జ్యోతినగర్(రామగుండం) : రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ అన్నపూర్ణకానీలో నివాసం ఉంటున్న కందుల రమేశ్(53) శుక్రవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే జీవితంపై విరక్తి చెందిన రమేశ్.. తన ఇంటి ఎదుటల గల పశువుల కొట్టలో కర్రకు నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు అయ్యాయి. కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో రైల్వే ఉద్యోగి..
రామగుండం: స్థానిక రైల్వే ఓవర్ హాలింగ్షెడ్లో సీనియర్ టెక్నీషియన్ సిమ్మని శ్రీనివా స్(57) శుక్రవారం ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవా రం రైల్వేకాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై సతీ శ్ కథనం ప్రకారం.. శ్రీనివాస్ తన పిల్లలను ఉ న్నత చదువులు చదివించేందుకు, వ్యక్తిగత ఖ ర్చులకు కొంత అప్పు చేశాడు. వడ్డీ చెల్లించలేకపోవడం, అవసరాల కోసం మరికొంత అప్పు చేయడంతో చెల్లించే దారిలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈనేపథ్యంలో భార్య అరుణతో తరచూ అప్పు విషయం చెబుతూ బాధపడే వాడు. ఈక్రమంలో శుక్రవారం తన బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన భార్య.. ఇరుగుపొరుగు వారిని పిలిపించి కిందకు దింపి చూడగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు అభిరామ్, కూతురు శ్రీజ ఉన్నారు. పిల్లలు ఇద్దరూ అవివాహితులు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment