-
ఎయిర్పోర్ట్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
విమానాశ్రయం(గన్నవరం): విమానాశ్రయ విస్తరణకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. స్థానిక ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ టెర్మినల్లో గురువారం విమానాశ్రయ విస్తరణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు చిన్నఅవుటపల్లి పరిధిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ప్లాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు కౌలు పరిహారం బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసిత కుటుంబాలకు గృహ నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ఆర్అండ్ఆర్ స్థలంలో విద్యుత్, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయలు కల్పించాలని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ వల్ల రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన యాజమానులకు అజ్జంపూడి పరిధిలో కేటాయించిన లేఅవుట్ అభివృద్ధికి ఏపీసీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ఏలూరు కాలువపై చేపట్టిన కొత్త వంతెన నిర్మాణానికి అవరోధాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, గుడివాడ ఆర్డీఓ పద్మావతి, ఎయిర్పోర్ట్ డెరెక్టర్ ఎల్.లక్ష్మీకాంత్రెడ్డి, జనరల్ మేనేజర్ (సివిల్) కె.రామాచారి, తహసీల్దారు పవన్కుమార్, సీఆర్డీఏ తహసీల్దారు పాపాయమ్మ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలన్నదే లక్ష్యం
నరసరావుపేట: ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలి, ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం అందాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ అతిథి గృహంలో ఎన్ఎస్పీ, వ్యవసాయాధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రియల్టర్లు వందలాది ఎకరాల్లో పొలాలు, పంట కాలువలు, డొంక రోడ్లు, చెక్ డ్యాములు కబ్జా చేసి లే అవుట్లు వేస్తున్నారన్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజినీర్ కొడుకు ఇంజనీర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్న విధంగానే రైతు బిడ్డ రైతు అవుతానని కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. రైతుల పొలాలు ఆక్రమణకు గురవ్వడంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన సదుపాయాలు అందకుండా పోతున్నాయని పేర్కొన్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో అనుసరిస్తున్న విధానాలను కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు ప్రభుత్వాలపై ఆధారపడే పరిస్థితి పోవాలని, ప్రభుత్వమే రైతులపై ఆధారపడే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయాధికారి మస్తానమ్మ, ఎన్ఎస్పీ డీఇ రామారావు, నాయకులు వేల్పుల సింహాద్రియాదవ్, పులిమి రామిరెడ్డి, దేశిరెడ్డి చిన్నపరెడ్డి, రామారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ -
23న విద్యార్థులకు నగదు పురస్కారాలు
తెనాలిఅర్బన్: వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 23న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు ఈఎల్వీ అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,16,000 పురస్కరాలతో పాటు 125 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, దుస్తులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమాన్ని ముత్తెంశెట్టిపాలెంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి మాచర్ల :మండలంలోని గుండ్లపాడు గ్రామంలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త తోట వెంకయ్య అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇనుపరాడ్లతో రెండు కాళ్లపై దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పాతకక్షల నేపథ్యంలో వెంకయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని వెంకయ్యను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు పేర్కొన్నారు. జీఓ నంబర్ 117ను రద్దు చేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తొలగించేందుకు ఉద్దేశించిన జీవో 117ను రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. చిరంజీవి డిమాండ్ చేశారు. నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం సంఘ జిల్లా అధ్యక్షుడు గోవిందు వెళాంగిణిరాజు అధ్యక్షతన సంఘ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ పాఠశాలల విలీనం పేరుతో ప్రాతమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపడం వల్ల ప్రాథమిక విద్యా వ్వవస్థ నిర్వీర్యమవుతుందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు, రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు మాట్లాడుతూ తల్లి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోవిందు వెళాంగణిరాజు, జిల్లా ప్రదాన కార్యదర్శి కట్టెబోయిన నరసింహారావు, రాష్ట్ర నాయకులు జి.విజయానంద్ పాల్గొన్నారు. జీవో రద్దుపై లోకేష్ హామీ నిలుపుకోవాలి ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనంపై జారీ చేసిన జీవో 117ను రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. పెదబాబు, డీకే సుబ్బారెడ్డి గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ముగిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కొత్తపేట జగన్నాథస్వామి దేవస్థానంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉదయం 10 గంటలకు లక్ష తులసి పూజ, రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు పవళింపు సేవ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జగన్నాథ, ఆంజనేయ, వెంకటేశ్వరస్వామి దేవస్థానాల చైర్మన్ సూరినేడి దుర్గావరప్రసాద్, సహాయ కమిషనర్ (ఈఓ) డి.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు శ్రీఅయోధ్య అయ్యప్ప, భక్తులు పాల్గొన్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.23 కోట్లుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులు సమర్పించారు. వేసవి సెలవుల నేపథ్యంలో 16 రోజులకు రూ.3.23 కోట్ల మేర కానుకలు, మొక్కుబడుల ద్వారా ఆదాయం సమకూరింది. ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు పర్యవేక్షణలో మహా మండపం ఆరో అంతస్తులో గురువారం కానుకల లెక్కింపు జరిగింది. రూ.3,23,75,523 నగదు లభమైంది. రోజుకు సరా సరిన రూ.20.23 లక్షల మేర ఆదాయం లభించిందని ఆలయ ఈఓ పేర్కొన్నారు. 694 గ్రాముల బంగారం, 6.264 కిలోల వెండితో పాటు విదేశీ భక్తులు డాలర్ల రూపంలో అమ్మవారికి కానుకలను సమర్పించారు. 516 యూఎస్ఏ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, వెయ్యి కొరియా ఒన్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 ఓమన్ బైంసాలు లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు ఎస్ఫీఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): సర్ధార్ గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ అధ్యక్షులు రావుల మణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనగాని సత్యప్రసాద్ను గౌడ సంఘ ప్రతినిధులు కలిసి అభినందించడంతోపాటు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గీత కార్మికులకు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గాలి సుబ్బారావు, మొరాకుల రాము, నరేంద్ర, వెంకటరమణ, ప్రసాద్, రమణ, గౌడ సంఘీయులు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో దివ్యాంగుడు బలవన్మరణం
అద్దంకి: జీవితంపై విరక్తితో ఓ దివ్యాంగుడు బ్రిడ్జి గ్రిల్స్కు తాడు కట్టి ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని అద్దంకి – దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వంతెనపై గురువారం వెలుగు చూసింది. అందిన సమాచారం మేరకు.. పట్టణంలోని పెరికపాలెంకు చెందిన నాగేశ్వరరావు ఉరఫ్ శేషు లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి వినుకొండకు చెందిన మహిళతో వివాహం అయింది. భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఐదు సంవత్సరాల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం నాగేశ్వరరావు (50) లారీ యాక్సిడెంట్లో కాళ్లకు దెబ్బ తగిలి పనిచేయకుండా పోయాయి. దీంతో వంతెన సమీపంలోని ఓ డైరీలో రాత్రి సమయంలో పడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వంతెన గ్రిల్స్కు లారీకి కట్టే తాడును బిగించి, ఆ తాడుతో మెడకు ఉరివేసుకుని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గమనించారు. గుండ్లకమ్మ వంతెనపై స్టాండు, చెప్పులు, కూల్డ్రింక్ సీసా పడి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తాడు విప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని చెల్లెలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే వికలత్వాన్ని భరించలేక.. తనను ఆదరించే వారు లేకపోవడంతో బతుకుపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఉరివేసుకుని మృతి -
అనాథ పిల్లల దత్తత కోసం సంప్రదించాలి
నరసరావుపేట: జిల్లాలో నిర్వహిస్తున్న శిశు గృహలో ఉన్న అనాథ పిల్లల దత్తత కోసం పిల్లలు లేని తల్లిదండ్రులు సంప్రదించాలని జిల్లా మహిళాభివృద్ధి, శిశు, సంక్షేమ సాధికారిత అధికారి కె.ఉమారాణి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహలో అప్పుడే పుట్టిన పసికందుల నుంచి ఐదేళ్లలోపు బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారన్నారు. వీరిని బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టి పిల్లలు లేని తల్లిదండ్రులకు న్యాయపరంగా దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దత్తత కావాలనుకున్న వారు https://cara.wcd.gov.in, htt ps://cara.wcd.nic.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దత్తత తీసుకోదల్చిన భార్యాభర్తలకు చెందిన ఆధార్కార్డులు, పాన్కార్డు, వారి వివాహ, జనన, ఆదాయ ధృవపత్రాలు, ఆరోగ్య ధృవీకరణపత్రం సమర్పించాలన్నారు. సింగిల్ పేరెంట్ అయితే విడాకుల డిక్రీ, మరణ ధృవపత్రం, బంధువుల ష్యూరిటీ, రూ.6వేలు డీడబ్ల్యూ, సీడబ్ల్యూ, ఈవోల పేరుపై డీడీ చెల్లించాలని కోరారు. ధృవపత్రాలను నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో గల 133 ఇంటి నెంబరులోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం, ఐసీడీఎస్ పీడీ కె.ఉమారాణి, 63053 13833, జిల్లా బాలల పరిరక్షణ అధికారి డి.శౌరిరాజు, సెల్ 94918 93573, శిశుగృహ మేనేజర్ ఎం.కుమారి, సెల్.83090 48218, ప్రొటెక్షన్ అధికారి వై.ప్రశాంతకుమార్, సెల్.70953 02602లను సంప్రదించాలని కోరారు. పసికందు కోసం నెల రోజుల్లో సంప్రదించండి మాచర్ల మండలం నాగార్జునసాగర్ మేరీమాత చర్చి వద్ద ఈనెల 14న స్వాధీనం చేసుకున్న రోజుల పసికందు కోసం నెలరోజుల వ్యవధిలో తమను సంప్రదించాలని ఐసీడీఎస్ పీడీ కె.ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేయటంతో పోలీసుల ద్వారా ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ వైద్యశాలకు చేర్చామన్నారు. ఒక కన్ను మూసుకుపోవటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం నరసరావుపేట బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే శిశుగృహలో ఉంచామని చెప్పారు. ఆ పాపకు చెందిన తల్లిదండ్రులు, బంధువులు నెలరోజుల వ్యవధిలో సంప్రదించాలని కోరారు. శిశుగృహలో ఉండే పిల్లలను న్యాయపరంగా దత్తత ఇస్తాం ఐసీడీఎస్ పీడీ కె.ఉమారాణి -
డీ.ఫార్మసీలో ప్రవేశం కోసం దరఖాస్తుకు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో రెండేళ్ల కాల పరిమితి గల డీ ఫార్మసీ కోర్సులో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈనెల 27 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్తోపాటు దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆదాయ ధ్రువీకరణపత్రం/తెల్లరేషన్ కార్డు కలిగిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా అడ్మిషన్ ఫీజు మినహాయింపుతోపాటు ఉపకార వేతనాలకు అవకాశం కలదని తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి కలదని, ఆసక్తి గల విద్యార్థినులు అన్ని సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుం రూ.400తో కళాశాలలోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 98480 38769, 99593 24563, 93986 20953 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
గంజాయి కేసులో ఏడుగురు అరెస్ట్
తెనాలిరూరల్: గంజాయి కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ సీఐ ఎ.సుధాకర్ కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చవటపల్లెకు చెందిన అల్లాడి నాగమణికంఠ ఈశ్వర్ అలియాస్ మణి, మచిలీపట్నానికి చెందిన దాసరి శ్రీసాయిశంకర్ భవాని, పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన రామిశెట్టి శ్యాంవెంకట్ అలియాస్ బబ్లు ముగ్గురు గంజాయికి అలవాటు పడ్డారు. ఒడిశా నుండి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టారు. వీరి వద్ద విజయవాడ తాడిగడపకు చెందిన ఉయ్యూరు కౌశిక్రెడ్డి, తెనాలి నందులపేటకు చెందిన కోటి సాయిమంజునాథ్, పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అమ్మిశెట్టి మణికంఠ, తెనాలి నందులపేటకు చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి వీఎస్సార్ కళాశాల సమీపంలో బుధవారం సాయంత్రం ఏడుగురూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రావడంతో సీఐ సుధాకర్ తన సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు. ఏడుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం నరసరావుపేట ఈస్ట్: పల్నాడురోడ్డులోని ఎన్బీటీ అండ్ ఎన్వీసీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కాకాని సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ– పొలిటికల్ సైన్స్, బీకామ్–కంప్యూటర్ అప్లికేషన్, బీఎస్సీ–జువాలజీ, బీఎస్సీ– కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ– మ్యాథమెటిక్స్ కోర్సులు ఉన్నాయని వివరించారు. ఇంటర్మీడియేట్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీలో చేరేందుకు వచ్చే విద్యార్థులు తమ వెంట ఇంటర్మీడియేట్ సంబంధిత సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల ఆధార్కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. విద్యార్థులకు సహాయపడేందుకు కళాశాలలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. -
నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
నాదెండ్ల: సాతులూరు రైల్వేస్టేషన్ సమీపంలో జరుగుతున్న రైల్వే గూడ్స్ షెడ్ నిర్మాణ పనులను పల్నాడు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఐ మురళి గురువారం పరిశీలించారు. నరసరావుపేట జిల్లా కేంద్రంగా మారినందున ప్రస్తుతం ఈ రైల్వే గూడ్స్ షెడ్డును సాతులూరుకు తరలించి అక్కడ నిర్మాణ పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. షెడ్డు నిర్మాణం పూర్తయితే వివిధ కంపెనీల నుంచి రైతులకు అవసరమైన ఎరువులు స్టాక్ పాయింట్కు చేరి సకాలంలో ఆర్బీకేలకు సరఫరా అయ్యేలా వీలుంటుందన్నారు. ఆయనతోపాటూ ఏడీఏ రవికుమార్, ఏఓ హరిప్రసాద్, వీఆర్వోలు, వీఆర్ఏలు ఉన్నారు. ఆర్బీకే సందర్శన సాతులూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని గురువారం జిల్లా వ్యవసాయాధికారి ఐ మురళి సందర్శించారు. కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీ చేసే విధానంపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధులకు సంబంధించి లబ్ధిదారుల్లో ఐదు శాతం మంది భౌతికంగా ధృవీకరించి వారి ఈకేవైసీని ఈనెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కౌలు రైతుల గుర్తింపు కార్డుల వలన సాధారణ రైతులకు ప్రభుత్వం నుండి అందే సబ్సిడీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ అందుతాయన్నారు. అర్హులైన ప్రతి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి రైల్వే గూడ్స్ షెడ్ నిర్మాణ పనుల పరిశీలన -
గుంటూరు రైల్వే డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజనల్ కార్యాలయంలో మూడో డివిజనల్ రైల్వే వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశం (డీఆర్యూసీసీ) నిర్వహించడం సంతోషంగా ఉందని డీఆర్ యూసీసీ చైర్మన్, డీఆర్ఎం ఎం.రామకృష్ణ చెప్పారు. స్థానిక పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో గురువారం డీఆర్యూసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో కోచ్ ఇండికేషన్ బోర్డుల మెరుగుదల, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, కొన్ని రైళ్ల నిలిపిత, రైళ్ల సమయాల మార్పులు, ఆర్ఓబీ, ఆర్యూబీలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. డివిజన్ పరిధిలోని కొన్ని సమస్యల పరిష్కారంపై హెడ్ క్వార్టర్స్ పరిశీలనకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. కొత్త గతి శక్తి టెర్మినల్స్ వచ్చాయని, డివిజన్లో మరి కొన్ని జీసీటీలు రానున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు. సమావేశంలో ఏడీఆర్ఎం కె.సైమన్, డీసీఎం కో–ఆర్డినేషన్ సి.హెచ్.ప్రదీప్, సీనియర్ డీఓఎం దినేష్కుమార్, సీనియర్ డీఈఎన్ జె.వి.అనూష, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, మెయింటెనెన్స్ డీసీఎం భారత్, సుదర్శన్రెడ్డి, డీఆర్యూసీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎం కార్యాలయంలో డీఆర్యూసీసీ సమావేశం హజరైన డీఆర్యూసీసీ చైర్మన్ రామకృష్ణ పలు కీలక అంశాలపై చర్చ -
కాంట్రాక్ట్ బిల్లుల అవకతవకలపై ఆడిట్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లుల్లో అవకతవకలు జరిగిన విషయంలో స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బిల్లులు తనిఖీ చేశారు. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారితో పాటు మరో ముగ్గురు అధికారులు వచ్చి బిల్లుల అకౌంటెంట్, ఎగ్జామినర్ను కలిశారు. గతంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు/ఫైల్స్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. విచారణకు ఎంత మంది సిబ్బంది అవసరమో వంటి, ఇతర వివరాలతో ప్రాథమిక దర్యాప్తు చేసి వెళ్లారు. అసలేం జరిగిందంటే.. నగరపాలక సంస్థలో 2022లో అకౌంటెంట్గా పనిచేసిన సిరిల్పాల్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను రూ.అరకోటి దాకా తన బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టిన నగర కమిషనర్ కీర్తి చేకూరి అతడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి విచారణ కోసం 3 నవంబర్ 2022న స్టేట్ ఆడిట్ డైరెక్టర్కు కమిషనర్ లేఖ రాశారు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎంత మొత్తంలో అవినీతి జరిగిందో తేల్చి రిపోర్టు అందించాలని కోరారు. సస్పెండ్ అయిన సిరిల్పాల్పై ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వానికి తగు ఆధారాలతో గత నెల 14న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సిరిల్పాల్ చేసిన అవినీతిపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అదనపు కార్యదర్శి ఎం.ప్రతాప్రెడ్డి సీడీఎంఏను (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అదేశించింది. ఆనాడు కమిషనర్ కీర్తి చేకూరి రాసిన లేఖ, గత నెల ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం స్టేట్ ఆడిట్ అధికారులు వచ్చినట్లు నగరపాలక సంస్థ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. -
రేపు కోటప్పకొండ గిరిప్రదక్షిణ
నరసరావుపేట రూరల్: పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారి గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవా సమితి అధ్యక్షులు అనుమోలు వెంకయ్యచౌదరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 5గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ఘాట్రోడ్డు విజయగణపతి ఆలయం వద్ద ఆల్పాహరం, మార్గమధ్యంలో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ పూర్తిచేసుకుని స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. వందేభారత్ రైలు ఆగేలా చర్యలు తీసుకోండి డీఆర్ఎంను కలిసిన రైల్వే బోర్డు సభ్యుడు జూలకంటి శ్రీనివాసరావు పిడుగురాళ్ల: పిడుగురాళ్ల రైల్వేస్టేషన్లో వందే భారత్ రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు సభ్యులు జూలకంటి శ్రీనివాసరావు కోరారు. డీఆర్ఎం ఎం.రామకృష్ణను గురువారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ మీదుగా వెళ్తున్న ఎల్టీటీ, డెల్టా, నర్సాపూర్, సికింద్రాబాద్ డెమో రైలు ఆగక పోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని డీఆర్ఎంకు వివరించినట్లు ఆయన తెలియజేశారు. టమాటా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోండి జిల్లా అధికారులను ఆదేశించిన జేసీ శ్యాంప్రసాద్ నరసరావుపేట: చిత్తూరు జిల్లా పుంగనూరు, మదనపల్లె నుంచి టమాట కొనుగోలు చేసి జిల్లాలో వినియోగదారులకు తక్కువ ధరకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.శ్యాంప్రసాదు పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం కూరగాయలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో జిల్లా మార్కెటింగ్, వ్యవసాయం, పౌర సరఫరాలు, ఉద్యానవనం, ఏపీఎంఐడీపీ, రైతు బజారు ఎస్టేటు అధికారులతో సమావేశం నిర్వహించి కూరగాయల ధరలపై సమీక్ష చేశారు. ధరల నియంత్రణ కోసం తగు సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ మార్కెట్లో టమాటా ధరలు అత్యధికంగా ఉన్నందువలన పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించారు. వ్యాపారస్తుల వద్ద నిత్యావసర కూరగాయలైన టమాట, ఉల్లిపాయలు మొదలైన నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ధరల స్థిరీకరణ జరిగేవరకు టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు ఐ.మురళి, ఆంజనేయులు, పద్మశ్రీ పాల్గొన్నారు. నేడు చాగంటి ‘ప్రవచనామృతం’ తెనాలి: ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తెనాలి పట్టణం మరొక విశిష్ట కార్యక్రమానికి వేదిక కానుంది. శ్రీరామనామము–శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరావు శుక్రవారం ‘ప్రవచనామృతం’ నిర్వహించనున్నారు. పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తనా బృందం, సంకీర్తనా సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్ధానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో తొలుత శ్రీపంచముఖ ఆంజనేయస్వామికి విశేష అర్చనలు చేస్తారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ప్రవచనామృం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డులోని సభాస్థలిలో గురువారం వారు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అండగా ఉంటాం
అధైర్యపడొద్దు.. భట్టిప్రోలు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల విధ్వంసం మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు అన్నారు. ఈనెల 18న టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన భట్టిప్రోలుకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు కొల్లిపర పూర్ణ చంద్రరరావు (బుల్లబ్బాయి)ని గురువారం అశోక్బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని అశోక్బాబు భరోసా ఇచ్చారు. టీడీపీ నేతలు దాడి చేసి ఎదు రు కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. బుల్లాబ్బాయిపై దాడి చేసిన పెదలంక సుబ్బారావును వెంటనే అరెస్టు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో అశోక్బాబు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి, ఎంపీటీసీ సభ్యురాలు కౌతరపు పద్మావతి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కుందేటి రమేష్, నాయకులు పడమట శ్రీనివాసరావు, వేల్పూరి బాలసుబ్రహ్మణ్యం (చిన్నారి), కుక్కల భూషణరావు, కుక్కల వెంకట్రామయ్య, సయ్యద్ సిరాజుద్ధీన్, సయ్యద్ నబీ, దావూరి నాగమల్లేశ్వరరావు, దారా చెన్నయ్య, కరింశెట్టి బాలు, తలకొల యలమంద, భాస్కర్, గోలి శ్రీనివాసరావు, తబ్రేజ్, తదితరులు ఉన్నారు. శ్రుతిమించుతున్న టీడీపీ ఆగడాలు వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ నాయకుడు బుల్లబ్బాయికి పరామర్శ -
పరిపాలన వ్యవస్థలో రెవెన్యూశాఖ కీలకం
బాపట్ల: పరిపాలన వ్యవస్థలో రెవెన్యూ శాఖ చాలా కీలకమైనదని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు అన్నారు. రెవెన్యూ దినోత్సవం గురువారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, ఆర్డీఓ జి.రవీందర్ కలిసి కేక్ కట్ చేశారు. క్రమశిక్షణ, మరింత బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగుల సేవలు మరువలేనివన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యేలా రెవెన్యూ శాఖ నిరంతర కృషి చేస్తుందన్నారు. రెవెన్యూ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించి, కార్యక్రమాన్ని జరపడం అభినందనీయమన్నారు. అన్నిప్రభుత్వ శాఖలను సమన్వయ పరిచే బృహత్తరమైన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. భూమి ఉన్నంతవరకు రెవెన్యూ శాఖ ఉంటుందన్నారు. డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ దినోత్సవం చట్టాల అమలు బాధ్యత రెవెన్యూ శాఖదే.. ప్రజాస్వామ్యంలో చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని బాపట్ల ఆర్డీఓ జి.రవీందర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో భూమి పరిపాలన వ్యవస్థ ఎంతో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సామాజిక అవసరాలను గుర్తించి వారికి అన్ని వనరులు అందేలా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. అనంతరం పలువురు రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. కలెక్టరేట్ ఏఓ లక్ష్మీకుమారి, పర్యవేక్షకులు మల్లీశ్వరి, పౌర సరఫరాలశాఖ అధికారి విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ డీఎం చంద్రశేఖర్, రిటైర్డు డీఆర్ఓలు రాధాకృష్ణమూర్తి, రిటైర్డు తహసీల్దార్ వల్లయ్య, నూర్ బాషాఖాసీం, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
తీర ప్రాంతాల్లో పటిష్ట భద్రత
బాపట్లటౌన్: జిల్లాలోని తీరప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటుచేయటం జరిగిందని ఎస్పీ వకుల్జిందాల్ తెలిపారు. గత రెండు రోజుల్లో సూర్యలంక సముద్రతీరంలో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 11 మంది యాత్రికుల ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అభినందించి గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్పీ వకుల్జిందాల్ మాట్లాడుతూ విధినిర్వహణలో భాగంగా ప్రాణాలకు తెగించి సముద్రంలో కొట్టుకుపోతున్న యాత్రికులను రక్షించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పోలీస్ శాఖ కీర్తి పెంచేవిధంగా విధులు నిర్వహించాలన్నారు. అలల తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న 11 మంది యాత్రికుల ప్రాణాలను కాపాడిన హెడ్ కానిస్టేబుల్ మస్తాన్రావు, కానిస్టేబుల్ ఎన్.నాగరాజు, హోంగార్డులు ఎన్.శ్రీనివాసరావు, పి.రమేష్, కె.ఆశీర్వాదం, కె.వెంకట నారాయణ, గజ ఈతగాళ్లు కె.సుబ్బారావు, ఎస్.శివగోపాల్, కె.రామకృష్ణ, కె.బాలకోటేశ్వరరావు, ఎస్.సురేష్, ఎస్.ఆంజనేయులు, మైరెన్ ఎస్ఐ నాయబ్ రసూల్లను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పాత్రలను అందజేశారు. విధుల్లో నిబద్ధత, దైర్యసాహసాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక, వాడరేవు సముద్రతీరాలకు విచ్చేసే యాత్రికుల రక్షణకోసం పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. తీరం వెంబడి గస్తీ పెంచామని, యాత్రికుల ప్రాణ రక్షణకై సముద్ర తీరం వెంబడి గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. సముద్ర తీరాలకు విహారానికి వచ్చిన యాత్రికులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీస్ వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రవర్తిస్తే ప్రాణం మీదికి తెచ్చుకున్నట్లేనన్నారు. జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ యాత్రికులను కాపాడిన పోలీసులు, గజ ఈతగాళ్లకు ప్రశంసాపత్రాలు అందజేత -
పేరుంది.. ఊరేది?!
పుల్లరిపాలెం పేరుమీదే కార్యకలాపాలు.. రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ, అన్ని ప్రభుత్వ రికార్డుల్లో పుల్లరిపాలెం గ్రామ పంచాయతీగానే నమోదై ఉంటుంది. భౌతికంగా మాత్రం గ్రామం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఉంది. పుల్లరిపాలెం గ్రామం కింద ఐదు హ్యామ్లెట్ గ్రామాలు ఉన్నా యి. వీటన్నిటిలో పుల్లరిపాలెం గ్రామ పంచా యతీపైనే కార్యకలాపాలు జరుగుతుంటాయి. – శర్మ, ఎంపీడీఓ, వేటపాలెం ●వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలో ప్రభుత్వ రికార్డుల్లో భౌతికంగా లేని గ్రామం పేరునే అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది వందేళ్లుగా సాగుతున్న తంతు. అసలు లేని గ్రామ పంచాయతీ పేరునే ఆరు గ్రామాలకు ప్రభుత్వ రికార్డుల్లో పనులు జరుగుతున్నాయి. ఆరు గ్రామాల ప్రజలను మీది ఏ గ్రామ పంచాయతీ అని ఎవరైనా అడిగితే... మాది పుల్లరిపాలెం గ్రామ పంచాయతీ అని సమాధానం చెబుతారు. అది ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు. గ్రామం ఏమైంది? సుమారు వందేళ్ల కిందట వేటపాలెం మండలం పరిధిలోని పందిళ్లపల్లి గ్రామానికి తూర్పుగా నాలుగు కిలోమీటర్లు దూరంలో కొత్తరెడ్డిపాలెం గ్రామానికి దగ్గరలో పుల్లరిపాలెం గ్రామం ఉండేది. అది అప్పటిలో పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉండేదని పూర్వీకులు చెబుతుండేవారు. వందేళ్ల కిందట ఈ గ్రామంలో ప్లేగు, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలి పెద్దసంఖ్యలో గ్రామస్తులు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో మిగిలిన వారు ఇళ్లు, వాకిళ్లు వదిలి వలసబాట పట్టారని ఆ ప్రాంతంలోని వృద్ధులు ఇప్పటికీ చెబుతుంటారు. ఇలా పుల్లరిపాలెం గ్రామం కనుమరుగైందన్న మాట. ఆ గ్రామానికి చెందిన ఎటువంటి ఆనవాళ్ల ఇప్పుడు లేవు. పుల్లరిపాలెం గ్రామం భౌతికంగా కనుమరుగైనా పంచాయతీకి సంబంధించిన పరిపాలన గ్రామానికి దగ్గరలోని కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డుల్లో పుల్లరిపాలెం.. సాధారణంగా ఏ గ్రామ పరిపాలనైనా ఆ గ్రామం పేరు మీదుగానే జరుగుతుంది. గ్రామంలోని ప్రజలు కూడా తాము ఫలానా ఊరి వారమంటూ రెవెన్యూ సౌకర్యాలు, ఇతరత్రా సదుపాయాలు పొందుతారు. కానీ వేటపాలెం మండలంలోని పుల్లరిపాలెం గ్రామం మాత్రం ఇందుకు విభిన్నం. ఎందుకంటే ఎప్పుడో ఒకానొక సమయంలో ఈ ఊరు ఉండేది. ప్రస్తుతం పేరొక్కటే ఉంది. ఈ పేరుమీదనే మండలంలోని ఆ పంచాయతీ కింది ఉన్న కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, రామాచంద్రాపురం, బచ్చులవారిపాలెం, ఊటుకూరి సుబ్బయ్యపాలెం, సాయనగర్ గ్రామాలకు చెందిన వారు ప్రస్తుతం సదుపాయాలు పొందుతున్నారు. మండలంలో పుల్లరిపాలెం పంచాయతీ తెలియనివారు ఈ ప్రాంతంలో ఉండరు. గ్రామానికి సర్పంచ్, కార్యదర్శి, వీఆర్ఓ, ఎంపీటీసీ సభ్యుడు ఉన్నారు. కానీ భౌతికంగా ఆ గ్రామమే లేదు. ఈ పల్లె లేని పల్లె గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే అధికారులు సైతం పుల్లరిపాలెం గ్రామం ఎక్కడుందబ్బా అంటూ ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఈ గ్రామ పంచాయతీ కింద ఆరు హ్యామ్లెట్ గ్రామాలు లబ్ధిపొందుతుంటాయి. ఈ ఆరు గ్రామాలకు పుల్లరిపాలెం గ్రామ పంచాయతీ పేరుమీదనే ప్రభుత్వ రికార్డుల్లో పరిపాలన జరుగుతుంది. ఆ పంచాయతీ చుట్టుపక్కల ఆరు గ్రామాల్లో మీది ఏ పంచాయతీ అని ఎవరిని అడిగినా ఆ గ్రామం పేరు ఠక్కున చెబుతారు.. కానీ ఎక్కడ వెతికినా ఆ గ్రామమైతే కనిపించదు.. పాలనా వ్యవహారాలన్నీ ఆ గ్రామం పేరుమీదనే నడుస్తున్నా.. ఎక్కడుందంటే ఎవరూ మాట్లడరు.. ఆ గ్రామానికి సర్పంచు, కార్యదర్శి, ఎంపీటీసీ వంటి కార్యవర్గమైతే ఉందిగానీ ఊరే బూతద్దంలో వెతికినా కనిపించదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, అనంతర పరిస్థితుల్లో ఆ గ్రామమైతే అంతరించింది గానీ దాని పేరైతే వందేళ్లుగా జనం మదిలో అలాగే నిలిచిపోయింది.. పేరుండి ఊరులేని గ్రామంగా వేటపాలెం మండలంలోని పుల్లరిపాలెం రికార్డులకెక్కింది. పేరుండి ఊరులేని గ్రామంగా పుల్లరిపాలెం ఖ్యాతి గ్రామం కనుమరుగై వందేళ్ల దాటిన వైనం అయినా ఆ గ్రామం పేరు పైనే అధికారిక కార్యక్రమాలు ఆ పంచాయతీ కింద ఆరు శివారు గ్రామాలు వందేళ్ల క్రితం ఉండేది.. దాదాపు వందేళ్ల కిందట పుల్లరిపాలెం అనే గ్రామం ప్రస్తుతం ఉన్న పాతరెడ్డిపాలెం గ్రామం వద్ద ఉండేదని మా పూర్వీకులు చెబుతుండేవారు. అప్పట్లో వచ్చిన వివిధ రకాల వ్యాధుల కారణంగా ఎక్కువ మంది మరణించారని అనుకుంటుండేవారు. మిగిలిన వారు గ్రామం విడిచి వెళ్లారని పెద్దలు చెబుతుండేవారు. అయితే ఇప్పటికీ పుల్లరిపాలెం గ్రామపంచాయతీ పేరుమీదనే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతుంటాయి. – సుబ్బారెడ్డి, కొత్తరెడ్డిపాలెం పుల్లరిపాలెం పంచాయతీ గానే పిలుస్తారు.. పుల్లరిపాలెం అనే గ్రామం భౌతికంగా లేదు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం పుల్లరిపాలెం గ్రామంగానే నమోదై ఉంది. అన్ని కార్యక్రమాలు ఆ ఊరిపేరునే జరుగుతాయి. – ఎ.శ్రీనివాసరెడ్డి, కొత్తరెడ్డిపాలెం -
రాష్ట్ర పోలీస్ బాస్ గుంటూరు వాసే
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ డీజీపీగా ఎంపికై న సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వస్థలం గుంటూరే. గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని దేవాపురంలో ఓ సామాన్య కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్న్అండ్ ఎకై ్సజ్ విభాగంలో అధికారి. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు. గుంటూరు కృష్ణా నగర్లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్లో గోల్డ్మెడల్ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్గా పని చేశారు. 1989లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. గర్వకారణం .. ద్వారకా తిరుమలరావు గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థి కావడం తమకు ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ మాట్లాడుతూ హైస్కూల్ విద్యను ఇక్కడే అభ్యసించిన ద్వారకా తిరుమలరావు నాయకత్వంలో రాష్ట్ర పోలీసుశాఖ ఉత్తమ సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలరావు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల పాలకవర్గం ఆకాంక్షించింది.ద్వారకా తిరుమలరావు పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ పూర్వ విద్యార్థి -
మాతృ మరణాల నివారణకు చర్యలు
జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయమ్మ చీరాల రూరల్: మాతృ మరణాల నివారణకు వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ అన్నారు. గురువారం ఆమె చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను సందర్శించారు. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో చేరిన జాండ్రపేటకు చెందిన గర్భిణి చేవూరి నాగమణికి సిజేరియన్తో కాన్పు జరగ్గా, ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించగా, మరుసటి రోజు మృతి చెందిన విషయమై వైద్యులు, వైద్య సిబ్బందితో ఆమె సమీక్షించారు. ఈ విషయమై వైద్యులు, వైద్య సిబ్బందితో ఆమె కూలంకషంగా మాట్లాడారు. ఎవరెవరి లోపాలు ఉన్నాయనే విషయమై ఆమె విచారించారు. ప్రమాదకర గర్భిణులను ముందుగా గుర్తించి వారిని వారం నుంచి 15 రోజులలోపు ముందుగానే ఆస్పత్రిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు. మాతృ మరణాల నివారణకు అందరూ సమష్టిగా పనిచేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. సమీక్ష కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శేషుకుమార్, జిల్లా ఎఫ్డీపీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.బ్రహ్మం, ఈపురుపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి, చీరాల ఏరియా పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించాలి
బాపట్ల: వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించడం కోసం వినూత్న విధానాలను రూపొందించేందుకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డా.బి.వి.నాథ్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 56వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మంటే కేవలం ఆహారోత్పత్తి మాత్రమే కాదని, జీవితాన్ని పోషించడమనే వాస్తవాన్ని విద్యార్థులంతా గ్రహించాలని గవర్నర్ సూచించారు. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, దాన్ని ఎప్పటికీ ఆపొద్దని, వ్యవసాయ రంగ భవిష్యత్ విద్యార్థుల భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులను అర్ధం చేసుకుంటూ, సృజనాత్మకతతో మేధస్సును పెంచుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోందని, ఇది మనం గర్వించదగ్గ విషయమన్నారు. పెరుగుతున్న జనాభా, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ప్రశ్నిస్తున్నా... విద్యార్థులు తమ భవిష్యత్కు బాటలు వేసుకుంటూ, డ్రోన్, రిమోట్ సెన్సింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్వంటి నూతన సాంకేతికతలను క్షుణ్ణంగా నేర్చుకుని రైతు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ చదువును పుట్టిన గ్రామాల సౌభాగ్యానికి వినియోగిస్తే వికసిత భారత్ సాధ్యపడుతుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ నివేదికను వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీ దేవి సమర్పించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్షు పాఠక్ కళాశాల, విశ్వవిద్యాలయ ఉన్నతిని కొనియాడారు. అవార్డుల ప్రదానోత్సవ సభను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.జి.రామచంద్ర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, యూనివర్సిటీ అధికారులు, వివిధ కళాశాలల అసోసియేట్ డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
తెనాలిలో 84.8 మి.మీ. వర్షం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది. అత్యధికంగా తెనాలి మండలంలో 84.8 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో 1 మి.మీ. వాన కురిసింది. సగటున 10.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా చేబ్రోలు మండలంలో 37 మి.మీ., పొన్నూరు 27.8, పెదనందిపాడు 21.2, తాడేపల్లి 16.6, వట్టిచెరుకూరు 3.6, దుగ్గిరాల 1.8, గుంటూరు తూర్పు 1.8, కొల్లిపర మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం పడింది. జూన్ 19వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 61.5 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 83.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
సూపర్ డిగ్రీ
సాధారణ డిగ్రీ కోర్సులూ ఇప్పుడు విద్యార్థులు అతిశయ పడేలా అత్యద్భుతంగా రూపొందాయి. ఆధునిక సాంకేతికతను జోడించిన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా సమూల మార్పులతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వీటిని గత విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చింది. ఫలితంగా విద్యార్థులు సరికొత్త డిగ్రీ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు.గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలలకై తే కొదవే లేదు. గుంటూరు, బాపట్లలో ప్రభుత్వ మహిళా కళాశాలలు, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్లల్లో కో–ఎడ్యుకేషన్ ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో ఇప్పుడు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్కు దీటుగా.. ఇంటర్ తరువాత విద్యార్థులు ఎక్కువ మంది ఇంజినీరింగ్ కోర్సుల వైపు వెళ్తున్న నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లోనూ మార్పులు వచ్చాయి. ఇంజినీరింగ్కు దీటుగా అవీ రూపొందాయి. మూడేళ్ల కాలానికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్ల కాలానికి ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసి, ఉపాధికి బాటలు చూపేలా మారాయి. ఈ కోర్సుల్లో భాషా, సాంకేతిక నైపుణ్యాలతోపాటు వృత్తి నైపుణ్యాలను పెంచేలా ఇంటర్న్షిప్, పారిశ్రామిక శిక్షణను అంతర్భాగం చేశారు. ఇవి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారాయి. ఆంగ్ల మాధ్యమం, సెమిస్టర్ విధానం ప్రభుత్వ కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. టెన్త్, ఇంటర్మీడియెట్ స్థాయిల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా డిగ్రీలో అదే మాధ్యమాన్ని కొనసాగింవచ్చు. తద్వారా భాషా నైపుణ్యంలోపాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కార్పొరేట్ కొలువులను సాధించే స్థాయికి చేరుకోవచ్చు. అదే విధంగా సెమిస్టర్ విధానం అమలులోకి వచ్చింది. పరీక్షలు, మూల్యాంకనం ద్వారా విద్యార్థి అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అధ్యాపకులు పర్యవేక్షించడం వల్ల విద్యార్థులు ఉత్తమ అవకాశాలను అందుకోగలుగుతారు. సంప్రదాయ కోర్సుల్లో మార్పులు ఇలా.. సంప్రదాయ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సు ల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ● పీజీలోలా పూర్తిగా ఓ సబ్జెక్టు చదివేలా డిగ్రీ కరిక్యులమ్తోపాటు సిలబస్లో మార్పులు చేసింది. ● బీఎస్సీ లైఫ్సైన్సెస్లో బోటనీ, జువాలజీ, ఆక్వాకల్చర్, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హోమ్సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సులతో పాటు బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ● బీఏలో ఫైనాన్షియల్ ఎకనామిక్స్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరరీ స్టడీస్, తెలుగు భాష–సాహిత్యం, పొలిటికల్ సైన్స్ కోర్సులను తీర్చిదిద్దింది. ● బీకాంలో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, అకౌంటింగ్ అంగ్ ట్యాక్సేషన్ బ్యాంకింగ్–ఇన్సూరెన్స్–ఫైనాన్షియల్ సర్వీసెస్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది.చదువుతోపాటు నైపుణ్యానికి కేరాఫ్ అందుబాటులో అధునాతన కోర్సులు ఇంజినీరింగ్కు దీటుగా రూపకల్పన జాతీయ నూతన విద్యా విధానం అమల్లో భాగంగా సమూల మార్పులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాం విద్యార్థినుల కోసం గుంటూరులో పూర్తిస్థాయి బోధన వసతులతో ప్రభుత్వ మహిళా కళాశాల ఉంది. అటానమస్ హోదాతో అధునాతన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తున్నాం. కళాశాలలో ప్రవేశం పొందగోరు విద్యార్థినుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశాం. దూరప్రాంత విద్యార్థినులకు హాస్టల్ వసతి ఉంది. – డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు -
లాంఫాం సందర్శన
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐకార్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశుపాఠక్ బుధవారం సందర్శించారు. నగర శివారుల్లోని లాంఫాంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కాటన్ కార్యాలయాన్ని పరిశీలించారు. కాటన్ రీసెర్చ్ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఎస్కే శుక్లా కార్యక్రమాల కార్యాచరణ, ప్రణాళికలను వివరించారు. కాటన్ క్వాలిటీ అనాలసిస్, ట్రాష్ టెస్టింగ్ సౌకర్యాలను పాఠక్ పరిశీలించారు. అనంతరం పాఠక్ మాట్లాడుతూ కంది, శనగలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలను రూపొందించి ఎగుమతులు పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు. ఏఐసీఆర్పీ సెంటర్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల సమస్యలు తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు వివిధ స్కీంల ద్వారా జరుపుతున్న పరిశోధనల ప్రగతిని తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాతీయ పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్, ఐకార్ క్వాలిటీ ఇవాల్యుయేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ డివిజన్ ప్రతినిధి డాక్టర్ ఏఎస్ఎమ్ రాజా, డైరెక్టర్ ఆప్ రీసెర్చ్ డాక్టర్ పి.సత్యనారాయణ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ దుర్గాప్రసాద్, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా జగన్నాథస్వామి బ్రహ్మోత్సవాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కొత్తపేటలోని జగన్నాథస్వామి దేవస్థానంలో రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు బుధవారం స్వామికి వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహించారు. పూర్ణాహుతి జరిపించారు. ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో జగన్నాథ, ఆంజనేయ, వేంకటేశ్వరస్వామి దేవస్థానాల చైర్మన్ సూరినేడి దుర్గావరప్రసాద్, సహాయ కమిషనర్ (ఈఓ) డి.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు అయోధ్య అయ్యప్ప పాల్గొన్నారు. -
పరిశోధనలకు అగ్రస్థానం
బాపట్ల: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయని, పరిశోధనలకు అగ్రస్థానం లభిస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ స్నాతకోత్సవం బుధవారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్, వర్సిటీ కులపతి అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. తొలుత ఆయన ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన స్నాతకోత్సవంలో మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి, గ్రామీణ జనాభా సంక్షేమంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ శక్తిగా భారత్ నిలుస్తోందని పేర్కొన్నారు. పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. దేశంలో వ్యవసాయం రంగం తప్పుదోవ పడితే మిగతాదేదీ సరిగ్గా జరిగే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధి, ప్రగతిలో సేద్య రంగం వాటా ఎక్కువన్నారు. స్థిరమైన వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అనుసంధానాల కోసం సృజనాత్మకంగా ఆలోచించి వినూత్న పద్ధతిలో పరిష్కారాలను అభివృద్ధి చేయాలని గవర్నర్ సూచించారు. వ్యవసాయ రంగ భవిత విద్యార్థుల భుజాలపైనే ఉందని వివరించారు. పాడిపోషణ, గోధుమలు, బియ్యం, పత్తి సాగులో ఎక్కువ విస్తీర్ణం మన దేశంలోనే ఉందని, గోధుమలు, బియ్యం, పత్తి, చెరకు, చేపలు, గొర్రెలు ఉత్పత్తిలో మనది రెండో అతిపెద్ద దేశమని గవర్నర్ వెల్లడించారు. వ్యవసాయ పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. 1,576 మందికి పట్టాలు ప్రదానం స్నాతకోత్సవంలో 1,576 మంది విద్యార్థులు పట్టాలు స్వీకరిస్తే వీరిలో 1,319 అండర్ గ్రాడ్యుయేట్, 193 పోస్ట్ గ్రాడ్యుయేట్, 64 పీహెచ్డీ డిగ్రీ సర్టిఫికెట్లను అందుకున్నారు. డాక్టర్ శరత్కుమార్కు ప్రతిష్టాత్మక అవార్డులు అగ్రికల్చరల్ సైన్సెస్ల అత్యుత్తమ పరిశోధనలకు డాక్టర్ ఎం.వి.రెడ్డి జాతీయ అవార్డు–2023, వి.రామచంద్రరావు జాతీయ పురస్కారం–2023ను డాక్టర్ శరత్ కుమార్కు అందించారు. ఈ రెండు అవార్డులూ ఒక్కరే కైవసం చేసుకోవడం విశేషం. స్నాతకోత్సవంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మిదేవి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సేద్య విద్యలో ఎన్జీ రంగా వర్సిటీ ఘన ప్రస్థానం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన ఉత్సాహంగా ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం గవర్నర్ను కలిసిన ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్లటౌన్: ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు బాపట్ల విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ను వ్యవసాయ కళాశాల అతిథిగృహంలో ఎస్పీ వకుల్జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేశారు.