-
జీపీ ఎదుట కార్మికుల ధర్నా
కేసముద్రం: ఎంపీఓ దుర్భాషలాడి, కించపరిచాడంటూ ఆరోపిస్తూ మండల కేంద్రంలోని జీపీ ఎదుట గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకన్న, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తాడబోయిన శ్రీశైలం, కోశాధికారి రాజమౌళి మాట్లాడుతూ.. కేసముద్రంస్టేషన్ జీపీకి చెందిన మంగీలాల్ అనే కార్మికుడు తమకు పది నెలలుగా వేతనాలు రావడం లేదంటూ ఎంపీఓ దృష్టికి తీసుకెళ్లాడన్నారు. దీంతో ఎంపీఓ దుర్భాషలాడుతూ జీపీ కార్మికుడిని కించపర్చాడని, వెంటనే అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న తహసీల్దార్ దామోదర్, ఎస్సై వంశీధర్, ఎంపీడీఓ రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. దీంతో జీపీ కార్మికులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో నాయకులు చాగంటి కిషన్, ఎల్లయ్య, జీపీ కార్మికులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మహబూబాబాద్ రూరల్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖరప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం యోగా గురువులు నారాయణప్రకాశ్ లోయ, ఉప్పల శ్రీనివాస్ యోగాసనాలు వేయించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. యోగాతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, శరీర దారుఢ్యానికి దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి తగినంత శ్రమ ఉండాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, జిల్లా కోర్టు పీపీలు చిలుకమారి వెంకటేశ్వర్లు, కీసర పద్మాకర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది కొంపెల్లి వెంకటయ్య, జిల్లా కోర్టు పరిపాలన అధికారి క్రాంతికుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం యోగా గురువులు నారాయణప్రకాశ్ లోయ, ఉప్పల శ్రీనివాస్ను సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అదనపు ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ.. యోగా, సూర్య నమస్కారాలు, నడక వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుంచి యోగా సాధన అలవాటు వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో జీవితంలో రాణిస్తారని పేర్కొన్నారు. అధికారులు, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, యోగా సాధన చేశారు. ఏఆర్ శ్రీనివాస్, సీఐలు దేవేందర్, సీఐ శరసర్వయ్య, ఆర్ఐలు భాస్కర్, సోములు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. ఒత్తిడి నుంచి విముక్తి.. నెహ్రూసెంటర్: యోగాతో మానసిక, శారీరక ఒత్తిడి నుంచి విముక్తి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... ప్రతీరోజు ఉదయం, సాయంత్రం యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష, డాక్టర్ మురళీధర్, ప్రొగ్రాం ఆఫీసర్లు, వైద్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆయుష్శాఖ డాక్టర్ నిరంజని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నెహ్రూసెంటర్: వానాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి వైద్యారోగ్యశాఖ, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ, పంచాయతీ, మున్సిపల్, విద్యాశాఖ, సంక్షేమశాఖ హాస్టళ్ల అధికా రులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులను అరికట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టి ప్రజలు డెంగీ, మలేరియా, చికెన్గున్యా లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రెయినేజీలు, నీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పంచాయతీరాజ్, అంగన్వాడీ, ఆశ, స్వయం సహాయక సంఘాలతో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షిస్తూ రోజువారి యాక్షన్ప్లాన్ నివేదికలు రూపొదించి అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కళావతిబాయి, డిప్యూటీ సీఈఓ నర్మద, డీటీడీఓ ఎర్రయ్య, డీడబ్ల్యూఓ వరలక్ష్మి, డీపీఓ హరిప్రసాద్, ఎస్సీ, మైనార్టీ శాఖల అధికారులు బాలరాజు, శ్రీనివాసరావు, డీఈఓ రామారావు, మిషన్ భగీరథ ఈఈ ఎం.కిషన్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఏ శాంతికుమారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష, మహబూబాబాద్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్లు రవీందర్, నరేష్రెడ్డి, రంజిత్, ప్రోగ్రాం అధికారులు బిందుశ్రీ, సుధీర్రెడ్డి, నాగేశ్వర్రావు, హెచ్ఈ కేవీ రాజు, పురుషోత్తం, డీడీఎం రాజ్కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
‘మేడిగడ్డ’ గేటు కటింగ్ పనుల్లో వేగం
కాళేశ్వరం: మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ 7వ బ్లాక్లోని 20వ పియర్ రేడియల్ గేటు తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం 20వ గేటు విడిభాగాలను తొలగించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇప్పటికే బ్యారేజీలోని 85గేట్లకుగాను 84 గేట్లు వర్షాకాలం దృష్ట్యా పైకి ఎత్తారు. ఒక్క గేటును పూర్తిగా తొలగించనున్నారు. 7వ బ్లాక్లో బొరియ ఏర్పడ్డ చోటుతో పాటు 11 గేట్ల వరకు మొత్తం 300 వరకు షీట్ఫైల్స్ వేయాల్సి ఉండగా.. ఇప్పటికే 285వరకు పూర్తిచేశారు. మిగితా బ్యాలెన్స్ షీట్ఫైల్స్ రెండురోజుల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. -
అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి దేవేందర్ హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, విచ్చలవిడిగా పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నా.. విద్యాశాఖ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ బడులను బలో పేతం చేయాలన్నారు. సతీష్, కృష్ణ, చింటు, ప్రణ య్, జైపాల్, అనిల్, జస్వంత్, రేవంత్ ఉన్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
నెహ్రూసెంటర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజాదరణ తగ్గిందని, సీట్లు కూడా తగ్గడానికి ప్రజావ్యతిరేక విధానాలే కారణమన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు వ్యతిరేక చట్టాల వల్ల దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరిగి 240 సీట్లకే పరిమితమైందని అన్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఏడు నెలలవుతున్నా అమలు చేయడంలో తాత్సారం చేస్తోందన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వెంటనే రైతుల రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు వీరయ్య, వెంకన్న, రాజు, రాజన్న, రాజమౌళి పాల్గొన్నారు. -
జిమ్నాస్టిక్స్ కోచ్పై విచారణ
వరంగల్ స్పోర్ట్స్ : మానసికంగా తమను వేధిస్తున్నాడంటూ వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు అకాడమీ కోచ్పై మే నెలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మే 17వ తేదీన ‘ఈ కోచ్ మాకొద్దు..’ అనే శీర్షికతోసాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ, ఎండీ సీరియస్గా తీసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఏడుగురు జిమ్నాస్టిక్స్ క్రీడాకారులను హైదరాబాద్లోని శాట్ ఎండీ ఆఫీస్కు పిలిపించి అసలేం జరిగిందని ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా విచారణ అధికారి శాట్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి శుక్రవారం హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలోని డీఎస్ఏ వచ్చారు. జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్కుమార్తో కలిసి సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఒక్కో కోచ్ను విడివిడిగా విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ పనితీరు, సమర్ధుడేనా అంటూ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పనితీరు సరిగా లేని కోచ్లను ఉపేక్షించేది లేదని డీడీ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల్లో విచారణపై పూర్తి స్థాయి నివేదిక బయటికి రానున్నట్లు తెలిసింది. అనంతరం బాలసముద్రంలోని స్విమ్మింగ్ పూల్ను సందర్శించి, క్రీడా వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాట్ ఎండీ ఆదేశాలతో రంగంలోకి డీడీ -
విద్యాభివృద్ధికి కృషి చేయాలి
గూడూరు: ఏజెన్సీ ప్రాంత గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయన్ అన్నారు. మండలంలోని దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలతో పాటు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకులాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల పరిసర ప్రాంతాలను పరిశీలించి మొక్కలు నాటారు. చదువులో విద్యార్థుల శక్తి సామర్థ్యాలను తెలుకున్నారు. అనంతరం ఉపాధ్యాయ బృందంతో మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. గురుకులాల్లో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేటి ఆధునిక యుగంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పటికీ విద్యాభివృద్ధిలో వెనకబడి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్సీఓ రాజ్యలక్ష్మి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వీరస్వామి, ఎంఈఓ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి నెహ్రూసెంటర్: విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పట్ల మధు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మఽధు మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ పాఠశాలలు యథేచ్ఛగా వ్యహరిస్తున్నాయని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సూర్యప్రకాశ్, జ్యోతి బసు, బానోత్ సింహాద్రి, వీరేందర్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన వారికి న్యాయం చేయాలి మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్సీ మహిళా ఉపాధ్యాయ రోస్టర్ అమలు కానందున నష్టపోయిన వారికి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి పి.రామారావుకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ.. ఇటీవల చేపట్టిన పదోన్నతుల్లో 9మంది మహిళా ఉపాధ్యాయులు ప్రమోషన్ కోల్పోయారన్నారు. దీనిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 24న టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, వెంకటేశ్వర్లు, స్వప్న, భధ్రునాయక్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. తప్పని విద్యుత్ తిప్పలు ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు పొందేందుకు వచ్చిన రోగులకు విద్యుత్ తిప్పలు తప్పడం లేదు. సాధారణ వార్డులకు విద్యుత్ సరఫరా జరిగితే తప్ప విద్యుత్ అందుబాటులో ఉండదు. ఎమర్జెన్సీ వార్డుకు జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ సకాలంలో సిబ్బంది స్పందించకపోవడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో ఎమర్జెన్సీ ఎక్స్రే విభాగానికి గంటల తరబడి విద్యుత్ నిలిచి ఎక్స్రే సేవలు ఆగిపోయాయి. అంతే కాకుండా పలు వార్డులకు కరెంట్ వస్తూ.. పోతూ ఉండడంతో రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఇదే విషయాన్ని రోగులు పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ సరఫరాలో ఉన్న సాంకేతిక లోపాన్ని సవరించారు. ‘జూడా’ల నిరసన ఎంజీఎం: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు శుక్రవారం నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంజీఎంలో నిరసన తెలిపారు. ఎంజీఎంలోని గాంధీ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. స్టైఫండ్లు సకా లంలో విడుదల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు, కేఎంసీలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, జూనియర్ డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 24నుంచి నిరవధిక సమ్మె కొనసాగించాలని రాష్ట్ర జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. సమ్మె నోటీసులను విడుదల చేశారు. సమ్మె సమయంలో ఎంజీఎంలోని అత్యవసర సేవలు మినహా అన్ని సేవలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు వరకు సమ్మె విరమించమన్నారు. -
అలరించిన సాంస్కృతికోత్సవం
హన్మకొండ కల్చరల్ : ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో నిర్వహించిన ససంగీత నృత్య విద్యార్థుల సాంస్కృతికోత్సవం అలరించింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సుధీర్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్, డిప్లొమా సంగీత, నృత్య కోర్సు విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక గాత్రం విద్వంసులు సింగారపు భాస్కర్ ఆధ్వర్యంలో కర్ణాటక గాత్ర విద్యార్థులు సిద్ధి వినాయకం మనిశం, సామజవరగమన, తిల్లాన, బ్రోచేవారెవరె రఘుపతే శ్రావ్యంగా ఆలపించారు. మృదంగ విద్వాంసులు వై.భీమ్శంకర్ సహకారం అందించారు. హిందూస్థానీ గాత్రం అధ్యాపకులు అనుముల యోష ఆధ్వర్యంలో విద్యార్థులు సహ్యూ ధృత్ఖయాల్ –ఆలాప్–తాన్, రాగ్ శుధ్ సారంగ్ వినిపించారు. సితార్ అధ్యాపకులు జక్కోజు సత్యనారాయణ వైష్టంజనతో, రాగ్ పహాడిలో దున్, మియాకీ మల్హర్ ధృత్గత్ తీన్తాల్ వాయించి ఆలరించారు. తబల సహకారం జక్కోజు సత్యనారాయణ అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది గడ్డం శంకర్, దోనేపూడి ప్రవళిక విద్యార్థులు, తల్లిదండ్రులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు. -
చినుకు చింత
శనివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2024సాక్షి, మహబూబాబాద్: వానాకాలం పంట సీజన్ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా.. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తొలకరి జల్లులను నమ్ముకొని వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు ఎండలకు వాడిపోతున్నాయి. ఇక కొత్తగా విత్తనాలు వేసేందుకు భూమిలో పదును లేదు. కాగా దుక్కులు దున్నుకొని వర్షం ఎప్పుడు పడుతుందా.. విత్తనాలు ఎప్పు డు వేద్దామా అని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొలకెత్తని విత్తనాలు వానాకాలం సీజన్కావడంతో.. వర్షాలు పడుతాయనే ధీమాతో రైతులు వేసిన విత్తనాలు పలుచోట్ల మొలకెత్తలేదు. జిల్లాలో సగటున ఈనెల 3వ తేదీన 23 మిల్లీ మీటర్లు, 6న 8.4మిల్లీ మీటర్లు, 7న 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా జిల్లా సాధారణ వర్షపాతం102 మిల్లీ మీటర్లు ఉండగా 28మిల్లీ మీటర్లు అధికంగా అనగా 130 మిల్లీ మీటర్లు కురిసింది. దీంతో వర్షాకాలం మొదలైందని భావించి ముందు వర్షానికి దుక్కులు దున్నుకొని వెంటనే విత్తనాలు వేశారు. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు 650ఎకరాల్లో మొక్కజొన్న, 55,623 ఎకరాల్లో పత్తి, 2030ఎకరాల్లో పెసర, 340 ఎకరాల్లో కందులు, 185 ఎకరాల్లో పసుపు వేశారు. ఇందులో సగానికి పైగా విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని విత్తనాలు మొలకెత్తగా.. ఎండల తీవ్రతతో మొక్కలు వాడిపోతున్నాయి. దుక్కులు దున్ని.. దిక్కులు చూస్తూ.. వర్షాకాలం ఎంత త్వరగా విత్తనాలు వేస్తే చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకోసమే జూన్ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు. రోహిణి కార్తెలోనే వరి నార్లు పోస్తారు. అయితే ఈ ఏడాదిలో జూన్ నెలలో ఇప్పటి వరకు ఎనిమిది రోజులు మాత్రమే వర్షం కురిసింది. అది కూడా అంతటా పడలేదు. దీంతో ఎక్కువ వర్షం కురిసిన ప్రాంతాల్లో ముందుగా దుక్కులు దున్నుకొని పత్తి, మొక్కజొన్న, పెసర, కంది విత్తనాలు, పసుపు వేశారు. ఇలా జిల్లాలో 4,29,790 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 58,828ఎకరాల్లో మాత్రం పంటలు సాగు చేశారు. ఇందులో అధికంగా 55,623ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. తక్కువ వర్షం కురిసిన చోట దుక్కులు దున్నిన తర్వాత కనీస స్థాయిలో కూడా భూమిలో తేమశాతం లేకుండా పోయింది. దీంతో వర్షం వస్తే కానీ విత్తనాలు నాటే పరిస్థితి లేదు. అదేవిధంగా ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో వాటి స్థానంలో మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రోజు ఆకాశం మేఘావృతం కావడం.. వర్షం వస్తుందని ఆశగా చూడడం, తీరా వాన పడకపోవడంతో రైతుల నిరాశ చెందడం పరిపాటిగా మారింది. అదేవిధంగా వర్షం కురిస్తేనే పంటలు, బతుకులు కావునా.. వర్షాలు పడాలని గంగమ్మ పూజలు, కప్పతల్లి ఆటలు, ఉయ్యాల పాటలతో వరుణ దేవుడిని కోరుతున్నారు. పంటల సాగు వివరాలు (ఎకరాలు) న్యూస్రీల్దుక్కులు దున్ని వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న రైతన్నలు వేసిన గింజలు మొలకెత్తని పరిస్థితి మళ్లీ వేద్దామంటే పదును లేక పాట్లు అదును దాటుతుందని రైతుల ఆందోళన వర్షం పడితేనే సాగు సాగేది.. ఈ ఫొటోలోని రైతు పేరు పిట్టల వెంకన్న కురవి మండలం బలపాల గ్రామం. మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు మొదలు పెట్టాడు. ఏడు పత్తి విత్తన పాకెట్లు తీసుకొచ్చి చేనులో విత్తాడు. ఎండల తీవ్రతతో పత్తి గింజలు మొలవక తీవ్రంగా నష్టపోయాడు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తిరిగి మరో నాలుగు ప్యాకెట్లను తీసుకొచ్చి విత్తాడు. మొత్తంగా మూడున్నర ఎకరాల్లో ఇప్పటివరకు సుమారు రూ.40 వేలు ఖర్చు చేశాడు. పంట సాగు అంచనా ప్రస్తుత సాగు వరి 2,15,278 00 పత్తి 84,070 55,623 మొక్కజొన్న 53,037 650 పెసర 1,722 2030 కందులు 1,236 340 పసుపు 1,870 185 ఇతర పంటలు 72,577 00 మొత్తం 4,29,790 58,828వర్షాలు లేక పత్తి గింజలు మొలకెత్తలేదు నేను మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్న. మొదట చిరుజల్లులు పడడంతో ఆశతో పత్తి విత్తన ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టినం. కానీ అనుకున్నట్టు వానలు పడలే.. దీంతో భూమిలో పత్తి గింజలు మొలకలు రాలేదు. దాదాపు విత్తనాల ప్యాకెట్ల ఖర్చు రూ.20 వేలు అయింది. మళ్లీ విత్తన ప్యాకెట్లు తీసుకురావాలంటే అప్పు చేయాలి. –సామ శ్రీనివాస్, అమీనాపురం, కేసముద్రం -
ఇప్పచెట్టు.. కల్పతరువు
కొత్తగూడ: ఇప్పచెట్టు.. ఆదివాసీల కల్పతరువు. అడవిలో విరివిగా ఇప్పపువ్వు, పలుకులు దొరుకుతాయి. కాగా ఏటా ఆదివాసీలు ఇప్పపువ్వును సేకరించి ఉపాధి పొందుతున్నారు. కాగా ఇప్పచెట్లకు ఆదివాసీ తెగలోని కొందరు ప్రత్యేక పూలు చేస్తారు. ఇలా తాతలకాలం నుంచి తమకు ఇప్పచెట్లతో ప్రత్యేక అనుబంధం ఉందని ఆదివాసీలు తెలుపుతున్నారు. గతంలో ఇప్ప సారాయి.. ఎన్నో బలవర్ధకమైన పోషకాలు ఉండడంతో ఇప్ప పువ్వుతో కుడుములు తయారు చేసి పిల్లలకు పెడుతారు. అలాగే కొన్నేళ్లక్రితం ఆదివాసీలు ఇప్పపువ్వుతో సారాయి తయారు చేసుకొని తాగేవారు. ప్రస్తుత ం ఆదివాసీల నుంచి జీసీసీ ద్వారా ఇప్పపువ్వులను సేకరించి ఆయుర్వేద మందుల్లో వాడుతున్నారు. అలాగే బిస్కెట్ల తయారీలో వినియోగిస్తున్నారు. గింజలతో నూనె తయారీ.. ఇప్ప గింజల నుంచి నూనె తీస్తారు. గతంలో కొన్ని ఆదివాసీ కుటుంబాలు నూనెను వంటల్లో వాడుకునేవారు. ప్రస్తుతం దైవారాధనలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గింజలను పట్టించి నూనె విక్రయిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో గింజలు సేకరించిన వారు జీసీసీకి విక్రయిస్తున్నారు. ఇప్పపువ్వు కిలో రూ.30, ఇప్ప పలుకులు(గింజలు) కిలో రూ. 29కి కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇప్ప పువ్వు, గింజలు సేకరించి ఆదాయం పొందుతూ కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. ఆదివాసీలకు ఇప్పచెట్టుతో ప్రత్యేక అనుబంధం పువ్వుల సేకరణతో ఆదాయం దైవారాధనలో నూనె వాడకం మందులు, తినుబండారాల తయారీ ఆదివాసీల జీవనంలో ముఖ్యమైనది.. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగలకు ఇప్ప చెట్టుతో ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతీ సంవత్సరం జూన్ ప్రారంభంలో ఇప్ప చెట్టుకు పూజలు చేస్తారు. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా లభించే ఇప్ప ఉత్పత్తులను తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నారు. కిలో ఇప్ప పువ్వుకు ధర రూ.100, కిలో పలుకులకు రూ.50 చెల్లించాలి. –వాసం వీరస్వామి, ఉపాధ్యాయుడువిక్రయానికి ఇబ్బందులు లేకుండా చూడాలి ఇప్ప పువ్వు సేకరించి శుద్ధి చేసి విక్రయించుకునేందుకు వెళ్తే కొనుగోలు చేసే వారు ఆలస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సేకరణ సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. –దాట్ల సుదర్శన్, కొత్తపల్లి గ్రామస్తుడు -
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ కోసం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఈ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బాలరాజు శుక్రవారం తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ స్టడీ సర్కిల్లో 10 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి సౌకర్యం ఉంటుందన్నారు. అభ్యర్థులు ఏదైన జనరల్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3లక్షల లోపు ఉండాలన్నారు. జూలై 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీ
కేసముద్రం : అనుమతి లేకుండా నిల్వ చేసిన వరి, పత్తి విత్తనాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేసిన ఘటన ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఓ ఎరువులు, విత్తన దుకాణంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇనుగుర్తి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ ఎరువులు, విత్తనాల దుకాణంలో వరంగల్ విజిలెన్స్ సీఐ అనిల్కుమార్, విజిలెన్స్ ఏఓ శ్రీనివాస్, కేసముద్రం ఏఓ వెంకన్నతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు దుకాణంలో పలు రికార్డులను, గోదాంను వారు పరీశీలించారు. ఎలాంటి అనుమతి లేకుండా గోదాంలో నిల్వ చేసిన 14.14 క్వింటాళ్ల వరి విత్తనాలు, 23 పత్తి ప్యాకెట్లను వారు గుర్తించారు. రూ.1.55 లక్షల విలువైన వరి, పత్తి విత్తనాలను సీజ్ చేసి, 6ఏ కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు ఏఓ వెంకన్న తెలిపారు. బంగారంతో గుమస్తా పరార్ ● రూ.48 లక్షల బంగారం చోరీ రామన్నపేట : వరంగల్ విశ్వకర్మ వీధికి చెందిన బంగారం వ్యాపారి సంజయ్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న సురేష్ 800 గ్రాముల బంగారంతో పరారైనట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. సంజయ్ వద్ద సురేశ్ రెండు వారాల నుంచి గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన రాత్రి సంజయ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా కరగదీసిన 800 గ్రాముల బంగారం బిస్కెట్తో పరాయ్యాడు. కాగా సురేశ్ స్వగ్రామం మహారాష్ట్రలోని సతార్ జిల్లా భాగ్యనగర్గా గుర్తించి అక్కడికి వెళ్లారు. అయినా అక్కడ అతడి ఆచూకీ లభించక పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సంజయ్ తెలిపారు. దొంగలించిన బంగారం విలువ రూ.48 లక్షలు వరకు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా మహిళ మృతి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండాకు చెందిన ఓ మహిళ మృతి చెందడం అనుమానస్పదంగా మారింది. కాగా భర్త మరణించడంతో ఆమె మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలపగా, మృతురాలి కుమార్తె మాత్రం తన తల్లిని కొట్టి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించింది. దీంతో సదరు మహిళ మృతి అనుమానాస్పదంగా మారింది. రూరల్ ఎస్సై వి.దీపికారెడ్డి కథనం ప్రకారం..సోమ్లాతండా గ్రామానికి చెందిన గుగులోత్ అనిత (35) భర్త మంగిలాల్ మూడేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి కూతురు ఉమ, కుమారుడు సాయికృష్ణ ఉన్నారు. కూతురు ఉమాకి వివాహం కాగా, కుమారుడు సాయికృష్ణ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే భర్త లేడని అనిత కొంతకాలంగా మనస్తాపానికి గురవుతోంది. ఈ క్రమంలో ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ఆమె మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై తెలిపారు. కొట్టి.. హత్య చేశారు..కుమార్తె ఉమా మండలంలోని సోమ్లాతండాకు చెందిన గుగులోత్ అనిత మృతిపట్ల ఆమె కుమార్తె ఉమా మాట్లాడుతూ తమ తల్లిని అదే తండాకు చెందిన గుగులోత్ బిచ్చు అనే వ్యక్తి కొట్టి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడని ఆరోపించింది. గురువారం రాత్రి తన తల్లిని హత్య చేసిన బిచ్చుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపించింది. ● ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది: పోలీసులు ● కొట్టి..చంపేసి ఉరివేసుకుందని చిత్రీకరిస్తున్నారు: మృతురాలి కుమార్తె ఉమా -
రుణమాఫీపై నివేదిక అందజేత
హన్మకొండ : రైతు రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఉపాధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య, పాలకవర్గ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఎస్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, పాలక వర్గ సభ్యులు కలిశారు. రుణమాఫీ నివేదిక అందించడంతో పాటు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. రైతుల రుణ మాఫీపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో ఋణం తీసుకున్న 7,74,833 రైతులకు సంబంధించిన రుణాల మాఫీపై నివేదిక అందించారు. డీసీసీబీలో తీసుకున్న రుణాల మాఫీపై సానుకూలంగా స్పందించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు, మంత్రి మండలికి మార్నేని కృతజ్ఞతలు తెలిపారు. సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు జనగామ : అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తమను వేధిస్తున్నాడని జనగామ మండలం వెంకిర్యాలకు చెందిన నవీన్కుమార్ స్థానిక సీఐ రఘుపతి రెడ్డిపై శుక్రవారం హైదరాబాద్లోని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) లో ఫిర్యాదు చేశాడు. అనంతరం నవీన్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారిని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలకు తలొగ్గి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని తెలిపాడు. మే 28వ తేదీన దాడికి పాల్పడగా ఇందుకు కాపాడే ప్రయత్నం చేసిన తన తల్లిని సైతం గాయపర్చారన్నారు. కాగా విషయం తెలుసుకున్న తన సోదరుడు డయల్–100 ఫోన్ చేసి, చికిత్స కోసం తమను జిల్లా ఆస్పత్రికి తీసుకు వెళ్లారన్నారు. అప్పటి కూడా పోలీసులు రాలేదని, అదే రోజు రాత్రి పీఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయడంతో పాటు సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అడవి దుంపలు తిని పలువురికి అస్వస్థత వెంకటాపురం(కె) : మండల పరిధిలోని వీఆర్కే పురం గ్రామానికి చెందిన ఐదుగురు అడవి దుంపలు తిని శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవ్య, మల్లక్క, రమ్య, రాజు, సరోజిని మల్లాపురం పరిధిలోని రాఘవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో అడవి దుంపలను (తెల్ల శనగ గడ్డలు) తవ్వి ఇంటికి తీసుకు వచ్చారు. అనంతరం వాటిని ఉడక బెట్టుకోని తినడంతో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. -
అత్తారింటిపై దాడి
● ఆరుగురిపై కేసు నమోదు రఘునాథపల్లి : భార్య, పిల్లలను ఎందుకు తీసుకెళ్లవని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి మరో ముగ్గురితో కలిసి అత్తారింటిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని మండెలగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలగూడెం గ్రామానికి చెందిన అరూరి సారయ్య–సునీత దంపతుల కూతురు అఖిలను లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన బర్ల మల్లయ్య–సుజాత దంపతుల కుమారుడు ఉపేందర్తో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కొన్నేళ్లుగా ఉపేందర్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కావాలని అఖిలను వేధిస్తున్నారు. కాగా అఖిల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వెళ్లి తల్లిగారింటి వద్దనే ఉంది. భార్య, పిల్లలను ఎందుకు తీసుకెళ్లడం లేదని అఖిల బంధువులు గురువారం ఉపేందర్కు ఫోన్ చేసి ప్రశ్నించారు. తననే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఉపేందర్ తన సోదరుడు మహేష్, మరో ఇద్దరితో కలిసి శుక్రవారం తెల్ల వారు జామున అత్తగారింటికి చేరుకున్నారు. ఆరుబయట నిద్రిస్తున్న వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో సారయ్య, సునీతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు లేచి రావడంతో నలుగురు పరారయ్యారు. గ్రామస్తులు వారి కోసం గాలించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన ఉపేందర్, సోదరుడు మహేష్, ఇద్దరు స్నేహితులతో పాటు వరకట్నం కోసం వేధించిన అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దాడి చేసిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. -
క్రీడా పాఠశాల పిలుస్తోంది..
భూపాలపల్లి అర్బన్ : రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో (హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్) 2024–25 విద్యా సంవత్సరానికి 4వ, 5వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు ఎంపికలుంటాయి, ఎలాంటి టెస్టులు పెడతారనే తదితర విషయాలపై ప్రత్యేక కథనం. ఎంపిక విధానం.. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు తెలంగాణ జిల్లాస్థాయిలో ఎంపికలు స్పోర్ట్స్ స్కూల్ అధికారులు ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని హకీంపేటలో, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు శారీరక సామర్థ్యంతో పాటు పలు టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎవరైతే ప్రతిభ కనబర్చి ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ స్కూళ్లు ఉండగా 40 మంది బాలురు, 40 మంది బాలికలకు అవకాశం ఉంటుంది. జిల్లాకేంద్రంలో విద్యార్థులకు శారీరక సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు మండల, జిల్లాస్థాయిలో నిర్వహించి రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు పంపిస్తారు. మండలస్థాయి పోటీలకు.. మండలస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల హెచ్ఎంతో పాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయస్సు ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలి. రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి ప్రొగ్రెస్ రిపోర్ట్తో మండలస్థాయి ఎంపిక పోటీలకు హాజరు కావాలి. ఈ నెల 25వ తేదీ వరకు ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే జిల్లాస్థాయికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక.. ● ఈ నెల 27వ తేదీ నుంచి 30వ వరకు జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎంపికలు.. ● జూన్ 8 నుంచి 12వ తేదీ వరకు హాకీంపేట స్పోర్ట్స్ న్కూల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఆగస్టు రెండో వారంలో ప్రవేశాలు నిర్వహిస్తారు. అర్హతలు.. ● 4వ తరగతి ప్రవేశాలకు హాజరయ్యే విద్యార్థులు 2015 సెప్టెంబర్ 1, నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులు. అలాగే దొడ్డి కాళ్లు, ప్లాట్ ఫీట్, వెన్నుముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు, బౌ లెగ్స్ ఉన్న వారు. ఎక్కడైన ఎముకలు విరిగిన వారు అనర్హులు.మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలుఅర్హులు వినియోగించుకోవాలిక్రీడాకారులుగా ఎదగాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ స్కూళ్లలో చదివి అంతర్జాతీయ స్థాయితో పాటు ఒలింపిక్స్ వంటి ఈవెంట్లో పాల్గొని సత్తాచాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ స్పోర్ట్స్ స్కూల్లో లభిస్తుంది. చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –రఘు, ఇన్చార్జ్ డీవైఎస్ఓ, జయశంకర్ భూపాలపల్లి హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూళ్లల్లో ప్రవేశాలు ఒక్కో పాఠశాలలో 40 మంది బాలురు, 40 మంది బాలికలకు అవకాశం ఎత్తు, బరువు 30 మీటర్ల ఫ్లెయింగ్ స్టార్ట్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ 800 మీటర్ల రన్నింగ్ 6, 10 మీటర్ల షటిల్ రన్ మెడిసన్ బాల్ త్రో(కిలో బరువు) వర్టికల్ జంప్ ప్లెక్సిబిలీటీ టెస్ట్ (ముందుకు వంగి భూమిని తాకడం), మెడికల్ టెస్ట్ -
బ్యూటీషియన్ శిక్షణ విజయవంతం
హన్మకొండ చౌరస్తా : చిన్న శుభకార్యం నుంచి వివాహ వేడుకల వరకు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు మహిళలు ఆరాట పడుతుంటారు. అందుకు పదిరోజుల ముందు నుంచే దగ్గరలోని బ్యూటీపార్లర్కు వెళ్తుంటారు. అయితే ప్రతి మహిళ సొంతంగా బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటే ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుంది. అలాగే ఉపాధి సైతం పొందవచ్చు. అలాంటి మహిళల కోసం శ్రీసాక్షిశ్రీ మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకునేందుకు అవకాశం కల్పించింది. హనుమకొండ చౌరస్తాలోని శ్రీ శైలి బ్యూటీపార్లర్ సహకారంతో నెల రోజుల పాటు బ్యూటీషియన్ కోర్సులో మహిళలు, యువతులకు శిక్షణ ఇచ్చారు. మెట్రో నగరాల్లోని కార్పొరేట్ బ్యూటీపార్లర్లకు తీసిపోని విధంగా సాక్షి మైత్రి, శ్రీ శైలి బ్యూటీపార్లర్ల సంయుక్త ఆధ్వర్యంలో అందించిన శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సాక్షి వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వి.శ్రీనివాస్, శ్రీ శైలి బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు రచ్చ రజిని పాల్గొని శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి బ్రాంచ్ మేనేజర్ వి.శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగడానికి, వారిని వివిధ రంగాల్లో ప్రోత్సహించడంలో సాక్షి ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. ఇలాంటి శిక్షణ తరగతుల్లో మీరు సైతం పాల్గొనాలంటే 95055 14424లో సంప్రదించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ ఎన్.సుమన్, సాక్షి బృందం పాల్గొన్నారు. సాక్షి మంచి కార్యక్రమం చేపట్టింది‘సాక్షి’ మైత్రి మహిళలకు ఎంతగానో ఉపయోగపడే మంచి కార్యక్రమం. మహిళలు ఎంతో ఇష్టపడే బ్యూటీషియన్ శిక్షణతో ప్రయోజనాలున్నాయి. మమ్మల్ని ఇందులో భాగస్వాములను చేయడం సంతోషం. సాక్షి ఇచ్చిన స్ఫూర్తితో తక్కువ ఖర్చుతో ప్రతి మహిళకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. శిక్షణలో పాల్గొన్న మహిళలకు అన్ని రకాల మెళకువలు నేర్పించాం. సాక్షి అందిస్తున్న అవకాశాన్ని వినియోగించుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. –ఆర్.రజిని, బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు శిక్షణ శ్రీ శైలి బ్యూటీపార్లర్ సౌజన్యంతో నిర్వహణ -
No Headline
హన్మకొండ కల్చరల్ : యోగా జీవితంలో ఒక భాగమని, యోగ సాధనతో శరీర శుభ్రతతో పాటు మనసు ఆనందంగా ఉంటుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్స్వామి పేర్కొన్నారు. ప్రాచీన భారత సాంప్రదాయం ప్రపంచానికి అందించిన ఆమూల్య సంపద యోగా అన్నారు. వస్తువులు శుభ్రంగా ఉన్నట్లే మన శరీర ఆరోగ్యం కోసం పదిహేను నిమిషాలు కేటాయించాలని చిన జీయర్స్వామి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాల మైదానంలో వికాస తరంగిణి హనుమకొండ, వరంగల్ జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బచ్చు రాధాకృష్ణ అధ్యక్షతన యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జీయర్ స్వామి హాజరై వికాస తరంగిణి సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. క్షణం తీరిక లేని నేటి జీవన విధానంలో మనిషి ఎన్నో రుగ్మతలను ఎదుర్కొంటున్నారని, శారీరక వ్యాయామం తగ్గడంతోనే అనారోగ్యం పాలవుతున్నారని, జీవన శైలితో సంపూర్ణ ఆరోగ్యానికి పొందేందుకు అందరూ నిత్యం యోగా సాధన చేయాలన్నారు.అనంతరం జీయర్ స్వామితో కలిసి పోశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వి ద్యార్థులు, నగర ప్రజలకు వినూత్న పద్ధతిలో యో గాసనాలు వేయించి సాధన చేయించారు. అంతకు ముందుగా వికాస తరంగిణి ప్రతినిధి డాక్టర్ బచ్చు రాధకృష్ణకు జీయర్స్వామి పూలమాల వేసి ఆశీర్వాదించారు. వికాస తరంగిణి ప్రతినిధులు డాక్టర్ బచ్చు మురళీకృష్ణ, భాస్కర్, రాము, పాకనాటి జ్యోతి, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చినజీయర్ స్వామి -
No Headline
● శాస్త్రవేత్త బి.రాములు హన్మకొండ: నేల అనుకూల ఆధారిత పంటలు సాగు చేయడం లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి.రాములు అన్నారు. గురువారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానంలో నాబార్డు సాయంతో నేల ఆరోగ్య యాజమాన్య పద్ధతులపై రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త బి.రాములు మాట్లాడుతూ సహజ వనరులైన నేల, వాతావరణం, నీరు క్రమక్రమంగా క్షయానికి గురవుతున్నాయని, ఇది రాబోయే తరాలకు అవసరమైన ఆహారపదార్థాల ఉత్పత్తి పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వివిధ పంటలకు అనుకూల నేలల్లో సాగు చేసినప్పుడే పూర్తి స్థాయిలో దిగుబడులు సాధించొచ్చన్నారు. ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, అపరాలకు అవసరమైన నేల, నీటి నాణ్యతపై సంపూర్ణ అవగాహన కల్పించారు. వరి పంటకు చౌడు, క్షారం, అమ్ల నేలలు తప్ప సాధారణంగా అన్ని రకాల నేలలు అనుకూలమన్నారు. పత్తి పంటకు లోతైన నల్ల రేగడి భూములు అనుకూలమన్నారు. మొక్కజొన్న పంటకు నీరు ఇంకే నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలమన్నారు. అపరాలకు ఎర్ర చలక, నల్ల రేగడి నేలలు, మురుగు నీరు పారే వసతి కలిగిన నేలలు అనుకూలమన్నారు. కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్. ఉమారెడ్డి, వరి శాస్త్రవేత్త బి.సతీష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకు మార్కెట్ విలువ
కాజీపేట అర్బన్ : నిబంధనల మేరకు భూమి మార్కెట్ విలువ నిర్ధారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి తెలిపారు. కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 మంది సబ్ రిజిస్ట్రార్లకు ఆయన పలు సూచనలు చేసి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ప్రభుత్వం అందజేసిన మార్కెట్ విలువ గైడ్లైన్స్ రూల్స్ 1998 ప్రాతిపదికన భూమి మార్కెట్ విలువను, రిజిస్ట్రేషన్ల నిర్ధారణ ప్రక్రియను ఈనెల 23వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. ఆ నివేదికను ఈ నెల 29వ తేదీ వరకు అడిషనల్ కలెక్టర్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఆర్డీఓ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి అందజేయాలన్నారు. కాగా, ఈనెల 29వ తేదీన కమిటీ నిర్ధారణ చేస్తుందని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణకు గాను జూలై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో ifrr.gov.in అనే వెబ్సైట్లో ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూలై 24వ తేదీన మార్కెట్ విలువలను కమిటీ అప్రూవల్ చేసి, జూలై 31వ తేదీన రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పొందుపరచి ఆగస్టు 1వ తేదీ నుంచి మారిన మార్కెట్ విలువలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు జూలై 1 నుంచి గ్రీవెన్స్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి -
మిస్సింగ్ కేసులను ఛేదించిన పోలీసులు
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో నమోదైన నాలుగు మిస్సింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఏసీపీ నందిరాంనాయక్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ మల్లయ్య నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసులను ఛేదించారు. ఇటీవల వరంగల్ శివనగర్కు చెందిన గృహిణి నాటు రజిత, ఉర్సు కరీమాబాద్కు చెందిన కోదాటి రశ్మిత, వరంగల్ శంభునిపేట ప్రాంతానికి చెందిన హబీబ్ ఉన్సీసా, దూపకుంట రోడ్డు శంభునిపేట గిరిప్రసాద్ నగర్కు చెందిన మంచాల మౌనిక అదృశ్యమయ్యారు. ఈమేరకు లోకేషన్ను ట్రేస్ చేసి మహిళతో పాటు ముగ్గురు యువతులను గుర్తించి తల్లిదండ్రులకు గురువారం అప్పగించారు. కేసులను ఛేదించిన ఇన్స్పెక్టర్ మల్లయ్య, సిబ్బందిని ఏసీపీ నందిరాంనాయక్ అభినందించారు. -
పింగిళి కళాశాల పీజీ ఫలితాల విడుదల
హన్మకొండ అర్బన్ : నగరంలోని పింగిళి మహిళా ప్రభుత్వ కళాశాల పీజీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ నర్సింహాచారి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి మాట్లాడుతూ కేయూ పరిధిలో గల ఏకై క మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల పింగిళి కళాశాల ఉన్నత స్థాయికి రావాలని, దీనికి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని తెలిపారు. పేద, మధ్య తరగతి పిల్లలు అభివృద్ధిలోకి రావడానికి పింగిళి కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ అన్ని కోర్సులలో 172 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరుకాగా 147 మంది ఉత్తీర్ణులై 85.47 ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి రామకృష్ణారెడ్డి, అదనపు కంట్రోలర్లు రేణుక, శిరీష, అధ్యాపకులు సుహాసిని, పార్వతి, కల్పన, తదితరులు పాల్గొన్నారు. -
పగలు కూలి పని.. రాత్రి బైక్ చోరీలు
ఖిలా వరంగల్: పగలు కూలి పని చేస్తూ.. రాత్రి సమయాన ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి ఆరు బైక్లు స్వాఽధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఈ మేరకు మిల్స్కాలనీ పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. వరంగల్ రంగశాయిపేట తెలంగాణ కాలనీకి చెందిన జాగరి లికేశ్ , మంచిర్యాల జిల్లా దోరారిపల్లికి చెందిన జాగరి తేజ్ బంధువులు. వీరు పగలు కూలి పని చేస్తూ.. రాత్రి సమయాన ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత నెల 24న రంగశాయిపేటకు చెందిన సుంకరి హర్షవర్ధన్, 25న రాత్రి ఎస్ఆర్ఆర్తోట చెందిన ఉరుగొండ సుభాశ్, ఈనెల 12న రంగశాయిపేటకు చెందిన పేరాల సందీప్ బైక్లు అపహరించారు. ఈ ఘటనపై సందీప్ ఫిర్యాదు మేరకు బైక్ చోరీలపై ఏపీపీ స్పందించారు. ఇన్స్పెక్టర్ మల్లయ్య నేతృత్వంలో ప్రత్యేక ఐడీ పార్టీని ఏర్పాటు చేయగా.. సహదేవ్, బి.బావ్సింగ్, ఎండీ వాజీద్, సాంబయ్య టీమ్గా ఏర్పడ్డారు. సందీప్ బైక్ చోరీ చేస్తున్న సమయంలో నిక్షిప్తమైన సీసీ పుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో లభించిన ఆధారాలను బట్టి జాగరి లికేశ్, జాగరి తేజ్గా గుర్తించారు. గురువారం వరంగల్ ఫోర్ట్రోడ్డుపై వీరిని అరెస్ట్ చేసి ఆరు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, కాజీపేట, జమ్మికుంట పీఎస్ల పరిధిలో కూడా బైక్ చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఏసీపీ చెప్పారు. ఇద్దరు దొంగల అరెస్ట్ 6 ద్విచక్రవాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరాం -
కాలుష్యం నుంచి జలాశయాలను రక్షించుకుందాం
● పర్యావరణ పరిరక్షకుడు కె.ప్రకాశ్హన్మకొండ: కాలుష్యం నుంచి జలాశయాలను రక్షించుకుందామని పర్యావరణ పరిరక్షకుడు కె.ప్రకాశ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేదిద్దామని, మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దామని కోరుతూ హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు కె.ప్రకాశ్ చేపట్టిన పాదయాత్ర గురువారం హనుమకొండలోని కాళోజీ విగ్రహం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర స్టేషన్ఘన్పూర్ వరకు చేరుకుంది. ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కె.ప్రకాశ్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను స్వచ్ఛదంగా నిషేదిద్దామని, మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కె.అనితారెడ్డి, మండల పరశరాములు, శ్రావణ్ కుమార్, అనంత్, గోపాల్ రెడ్డి, సీమ రాజు, సురేష్ లాల్, కల్యాణ్ పాల్గొన్నారు.