రవీణ్, ఎస్వీయూ ఆర్గనైజింగ్ సెక్రటెరీ చంద్రనాయక్, సురేష్నాయక్, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు తిరుమలేష్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం స్కామ్లు, కుంభకోణాలు ఇదేనా మోదీ మేక్ ఇన్ ఇండియా రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం ఎన్టీఏ చైర్మన్, కేంద్రమంత్రి వెంటనే రాజీనామా చేయాలి తిరుపతిలో కదం తొక్కిన విద్యార్థి సంఘాలు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. బుధవారం అర్ధరాత్రి వరకు 79,584 మంది స్వామివారిని దర్శించుకోగా 31,848 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.