-
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డోజర్
సూపర్వైజర్, డ్రైవర్పై కేసుతాండూరు రూరల్: నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తుండగా పెను ప్రమాదం తప్పింది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రాంపూర్ సమీపంలో అల్మాస్ ఇంటర్నేషల్ పాఠశాల వద్ద హైవే రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు చదును చేస్తుండగా డోజర్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం నేలకొరిగింది. ఈ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ ఏఈ వెంకట్నాయకుడు ఫిర్యాదు మేరకు పనుల సూపర్వైజర్, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. డోజర్ను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాల
కొడంగల్: మండలంలోని అప్పాయిపల్లి (ఎరన్పల్లి) శివారులో మెడికల్ కళాశాలను నిర్మించనున్నారు. మంగళవారం తహసీల్దార్ విజయ్కుమార్, ఎంఆర్ఐ శ్రుతితో పాటు రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్ గ్రామంలోని సర్వే నంబర్ 19లో గల స్థలాలను పరిశీలించారు. భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతులతో మాట్లాడారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతులు వారి పొలాల హద్దులను అధికారులకు చూపించారు. కళాశాల నిర్మాణానికి ప్రస్తుతం 20 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల కోడ్తో కారణంగా ఇన్నాళ్లు పనుల్లో పురోగతి లేదు. కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పనులను వెంటనే ప్రారంభించే విధంగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కళాశాల భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.124.50 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం మరో రూ.46 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను, పారామెడికల్ కళాశాలను మంజూరు చేశారు. వీటి నిర్మాణం కోసం రూ.27 కోట్లు మంజూరు చేశారు. ఈ భవన నిర్మాణాల కోసం మండలంలోని అప్పాయిపల్లి శివారులో ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూములను గుర్తించారు. భూములు ఇచ్చే రైతులకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. భూములను పరిశీలించిన రెవెన్యూ అధికారులు హద్దులు చూపిన రైతులు -
శిథిల పాఠశాల భవనం పరిశీలన
దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్ భవనం పూర్తిగా శిథాలవస్థకు చేరింది. ఈ నెల 13న ‘సాక్షి’ పత్రికలో ‘భయం భయంగా బడికి’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన కలెక్టర్ కొడంగల్ ఎంపీడీఓను నివేదిక కోరారు. ఈ మేరకు ఎంపీడీఓ ఉషశ్రీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు మంగళవారం పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఏఈ రవి కిరణ్ మాట్లాడుతూ.. పాఠశాల భవనాన్ని పరిశీలించామని.. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని నివేదిక అందజేశామని చెప్పారు. నివేదిక అందజేశామని ఏఈ వెల్లడి -
ఎస్పీకి అభినందనలు
అనంతగిరి: నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డిని మంగళవారం అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీకి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి విరాళం కొడంగల్: పట్టణ శివారులో నిర్మిస్తున్న శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి కొడంగల్కు చెందిన ఇద్దరు దాతలు ముందుకు వచ్చారు. నందారం మిడిదొడ్డి కృష్ణయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఆనంద్ గుప్తారూ.1,11,111, మురళి గుప్తా రూ.51వేలు విరాళంగా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పి.శ్రీనివాస్గౌడ్, జగదీశ్కు మంగళవారం నగదు అందజేశారు. తండ్రీకొడుకుల అదృశ్యం మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తండ్రీకొడుకులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్ తెలిపిన ప్రకారం.. ఆర్ఎన్రెడ్డినగర్కు చెందిన నాగ రాజు (32) ఈ నెల 22న కుమారుడు రితీశ్ను వెంటబెట్టుకుని రాత్రి 10 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. తిరిగి వారు రాకపోవడంతో నాగరాజు భార్య శిరీష పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వాకబు చేసి నా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై వీధి కుక్కల దాడి తుర్కయంజాల్: మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు బెడద తీవ్రమవుతోంది. రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్లే వారితో పాటుగా.. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. మంగళవారం తొమ్మిదేళ్ల బాలుడు పట్నం రుషి దుకాణానానికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వీధికుక్కలు దాడి చేయడంతో తొడ భాగంలో గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీధి కుక్కలు దాడులు పెరిగిపోతున్నా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
దాచుకున్న సొమ్ము దోచేశారు
దుద్యాల్: రైతు పంట అమ్మగా వచ్చిన సొమ్మును గుర్తు తెలియని దుండగులు దోచేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొడంగల్ ఎస్ భరత్ కుమార్ తెలిపిన ప్రకారం.. హస్నాబాద్ గ్రామానికి చెందిన పోలేపల్లి వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు పంట అమ్మగా వచ్చిన రూ.2లక్షలతో పాటు, వెంకటమ్మ పొలం పనికి వెళ్తున్నందున 17 తులాల వెండి పట్టీలను బీరువాలో దాచారు. రోజు మాదిరిగా సోమవారం పొలం పనులకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు తాళం పగుల గొట్టి బీరువాను ధ్వసం చేసి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సాయంత్రం వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం బాధితుడు వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైతు ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు రూ.2లక్షల నగదు, 17 తులాల వెండి ఆభరణాలు మాయం -
చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరి
అనంతగిరి: ఎదుగుదల లోపించిన, బలహీనంగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. అంగన్వాడీల బలోపేతం, యూనిఫాంల తయారీ, తాగునీటి సరఫరా, టాయిలెట్ల నిర్మాణం, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారంపై మంగళవారం మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ కార్యదర్శి వాకాటి కరుణ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలోని 1,107 అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మంజూరైన వివిధ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ భవనాలకు మరమ్మతులు, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం ఉండేలా పనులు వేగవతం చేయాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటుగా బాలామృతం తప్పక ఇవ్వాలన్నారు. సదరం క్యాంప్లలో అర్హులైన దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేలా, వీరికి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాల సదనం, శిశు గృహాలను త్వరలోనే సందర్శిస్తానన్నారు. వయోవృద్ధుల ఖర్చుల నిర్వాహణకు సంబంధించిన దరఖాస్తుల పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులు సూచించారు. ట్రాన్స్జెండర్ల గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా సంక్షేమ అధికారి వెంకటేశ్వరమ్మ, ఎఫ్ఆర్ఓ వెంకటేశ్, సఖీ కేంద్రం అధికారి యశోద, బాలల పరిరక్షణ అధికారి ఆంజనేయులు, శిశు గృహ మేనేజర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయండి దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృధ్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని దౌల్తాబాద్, గోకఫసల్వాద్, దేవర్ఫసల్వాద్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తికాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్ తదితర మౌలిక వసతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, హెచ్ఎఎంలతో సమావేశం నిర్వహించి పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులున్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
తాళం వేసిన ఇంటికి కన్నం
15 తులాల వెండి, రూ.పది వేల నగదు చోరీశంకర్పల్లి: తాళం వేసిన ఇంటికి కన్నమేసిన దుండగులు వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహాలింగపురం గ్రామానికి చెందిన నారాయణ, సత్యమ్మ దంపతులు వారం క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అదే ఇంట్లో పై పోర్షన్లో ఉండే వారి కుమారుడు రవి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు ఇంటికి వచ్చి పరిశీలించి భూమి పాస్పుస్తకాలు, 15 తులాల వెండి, రూ.10వేల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఆమనగల్లు: ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి బైక్ను సీజ్ చేశారు. ఈ ఘటన మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ మాట్లాడుతూ.. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం చారకొండ నుంచి బైక్పై మాడ్గుల మండలం బ్రాహ్మ ణపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ను తనిఖీ చేయగా అతనివద్ద 6 లీటర్ల నాటుసారా లభ్యమైందన్నారు. దీంతో నాటుసారా, బైక్ను సీజ్ చేసి వెంకటేశ్ను అరెస్టు చేశామన్నారు. నాటుసారా కేసుల్లో నిందితులుగా ఉన్న 11 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. మాడ్గుల తహసీల్దార్ వద్ద ఐదుగురిని, తలకొండపల్లి తహసీల్దార్ వద్ద ఒకరిని, కడ్తాల తహసీల్దార్ వద్ద ఐదుగురిని బైండోవర్ చేశామన్నారు. 11 మంది బైండోవర్ -
కలకలం రేపిన కాల్పుల శబ్దం
రక్తపు మరకల ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్, పోలీసు అధికారులు అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి శివారులో సోమవారం రాత్రి వేటగాళ్ల కాల్పుల శబ్దాలు కలకలం రేపాయి. ఈ విషయం ఫారెస్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం ఫారెస్ట్, పోలీ సు అధికారులు మంగళవారం సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఎఫ్ఆర్ఓ అరుణ, ఇతర సిబ్బంది గ్రామ శివారు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం లాస్ట్ ఇన్ విలేజ్ రిసార్ట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అక్కడే ఉన్న జీపులో రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి. వాహనంలో ఓ కత్తి, బ్యాటరీని స్వాధీనం చేసుకున్నా రు. రెస్టారెంట్ చుట్టు పక్కల క్షుణ్నంగా పరిశీలించారు. రక్తపు ఆనవాళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మా ట్లాడుతూ తమ సిబ్బంది విచారణలో జీపు, పరికరాలను స్వాధీనం చేసుకున్నామని.. జంతు వేట చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తైబజార్@రూ.4.08లక్షలు ధారూరు: ప్రతీ శనివారం ధారూరు పంచాయతీ ఆవరణలో నిర్వహించే కూరగాయల మార్కెట్కు మంగళవారం తైబజార్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో తిమ్మానగర్కు చెందిన కోడిగంటి మహేశ్ రూ.4.08లక్షలకు దక్కించుకున్నారు. ధారూరుకు చెందిన చాకలి లక్ష్మయ్య రూ.4.07లక్షలు వరకు వేలంలో పాల్గొన్నారు. మార్కెట్లో నిర్ణీత రుసుముతో గంప, చాప, టెంట్లకు డబ్బు వసూలు చేసుకోవాలని చెప్పారు. మొదటి వ్యక్తి డబ్బు చెల్లించకుంటే రెండో వ్యక్తికి కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. ఈ వేలంలో ఎంపీడీఓ నర్సింలు, పంచాయతీ కార్యదర్శి అంజానాయక్, వ్యపారులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలుమోమిన్పేట: తై బజార్లో వేలం దక్కించుకున్న వారు తప్పవని కార్యదర్శి నర్సింలు హెచ్చరించారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీఓ యాదగరి అధ్యక్షతన తై బజార్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎల్.ప్రతాప్రెడ్డి, జె.బాగయ్య పాల్గొన్నారు. వేలంలో రూ.2,10,00లక్షలు బాగయ్య దక్కించుకున్నారు. బుధవారం నుంచి 2025 మార్చి 31 వరకు వారాంతపు సంతలో కూరగాయల దుకాణాల నుంచి ఒక్కో దుకాణానికి రూ.30కు మించుకుండా వసూలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అయ్యప్ప సేవా ట్రస్టు జిల్లా అధ్యక్షుడిగా రవి మోమిన్పేట: అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్టు జిల్లా అధ్యక్షుడిగా రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నన్నారు. మండల పరిధిలోని ఏన్కతల శనైశ్చరస్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా నీలి శ్రీకాంత్, కోశాధికారిగా మనోహర్రెడ్డి, కార్యదర్శిగా గిరిగౌడ్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్, విఘ్నేశ్, వీరబాబు, కోనారెడ్డి, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతు చూపు.. సన్నాల వైపు
ఈ వానాకాలం సీజన్ నుంచి సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సన్నాల సాగు పెరగనుంది. సాగువిస్తీర్ణం గతం కన్నా పెరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దుద్యాల్: ఇటివల ప్రభుత్వం సన్న రకం వడ్లకు మద్దతు ధర కంటే రూ.500 ఎక్కువగా ఇస్తామని ప్రకటించడంతో రైతులు సన్నరకం వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. యాసంగిలో దొడ్డు రకం వరి సాగు చేసిన రైతులు ఈ వానాకాలంలో సన్న రకం సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక వేల ప్రభుత్వం సన్న రకం వడ్లను కొనుగోలు చేయకున్నా.. మండలంలో అత్యాధునిక రైస్ మిల్లులుండడం, ఆయా మిల్లుల యాజమాన్యం ధాన్యంలో తేమ శాతం 25 నుంచి 30 వరకు ఉన్న ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా క్వింటాలుకు రూ.2500 నుంచి రూ.3వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో సన్నాలు సాగు చేసి వెంటనే విక్రయించుకుందామనే అలోచనలో ఉన్నారు. దొడ్డు రకంతో ఇబ్బందులు గత యాసంగి సీజన్లో మండల పరిధిలో దాదాపు 9 వేల ఎకరాల వరకు సాగు చేశారు. దొడ్డు రకం వరి సాగు చేసిన రైతులు ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డు రకం పంట కాలం సైతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రైతులు తక్కువ కాలంలో చేతికి వచ్చే సన్నాలనే సాగు చేస్తున్నారు. దొడ్డు రకం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుండగా.. సన్న రకం 40 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుండడంతో రైతులు ఆ వైపు మొగ్గు చూపుతున్నారు. వానాకాలంలో రెండితలయ్యే అవకాశం ఈ వానాకాలంలో సన్నాల సాగు యాసంగి కంటే రెండింతలయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిడంతో సన్నాల సాగుపై మరంత ఆసక్తి పెరిగింది. పంట కాలం 120–130 రోజుల వరకు కోతకు వచ్చే రకాలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచిస్తోంది. మండల పరిధిలోని చాలా గ్రామాల్లో రైతులు సన్న రకం వరి విత్తనాల నారు పోసుకుని నాటుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో అన్నదాత ఆసక్తి యాసంగిలో తేమ ఉన్నా మంచి ధర ఇచ్చిన మిల్లర్లు తగ్గనున్న దొడ్డు రకం వరి సాగు -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
అనంతగిరి: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీపీ కార్మికులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు బీమా సదుపాయం కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలన్నారు. అధికారుల ఒత్తిడి తగ్గించాలన్నారు. నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన సిబ్బందికి కారోబార్ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, నాయకులు, కార్మికులు లక్ష్మయ్య, కుమార్, అశోక్, వెంకట్, రాజు, రవి, గోపాల్, శ్యామమ్మ, లక్ష్మమ్మ, నరేష్, బాలప్ప, సాయిలు, హనుమంతు, ఎల్లమ్మ, నర్సమ్మ, భారతి, మంగమ్మ, అనసూయ, రేణుక, పుష్ప, అమృత తదితరులు పాల్గొన్నారు వేతనాలు చెల్లించాలి: బాల్రాజ్ బంట్వారం: ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీపీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోట్పల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెంటనే జీతాలు విడుదల చేయాలని కోరుతూ ఇన్చార్జ్ ఎంపీడీఓ డానియల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జీపీ వర్కర్ల సంఘం మండల అధ్యక్షుడు సదానందం, కార్యదర్శి బ్రహ్మం, సంఘం నాయకులు నాన్యనాయక్, ముకుందం, ఖదీర్, రవి, నర్సింలు, రత్నం, ఆనందం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ జీపీ కార్మికులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా -
క్రమశిక్షణతో మెరుగైన ఫలితాలు
తాండూరు: తెలుగు మీడియంలో చదువుకుని ఎంతో మంది న్యాయ మూర్తులుగా కొనసాగుతున్నారని తాండూరు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్(న్యాయమూర్తి) నామాల అశోక్ అన్నారు. మంగళవారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఙాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ చదువుకుంటేనే ఉత్తమ ఫలి తాలు సాధిస్తారన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి గురువులన్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో చదువుకు వసతులు లేక ఎంతో మంది ఇత ర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవారన్నారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఎందరో ప్రస్తుతం న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పటిష్టం చేసాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతుందన్నారు. విద్యార్థులు వ్యసనాల దూరంగా ఉండి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. బాలికలు, మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయన్నారు. వారి భద్రతకు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. షీటీంలు బాలికలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయని వివరించారు. ఈ కార్య క్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పిన మోని శ్రీనివాస్, కార్యదర్శి పి.చంద్రశేఖర్, పట్టణ ఎస్ఐ కాశీనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ మల్లినాథ్, న్యాయవాదులు పాశం రవికుమార్, అనితాగుప్తా, సోఫియా, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి తాండూరు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అశోక్ -
ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
సదరాగా చేసిన తప్పు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించి, దేశ రక్షణలో భాగస్వామి అవుతాడనుకున్న కొడుకు శవంగా మారి.. పాడె ఎక్కడాన్ని తల్లిదండ్రులు భరించలేక పోతున్నారు. దోమ: పరువు పోతుందనే మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట రాములు, మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. వీరిలో చింటు (21) పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను అగి్నపథ్లో భాగంగా ఇండియన్ ఆరీ్మకి ఎంపికయ్యాడు. ఇటీవలే బెంగళూర్లో శిక్షణ పూర్తి చేసుకోగా.. గుజరాత్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సెలవులు ఇవ్వడంతో ఈనెల 22న ఇంటికి వచ్చాడు. గత సోమవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చింటు సరదాగా బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళ దాదాపూర్లో స్కూల్ ముగించుకుని కాలి నడకన గుండాలకు వెళ్తున్న ఓ బాలికను గమనించిన చింటు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తానని స్నేహితులతో చెప్పాడు. ఆ వెంటనే వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇందుకు అంగీకరించమని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి కొత్తపల్లికి చేరుకుని చింటు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న చింటు జరిగిన విషయం గ్రామంలో తెలిస్తే తనతో పాటు తల్లిదండ్రుల పరువు పోతుందని మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం బైక్ తీసుకుని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన కొడుకు అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచి్చన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మెరుగైన వైద్యం అందించాలి
మర్పల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశించారు. మర్పల్లి మండలం పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమ వారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ సురేష్, పట్లూర్ ఎంపీటీసీ స్వప్న, పంచలింగాల మాజీ సర్పంచ్ సురేష్, సహకార సంఘం వైస్చైర్మన్ ఫసి, మండల నాయకులు రాచన్న, మహేశ్, రాఖేశ్ తదితరులు ఉన్నారు. అంచనాలు తయారు చేయండి ధారూరు: లక్నాపూర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు అంచనాలు తయారు చేయా లని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ నీటిపారుదల శాఖ చేవెళ్ల సర్కిల్ ఎస్ఈ రంగారెడ్డిని ఆదేశించారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్రెడ్డి, మోమిన్కలాన్, నాగారం మరికొన్ని గ్రామాల ఆయకట్టు రైతులు సోమవారం నగరంలో స్పీకర్ను కలిసి ప్రాజెక్టు కాలువుల విషయాన్ని తెలియజేశారు. స్పందించిన ఆయన ఎస్ఈ రంగారెడ్డిని పిలిపించి కాలువలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పట్లూర్ పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు -
టెండర్ల ఆహ్వానం
షాద్నగర్రూరల్: ఆర్టీసీ కాంప్లెక్స్లోని దుకాణా లకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు ఆర్టీసీ రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుర్మయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఆయన మాట్లాడారు. మహబూబ్నగర్ రోడ్డువైపు ప్రస్తు తం ఉన్న ఆర్టీసీ దుకాణ సముదాయంపై మొదటి అంతస్తులో 11 షాపులను నూతనంగా నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ షాపులకు టెండర్లను పిలుస్తున్నట్టు చెప్పారు. అడ్వాన్స్ టెండర్లలో భాగంగా ఒక్కో దుకాణానికి రూ.2లక్షల డిపాజిట్ నిర్ణయించామని, ఆన్లైన్లో బిడ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. టెండర్ వేసేందుకు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపారు. హార్డ్ కాపీలను ఈ నెల 27న ఉద యం 10.30నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మహబూబ్నగర్లో రీజినల్ టెండర్ బాక్సులో వేయాలన్నారు. టెక్నికల్ బిడ్ను ఈ నెల 27న మఽ ద్యాహ్నం 3గంటలకు తీయడం జరుగుతుందని, కమర్షియల్ బిడ్ ఈ నెల 28న ఉదయం 11గంటలకు ఓపెన్ చేయనున్నట్టు వివరించారు. మరిన్ని వివరాలకు 91009 98229, 99592 26285, 94406 77428 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నత్తే నయం..!
వికారాబాద్: పై ఫొటోలో కనిపిస్తున్న రోడ్డు నవాబుపేట మండల పరిధిలోని చించల్పేట్, అతతాపూర్, అక్నాపూర్ గ్రామాల మీదుగా నారేగూడ వరకు వెళ్లే దారి.. రెండు దశాబ్దాల క్రితం పీఎంజీఎస్వై పథకం కింద చించల్పేట్ గేట్ నుంచి అక్నాపూర్ వరకు 8కిలో మీటర్ల మేర రోడ్డు వేశారు. కాలక్రమేణా ఇది పూర్తిగా పాడైపోయింది. ఆరేళ్లుగా గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు సంవత్సరాల క్రితం రూ.12 కోట్లతో చించల్పేట్ గేట్ నుంచి అక్నాపూర్ వరకు 8 కిలో మీటర్లు, అక్నాపూర్ నుంచి నారేగూడ వరకు 4 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు మంజూరైంది. పనులు ప్రారంభించినా నేటికీ 50 శాతం కూడా పూర్తి కాలేదు. వాహనదారులకు తప్పని ఇబ్బందులు కనెక్టివిటీ రోడ్లు ప్రాంతాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదు. చాలా ప్రాంతాలకు కనెక్టవిటీ రోడ్లు అవసరం ఉన్నా మంజూరు కావడం లేదు. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కొంత దూరమైనా వేరే మార్గా ల్లో గమ్యం చేరుకుంటున్నారు. రోడ్లతో పాటు ఆయా మార్గాల్లో వంతెనలు, బ్రిడ్జీల నిర్మాణ పను లు సైతం ఏళ్లు కావస్తున్నా పూర్తి కావడం లేదు. హడావుడిగా రోడ్ల పనులు ప్రారంభిస్తున్నా ఆ తర్వాత నిధుల విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. మరి కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు లోపాయికారీగా వ్యవహరిస్తున్నారు. వేరే కాంట్రాక్టర్లు పనులు చేపట్టకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులను మేనే జ్ చేస్తున్నారు. వారు ప్రారంభించిన పనులు పూర్తయ్యేదాకా టెండర్లు పిలవకుండా, పిలిచినా వేరే వారు టెండర్ వేయకుండా చూసుకుంటున్నారు. అన్నీ అసంపూర్తిగానే.. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు పీఎంజీఎస్వై కింద 13 రోడ్లు మంజూరయ్యాయి. 93.9 కిలోమీటర్లు బీటీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.56.85 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. కొన్ని పనులు ప్రారంభించి రెండున్నరేళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. పలుచోట్ల పనులను మధ్యలో ఆపేశారు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. నిధుల కొరత కారణంగా అక్కడక్కడ పనులు నిలిచిపోయిన మాట వాస్తవమేనని.. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్ తెలిపారు. రోడ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం 2020 – 21లో జిల్లాకు13 రహదారులు మంజూరు అంచనా వ్యయం రూ. 56.85 కోట్లు నిర్మించాల్సిన దూరం93.9 కిలో మీటర్లు మూడేళ్లు గడిచినా పూర్తికాని పనులు ఇబ్బందుల్లో ప్రయాణికులు పట్టించుకోని అధికారులు -
సమయపాలన పాటించని టీచర్లు
దౌల్తాబాద్: విద్యావ్యవస్థ దయనీయంగా మారింది. పాఠశాలల్లో వసతుల లేమితో పాటు ఉపాధ్యాయుల పనితీరు సక్రమంగా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. మండల పరిధి బండివాడ పాఠశాలలో ఉదయం 9గంటలకు ప్రార్థన చేయాల్సి ఉండగా.. ఇక్కడి ఉపాధ్యాయులు తీరిగ్గా 9.40నిమిషాలకు బడికి వస్తారు. వీరి ఆలస్యం కారణంగా ఉన్న నలుగురు విద్యార్థులకు ఒక్కరూ రాలేదు. తిమ్మారెడ్డిపల్లిలో ఐదుగురు టీచర్లు ఉండగా.. ఒకరు డిప్యుటేషన్ వెళ్లారు. మరొకరు సెలవు పెట్టారు. ఏడు తరగతులకు గాను ముగ్గురే పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన విద్యాధికారులు.. పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. బాలంపేట ఉన్నత పాఠశాలలో బాలికలకు మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. వంటగదులు లేకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆరుబయటే వండుతున్నారు. -
తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం
దుద్యాల్: గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు ధీటుగా బోధన ఉండేది. ఉత్తీర్ణత శాతం ఎక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం ఏటా తగ్గిపోతోంది. మండల పరిధి దుద్యాల్, హకీంపేట్, హస్నాబాద్, కుదురుమల్ల గ్రామాల్లో జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి స్కూల్లో ఏదో ఒక సబ్జెక్ట్కు ఉపాధ్యాయులు లేకపోవడంతో 10వ తరగతి విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని ప్రాధానోపాధ్యాయులు తెలిపారు. కుదురుమల్ల బడిలో జీవశాస్త్రం టీచర్ లేరు. హస్నాబాద్ పాఠశాలలో జీవశాస్త్రం, ఇద్దరు గణితం ఉపాధ్యాయులకు ఒక్కరే ఉన్నారు. హకీంపేట్లో ముగ్గురు గణితం ఉపాధ్యాయులకు ఒక్కరు, దుద్యాల్లో సాంఘిక, జీవశాస్త్రం బోధకులు లేరు. దీంతో 10వ తరగతి విద్యార్థులకు నష్టం జరుగుతుందని హెచ్ఎంలు పేర్కొంటున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో టెన్త్ ఉత్తీర్ణత శాతం దుద్యాల్ 60 మంది పరీక్ష రాయగా.. 38 మంది, హస్నాబాద్ 71 మందికి 30 మంది, హకీంపేట్లో 59 మందికి 49 మంది, కుదురుమల్లలో 36 మందికి 20 మంది పాసయ్యారు. టీచర్ల కొరత వలనే ఉత్తీర్ణత తగ్గుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సత్వరం పరిష్కరించాలి
అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. 250 మంది వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇచ్చారు. భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తోడ్పాటునందించాలి మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శక్తి కార్యాచరణ ప్రణాళికపై జిల్లా గ్రామీణాభివృద్ధి సిబ్బంది ఏపీఎం, సీసీలతో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 2024 –25 సంవత్సరం కింద చేపట్టాల్సిన 14 రకాల పథకాలపై మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 9,722 యూనిట్లకు 11,354 లక్షల రూపాయల రుణాలకు గ్రౌండింగ్ చేయాలన్నారు. పెరటి కోళ్ల పెంపకం, మండల స్థాయిలో క్యాంటిన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సామూహిక పప్పు ధాన్యా ల సేకరణ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, డీపీఎంలు రామమూర్తి, శ్రీనివాస్, వీరయ్య, నర్సింలు పాల్గొన్నారు. నిర్ధేశించిన రుసుమే తీసుకోవాలి మీ సేవ కేంద్రం నిర్వాహకులు ప్రభుత్వం నిర్ధేశించి న రుసుం మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.మార్పల్లి మండలంలో మీసేవ కేంద్రం నిర్వా హకులు ప్రజల నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో కలెక్టర్ ఇలా స్పందించారు. సంబంధిత మీసేవ కేంద్రం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజావాణికి 250 అర్జీలు -
మరుగుదొడ్లున్నా.. శుభ్రం సున్నా..
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టినప్పటికీ.. ఇంకా చాలా బడుల్లో పూర్తికాలేదు. మండలంలో 29 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో 5 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు కొనసాగుతుండగా.. 390 మంది విద్యనభ్యసిస్తున్నారు. 22 మంది ఉపాధ్యాయులు ఉండగా.. ఇటీవల నలుగురు టీచర్లు బదిలీ అయ్యారు. పాఠశాలలో విద్యార్థులు ఇతర అవసరాలకు బోరు నీటిని వాడుతున్నప్పటికీ.. తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నా.. వాటిని శుభ్రం చేయడానికి స్కావెంజర్ లేరు. అప్పుడప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. కొన్నేళ్లుగా అటెండర్, వాచ్మెన్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్మెన్ లేక పోవడంతో.. ఆకతాయిలు పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల మాటున ఉంటూ.. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, వెంటనే వాచ్మెన్ను నియమించడంతో పాటు.. పాఠశాల వెనుకభాగంలో ప్రహారి ఎత్తును పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
అడవుల్లో ట్రైనీ ఎఫ్ఆర్ఓలు
వికారాబాద్/ధారూరు: పశ్చిమ భారతదేశ సందర్శనలో భాగంగా 35 మంది ట్రైనీ ఫారెస్టు రేంజ్ ఆఫీ సర్స్ సోమవారం జిల్లాలో పర్యటించారు. వీరికి ఇండియన్ ఫారెస్టు సర్వీస్ డైరెక్టర్ ఆశ, డిప్యూటీ డైరెక్టర్ రాంమోహన్ ఆధ్వర్యంలో ధారూరు, వికారాబాద్ అడవులను సందర్శించారు. వీరంతా మహారాష్ట్రలో ని షోలాపూర్ పట్టణానికి వెళుతూ మార్గమధ్యలో ఉన్న వికారాబాద్ అడవులను పరిశీలించారు. తెలంగాణ ఫారెస్టు అకాడమీలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. అడవుల్లో జరుగుతున్న వివిధ రకాల పనులను తెలుసుకున్నారు. ప్లాంటేషన్ విధానం, నర్సరీ అభివృద్ధి, మొక్కల పెంపకం, అనంతగిరి అడవుల్లో టూరిజం డెవలప్మెంట్ మొదలైన అంశాలపై ఫీల్డ్ విజిట్ రూపంలో అధ్యయనం చేసినట్లు జిల్లా ఫారెస్టు అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. అడవుల్లో జరుగుతున్న పనులపై రేంజ్ ఆఫీసర్ డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, ఎఫ్ఆర్ఓ శ్యామ్కుమార్, ఎఫ్ఎస్ఓ అరుణలు శిక్షణ లో ఉన్న అధికారులకు అవగాహన కల్పించారు. మొక్కల పెంపకం, ప్లాంటేషన్పై అవగాహన కల్పించిన డీఎఫ్ఓ -
జడ్జిని కలిసిన కలెక్టర్
అనంతగిరి: ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రతీక్జైన్ సోమవారం కోర్టు సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కను బహూకరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఉన్నారు. శివకుమార్కు బంగారు పతకం దౌల్తాబాద్: ప్రపంచస్థాయి అండర్ –19 వంద మీటర్ల పరుగు పందెంలో మండలంలోని యాంకి గ్రామానికి చెందిన సున్నపు శివకుమార్ బంగారు పతకం సాధించారు. నేపాల్లో ఈ నెల 20నుంచి 24వ తేదీ వరకు పోటీ లు జరిగాయి. శివకుమార్ విజేతగా నిలిచి బంగారు పతకం అందుకున్నారు. అతన్ని గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు. ఫైళ్లు పెండింగ్లో పెట్టొద్దు ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: పోలీస్ శాఖలో విధి నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని ఎస్పీ నారాయణరెడ్డి డీపీఓ సిబ్బందికి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో డీపీఓ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమన్వయంతో పనిచేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లను తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వెంకటేశం, డీపీఓ సూపరింటెండెండ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బదిలీలపై విచారణ జరిపించండి ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో అవకతకవలపై సమగ్ర విచారణ జరిపించాలని సేవ్రంగారెడ్డి జిల్లా ఉద్యమ సంస్థ కోర్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాకు అక్రమంగా వచ్చిన వారిని ఆయా జిల్లాలకు తిరిగి పంపించాలని కోరారు. ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. మంత్రి శ్రీధర్బాబు స్పందించి విచారణ జరిపిస్తామని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొనగంటి మహిపాల్రెడ్డి, బి.మధుకర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, సునీత, మాధురి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
నిరాశ పరిచిన నైరుతి
తాండూరు: వరుణుడు ముఖం చాటేశాడు. నైరుతి రుతుపవనాలు సమయానికి రాష్ట్రానికి చేరుకున్నాయి. రుతుపవనాల ఆగమనంతో ఈ నెల రెండో వారంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. పది రోజులుగా జిల్లాలో వర్షాల జాడ లేదు. వాతావరణ శాఖ నుంచి వర్షాలు కురుస్తాయనే ప్రకటన వస్తుందని ఎదురు చూసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. మరోవైపు ఎండల తాకిడి అధికం కావడంతో ఉక్కపోతతో పాటు పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రతి రోజూ ఆకాశం మబ్బులు కమ్ముకుంటున్నాయి. కానీ దివి నుంచి గంగ మాత్రం భూమికి దిగడం లేదు. వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారు. మొలకలు కూడా వచ్చాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కలకు తేమ లేకపోవడంతో ఎండుముఖం పడుతున్నాయి. 70శాతం విత్తు పూర్తి ప్రస్తుత సీజన్లో జిల్లాలోని 20 మండలాల్లో 5.97లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. 70 శాతం వరకు పత్తి, కంది, మొక్కజొన్న, వరి వంటి విత్తనాలు వేశారు. మిగిలిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సీజన్లో పత్తి పంట విస్తీర్ణం తగ్గించారు. 2.53లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధమయ్యారు. కంది పంట 1.50లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా. ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా 108 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తేలిక పాటి భూముల్లో 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈ భూముల్లో విత్తుకునే అవకాశం ఉంది. కానీ నల్లరేగడి నెలల్లో 75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలను విత్తుకోవాలి. ఆరు మండలాల్లో వర్షాభావం జిల్లాలోని 6 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు కారణంగా జూన్ నెల మొదటి రెండు వారాల్లో 108 ఎంఎంల వర్షపాతం నమోదైంది. వ్యవసాయ శాఖ అధికారులు లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం కంటే అధికంగానే వర్షాలు కురిశాయని రైతులు పెద్ద ఎత్తున పొలాల్లో విత్తనాలు వేసుకున్నారు. ఈ నెల మూడో వారం నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. మరోవైపు జిల్లాలోని 6 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వాటిలో నవాబుపేట్, వికారాబాద్, పుడూరు, పరిగి, కుల్కచర్ల, దుద్యాల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 30 ఎంఎంల నుంచి 60 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజులు వర్షాభావ పరిస్థితులు సంభవిస్తే రైతులు వేసిన విత్తనాలు పూర్తిగా ఎండిపోయే అవకాశం లేకపోలేదు. వర్షాల కోసం పూజలుఅనంతగిరి: వర్షాల కోసం రైతులు వరుణదేవుడికి పూజలు చేస్తున్నారు. పది రోజులుగా వా నజాడ లేకపోవడంతో విత్త వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పది రోజులు వర్షాలు పడకపోతే పూర్తిగా నష్టపోతా మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వికా రాబాద్ మండలంద్యాచారంలో, గొట్టిముక్కు ల గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాల కోసం రైతన్న ఎదురుచూపులు రుతుపవనాల రాకతో ముందుగానే సాగు పనులు సాగుపై తీవ్ర ప్రభావం ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు రాష్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాల వల్ల భా రీగా వర్షాలు కురుస్తాయని అనుకున్నాం. కానీ రుతుపవనాలు వేగంగా మందగించాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన ప్రాంతంలో ఇందుకు భిన్నంగా. జిల్లాలో సాగు చేసిన పంటలకు మరో వారం రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పటిలోగా వర్షాలు పడకపోతే మొక్కలు వాడిపోతాయి. రైతులు పంటలు ఎండిపోకుండా నీటి తడులు పెట్టి కాపాడుకోవాలి. – డాక్టర్. సుధాకర్చౌరట్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, తాండూరు -
తరగతి గదిలోనే వంట
పెద్దేముల్: సర్కారు బడుల్లో వసతులు కొరవడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో సెలవుల దినాల్లో పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కానీ.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. క్షేత్రస్థాయి బడుల్లో పనులు పూర్తి కాలేదు. మండల పరిధి కర్ణాటక సరిహద్దు గిరిజన పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. 1నుంచి 5 తరగతులను ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తున్నారు. ఆ టీచర్ అత్యవసర సమయంలో సెలవు పెడితే విద్యార్థులకు తీవ్ర నష్టం తప్పదు. గాజీపూర్ పాఠశాలకు ప్రహరి, బుద్దారం, ఊరేంటితండా బడులకు వంట గదులు లేక, క్లాస్ రూముల్లో వంట చేస్తున్నారు. బాయిమీదితండా, జైరాంతండా, ఉఫానాయక్తండాల ఐదు తరగతులకు ఒక్కరే టీచర్. బడులు తెరిచి పది రోజులు గడుస్తున్నా.. నేటికీ 40శాతం వరకు ఏకరూప దుస్తులు సరఫరా అయినట్లు ప్రధానాపోధ్యాయుల ద్వారా తెలుస్తోంది. -
No Headline
పాలకుల మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దెబ్బతిన్న భవనాలు.. ఉరుస్తున్న గదులు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సమస్యలు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శిథిల భవనాల్లో భయంభయంగా చదువులు సాగుతున్నాయి. పూర్తి వివరాలు 8వ పేజీలో..