ఆల్‌ ఇండియా జూడో పోటీలకు గుడిబడి విద్యార్థులు - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇండియా జూడో పోటీలకు గుడిబడి విద్యార్థులు

Published Wed, Jun 19 2024 1:50 AM | Last Updated on Wed, Jun 19 2024 1:50 AM

-

కాశిబుగ్గ: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే ఆల్‌ ఇండియా ఇంటర్‌స్థాయి జూడో పోటీలకు కాశిబుగ్గలోని నరేంద్రనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గుడిబడి)కు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో గత సంవత్సరం ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయస్థాయి జూడో పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఎస్‌.మనస్వినికి రూ. ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 15 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వారిలో 10 మంది గుడిబడి విద్యార్థులేనని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement