ఈనెల 6న గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లికి చెందిన రేషన్షాపును తనిఖీ చేసి 6.20 క్వింటాళ్లు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు డీలర్పై కేసు నమోదు చేశారు. ఇలా అధికారుల తనిఖీల్లో రేషన్ దుకాణాల్లో కేటాయించిన కోటాలో రిజిస్ట్రర్లో ఉన్న వాటికి వ్యత్యాసాలు ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం సదరు బియ్యాన్ని పక్కదారి పట్టించడమే కారణం.
ఈనెల 13న సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ చౌకధరల దుకాణంలో రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా 105 బస్తాలు అనగా 52.50 క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసం ఉంది. దీంతో ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.
ఈనెల 11న ధర్మారం మండలం రామాయపల్లి గ్రామ చౌక ధరల దుకాణంలో తనిఖీలు నిర్వహించగా.. రికార్డుల ప్రకారం దుకాణంలో రెండు క్వింటాళ్ల 42 కిలోల బియ్యం తక్కువ స్టాక్ ఉండడంతో డీలర్పై 6ఏ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment