24 నుంచి పరీక్షలు - | Sakshi
Sakshi News home page

24 నుంచి పరీక్షలు

Published Sat, Jun 22 2024 1:32 AM | Last Updated on Sat, Jun 22 2024 1:32 AM

-

కాళోజీ సెంటర్‌: గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖలో వార్డెన్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, మ్యాటిన్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేపర్‌–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షకు అరగంట ముందే కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు శనివారం నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement