కొత్తగూడెంటౌన్: యోగాతో మానవునికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రశాంత జీవనానికి మార్గం చూపుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు దిన చర్యలో యోగాను భాగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గొల్లపూడి భానుమతి, జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, న్యాయమూర్తులు కె.సాయిశ్రీ, వి.శివనాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి, న్యాయవాదులు మెండు రాజమల్లు, రాజేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలో..
కొత్తగూడెంరూరల్: జిల్లా వైద్య కళాశాలలో యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ మాట్లాడుతూ.. యోగాతో అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. శ్వాసను నియంత్రించేందుకు ఉపకరిస్తుందని, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేసేలా చూస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ యోగా చేయడం అవసరమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు, రాజేకుమార్, ఎం వెంకటేశ్వర్లు, డాక్టర్ వనిత, డీపీఎం దుర్గ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్వసంత్
Comments
Please login to add a commentAdd a comment