-
రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించిన జయశంకర్
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ: జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతోపాటు జనాన్ని జాగృతం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు తోట వెంకన్న, బంక సరళ, వెంకట రాజ్ కుమార్, బంక సంపత్, వీరగంటి రవీందర్, మాధవిరెడ్డి, చీకటి ఆనంద్ నలుబోల సతీశ్, వల్లపు రమేశ్, పాలడుగుల ఆంజనేయులు పాల్గొన్నారు. -
యోగాతో ఆధ్యాత్మిక భావన పెంపు..
వరంగల్ లీగల్: మనిషికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను అందించడంలో యోగా ఎంతో దోహదపడుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్బాబు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని కోరారు. యోగా సాధన వల్ల శారీరక, మానసిక రుగ్మతలను పారదోలవచ్చన్నారు. ఈసందర్భంగా యోగా గురువు జితేందర్రావు ప్రదర్శించిన వివిధ ఆసనాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉత్సాహంగా వేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.జీవన్గౌడ్, బార్ అసోసియేషన్ల బాధ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్, పీజీటీ, స్టాఫ్ నర్స్ (ఔట్ సోర్సింగ్ పద్ధతిన) పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు మేన శ్రీను, డి.సౌజన్య శుక్రవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా పరిధి హనుమకొండ (బాలికలు) జూనియర్, పాఠశాలలో జూనియర్ లెక్చరర్లు తెలుగు, భౌతికశాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆంగ్లం(పీజీటీ) పోస్టు, కాజీపేట (బాలురు) జూనియర్ లెక్చరర్ (జంతు శాస్త్రం) ఉద్యోగాలు, వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ (బాలికలు–2)లో జూనియర్ లెక్చరర్( సివిక్స్), స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25లోగా దరఖాస్తుల్ని ఆయా జిల్లాల కార్యాలయాల్లో అందజేయాలని వివరాలకు హనుమకొండ జిల్లాకు సంబంధించి 80749 94073, వరంగల్ జిల్లాకు సంబంధించి 93988 60995లో సంప్రదించాలని సూచించారు. ఎంజీఎంలో విద్యుత్ తిప్పలుఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు పొందేందుకు వచ్చిన రోగులకు విద్యుత్ తిప్పలు తప్పడం లేదు. సాధారణ వార్డులకు విద్యుత్ సరఫరా జరిగితే తప్ప విద్యుత్ అందుబాటులో ఉండదు. ఎమర్జెన్సీ వార్డుకు జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ సకాలంలో సిబ్బంది స్పందించకపోవడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో ఎమర్జెన్సీ ఎక్స్రే విభాగానికి గంటల తరబడి విద్యుత్ నిలిచి ఎక్స్రే సేవలు ఆగిపోయాయి. అంతే కాకుండా పలు వార్డులకు కరెంట్ వస్తూ.. పోతూ ఉండడంతో రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఇదే విషయాన్ని రోగులు పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ సరఫరాలో ఉన్న సాంకేతిక లోపాన్ని సవరించారు. పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి దేశాయిపేట: పెన్షనర్ల కరువు భత్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో నగదు రహిత వైద్య సేవలదించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు కె.సుధీర్బాబు కోరారు. నగరంలోని ఇన్నర్వీల్ క్లబ్లో శుక్రవారం మూడో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన 35 మందికి సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన మంత్రి కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరుకావంతో ఆమె పంపిన సందేశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలిశోజు రామమనోహర్ చదివి వినిపించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.నరసింగరావు, రాష్ట్ర సలహాదారు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగపురి సారయ్య, నాయకులు నర్సయ్య, రామమనోహర్, టి.పురుషోత్తం, జగన్మోహన్, అలువాల సూర్యనారాయణ, అంజయ్య, బాల మల్లేష్, అంజయ్య, సత్యనారాయణ, రాజయ్య, జె.విజయసారథి పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడుదాం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడుదామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని జరుపుకున్నారు. అంతకుముందు బాలసముద్రంలోని ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో సైనికులమవుతామన్నారు. తెలంగాణే శ్వాసధ్యాసగా జీవించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రఽభుత్వం ఏకశిలా పార్కును జయశంకర్ స్మృతివనంగా తీర్చిదిద్దిందన్నారు. కార్యక్రమంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. -
ప్లాంటేషన్ పనులు ప్రారంభించాలి
వరంగల్ అర్బన్: చెరువు కట్టలపైన బండ్ ప్లాంటేషన్ పనులు ప్రారంభించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఉద్యావన విభాగ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె వరంగల్ పరిధి క్రిస్టియన్ కాలనీలోని నర్సరీ, గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువులు, ఏనుమాములలోని ముసలమ్మ కుంట ప్రాంతాల్లో పర్యటించి బండ్ ప్లాంటేషన్ కార్యాచరణ ప్రణాళికను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. క్రిస్టియన్ కాలనీ నర్సరీని పరిశీలించిన కమిషనర్ మొక్కల పెంపకం, నిల్వ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని సూచించారు. నగర పరిధిలో కుంటలు, చెరువులు ఆక్రమణలకు గురవకుండా కట్టలపై మొక్కలు పెంచాలన్నారు. అదేవిధంగా శాకరాశికుంట ఎస్సీ కాలనీ, కీర్తిబార్ ప్రాంతాలతోపాటు బొమ్మలగుడి వద్ద నిర్మించిన కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు చేపట్టిన పనులకే బిల్లులు చెల్లింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేశ్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రిన్సి, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల వేకెన్సీ జాబితా వెల్లడి
విద్యారణ్యపురి: ఎస్జీటీల తత్సమానమైన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు సంబంధించిన వేకెన్సీల వివరాల్ని ఉపాధ్యాయ సంఘాలకు, ఆయా టీచర్ల వాట్సాప్ గ్రూపులకు అధికారులు శుక్రవారం పంపించారు. హనుమకొండ జిల్లాలో ఎస్జీటీల తత్సమాన ఉపాధ్యాయుల వేకెన్సీలు 357 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అందులో క్లియర్ వేకెన్సీలు 202, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్ల వేకెన్సీలు 155 వరకు ఉన్నట్లుగా ప్రాథమికంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు గుర్తించారు. స్పౌజ్ కేటగిరీలో బదిలీలు కావాలనుకునేవారు సమర్పించిన దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్హై తెలిపారు. స్పౌజ్ ఇప్పటికే బదిలీ అయినా.. ఉద్యోగ విరమణ పొందినా, దివ్యాంగులై ఉన్నా ఈనెల 22వ తేదీ(శనివారం) సాయంత్రం వరకు 99481 88254కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో మరో 76 మంది తత్సమాన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వులు అందాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 434 మంది టీచర్లకు పదోన్నతుల ఉత్తర్వులు అందాయి. వరంగల్ జిల్లాలోనూ ఎస్జీటీ తత్సమాన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరగనుంది. వేకన్సీలు 606 ఉన్నాయి. క్లియర్ వేకెన్సీలు 278 ఉన్నాయి, 8సంవత్సరాలు పూర్తిచేసుకున్న టీచర్ల వేకన్సీలు 328 ఉన్నాయి. వీటిపై అభ్యంతరాలుంటే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుంది. -
సమస్యలు పరిష్కరించాలని ‘జూడా’ల నిరసన
ఎంజీఎం: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు శుక్రవారం నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంజీఎంలో నిరసన తెలిపారు. ఎంజీఎంలోని గాంధీ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టైఫండ్లు సకాలంలో విడుదల కోసం గ్రీన్ చానల్ ఏర్పాటు, కేఎంసీలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, జూనియర్ డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 24న నుంచి నిరవధిక సమ్మె కొనసాగించాలని జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈమేరకు సమ్మె నోటీసులను విడుదల చేశారు. సమ్మె సమయంలో ఎంజీఎంలోని అత్యవసర సేవలు మినహా అన్ని సేవలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్ల డించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. -
తెరమీదకు మరోసారి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెల పంపిణీ పథకంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన అక్రమాలు మరోసారి తెరమీదకు రాబోతున్నాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని పక్కదారి పట్టించిన వారి అవినీతి అక్రమాలు మళ్లీ వెలుగుచూడబోతున్నాయి. అక్రమార్కులపై అప్పటి ప్రభుత్వం మొక్కుబడిగా చర్యలు తీసుకుని కేసులు మూసేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రమాలను తోడుతోంది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈపథకానికి సంబంధించిన సమస్త సమాచారం జిల్లాల వారీగా కావాలని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య, పశుసంవర్దకశాఖను ఇటీవల కోరింది. ఆయా జిల్లాల జిల్లా పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారు(డీవీఏహెచ్ఓ)లు నేడే, రేపో పంపేందుకు సిద్ధమయ్యారు. మొదటి విడత సాగిందిలా.. ఉమ్మడి వరంగల్లో 575 సహకార సంఘాలు, సుమారు 60 వేల మంది సభ్యులను గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఆ మేరకు విడతల వారీగా అర్హులకు లబ్ధి చేకూరేలా ప్లాన్ చేసింది. మొదటి విడత (ఎ–లిస్టు)లో మొత్తం 50,678 యూనిట్లు మంజూరు చేసి, ప్రతి యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించి పంపిణీ చేశారు. మహారాష్ట్రతోపాటు కడప జిల్లాలోని ఆరు మండలాల్లో గొర్రెల కొనుగోలు ప్ర క్రియ చేపట్టారు. వాటికి ఇన్సూరెన్స్ ట్యాగ్లు పూర్తయిన అనంతరం అక్కడినుంచి వాహనాల ద్వారా జిల్లాకు పంపాల్సి ఉండగా.. ఇక్కడే అనేక అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తాజాగా ఈడీ ఆదేశాల మేరకు పాత వరంగల్ జిల్లా పరిధిలో ఏర్పడిన జిల్లాల్లో లబ్ధిదారులకు 50,678 యూనిట్లకు 49,276 యూ నిట్లు (97శాతం) గ్రౌండింగ్ చేసినట్లు ఇప్పటివరకు తేలినట్లు సమాచారం. అలాగే రెండో విడత గ్రౌండింగ్ తదితర వివరాలను సైతం క్రోడీకరించి రెండు, మూడు రోజుల్లో ఈడీకి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ డీవీఏహెచ్ఓ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అడుగడుగునా అక్రమాలే.. నివేదికలో వివరాలు అవే... పథకం ఆరంభంలో శ్రద్ధ వహించిన ఉన్నతాధికారులు రానురానూ మండల పశువైద్యాధికారులకే జీవాల కొనుగోలు బాధ్యత ఇచ్చారు. దీంతో గొర్రెలు లబ్ధిదారుల ఇంటికి చేరకముందే చేతులు మారాయి. కొన్నిచోట్ల ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వరకు చేరుకొని, మళ్లీ తరలిపోయాయి. ఈ అక్రమాల తంతులో పలువురు మండల పశువైద్యాధికారులే కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గొర్రెలను ఏడాదిలోపు విక్రయించరాదన్న నిబంధనలున్నా.. వారంలోపు అమ్మడమే కాకుండా.. రీసైక్లింగ్ చేసిన దాఖలాలూ బయటపడ్డాయి. గొర్రెలు క్షేత్రస్థాయిలో లేకున్నా.. గొర్రెలు, వాటి పిల్లల పేరిట దాణా, నట్టల మందులకు కూడా డబ్బులు కాజేశారు. వీటన్నింటిపై వివరంగా నివేదిక సిద్ధం చేస్తుండడంతో మళ్లీ ఏం జరుగుతుందోనన్న చర్చ అందుకు బాధ్యులైన వారిలో మొదలైంది. ఆ గొర్రెలు ఎవరివి? ఇప్పటికే తేలని లెక్క.. బ్యాంకులో నగదు జమ వరంగల్ జిల్లా నుంచి ఎల్కతుర్తి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలతోపాటు 574 గొర్రెలను 2019లో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 13 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆ 13 మంది కూడా తమకు సంబంధం లేదని తప్పుకున్నారు. దీంతో ఆ గొర్రెలను విక్రయించిన పశుసంవర్థ్ధకశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు ఆ డబ్బులను బ్యాంకులో జమ చేశారు. ఆ గొర్రెలు ఎవరివి? ఎక్కడినుంచి తరలించారు? అనే వివరాలను ఇప్పటికీ తేల్చలేదు. ఽ ● చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 12 యూనిట్లలో అవకతవకలు చోటు చేసుకోవడంతో అక్కడి పశువైద్యాధికారిని సస్పెండ్ చేశారు. 10 మందిపై శాఖాపరమైన ప్రత్యేక బృందాలు విచారణ జరిపి ‘మమ’అనిపించాయి. ● భూపాలపల్లికి చెందిన డీవీఅండ్ఏహెచ్ఓ డాక్టర్ ఎం.బాలకిషన్, జనగామ జిల్లా బచ్చన్నపేట వీఏఎస్ డాక్టర్ కె.హరికిషన్పై చర్యలకు ఫెడరేషన్ ఎండీకి చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యా యి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ విచారణ పశుసంవర్థకశాఖలో చర్చనీయాంశంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల లెక్కలు జిల్లాల వారీగా వివరాలు కోరిన ఈడీ గతంలో ఉమ్మడి వరంగల్లో 10 మందిపై విచారణ.... ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశం.. మళ్లీ సమగ్ర విచారణకు రంగంలోకి ఈడీ.. ఈడీ, సమాఖ్యల ఆదేశాలతో నివేదిక తయారీలో డీవీఏహెచ్ఓలు -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)శనివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2024యోగాసనాలు వేస్తున్న హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, సీకేఎం మైదానంలో యోగాసనాలు వేస్తున్న నగరవాసులు, యోగాసనంలో చినజీయర్ స్వామి యోగా డేయోగా దినోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్లో, వరంగల్ ఓ సిటీ మైదానంలో ఆయా జిల్లాల ఆయుష్, యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, నగరవాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో మాస్టర్ యోగాసనాలు వేయించారు. ఆరోగ్యానికి యోగా ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. వరంగల్ దేశాయిపేట సీకేఎం కళాశాల మైదానంలో వికాసతరంగిణి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు.న్యూస్రీల్– వివరాలు 8లోuయోగాతోనే మానసిక ఆనందం త్రిదండి చినజీయర్ స్వామి -
చెరువుకు చెర!
కాజీపేట: దాదాపు ఏడు శతాబ్దాలుగా వరంగల్ నగర ప్రజల దాహార్తి తీర్చిన ఆదెరువు ఇప్పుడు కళావిహీనమైంది. పాలకుల పట్టింపులేనితనంతో వడ్డేపల్లి చెరువు చెత్తకుప్పలకు కేంద్రమవుతోంది. మున్సిపల్ అధికారులు కొన్ని సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ వడ్డేపల్లి చెరువు నీటిని ఆరేళ్లుగా వాడడం నిలిపేశారు. దీంతో ఈ చెరువు కాజీపేటలోని వ్యర్థ జలాలకు ఆవాసంగా మారింది. అధికారులు సమ్మర్ స్టోరేజీగా వినియోగించడం ఆపేసినప్పటి నుంచి దీనిపై రియల్ వ్యాపారుల కన్ను పడింది. మెల్లమెల్లగా కొంత మంది ఆక్రమణలకు తెరలేపారు. చెరువు శిఖంలో ఉన్న భూములను అతి తక్కువ ధరలకు కొంటూ రియల్ వ్యాపారులు వెంచర్లు చేస్తూ.. ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తున్నారు. ఘన చరిత్ర చెరువుది.. కాకతీయ రాజుల కాలంలో తాగు, సాగు నీటి అవసరాల కోసం వడ్డేపల్లి చెరువును తవ్వారు. ఆరోజుల్లో దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. నిజాం రాజుల కాలంలోనూ హనుమకొండ, కాజీపేట ప్రాంతాలకు తాగునీటిని ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేసి అందించేవారు. కాజీపేట పట్టణం నానాటికీ విస్తరిస్తుండడంతో అనేక కాలనీలు ఏర్పడ్డాయి. నూతన కాలనీల ఏర్పాటుతో వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారిపోయాయి. పెద్దపెద్ద భవనాల నిర్మాణంతో ఆయకట్టు భూములు కనుమరుగయ్యాయి. అనంతరం 1993లో రూ.10 కోట్ల వ్యయంతో అప్పటి ప్రభుత్వం ఈ చెరువును పూర్తి స్థాయి సమ్మర్ స్టోరేజీగా తీర్చిదిద్దింది. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ... ఇటీవలి కాలంలో ధర్మసాగర్ పెద్ద చెరువును పూర్తి స్థాయి రిజర్వాయర్గా మార్చారు. చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ కెపాసిటీగా మార్చి గోదావరి నదీ జలాలను ఎత్తిపోస్తున్నారు. ధర్మసాగర్ చెరువు ఎగువ ప్రాంతంలో ఉండడం కారణంగా గ్రావెటీ ద్వారా నీరు వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్కు నేరుగా చేరుతున్న నేపథ్యంలో వడ్డేపల్లి చెరువు నీటి అవసరం లేదని అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిశ్చయించి తాగునీటి అవసరాలకు నీటి వాడకాన్ని పూర్తిగా ఆపేశారు. డంపింగ్ యార్డుగా వినియోగం.. చెరువు నీటిని అధికారులు పూర్తిగా వాడడం నిలిపేయడంతో చుట్టు పక్కల ఉన్న గృహస్తులు చెరువు కట్టను డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇళ్లలోని చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి నిర్భయంగా చెరువులోనే పడేస్తుండడం గమనార్హం. కొంతమంది ట్రాక్టర్లలో పట్టణం నుంచి చెత్తను తీసుకొచ్చి సిద్ధార్థనగర్ వైపు ఉన్న చెరువులో పోస్తుండడం దేనికి సాంకేతమో అర్థం కావడం లేదని పర్యవరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో కొంతమంది కావాలనే ముందస్తు ప్రణాళికతో చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పర్యాటకులకు ఇబ్బంది.. ‘కుడా’, మున్సిపల్ శాఖలు దాదాపు రూ.2 కోట్లకు పైగా వెచ్చించి చెరువు కట్టను ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాయి. నేటికీ పనులు సాగుతూనే ఉన్నాయి. అయితే అసలు సమస్యంతా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒకప్పుడు రిజర్వాయర్గా వెలుగొందిన చెరువు.. నేడు వ్యర్థ జలాలతో కంపు వాసన వెదజల్లుతోంది. సినీ, లఘు చిత్రాల, సీరియళ్ల షూటింగ్లు నిలిచి పోయాయి. పర్యాటకుల సంఖ్య క్రమేిపీ తగ్గిపోతోంది. శిఖంలో ఉన్న భూములు యథేచ్ఛగా క్రయ, విక్రయాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికై నా.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఈదిశగా దృష్టి సారించి అధికారులతో సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. చెరువు స్థలాన్ని కాపాడాలి.. వడ్డేపల్లి చెరువును కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. చెరువులో కలుస్తున్న వ్యర్థ జలాలను దారి మళ్లించాలి. కట్టపై ఎలాంటి చెత్తా చెదారం వేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. – కాయిత రాజ్కుమార్ యాదవ్, కాజీపేట చెత్తవేయకుండా చర్యలు తీసుకుంటాం.. చెరువు కట్టను ఆనుకుని ఉన్న కుటుంబాలు ఇష్టారీతిగా చెత్తను తీసుకొచ్చి కట్టపై పోయకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ట్యాంక్బండ్పై ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి నివారణ చర్యలు చేపడతాం. – సంతోశ్బాబు, డీఈ, మున్సిపల్ డంపింగ్ యార్డుగా మారుతున్న వడ్డేపల్లి చెరువు ఎఫ్టీఎల్లో రియల్ వ్యాపారాలు పట్టించుకోని అధికారులు విచారణ జరపాలని కోరుతున్న ప్రజలు -
ఆయిల్పామ్ రైతులకు రెండో సంవత్సర రాయితీ
హన్మకొండ: ఆయిల్పామ్ రైతులకు ప్రభుత్వం రెండో సంవత్సర రాయితీ సొమ్ము విడుదల చేసింది. హనుమకొండ జిల్లాలో 303 మంది రైతులు 1,116 ఎకరాలలో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. తోటల నిర్వహణ, అంతర్ పంటల సాగుకు ప్రభుత్వం రాయితీని అందిస్తుంది. జిల్లాలోని 1,116 ఎకరాలకు గాను రూ.46.90,140ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.శ్రీనివాస్ రావు తెలిపారు. సొమ్ము జమకాని రైతులు సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్: వరంగల్ జిల్లాలో 2626 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేస్తున్న 754మంది రైతులకు రెండో ఏడాదికి గాను రాయితీ నిధులు రూ.1,10,31,300లు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. కేయూలో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులుకేయూ క్యాంపస్: కేయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తరగతులు జూలై 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా జూలై 9వ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కేయూ విద్యార్థులు, ఉద్యోగులకు రూ.1.000, ఇతరులకు రూ.1,500 ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజీకి నాన్ యూనివర్సిటీ ఫండ్లో చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. జూలై 10 నుంచి 40 రోజులపాటు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. రేపు ప్రిన్సిపాళ్లతో సమావేశంకేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఈనెల 22న సమావేశం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపస్లో నిర్వహించే ఈ సమావేశంలో 2024–25 విద్యాసంవత్సరం అలుమనాక్, పరీక్ష షెడ్యూల్, స్పోర్ట్స్అండ్ గేమ్స్, జాతీయ సేవా పథకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. సంబంధిత డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు విధిగా హాజరుకావాలని కోరారు. -
రెండు క్రీడా అకాడమీలు
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు శుభవార్త ప్రకటించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో మూడు క్రీడల అకాడమీలు కొనసాగుతున్నాయి. వీటికి తోడుగా మరో రెండు క్రీడలను కొనసాగించేలా కొత్త అకాడమీలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా మంజూరైన అకాడమీల్లో క్రీడాకారుల ప్రవేశాల ఎంపిక ప్రక్రియను సైతం చేపట్టనుంది. ఇందులో అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధీనంలో జేఎన్ స్టేడియంలో ప్రస్తుతం అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్ అకాడమీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారులు స్టేడియంలోని వసతిగృహంలో ఉంటూ డీఎస్ఏ కోచ్ల పర్యవేక్షణలో ఆయా క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెజ్లింగ్, స్విమ్మింగ్ అకాడమీలను మంజూరు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆ రెండు క్రీడల క్రీడాకారులు డీఎస్ఏ నిర్వహించే ఎంపికలో అర్హత సాధించినట్లయితే అకాడమీలో శిక్షణ పొందుతారు. ప్రస్తుతం 118మంది క్రీడాకారులు.. స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ఇప్పటివరకు ఉన్న మూడు క్రీడల్లో 118 మంది క్రీడాకారులకు వసతి కల్పిస్తోంది. అందులో జిమ్నాస్టిక్స్లో బాలురు– 30, బాలికలు 20, హ్యాండ్బాల్లో 16మంది బాలురు, అథ్లెటిక్స్లో బాలురు 27 మంది, 25మంది బాలికలు అడ్మిషన్లు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రీడాకారుల సంఖ్య 118 మంది దాటకుండా కొత్తగా మంజూరైన రెండు అకాడమీలు, ఇప్పటికే కొనసాగుతున్న మూడు క్రీడల్లో క్రీడాకారులకు అడ్మిషన్లు కల్పించాలని పేర్కొంది. అందులో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ క్రీడాకారులకు కోత విధించి రెజ్లింగ్లో బాలురు 17 మంది, స్విమ్మింగ్లో బాలబాలికలు 18 మంది క్రీడాకారులకు అడ్మిషన్లు కల్పించాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. కాగా, పదేళ్ల క్రితం వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో స్విమ్మింగ్ అకాడమీ కొనసాగింది. అనుకున్న స్థాయిలో అడ్మిషన్లు, ఆశించిన ఫలితాలు లేకపోవడంతో అకాడమీని ఇక్కడినుంచి తరలించారు. పదేళ్ల తర్వాత జిల్లాకు స్విమ్మింగ్, రెజ్లింగ్ అకాడమీలు మంజూరు కావడం విశేషం. ఎంపికలో పాల్గొనాలి.. వచ్చే నెల 3,4 తేదీల్లో వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్ తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే ఎంపికలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలురు రెజ్లింగ్ ఎంపికలో పాల్గొనవచ్చన్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికలు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. క్రీడాకారులు తగిన ధ్రువీకరణ పత్రాలతో రావాలని రెజ్లింగ్ కోచ్ రాజు తెలిపారు. ఉత్తర్వులు జారీ చేసిన సాట్ హనుమకొండలో రెజ్లింగ్, స్విమ్మింగ్ అకాడమీల మంజూరు ఇప్పటికే ఉన్న అకాడమీల్లో క్రీడాకారుల కుదింపు? పదేళ్ల క్రితం తరలిన స్విమ్మింగ్ అకాడమీ తిరిగి ఏర్పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు -
సొంత ఆదాయం నుంచి రాక ఇలా
రెవెన్యూ ఆదాయం మొత్తం రూ. 237.02కోట్లు వరంగల్ అర్బన్ : షరా మామూలు.. గతంలో మాదిరిగానే ఈ ఏడాది భారీ అంకెలతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్ను రూపొందించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.650.12కోట్లతో వార్షిక అంచనాలకు కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గ సభ్యులు గురువారం ఆమోదం పలికారు. గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 37.83కోట్ల అంచనాలను పెంచారు. సొంత ఆదాయం ఏ మేరకు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో ఎంత మంజూరవుతుంది అన్నది బేరీజు వేసుకోకుండానే తగ్గేది లేదు అన్నట్లుగా గ్రేటర్ భా రీ బడ్జెట్ చూపారు. ప్రజలపై పెద్దగా భారం మోపకుండా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ లైసెన్సు పునరుద్ధరణ, అక్రమ నీటి కనెక్షన్ల క్రమబద్ధీకరణ, మీటర్ల బిగింపు, భవన, ప్రకటనల నుంచి మెరుగైన రాబడులు, ఆస్తిపన్ను రివైడ్జ్, మొండి బకాయిలపై దృష్టి సారించించినట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్ స్వరూపం ఇలా.. చివరి బడ్జెట్లో పద్దుల్లో సల్ప మార్పులు తప్ప మక్కిమక్కిగా రూపొందించారు. రూ.650.12కోట్లతో రూపొందించిన పద్దుల వివరాలు ఇలా ఉన్నాయి. సొంత ఆదాయం రూ. 237.02కోట్లు(37 శాతం) కాగా ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల రూపేణా 410.10కోట్లు (63)శాతం వస్తాయని అంచనా వేశారు. బల్దియా రెవెన్యూ వ్యయాలు 147.95కోట్లు(23 శాతం) కాగా, ఇతర నిర్వహణకు 46.95 కోట్లు(7శాతం), క్యాపిటల్ వర్క్కు రూ.42.82కోట్లు (4శాతం) క్యాపిటల్ వ్యయాలు రూ.410.10కోట్లు (63శాతం) అంచనాలు వేశారు. బల్దియాకు సొంత ఆదాయం రూ. 237.02కోట్లు కాగా, అందులో నిర్వహణకు రూ.147.95కోట్లు ఖర్చు అవుతున్నట్లు రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను రూ.89.80కోట్లు వస్తుందని అంచనా వేశారు. సర్చార్జ్లు, స్టాంపు డ్యూటీ తదితర చార్జీలను సల్పంగా పెంచారు. అద్దెలు, ఫీజు మార్పిడిలు బాగా వస్తాయని ఆశిస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్లు, టౌన్ప్లానింగ్ ఫీజులు, లే అవుట్ సబ్ డివిజన్ ఫీజలను కొంత మేరకు పెంచారు. గతంలో మాదిరిగానే గ్రీన్ బడ్జెట్కు 10శాతం అంటే రూ.23.70కోట్లు కేటాయింపులు చేశారు. విలీన గ్రామాలు, మురికివాడల అభివృద్ధికి రూ.29.55కోట్ల నిధులు, 66వ డివిజన్లకు గాను కేటాయింపులు చేయగా, అందులో రోడ్లకు రూ.11 కోట్లు, డ్రెయినేజీలకు రూ. 9కోట్లు, తాగునీటి సరఫరాకు రూ.1.05 కోట్లు, లైటింగ్కు రూ.30లక్షలు, ఆఫీస్ భవనాలు, ఫర్నిచర్కు రూ.1.20కోట్లు, ఇతర పనులకు రూ.33లక్షలు అంచనాలు రూపకల్పన చేశారు. ● ఇవికాకుండా.. పార్కులు, క్రీడా మైదానాలకు రూ.60 లక్షలు, మోడల్ జంతువధశాలకు రూ.60 లక్షలు, డంపింగ్ యార్డుకు రూ.60 లక్షలు, పబ్లిక్ టాయిలెట్లకు రూ.60 లక్షలు, వీధి వ్యాపారుల జోన్లకు రూ.60 లక్షలు, ఓపెన్ జిమ్కు రూ.60 లక్షలు. పోక ఇలాజీతాలు, ఈఎఫ్పీ, ఈఎస్ఐ, ఇతర వ్యయాలు: రూ.80కోట్లు శానిటేషన్ వ్యయం : రూ.25.80కోట్లు విద్యుత్ చార్జీలు : రూ.18.45కోట్లు గ్రీన్ బడ్జెట్ 10శాతం : రూ.23.70కోట్లు ఇతరములు ఇంజనీరింగ్ : రూ.25.75కోట్లు పరిపాలన వ్యయం : రూ.18.50కోట్లు టౌన్ ప్లానింగ్ వ్యయం : రూ.1.20కోట్లు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ : రూ.1,50కోట్లు విలీన గ్రామాలు, స్లమ్లలో : రూ.14.04కోట్లు శ్మశానవాటికలకు : రూ.1.40కోట్లు డివిజన్ల వారీగా అభివృద్ధి పనులకు : రూ.22.88కోట్లు(ఆస్తి, ఇతర పన్నులు, ప్రైవేట్) : రూ.89.80 కోట్లు అద్దెలు, ఫీజులు, ఇతర ఆదాయం :రూ.12.66 కోట్లు శానిటేషన్ ద్వారా : రూ.18.97 కోట్లు (ట్రేడ్ లైసెన్స్, సర్వీసులు) టౌన్ ప్లానింగ్ : రూ.86.04 కోట్లు (బిల్డింగ్ పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్, ఇతరత్రా) ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి : రూ.29.55 కోట్లు (నల్లా పన్నులు, ఇతర ఆదాయం) -
రచ్చ..రచ్చ
వరంగల్ అర్బన్ : ఆరోపణలు, ఆందోళనలు, నిరసనలు, వాకౌట్లు, బైఠాయింపులు, తోపులాట ఇన్ని గందరగోళాల నడుమ గురువారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సాధారణ బడ్జెట్ ఆమోదానికి గురువారం బల్దియా కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సమావేశం జరిగింది. హాల్కు ముందే చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు సమావేశం మొదలు కాగానే.. ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని, రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగించొద్దని, ఈ ప్రాంత గుర్తింపును కనుమరుగు చేయొద్దని ప్ల కార్డులు ప్రదర్శించారు. బీజేపీ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే బడ్జెట్ అంచనాల ప్రతాలను చదువుతున్న జేఏఓ సరిత నుంచి బీఆర్ఎస్ మహిళా సభ్యులు గుంజుకొని చించివేశారు. అయినప్పటికీ సమావేశం కొనసాగించడంతో విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మేయర్కు మద్దతుగా నిలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలక వర్గ సమావేశంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సమావేశాన్ని వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సమావేశ మందిరం ఎదుట బైఠాయించి తమ నిరసన గళాన్ని వినిపించారు. ధర్నా చేస్తుండగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు. పోలీసుల అత్యుత్సాహంతో పలువురు మహిళా కార్పొరేటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒకదశలో బల్దియా ఆవరణను పోలీసులు దిగ్బంధించారు. పోలీసుల పహారా నడుమ బడ్జెట్ సమావేశం గందరగోళంగా సాగింది. చివరకు మెజార్టీ సభ్యులు చేతులెత్తడంతో 2024–25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.650.12కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. మేయర్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు మేయర్ గుండు సుధారాణి టార్గెట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా గెలిచి, మేయర్గా ఎన్నికై పార్టీ మారడంపై ఆ పార్టీ సభ్యులు విమర్శనాస్త్రాలను సంధించారు. మేయర్గా కొనసాగే అర్హత లేదంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగించడం, బల్దియా పాలనలో అవినీతి మితిమీరిపోయిందని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ నినాదాలు చేయగా, కాంగ్రెస్ సభ్యులు ప్రతిగా జై కాంగ్రెస్ అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఈ దశలో కొంత ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకుల్ని అడుగడుగునా ఇరకాటంలోకి నెట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. ఈ గందరగోళం నడుమ బడ్జెట్ అంచనాలు చదివారు. ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి బడ్జెట్ ఆమోదించాలని సూచించారు. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి, కౌన్సిల్ సమావేశ ప్రాంగణం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ సభ్యులు సమావేశం నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ముగ్గురు ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో సభ్యులుగా మెజార్టీ సభ్యులు చేతులెత్తి అంగీకారం తెలిపారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సభ్యుల సంఖ్యను నాలుగు సార్లు లెక్కించారు. మెజార్టీ ఉండడంతో రూ.650.12కోట్ల బడ్జెట్కు ఆమోదం పలికినట్లుగా ధ్రువీకరించారు. సుదీర్ఘంగా సాగుతుందనుకున్న సమావేశం గంట వ్యవధిలో ముగించడం గమనార్హం. కాగా, సమావేశానికి ముందు పోలీసులు ఒక్కొక్కరిని కౌన్సిల్లోకి అనుమతించడంపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసహనం వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదని హెచ్చరించారు. ఏదేమైనా జీడబ్ల్యూఎంసీ సర్వ సభ్య సమావేశం ఎలాంటి చర్చ లేకుండా రచ్చతోనే ముగిసింది. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలతో దద్దరిల్లిన ‘గ్రేటర్’ కౌన్సిల్ ఆద్యంతం గందరగోళంగా సమావేశం బడ్జెట్ పత్రాలను చించివేసిన బీఆర్ఎస్ సభ్యులు పోడియం చుట్టుముట్టిన విపక్ష సభ్యులు చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదం కౌన్సిల్ ప్రవేశ ద్వారం ముందు ధర్నా -
విధుల్లోకి ‘పదోన్నతి’ ఉపాధ్యాయులు
● కొందరు టీచర్లు నాట్ విల్లింగ్ ● పండిట్లు, పీఈటీల బదిలీలకు దరఖాస్తులు ● వరంగల్ జిల్లాలో పదోన్నతులకు నిరీక్షణవిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో పదోన్నతులు పొందిన 455 మంది టీచర్లలో 414 మంది గురువారం విధుల్లో చేరారు. డబుల్ పదోన్నతులు పొందిన వారిలో ఒక పోస్టులో విధుల్లో చేరిన వారు, పదోన్నతి లభించినా నాట్ విల్లింగ్ ఇచ్చినవారు కలిపి 37 మంది ఉన్నారు. మరో నలుగురు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పదోన్నతి పొందని లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ ఎండీ అబ్దుల్హై ఆదేశించారు. ఇప్పటికై నా బదిలీలకు దరఖాస్తులు చేసుకుని ఉంటే.. ఆయా టీచర్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సమాచారమిచ్చారు. చేసుకోని వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసిన ప్రింట్ కాపీని అందజేయాలని సూచించారు. జిల్లాలో లాంగ్వేజ్ పండిట్ల, పీఈటీల పోస్టుల్లో కొన్ని పోస్టులు ఎస్ఏలుగా అప్గ్రేడ్ చేయలేదు. దీంతో పలు హైస్కూళ్లలో పదోన్నతులు లభించిన లాంగ్వేజ్ పండిట్లు ఇద్దరు చొప్పున కూడా ఉండాల్సి వస్తోంది. అలాంటి టీచర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ఎస్జీటీల బదిలీల పక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎస్జీటీల బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 450 నుంచి 500 మంది వరకు ఎస్జీటీలు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.కాగా, జిల్లాల వారీగా పదోన్నతులు కల్పించాక.. ఇలా జాయిన్ కానీ పోస్టుల్లో మిగిలిపోయిన వాటిల్లో అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఆయా ఉపాధ్యాయులు కోరుతున్నారు పదోన్నతుల ఉత్తర్వులేవి? వరంగల్ జిల్లాలో లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు పదోన్నతులు పొందారు. అదేవిధంగా ఎస్జీటీలు వివిధ సబ్జెక్టుల్లో ఎస్ఏలుగా మొత్తం 358 మంది టీచర్లు పదోన్నతుల ఉత్తర్వులు అందుకున్నారు. కానీ, ఎస్జీటీలు పీఎస్ హెచ్ఎంలుగా, లోకల్ బాడీ ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో, పీఈటీలు పీడీలుగా కలిపి మొత్తం 76 మందికి ఉత్తర్వులు ఇవ్వలేదు. గురువారం రాత్రి వరకు వారికి పదోన్నతుల ఉత్తర్వులు అందలేదు. -
పదోన్నతుల కల ఫలించిన వేళ..
విద్యారణ్యపురి: దశాబ్దంన్నర కాలంగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న ప్రభుత్వ, లోకల్బాడీ యాజమాన్యాల పరిధి లాంగ్వేజ్ పండిట్ల (తెలుగు, హిందీ, ఉర్దూ)కు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలు ఎస్ఏ పీడీలుగా ఎట్టకేలకు పదోన్నతులు లభించాయి. వీరికి బుధవారం ఉత్తర్వులు ఇవ్వడంతో పోస్టింగ్ స్థానాల్లో జా యిన్ అవుతున్నారు. తొమ్మిదేళ్లుగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు కూడా పదోన్నతులు లభించాయి. వీరికి పీఎస్హెచ్ఎంలుగా, ఎస్ఏ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, కేటగిరీలో పదోన్నతులు కల్పించారు. మల్టీజోన్–1 పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూ పాలపల్లి, ములుగు జిల్లాలోని ప్రభుత్వ, లోకల్బాడీ యాజమాన్యాల పరిధిలో అన్ని కేటగిరీలు కలిపి 1,768మందికి పదోన్నతులు కల్పించారు. జిల్లాల వారీగా ఇలా.. ● హనుమకొండ జిల్లాలో 454మంది పదోన్నతులు పొందారు. వరంగల్ జిల్లాలో 434 మంది పదోన్నతులు పొందాల్సి ఉండగా, అందులో లోకల్బాడీలో పీఎస్హెచ్ఎం, ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ యాజమాన్య పరిధి స్కూల్ అసిస్టెంట్ పీడీలు 76మందికి పదోన్నతుల ఉత్తర్వులు రావాల్సింది. రోస్టర్లో తలెత్తిన సమస్యతో మళ్లీ పరిశీలించినట్లు సమాచారం. రాత్రి వరకు పదోన్నతుల ఆర్డర్స్ వస్తాయని భావిస్తున్నారు. మిగతా 358 మందికి ఉత్తర్వులు అందాయి. ● ములుగు జిల్లాలో 217 మందికి పదోన్నతులు కల్పించగా 163 మందికి ఉత్తర్వులు అందాయి. పీఎస్హెచ్ఎం 39మందికి, ఎస్ఏ ఇంగ్లిష్ 15మంది.. మొత్తంగా 54 మంది టీచర్లకు ఉత్తర్వులు రావాల్సింది. ● మహబూబాబాద్ జిల్లాలో 517మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 276మంది పదోన్నతులు పొందారు. ● ఎక్కువశాతం మంది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తమకు వెబ్ ఆప్షన్ల ప్రకారం కేటాయించిన ఉన్నత పాఠశాలలు, అక్కడక్కడా యూపీఎస్లలో విధుల్లో చేరారు. కొందరు ఎస్జీటీలకు రెండింటిల్లోనూ పదోన్నతులు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలో కొందరు ఎస్జీటీలకు రెండింటిల్లోనూ పదోన్నతులు లభించినట్లు సమాచారం. ఎస్జీటీ కేడర్లోని వారికి పీఎస్హెచ్ఎంలుగా, విద్యార్హతలను బట్టి ఇతర సబ్జెక్టుల్లో ఎస్ఏలుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. దీంతో హనుమకొండ జిల్లాలో అలా రెండు పోస్టుల్లోనూ పదోన్నతి పొందిన వారు 50మంది వరకు, మహబూబాబాద్ జిల్లాలో 30మంది వరకు ఉంటారని తెలుస్తోంది. వ రంగల్ జిల్లాలో ఒక టీచర్కు మాత్రం రెండు స బ్జెక్టుల్లో పదోన్నతి లభించినట్లు తెలిసింది. మిగతా జిల్లాల్లోనూ పలువురు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరు ఏదో ఒక పోస్టులో వి ధుల్లో చేరితే మిగతా పోస్టు ఖాళీగా ఉంటుంది. ములుగు జిల్లాలో 247 మంది వరకు అవకాశం ఉన్నా.. ములుగు జిల్లాలో 247 మంది టీచర్లకు పదోన్నతి అవకాశం ఉన్నప్పటికీ అర్హులైనవారు లేక 217 మందికే లభించినట్లు ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉండగా జనగామ జిల్లా మల్టీజోన్–2 పరిధిలో ఉండడంతో అక్కడ ఆ జోన్తోపాటు జరుగుతాయని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో 1,768మంది టీచర్లకు పదోన్నతులు ఉత్తర్వులు చేతికందడంతో పలువురు విధుల్లో చేరిక ఎస్ఏ పీడీలుగా పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్లకు ఎస్ఏలుగా, ఎస్జీటీలకు పీఎస్హెచ్ఎంలు, ఎస్ఏలుగా ఉద్యోగోన్నతి వరంగల్లో మరో 76మంది, ములుగులో 54మంది వెయింటింగ్ -
దేవాదుల–3వ దశకు మరో రూ.550కోట్లు
హసన్పర్తి: మరో రూ.550కోట్లు విడుదల చేస్తే దేవాదుల ప్రాజెక్టు–3వ దశ పనులు పూర్తవుతాయని ఇరిగేషన్ అధికారులు.. రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సారెీస్పీ, దేవాదుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమావేశం హైదరాబాద్లో జలసౌధలో మంగళవారం రాత్రి జరిగింది. సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దేవాదుల ప్రాజెక్టు–3పై జరిగిన చర్చ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు–3వ దశ పనులు 90 శాతం పూర్తయినట్లు మంత్రి ఉత్తమ్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కాంక్రీట్తోపాటు ఇతర పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు నిధులు మంజూరు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. డిస్ట్రిబ్యూటరీ, కాల్వలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. 1.5లక్షల ఎకరాలకు నీరు అందించగలమని అధికారులు మంత్రికి వివరించారు. ఈఅంశంపై ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి సూచించారు. రెండున్నర నెలల్లోనే దేవాదుల–3 దశ ద్వారా నీరు అందించాలని ఆదేశించారు. నీటి కేటాయింపుల్లో కుదింపు చర్చ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడారు. గతంలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 60 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందన్నారు. ప్రస్తుతం దాన్ని 38.15 టీఎంసీలకు కుదించారని తెలిపారు. దేవాదుల–1, 2, 3 దశల్లో నీటిని లిఫ్ట్ చేయడానికి 38.16 టీఎంసీలు సరిపోవన్నారు. కేటాయింపులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు–2లో భాగంగా స్టేషన్ ఘన్ఫూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు 31 కిలోమీటర్ల వరకు ప్రధాన కాల్వ మంజూరైనట్లు వివరించారు. దీనిద్వారా స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ కింద 28,.800ఎకరాలు, చెన్నూరు రిజర్వాయర్ కింద 25,200 ఎకరాలు, నవాబుపేట రిజర్వాయర్ కింద 53,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లోని 1,07,400 ఎకరాలకు సాగునీరు అందించడానికి శాశ్వత ప్రాతిపదికన ప్రధాన కాల్వలకు ఇరువైపులా లైనింగ్, పూడిక తొలగింపు, జంగిల్ క్లియరెన్స్, ఓటీలు, డీఎల్ఆర్ బిల్లు, తూములు, షట్టర్ల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాత పద్ధతి ప్రకారమే మైనర్, మేజర్ ఇరిగేషన్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. రైతులకు కూడా తగిన విధంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. కాల్వల పనులు చేపట్టాలి పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ–2 ప్రాజెక్టులోని పలు ప్రాంతాల్లో ప్రధాన కాల్వలు, ఉపకాల్వలు దెబ్బతిన్నాయని మంత్రి చెప్పారు. మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. గతేడాది దెబ్బతిన్న కాల్వలు, చెరువుల నివేదికను వెంటనే అందించాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రాంచందర్నాయక్, మురళీనాయక్, ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, ఈఎన్సీలు నాగేందర్, అనిల్కుమార్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నీటిపారుదలశాఖ ఉన్నతాఽధికారులు తదితరులు పాల్గొన్నారు. అవసరమని మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు రెండున్నర నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం వేర్వేరుగా మైనర్, మేజర్ ఇరిగేషన్ చేయాలన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నగరంలో ముంపునకు గురి కాకుండా నాలాల అభివృద్ధికి దిశానిర్దేశం నీటిపారుదలపై హైదరాబాద్లో సమీక్ష సమావేశంనాలాల అభివృద్ధికి రూ.140 కోట్లు గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో నాలాల అభివృద్ధికి రూ.140 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలంలో నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రకాళి చెరువుతోపాటు ఇతర చెరువుల నాలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
బడ్జెట్పై చర్చ.. రచ్చేనా?
వరంగల్ అర్బన్: భారీ అంచనాలతో సిద్ధం చేసిన వరంగల్ మహానగర పాలక సంస్థ బడ్జెట్ను పాలకపక్షం గురువారం ఉదయం కౌన్సిల్ ముందుకు తెస్తోంది. మేయర్ గుండు సుధారాణి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా.. ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా యథావిధిగా ఆమోదింపజేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ అంచనాలపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రూ.652 కోట్ల అంచనాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజలపై పెద్దగా భారం లేకుండానే 2023–24 బడ్జెట్ అంచనాలను కొంచెం అటు.. ఇటుగా అంకెల గారడీ చేసినట్లు తెలిసింది. వ్యూహ, ప్రతివ్యూహాలు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశానికి పాలక, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. కౌన్సిల్లో అధికార పార్టీ తీరును ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సై అంటుంటే.. విమర్శలు తిప్పికొడతామని పాలక పక్షం చెబుతోంది. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ నుంచి ఎన్నికై .. కొద్ది నెలల కిందట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మేయర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు అనర్హురాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు రెండ్రోజులుగా బాహాటంగానే విమర్శిస్తున్నారు. వీరికి కొంత మంది బీజేపీ కార్పొరేటర్లు సహకారం అందిస్తుండడంతో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరకాటంలో నెట్టేందుకు! మేయర్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకోవాలని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు హనుమకొండలో వ్యూహ, ప్రతివ్యుహాలు రచించినట్లు సమాచా రం. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని హితబోధ చేసినట్లు తెలి సింది. అంతేకాకుండా బీజేపీ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల వైఖరిని ప్రతిఘటించేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రి, ఎమ్మెల్యేలు కూడా విపక్షాల నుంచి ఎదురయ్యే సమస్యను ప్రతిఘటించాలని సూచనలు చేసినట్లు సమాచారం. కలెక్టర్, కమిషనర్లకు వినతి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మేయర్ సుధారాణికి అర్హత లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. గుండు సుధారాణి బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్, మేయర్గా ఎన్నికై .. కాంగ్రెస్ పార్టీలో చేరారని, స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం.. సుధారాణి కార్పొరేటర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, కమిషనర్లను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు రవి, మనీష, బాబు, పద్మ, స్వరూపారాణి, దివ్య రాజ్, నాగేశ్వర్, బోగి సువర్ణ, దిడ్డి కుమారస్వామి, రంజిత్రావు, నర్సింహారావు, అశోక్ యాదవ్, రాధికారెడ్డి తదితరులు ఉన్నారు. మేయర్పై విపక్షాల నిరసన గళం అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ బీఆర్ఎస్తో జతకట్టిన కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు నేడు గ్రేటర్ వరంగల్ బడ్జెట్ -
అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి పొడిగింపు
వరంగల్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)ల కాల పరిమితిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా డీపీఆర్ఓ ఆయూబ్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు పొడిగిస్తూరాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లుగా ఉన్న కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనట్లు తెలిపారు. జర్నలిస్టుల కోసం రెండేళ్లకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తోందని, ఈనెల 30తో గడువు ముగుస్తుండగా.. సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు తెలిపారు. -
నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
రామన్నపేట: టీజీ పాలిసెట్–2024 ప్రవేశాలకు నేటి (గురువారం) నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 24 వరకు జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాలిసెట్–24లో క్వాలిఫై అయిన విద్యార్థులు సర్టిఫికెట్ ధ్రువీకరణ స్లాట్స్ ఎంచుకోవచ్చని తెలిపారు. 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ధ్రువీకరణ జరుగుతుందని, విద్యార్థులు తాము బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి ఎంచుకున్న సెంటర్కి వెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. విద్యార్థులు తమకు కావాల్సిన కోర్సులకు సంబంధించి WWW.TGPOLYCET.NIC.IN వెబ్ సైట్ ద్వారా ఆప్షన్స్ని ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు ఇచ్చుకోవచ్చని సూచించారు. ఆప్షన్స్ని నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 30న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీటు పొందిన విద్యార్థులు ఈనెల 30 నుంచి జూలై 7 వరకు వెబ్సైట్ ద్వారా ప్రవేశ రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ప్రిన్సి పాల్ పేర్కొన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు వారి అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్తో పాటు ఒక కాపీ సెట్ జిరాక్స్ కూడా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆప్షన్స్ను జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుందని, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలు ఇతరులకు ఇవ్వకూడదని సూచించారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా విజయభానుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా డి.విజయ భాను బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్ఎంగా పని చేసిన జాస్తి శ్రీలత ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్గా బదిలీ కాగా.. హైదరాబాద్ చార్మినార్ డిప్యూటీ ఆర్ఎం (ఆపరేషన్)గా పని చేస్తున్న డి.విజయ భానుకు పదోన్నతి కల్పించి వరంగల్ ఆర్ఎంగా నియమించారు. హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. విజయభానుకు డిప్యూటీ ఆర్ఎంలు భాను కిరణ్, మాధవరావు, డిపో మేనేజర్లు వంగల మోహన్రావు, ధరంసింగ్, కార్గో ఏటీఎం పవన్ కుమార్, సూపర్వైజర్లు, ఉద్యోగులు మొక్కలు, పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నేడు నులి పురుగుల నివారణ కార్యక్రమంఎంజీఎం: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నేడు (గురువారం) నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు తెలిపారు. జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల వయస్సు పిల్లలందరికీ వారి తల్లిదండ్రులు నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు ఇప్పించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ మాత్రలను భోజన అనంతరం ఇవ్వనున్నట్లు తెలిపారు. నులి పురుగుల వల్ల పిల్లలకు కడుపు నొప్పి, పోషకాహారలోపం, రక్తహీనత ఉంటుందని తద్వారా పిల్లలు చదువుపై శ్రద్ధ చూపలేరని వివరించారు. ఏదైనా కారణాలతో అందుబాటులో లేని పిల్లలకు ఈనెల 27న ఇవ్వాలని పేర్కొన్నారు. బాధ్యతల స్వీకరణహన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్, వెస్ట్ జోన్ డీసీపీలుగా షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్ బుధవారం వారివారి కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. షేక్ సలీమా 2007లో గ్రూప్–1 అధికారి హోదాలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి కాగజ్నగర్, సైబ రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీగా, అదనపు ఎస్పీగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ఎస్పీగా రైల్వే విభాగంలో పని చేశారు. అదేవిధంగా 2010 గ్రూప్–1 అధికారి హోదాలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజ మహేంద్రనాయక్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సీసీఎస్ ఏసీపీగాను, ములుగు, మహబూబాబాద్ డీఎస్పీగా పని చేసి అదనపు ఎస్పీగా పదోన్నతిపై భూపాలపల్లి జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి ఎస్పీగా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు. -
No Headline
కాజీపేట అర్బన్/నయీంనగర్: కాజీపేట, హనుమకొండ నుంచి హంటర్రోడ్డు మీదుగా వరంగల్కు వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. అదాలత్ వరకు ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు సిగ్నల్ పాయింట్స్ ఉన్నా.. హంటర్రోడ్డు మీదుగా జూపార్క్ నుంచి వరంగల్ వరకు లేకపోవడంతో వాహనాలు దూసుకెళ్తున్నాయి. వాహనాల స్పీడుకు కళ్లెం వేసేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. ఇష్టారీతిన.. జూపార్క్ నుంచి వరంగల్ వరకు ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కూడా లేకపోవడంతో జూపార్క్, న్యూశాయంపేట చౌరస్తాలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు ఇష్టారీతిన ప్రయాణిస్తున్నారు. ఇటీవల జూపార్క్ ఎదు ట ఓ ట్రాక్టర్ స్పీడ్ కంట్రోల్ తప్పి ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టగా వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. న్యూశాయంపేట చౌరస్తాలో రోడ్డు దాటుతున్న ఓ మహిళా మున్సిపల్ సిబ్బందిని ద్విచక్రవాహనం వేగంతో ఢీ కొట్టగా ఆమె ఎగిరిపడి రెండు కాళ్లు విరిగాయి. ఇలా హంటర్ రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. డబ్బాల్ జంక్షన్లో గందరగోళం బల్దియాకు ఆదాయం ఇవ్వని కటౌట్లు, హోర్డింగ్లు, డిస్ప్లేలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి. కానీ ప్రజలకు అవసరమైన సిగ్నల్స్ వ్యవస్థ మాత్రం కానరాదు. ప్రధాన జంక్షన్లలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రద్దీగా ఉండే మర్కజీ, డబ్బాల్ జంక్షన్లో సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో పీక్ అవర్స్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది. నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో కరీంనగర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు మర్కజీ స్కూల్ జంక్షన్, కొత్తూరు రోడ్, డబ్బాల్ జంక్షన్ గుండా వెళ్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సాయంత్రం పూట మర్కజీ స్కూల్ నుంచి కేయూ రోడ్ దారంతా జామ్ అవుతోంది. డబ్బాల్ జంక్షన్ నుంచి గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు, స్కూల్, కాలేజీ, ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులతో పాటు, ఇక్కడ లేబర్ అడ్డా, వివిధ ట్రాన్స్పోర్ట్ వాహనాల అడ్డాలు ఉండడంతో పీక్ అవర్స్లో అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు ఎవరికిష్టం వచ్చినట్టు వారు వెళ్తుండడంతో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ లేక ఇబ్బందులు తరచూ ప్రమాదాలు.. జంకుతున్న ప్రయాణికులు -
ఆల్ ఇండియా జూడో పోటీలకు గుడిబడి విద్యార్థులు
కాశిబుగ్గ: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్స్థాయి జూడో పోటీలకు కాశిబుగ్గలోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గుడిబడి)కు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో గత సంవత్సరం ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి జూడో పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఎస్.మనస్వినికి రూ. ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 15 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వారిలో 10 మంది గుడిబడి విద్యార్థులేనని తెలిపారు. -
ప్రీస్కూల్ పిలుస్తోంది..
కాజీపేట అర్బన్: చిన్నారులను ఆటపాటలతో అలరిస్తూ, పౌష్టికాహారం అందజేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ఆనంద నిలయాలుగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల వైపు రప్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారులకు బోధించే ప్రీస్కూ ల్ విద్యపై తల్లిదండ్రులకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. 788 అంగన్వాడీ కేంద్రాలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను బోధించేందుకు ప్రీస్కూల్ పిలుస్తోంది అంటూ చిన్నారులను ఆకట్టుకుంటున్నారు అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది. హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 788 అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా మెయిన్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. దీంతో ప్రతి అంగన్వాడీ కేంద్రం ప్రీస్కూల్ విద్యకు వేదికగా మారింది. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో బోధన చేస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల వివరాలు అంగన్వాడీ కేంద్రాలు : 788 ప్రీస్కూల్ చిన్నారులు : 6,813 మూడేళ్లలోపు చిన్నారులు : 21,065 బడిబాటలో అంగన్వాడీలు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో బోధన -
స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన లింగనిర్ధారణ నిరోధక చట్టం (పీసీ అండ్ పీఎన్డీటీ) జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేయాలని, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో డేకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షించాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు.. గర్భిణులకు లింగ వివక్షపై అవగాహన కల్పించడంతోపాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. అలాగే, ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 సంవత్సరాల్లోపు ఉన్న 2,36,488 మంది పిల్లలకు మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్లు, బ్యానర్లను కలెక్టర్ అవిష్కరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, ఏసీపీ దేవేందర్రెడ్డి, డీడబ్ల్యూఓ మధురిమ, జిల్లా కోర్టుల ముఖ్య పాలనాధికారి శోభారాణి, మారి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆర్.కృష్ణమూర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ యాకూబ్పాషా, అధికారులు పాల్గొన్నారు.జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య -
ఇళ్లనుంచి విధిగా చెత్త సేకరించాలి
వరంగల్ అర్బన్: ఇళ్లు, ప్యాపార, వాణిజ్య సంస్థల నుంచి విధిగా చెత్త సేకరించకుంటే చర్యలు తప్పవని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. ‘రోడ్లే డ్రెయినేజీలు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మేయర్, కమిషనర్ స్పందించారు. ఉదయమే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాయలంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మేయర్, కమిషనర్ మాట్లాడారు. ప్లాస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ప్లాస్టిక్ మహమ్మారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మురికివాడల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని తెలిపారు. ఖాళీ స్థలాల్లో చెత్త ఉంటే జరిమానా విధించాలని, లేకుంటే బల్దియా ద్వారా శుభ్రం చేసి వారి నుంచి జరిమానా వసూలు చేయాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అంతకు ముందు కమిషనర్ హనుమకొండలోని పలు డివిజన్లలో క్షేత్ర స్థాయి తనిఖీలు చేశారు. కార్మికుల హాజరు, విధులు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ డివిజన్లలో శుభ్రతపై శానిటరీ ఇన్స్పెక్టర్లు రోజూవారీగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. చెత్త తరలింపు వాహనాలు ఎన్ని, సిబ్బంది హాజరు, డంపర్ బిన్లు, స్వచ్చ ఆటోల పనితీరు, రోడ్ల శుభ్రత వివరాలను సమర్పించాలన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలనే పారిశుధ్య సిబ్బంది బయోమెట్రిక్కు ఎంచుకోవాలని చెప్పారు. అక్రమ డంపింగ్ను తొలగించడానికి ప్రత్యేకంగా 2, 3 వాహనాలను కేటాయించాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. ప్రతి డివిజన్లో ఫాగింగ్ కొనసాగే విధానంపై శానిటరీ ఇన్స్పెక్టర్లకు అవగాహన ఉండాలని, కాంప్యాక్టర్లు డంపర్బిన్ల నుంచి చెత్తను తొలగించే క్రమంలో జియోట్యాగ్తో కూడిన ఫొటోలను పంపించాలని, డిప్యూటీ కమిషనర్లు కూడా క్షేత్రస్థాయిలో శానిటేషన్ నిర్వహణ తీరును తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్ఓ రాజేశ్, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, రవీందర్, ఈఈ సంజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య పసునూరి భాస్కర్, నరేందర్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పువు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీవాకడే -
సాదాసీదాగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల చివరి సమావేశం మంగళవారం హనుమకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎప్పటిలాగే సాదా సీదాగా జరిగింది. జూలై 4తో ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో జూలైన 3న వరంగల్ అర్బన్ జెడ్పీ సర్వసభ్య సమావేశం, వీడ్కోలు సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1, 2, 4, 7 స్థాయీ సంఘాల సమావేశం జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ అధ్యతన నిర్వహించారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, ఎకై ్సజ్ శాఖ, వయోజన విద్య, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా యువజన, క్రీడా ప్రాధికార సంస్థ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల ప్రగతి, జిల్లా ప్రణాళికపై సమీక్షించారు. వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన 3వ స్థాయీ సంఘం సమావేశంలో వ్యవసాయ, అటవీ, మత్స్య శాఖ, పశువైద్య, సంవర్థక శాఖల ప్రగతిపై సమీక్షించారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల శ్రీలత అధ్యక్షతన జరిగిన 3వ స్థాయీ సంఘం సమావేశంలో మహిళాశిశు, వయోవృద్ధుల సంక్షేమంపై చర్చించారు. హసన్పర్తి జెడ్పీటీసీ సభ్యురాలు సునీత అధ్యక్షతన జరిగిన 6వ స్థాయీ సంఘం సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమంపై సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎం.విద్యాలత, జెడ్పీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.