-
కరోనా తర్వాత పెరిగిన మిద్దె సాగు
హైదరాబాద్లో సుమారు 50,000 ఎకరాల రూఫ్టాప్లు ఉంటాయని వ్యవసాయ నిపుణుడు డీవీఆర్కే రావు 2017లోనే అంచనా వేశారు. హైదరాబాద్లో ఇళ్ల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది కాబట్టి రూఫ్టాప్ లు 70,000 ఎకరాలకు విస్తరించి ఉంటాయని, వాటిల్లో కొన్ని వేల మిద్దెతోటలు ఏర్పాటయ్యాయని, కరోనా తర్వాత నగరంలో మిద్దెతోటల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయని రఘోత్తమరెడ్డి ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. కోవిడ్కు ముందు నాటికే తెలుగు రాష్ట్రాల్లో 5.5 లక్షల మంది మిద్దెతోటలు, పెరటి తోటలు పండిస్తున్నారని ఒక అంచనా. హైదరాబాద్లో ఇందులో కనీసం 35% ఉంటాయని రఘోత్తమరెడ్డి అన్నారు. -
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బిస్రం ప్రసాద్ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి గోదావరి హోమ్స్ సమీపంలోని గాయత్రి నగర్లో నివాసముంటోంది. స్థానికంగా బీమ్స్కాలం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ పనుల నేపథ్యంలో అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం అతని చిన్న కుమార్తె దీపాలి (3) ఆరుబయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. తీవ్ర గాయాలైన చిన్నారికి తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న సృజన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు బాలికను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ నెల 20 నుంచి హెచ్సీఏ వేసవి శిక్షణ శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. నగరంలోని ఐదు కేంద్రాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో చిన్నారులకు నెల రోజులపాటు ఉచితంగా క్రికెట్లో శిక్షణ ఇస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు తెలిపారు. ప్రతి శిబిరంలో 80 నుంచి 100 మందికి అవకాశమిస్తామని... బాలురకు అండర్–14, అండర్–16, అండర్–19 వయో విభాగాల్లో... బాలికలకు అండర్–15, అండర్–19 వయో విభాగాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామని జగన్ మోహన్ రావు వివరించారు. ఆసక్తి గలవారు ఈనెల 15 నుంచి 18వ తేదీలోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్లోని ఐదు కేంద్రాల్లో (జింఖానా; మొబైల్: 90301 30346, ఫలక్నామా: 98852 95387; అంబర్పేట: 98665 82836; లాలాపేట: 99664 62667; మాదాపూర్: 80195 35679) శిబిరాలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం హెచ్సీఏ అధికారిక వెబ్సైట్ (http://www.hycricket.orf)ను సందర్శించి, తెలుసుకోవచ్చు. -
హస్తం గూటికి ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్
ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్యయాదవ్ దంపతులు, కౌన్సిలర్ నాగజ్యోతి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరివర్థన్రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి వారికి కండువాకప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ సర్పంచులు యాదగిరి యాదవ్, వెంకటేశ్ ముదిరాజ్, కౌన్సిలర్లు శశికళ, సంగీత, నరేశ్మాదవ్, మల్లేశ్, రవీందర్ నాయకులు దేవేందర్ ముదిరాజ్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్కు మంగళం?
ఉస్మానియా యూనివర్సిటీ: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పీహెచ్డీ ప్రవేశాలకు ఓయూ మంగళం పాడనుంది. యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీహెచ్డీలో ప్రవేశం కల్పించనున్నారు. ఇప్పటి వరకు కేటగిరి–1లో ఎంట్రన్స్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు కేటగిరి–2లో నెట్ అర్హత సాధించిన వారికి పీహెచ్డీలో ప్రవేశం కల్పించారు. ఇక నుంచి కేవలం నెట్ అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే పీహెచ్డీలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ విషయమై త్వరలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.రవీందర్ శనివారం ‘సాక్షితో అన్నారు. 20న అంతర్జాతీయ మహిళా సదస్సు గన్ఫౌండ్రీ: యునైటేడ్ నేషన్స్, యునిసెఫ్, యునెస్కోల సహకారంతో ఇంటిగ్రేటెడ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్య ంలో ఈనెల 20న సింగపూర్లో అంతర్జాతీ య మహిళా సద స్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు వినయ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూచిపూడి నృత్య కళాకారులు డాక్టర్ వనజ ఉదయ్, డాక్టర్ వి.వినీల రావు, ఫిల్మ్ మేకర్ రుబీనా పర్వీన్, సీనియర్ పాత్రికేయులు మహ్మద్ రఫీ, సిరి కొండ వినయ్ల తో పాటు వివిధ రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్న ట్లు పే ర్కొన్నారు. 19న 120 మంది విద్యావేత్తలు, సామాజికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్తారన్నారు. -
అనంత లోకాలకు
హెల్త్ చెకప్కు వెళ్తూ.. నాగోలు: హాస్పిటల్లో హెల్త్ చెకప్ కోసం వెళ్తుండగా ఆగిఉన్న లారీని క్యాబ్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఎల్బీనగర్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిల్కూర్ బేతవోలుకు చెందిన సాదె వీరయ్య (78), ఇదే ప్రాంతానికి చెందిన సుంకరి మొగ్గయ్య (60) నగర శివారు హయత్నగర్ సూర్యనగర్ కాలనీలో నివాసం ఉండే సాదె జగదీష్ వద్దకు శుక్రవారం వచ్చారు. శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో సాదె వీరయ్య హెల్త్ చెకప్నకు వెళ్లేందుకు ఓలా క్యాబ్ను బుక్ చేసుకున్నారు. కారులో డ్రైవర్తో పాటు వీరయ్య, మొగ్గయ్య, జగదీష్లు కలిసి హయత్నగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. ఎల్బీనగర్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వద్ద రోడ్డు మధ్యలో నిలిపి ఉన్న లారీని వెనక నుంచి క్యాబ్ ఢీకొంది. కారులో ఉన్న నలుగురిలో మొగ్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వీరయ్యను ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ తరలించారు. తలకు తీవ్రగాయాలైన జగదీష్, కారు డ్రైవర్ కిరణ్కుమార్లను కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్కు తరలించారు. కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరయ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు.. హస్తినాపురం: గుర్రంగూడ చౌరస్తా విపాసన ధ్యాన కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీఎన్రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారును మర్రిగూడ నుంచి నగరానికి వస్తున్న క్రెటా కారు అతివేగంతో ఢీకొంది. దీంతో స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న వనస్థలిపురం ఎస్కేడీ నగర్కు చెందిన రవి (29), మీర్పేట నంది హిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రణయ్ (29)లు అక్కడికక్కడే మృతి చెందారు. క్రీటా కారు డ్రైవర్ దస్రుకు గాయాల కావడంతో ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్యాబ్ ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు ఎల్బీనగర్లో ఘటన -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఫైర్ సర్వీసెస్ వీక్ జరగనుంది. ఈమేరకు ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తాగు నీటి సరఫరాకు ఆటంకం కల్పిస్తే చర్యలు
సమీక్ష సమావేశంలో మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్సాక్షి, సిటీబ్యూరో: తాగునీటి సరఫరాలో ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ హెచ్చరించారు. వేసవిలో తాగునీరు, ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో శనివారం జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ, లైన్మెన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్ మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లైన్మెన్లు ఉద్దేశ పూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. జలమండలి రూపొందించిన నాణ్యత యాప్లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలని చెప్పారు. సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే.. అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు. 20 ఎంఎల్డీల అదనపు జలాలు నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీరు వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దానకిశోర్ వెల్లడించారు. నాగార్జున సాగర్లో నీటిమట్టం డెడ్స్టోరేజీకి పడిపోతుండటంతో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15 తర్వాత ఏ క్షణమైనా పంపింగ్ చేసే అవకాశముందని వివరించారు. అదనపు మినీ ట్యాంకర్లు వేసవిలో డిమాండ్ ఎదుర్కొనేందుకు అదనంగా 5 కేఎల్ సామర్థ్యం కలిగిన వంద ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు దానకిశోర్ తెలిపారు. కాలనీలు, బస్తీలు, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు 2.5 కేఎల్ సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకర్ డెలివరీ టైమింగ్స్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దానకిశోర్ ఆదేశించారు. ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్స్, ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఈడీ డా. సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొనారు. -
No Headline
లక్డీకాపూల్ : నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. శుక్రవారం అవుట్ పేషెంట్ విభాగాలు రోగులతో కిటకిటలాడాయి. ఓపీ కార్డు క్యూలైన్లలో రోగులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వరుసగా పండుగ సెలవులు వచ్చిన నేపథ్యంలో నిమ్స్ రోగుల తాకిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలు దాటినా ఓపీ కార్డుల కోసం రోగులు క్యూలైన్లలో బారులు తీరడం గమనార్హం. ఓపీ కార్డులు లభ్యం కాకపోవడంతో 30 శాతం రోగులు తిరుగుముఖంపట్టాల్సిన పరిస్థితి. ఆస్పత్రి వైద్యుల కొరత కూడా ఇందుకు కారణంగా నిమ్స్ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న వైద్యులు మధ్యా హ్నం రెండు గంటల వరకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా ఆస్పత్రికి నిత్యం 2,500 నుంచి 3000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, శుక్రవారం ఆ సంఖ్య రెట్టింపు అయిందని ఓ అధికారి చెప్పారు. అయినప్పటికీ నిర్ణీత సమయం వరకు క్యూ లైన్లలో ఉన్న వాళ్లందరికీ ఓపీ కార్డులను ఇవ్వడంతో పాటు అందరికీ వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. -
భారత్ రైస్ వచ్చేసింది..
కిలో బియ్యం రూ.29 ● 5, 10 కిలోల బ్యాగుల్లో లభ్యం సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ భారత్ బ్రాండ్ రైస్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చేసింది. కిలో బియ్యం రూ.29 చొప్పున నగరంలోని సుమారు 20 కేంద్రాల్లో పదిహేను రోజులుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే బియ్యం ధరలు 15 నుంచి 20 శాతం పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రెండు నెలల క్రితం సరసమైన ధరపై భారత్ బ్రాండ్ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నాఫెడ్ ద్వారా.. నగరంలో నాఫెడ్ ద్వారా సుమారు 20 ప్రైవేట్ కేంద్రాల్లో పక్షం రోజులుగా భారత్ రైస్ విక్రయాలు కొనసాగుతున్నాయి. 5, 10 కిలోల బ్యాగుల్లో బియ్యం అందుబాటులో ఉన్నాయి. విస్తృత ప్రచారం లేకపోవడంతో వీటి విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని నాఫెడ్ అధికారు ఒకరు చెప్పారు. ఒకసారి కొనుగోలు చేసిన వినియోగదారు రెండోసారి ఆసక్తి కనబర్చడం లేదని సమాచారం. బియ్యం ఎలాంటి నూకలు లేకుండా సన్నగానే కనిపిస్తున్నా.. వండిన తర్వాత పీడీఎస్ బియ్యం మాదిరిగా అన్నం దొడ్డుగా మారుతోందని వినియోగదారులు చెబుతున్నారు. -
ఉత్తుత్తి ఫిట్నెస్..
గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుందా? ● కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహదారి భద్రతా చట్టం వాహన కాలుష్యానికి, రహదారి భద్రతకు కారణమైన 15 ఏళ్లు దాటిన వాహనాలపై నిషేధం విధించింది. ఇలాంటి వాహనాలను రవాణా అధికారులు తుక్కుగా మార్చాలి. వాటి స్థానంలో కొనుగలు చేసే కొత్తవాటికి ఆటోమొబైల్ సంస్థలు రాయితీ ఇవ్వాలి. ఢిల్లీలో మాత్రమే ఇది అమలవుతోంది. అక్కడ 15 ఏళ్లు దాటిన వాహనాలను ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం హైదరాబాద్లోనూ ప్రభుత్వ వాహనాలకు దీన్ని అమలు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 15 ఏళ్లుదాటిన వాహనాలను రవాణాశాఖ ఇప్పటికే గుర్తించి చర్యలు చేపట్టింది. ● వ్యక్తిగత, కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ నిబంధన వర్తించకపోవడంతో సామర్థ్యం ఉన్నా.. లేకున్నా 15 ఏళ్లు దాటిన వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మోటారు వాహన నిబంధనల మేరకు 15 ఏళ్లుదాటిన వ్యక్తిగత వాహనాలకు గ్రీన్ట్యాక్స్. ఇన్స్యూరెన్స్ చెల్లిస్తే చాలు మరో 5 ఏళ్ల వరకు వాటిని నడిపేందుకు ఆర్టీఏ నుంచి అనుమతి లభిస్తుంది. దీంతో వాహన యజమానులు 20 ఏళ్లు దాటిన వాహనాలను కూడా వాటి సామర్థ్యంతో నిమిత్తం లేకుండా వినియోగిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వాహన కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలు ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. రవాణా శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా వాహనాలు రహదారులపై పరుగులు తీస్తుండగా.. వీటిలో 22 లక్షలకు పైగా పదిహేనేళ్ల కాల పరిమితి ముగిసిన వాహనాలే ఉన్నాయి. వీటితో కార్బన్ డయాకై ్సడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్స్, పీఎం వంటి కాలుష్య కారకాలు భారీగా వెలువడుతున్నాయి. నగరంలో తిరుగుతున్న ప్రతి నాలుగు వాహనాల్లో ఒకటి డొక్కు బండే కావడం గమనార్హం. ఇలా సామర్థ్యం లేని డొక్కు బండ్లతో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించడంలోనూ, వాటి కాలపరిమితిని నిర్ణయించడంలోనూ రవాణాశాఖ ఎలాంటి నిర్దిష్టమైన, శాసీ్త్రయమైన విధానాలను పాటింంచకపోవడంతో ఏటా డొక్కు బండ్ల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రమాద ఘంటికలు మోగిస్తోందని సామాజిక సంస్థలు, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహన కాలుష్య కారకాలతో జీవనశైలి వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. వ్యక్తిగత వాహనాలే టాప్.. ● నగరంలో 15 ఏళ్లు దాటిన వాటిలో వ్యక్తిగత వాహనాలే టాప్లో ఉన్నాయి. సుమారు 17 లక్షల బైక్లు, మరో 3.5 లక్షల కార్లు ఉన్నాయి. రవాణా వాహనాల్లో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు తదితర కేటగిరీలకు చెందిన డొక్కు బండ్లు ఎక్కువే ఉన్నాయి. సుమారు లక్షకు పైగా వస్తు రవాణా వాహనాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 10 వేలకు పైగా స్కూల్ బస్సులు నమోదై ఉండగా వాటిలో సుమారు 2.5 వేలు డొక్కు బస్సులే కావడం గమనార్హం. ● గ్రేటర్లో 1.4 లక్షల వరకు ఆటో రిక్షాలు నమోదై ఉండగా, వాటిలో 25 వేలకు పైగా డొక్కువే ఉన్నట్లు అంచనా. వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులు, 4 వేల మ్యాక్సీ క్యాబ్లు డొక్కువే. ఇటు వ్యక్తిగత వాహనాలు, అటు రవాణా వాహనాలు అన్నీ కలిపి 22 లక్షలకుపైగా ఉన్నాయి. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల్లో పీఎం స్థాయి 2.5 శాతం వరకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల కండీషన్ బాగా లేకపోవడం వల్ల, ఇంజన్ దెబ్బతినడం, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది డొక్కు వాహనాల కారణంగా సుమారు వెయ్యికి పైగా ప్రమాదాలు జరిగినట్లు రహదారి భద్రతపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రవాణా వాహనాలకు ఆర్టీఏ అధికారులు ఏటా సామర్థ్య పరీక్షలు చేసి ఉత్తుత్తి ఫిట్నెస్ సర్టిఫికెట్లతో సరిపెడుతున్నారు. సకాలంలో సర్వీసింగ్ చేయించకపోవడం, ఇంజిన్ ఓవర్హాలింగ్ చేయకపోవడంతోనూ వాహనాల కండిషన్ దెబ్బతింటుంది. ఇలాంటి వాహనాల్లో వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్లు విఫలమవుతున్నారు. ‘వాహనాల కాలపరిమితిపై కచ్చితమైన విధానాలు, ప్రమాణాలను పాటించకపోతే ఢిల్లీ తరహా ముప్పు మరెంతో దూరంలో లేదు’ అని ప్రముఖ సామాజికవేత్త నర్సింహారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
జల్దీ జర్నీ! సాఫీగా రైలు ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్ నుంచి కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు కాజీపేట్ నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలాలీ బైపాస్ వరకు కేవలం 85 నిమిషాల్లో చేరుకుంటాయి. కానీ.. అక్కడి నుంచి మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాచిగూడకు చేరుకొనేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. అంటే.. కాచిగూడ నుంచి మౌలాలీ వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. కానీ.. అక్కడి నుంచి మల్కాజిగిరి మీదుగా కాచిగూడకు వెళ్లేందుకే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో నగరానికి చేరుకున్నప్పటికీ ప్రయాణికులు కనీసం 50 నిమిషాలు అదనంగా ప్రయాణం చేయాల్సివస్తోంది. రైళ్ల రాకపోకల్లో ఈ జాప్యాన్ని నివారించేందుకు లాలాగూడ నుంచి సీతాఫల్మండి వరకు 4 కిలోమీటర్ల కార్డ్లైన్ నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే పనులు ప్రారంభించింది. ఈ కార్డ్లైన్ వల్ల మౌలాలీ నుంచి కాచిగూడకు చేరుకొనే సమయం గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. ప్రస్తుతం కాజీపేట నుంచి వచ్చే రైళ్లు మల్కాజిగిరి నుంచి సీతాఫల్మండి మీదుగా కాకుండా లాలాగూడ స్టేషన్ నుంచి ఎడమ వైపునకు మళ్లి నేరుగా సీతాఫల్మండి మీదుగా కాచిగూ డకు చేరుకుంటాయి. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఆర్యూబీ బ్లాక్... కార్డ్లైన్ నిర్మాణ పనుల కోసం ప్రస్తుతం ఆలుగడ్డ బావి వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించారు. రైల్నిలయం నుంచి తార్నాక వైపు వెళ్లే మార్గంలో ఆలుగడ్డబావి వద్ద ఉన్న ఆర్యూబీని బ్లాక్ చేశారు. ప్రస్తుతం ఈ ఆర్యూబీపైన కార్డ్లైన్ పనులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో పనులను పూర్తి చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న మూడు నెలల కాలంలో లాలాగూడ–సీతాఫల్మండి కార్డ్లైన్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇది పూర్తయితే కాజీపేట్, నిజామాబాద్ వైపు నుంచి కాచిగూడ మీదుగా వెళ్లే రైళ్లకు ఎంతో ఊరట లభించనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను కూడా కాచిగూడకు మళ్లించే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. కొత్త కార్డ్లైన్ వల్ల ప్రయాణ సమయం 30 నిమిషాలకు తగ్గనున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఎంతో ఊరట.. మల్కాజిగిరి నుంచి సీతాఫల్మండి వరకు చేపట్టిన డబ్లింగ్ పనుల్లో భాగంగానే లాలాగూడ– సీతాఫల్మండి మధ్య కార్డ్లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. ఇటీవలే మౌలాలీ బైపాస్–సనత్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య 29 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఆ రూట్లో ఎంఎంటీఎస్లు అందుబాటులోకి వచ్చాయి. కార్డ్లైన్ కూడా పూర్తయితే దూర ప్రాంతాల రైళ్లకు ఎంతో ప్రయోజనం. సికింద్రాబాద్పై ఒత్తిడి తగ్గుతుంది. – ఫణి, రైల్వేఫోరం సభ్యుడు -
రేపు సాలార్జంగ్ మ్యూజియంకు సెలవు
చార్మినార్: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14న సాలార్జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాలార్జంగ్ మ్యూజియం మూసి ఉంటున్నందున సందర్శకులు ఎవరూ రావద్దని కోరారు. 14న సితార్ ఫర్ మెంటల్ హెల్త్ టూర్ కచేరీ లక్డీకాపూల్ : నగరంలో సంగీత ప్రియులను అలరించేందుకు ఈ నెల14న సితార్ ఫర్ మెంటల్ హెల్త్ టూర్ను నిర్వహిస్తున్నట్లు సుప్రసిద్ధ సితార్ వాద్యకారుడు, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మానసిక ఆరోగ్య ప్రచారకర్త రిషబ్ రిఖిరామ్ శర్మ తెలిపారు. శుక్రవారం ఎర్రమంజిల్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్ఎస్బీఎస్ సహకారంతో నిర్వహించే ఈ కచేరీ అసాధారణమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్ టూర్ తన కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని రిషబ్ పేర్కొన్నారు. మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీ రోడ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఓయూకు సందర్శకుల సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 7 నుంచి ప్రారంభమైన వరుస సెలవులతో ఓయూకు సందర్శకుల తాకిడి పెరిగింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సందర్శకులతో యూనివర్సిటీ క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. స్టడీ టూర్లో భాగంగా యాదాద్రి– భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని నలంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఓయూ క్యాంపస్ను సందర్శించారు. ఆర్ట్స్ కాలేజీ, ఇటీవల నిర్మించిన 100 సంవత్సరాల పైలాన్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పైలాన్ వద్ద సెల్ఫీలు దిగుతూ విద్యార్థులు, అధ్యాపకులు ఎంతగానో ఆనందించారు. ఓయూ చరిత్ర విభాగం విద్యార్థి వలిగొండ నర్సింహ సందర్శకులకు గైడ్గా వ్యవహరిస్తూ ఆర్ట్స్ కాలేజీ విశిష్ట, పైలాన్ నిర్మాణం, ఇతర విషయాలను వివరించారు. -
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్కు నూతన కార్యవర్గం
సుల్తాన్బజార్: తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్కు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు రావడాన్ని స్వాగ తిస్తున్నామని టీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భాస్కర్ అన్నారు. శుక్రవారం రామ్కోఠిలోని వెస్లీ సెంటినరీ చర్చిలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ 4వ వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమంలో వివిధ జిల్లాల ప్రధాన చర్చిలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గం ఎన్నిక తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ చైర్మన్గా బిషప్ పద్మారావు, వైస్ చైర్మన్గా ఎంఏ డానియేల్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ టి.భాస్కర్, కోశాధికారిగా రాబర్ట్ సూర్యప్రకాష్లతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.భాస్కర్ మా ట్లాడుతూ టీసీసీ కేఎన్సీసీఐ గుర్తింపు రావడం తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రూబన్ మార్క్, ఫిలిప్రాజ్, జ్యోతి సుందర్, విజయ పద్మారావు, స్టీవెన్, జాన్ రవీందర్, తిమోతి, వివిధ జిల్లాలకు చెందిన చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చేతులు కలిసినా.. మనసులు కలిసేనా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు పెద్ద చిక్కొచ్చిపడింది. అధికారంలోకి రాగానే వలసలను ప్రోత్సహించడం పార్టీని నమ్ముకున్న కేడర్ను అసంతృప్తికి గురిచేసింది. కష్టకాలంలో వెన్నంటి నిలిచిన తమను కాదని ప్రత్యర్థి పార్టీల నాయకులను చేర్చుకోవడం వారిని నైరాశ్యంలోకి నెట్టింది. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఢీ అంటే ఢీ అని పోరాడిన తమను జంప్ జిలానీలతో కలిసి నడవాలని అధిష్టానం ఆదేశించడం అసమ్మతి రాజేసింది. ఇంకేముంది.. పాత, కొత్త నాయకుల మధ్య కొరవడిన సమన్వయం లోక్సభ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రేటర్పై ఘోర పరాభవం మూటగట్టుకున్న హస్తం పార్టీ.. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ఎన్నికల్లోపు బలపడాలని భావించింది. అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బడా నేతలపై వల విసిరింది. ఈ దిశగా చేరికల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇదే ఆ పార్టీకి తాజాగా కష్టాలను తెచ్చి పెడుతోంది. మల్కాజిగిరిలో తీవ్ర అసమ్మతి ► మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని కంటోన్మెంట్లోనూ అసమ్మతి రాజుకుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో దిగిన శ్రీగణేశ్ అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరడం టికెట్ దక్కించుకోవడం స్థానిక నేతలకు మింగుడుపడడంలేదు. 2018 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన గద్దర్ తనయ వెన్నెల వర్గం..తాజా పరిణామాలను జీర్ణించుకోలేకపోతోంది. ► ఎల్బీనగర్లో పార్టీ ఇప్పటికే మూడు గ్రూపులుగా విడిపోయింది. మల్రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్రెడ్డి, మధు యాష్కీ నియోజకవర్గ ఇన్చార్జిలుగా చెలామణి అవుతున్నారు. ఈ పరిణామాలే ఇటీవల ఎల్బీ నగర్ సీటు చేజారడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. కాగా.. పార్టీలో చేరిన కార్పొరేటర్ సుజాతా నాయక్, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, నాయకుడు నల్లా రఘుమారెడ్డి వ్యవహార శైలిపై పాత నేతలు పెదవి విరుస్తున్నారు. ► ఉప్పల్లోనూ పాత కొత్త నేతల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. నిజానికి మల్కాజిగిరి టికెట్ను మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ఆశించి హస్తం పార్టీలో చేరారు. తీరా ఆయనకు కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గం స్తబ్దుగా ఉండిపోయింది. ► కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీని వీడి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఆయన చేరికను సీనియర్ నేత కొలను హన్మంతరెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. ఇరువురు నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపనుంది. ► మల్కాజిగిరిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నీ తానై వ్యవహరిస్తున్నప్పటికీ.. లోక్సభ టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన కేడర్ నిరాశతో ఉంది. కూకట్పల్లిలో బండి రమేష్, సత్యం శ్రీరంగంల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ► మేడ్చల్లోనూ పాత, కొత్త నేతల మధ్య కొరవడిన సమన్వయం కూడా పార్టీకి నష్టం చేకూర్చనుందనే ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు మాజీ మంత్రి మల్లారెడ్డితో అంటకాగిన నాయకులకు తాజాగా పెద్దపీట వేయడంపై స్థానిక నాయకత్వంలో తీవ్ర అసమ్మతిని రాజేసింది. రంజిత్పై రుసరుసలు చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది .ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి వర్గం రంజిత్ ప్రచార కార్యక్రమాలకు దూరం పాటిస్తోంది. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. భీం భరత్, దర్శన్, వసంతం మూడు గ్రూపులుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల, జడ్పీ చైర్పర్సన్ అనిత వర్గంతో కలిసిపోవడానికి సీనియర్లు అంతగా ఆసక్తి చూపడంలేదు. రాజేంద్రనగర్లోనూ రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేందర్ను కాదని జ్ఞానేశ్వర్కు పెద్దపీట వేయడం పార్టీలో అసంతృప్తికి తావిచ్చింది. లష్కర్లోనూ సేమ్ సీన్ సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేసింది. దానం చేతిలో ఓడిపోయిన విజయారెడ్డి దానం చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు నగర అధ్యక్షుడు రోహిణ్రెడ్డి కూడా ఖైరతాబాద్ రాజకీయాల్లో తలదూర్చుతుండడం కూడా కాంగ్రెస్లో వివాదాలకు తెరలేపుతోంది. -
క్రీడలలో మహిళలను ప్రోత్సహించాలి
రాయదుర్గం: క్రీడలలో భద్రత ఇప్పటికీ ఒక సమస్యగా ఉందని మాజీ ఒలంపియన్, ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్లో చీఫ్ పార్టనర్షిప్ ఆఫీసర్ నేహా అగర్వాల్ శర్మ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా క్రీడలలో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. టీ హబ్ ప్రాంగణంలో శుక్రవారం యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(వైఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో ‘షట్టరింగ్ స్టీరియో టైప్స్–విమెన్ స్పోర్ట్స్, ఆన్స్క్రీన్, బియాండ్ ఎట్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నేహా అగర్వాల్ శర్మ మాట్లాడుతూ క్రీడల్లో ప్రస్తుతం భారతీయ మహిళలు బాగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. వరల్డ్ ట్రావెలర్ డాక్టర్ మారల్ యాజర్లు–ప్యాట్రిక్స్, సీజన్డ్ డెజర్ట్ మారథానర్ మిచెల్ కకడే, వైఎఫ్ఎల్ఓ అధ్యక్షురాలు రిధి జైన్ తదితరులు మాట్లాడారు. -
బకెట్లో పడి చిన్నారి మృతి
జీడిమెట్ల: బాత్రూంలో అడుకుంటున్న చిన్నారి నీటి బకెట్లో పడి మృతిచెందిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. చింతల్ అంబేడ్కర్ నగర్కు చెందిన సుధాకర్, బిందు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఆద్య(5), లిరి(1) ఉన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు చిన్నారులు బాత్రూంలో ఉండగా తల్లి బయట వాషింగ్మిషన్లో బట్టలు వేస్తుంది. కొద్ది నిమిషాల వ్యవధిలో పెద్దపాప ఆద్య బయటకు వచ్చి లిరి నీటి బకెట్లో పడిపోయిందని చెప్పింది. వెంటనే తల్లి బాత్రూంలోకి వెళ్లి చూడగా చిన్నారి లిరి బకెట్లో పడి ఉలుకూ పలుకు లేకుండా ఉంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెల్లగా చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు డ్యూటీ డాక్టర్ తెలిపారు. చిన్నారి తండ్రి సుధాకర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ మెడలోని గొలుసు స్నాచింగ్ ముసుగు ధరించి బైక్పై వచ్చిన దుండగులు బంజారాహిల్స్: కూతురిని స్కూల్లో దిగబెట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ..బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.11లో నివసించే బండి శ్రీవిద్య ఉదయం 7 గంటల ప్రాంతంలో తన కూతురిని స్కూల్కు తీసుకువెళ్లే క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–1/10 చౌరస్తాలో సిగ్నల్ వద్ద బస్సు కోసం ఆగింది. యూకో బ్యాంక్ వైపు వెళ్తుండగా ముసుగు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు నెంబర్ ప్లేట్ లేని బైక్పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల మంగళసూత్రాన్ని లాక్కొని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనలో ఆమెకు మెడపై స్వల్ప గాయాలు అయ్యాయి. యువకులు 20–25 ఏళ్ల వయస్సు మధ్య ఉంటారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్నాచర్ల కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. భార్యను కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు బంజారాహిల్స్: భార్యను కులం పేరుతో దూషించిన ఓ టీవీ చానల్ ఫ్రీలాన్స్ ఎడిటర్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..శ్రీనగర్కాలనీలోని శాలివాహననగర్లో నివసించే బ్యూటీషియన్ (40)కి ఓ టీవీ చానల్లో ఫ్రీలాన్స్ ఎడిటర్గా పనిచేస్తున్న సి.హెచ్.లక్ష్మణ్ (38)తో 2014లో కులాంతర వివాహం జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ఇద్దరూ కొన్నాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా కాపురం చేశారు. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. కొద్ది రోజుల తరువాత లక్ష్మణ్ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. కొట్టడం, తిట్టడం, ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం తదితర మానసిక క్షోభకు గురిచేశాడు. ఆమె భర్త వేధింపులు నుంచి ఎంత భరించినా ఫలితం లేకపోయింది. 2018 నుంచి ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమెను కులం పేరుతో దూషించసాగాడు. దీంతో భర్త వేధింపులు నుంచి రక్షించి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు లక్ష్మణ్పై ఐపీసీ సెక్షన్ 498ఏ, 323, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో ఎదుట సైకో వీరంగం బంజారాహిల్స్: మద్యం మత్తులో ఓ సైకో అన్నపూర్ణ స్టూడియో ముందు వీరంగం సృష్టించడమే కాకుండా అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ తలపై కర్రతో బాది హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్లో నివసించే అల్లూరు శ్రీకాంత్(30) విచ్చలవిడిగా మద్యం తాగుతూ దారినపోయే వారిని వేధిస్తూ స్నాచింగ్లకు పాల్పడుతూ కొంతకాలంగా స్థానికంగా న్యూసెన్స్కు పాల్పడుతున్నాడు. తండ్రి మాట కూడా లెక్కచేయకుండా రాత్రంతా వీధుల్లో తిరుగుతూ చిల్లర పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ అన్నపూర్ణ స్టూడియో గేటుపై బండరాళ్లు వేస్తూ వీరంగం సృష్టించాడు. అడగడానికి, అడ్డుకోవడానికి గేటు తీసి బయటకు వస్తున్న సెక్యూరిటీ గార్డు అనిల్కుమార్ను అకారణంగా తలపై కర్రతో బాదడంతో ఆయన తల పగిలి తీవ్ర రక్తస్రావం కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా రాళ్లతో దాడి చేస్తున్న శ్రీకాంత్ను అక్కడి సెక్యూరిటీ గార్డులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టు రట్టు
మైలార్దేవ్పల్లి: నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవ్పల్లి పోలీసులు రట్టు చేశారు. సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతానికి చెందిన గంగరాజు, అభినందన్లు సులభంగా డబ్బు సంపాదించేందుకు నకిలీ కరెన్సీ చెలామణి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ పవార్, సురేష్ పవార్ ఫేస్బుక్లో పోస్టు చేసిన నకిలీ కరెన్సీ వీడియోను చూసి వారిని సంప్రదించారు. 500 రూపాయల నోట్లను 1:5 నిష్పత్తిలో సరఫరా చేయడానికి ఒప్పుకున్నారు. అనంతరం వీరు మహారాష్ట్రలోని నందుబార్ ఛద్వేల్ గ్రామానికి వెళ్లి సచిన్ పవార్, సురేష్ పవార్లను కలుసుకొని నకిలీ నోట్లను మార్కెట్లో పరీక్షించడానికి పూనుకున్నారు. ఓ వ్యక్తికి 5 నోట్లను ఇచ్చి మార్కెట్కు పంపించారు. అవి సులభంగా మార్పిడి కావడంతో గంగరాజు రూ.3.5 లక్షలు పోగు చేసి మళ్లీ రూ.17 లక్షల నకిలీ నోట్లను తీసుకొన్నారు. ఇక్కడ చెకింగ్లు ఎక్కువగా ఉండడంతో బెంగళూరు వెళ్లి రవి అనే వ్యాపారికి నకిలీ నోట్లను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఒప్పందం కుదరక పోవడంతో హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లోని లాడ్జిలో బస చేశాడు. మల్కాజిగిరిలోని సాయిరాం థియేటర్ సమీపంలో సురేష్ అనే వ్యక్తి వద్ద ఒక బైక్ అద్దెకు తీసుకున్నారు. దానిపై నకిలీ నోట్లను విక్రయించడానికి మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్కు చేరుకున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసుల బృందం వారిని అదుపులోకి తీసుకొని రూ.6.65 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.6.65 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం ఇద్దరి అరెస్టు -
‘నవమి’ శోభాయాత్రకు సహకరించాలి
అబిడ్స్: శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా నిర్వాహకులు, స్థానిక భక్తులు పూర్తి సహకారం అందించాలని నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీతారామ్బాగ్ ద్రౌపది గార్డెన్లో ఈ నెల 17వ తేదీన జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..శ్రీరామనవమి కల్యాణం ఉదయం 10 గంటల వరకు పూర్తిచేసి..శోభాయాత్రను ప్రారంభిస్తే త్వరగా పూర్తిచేయగలుగుతామన్నారు. శోభాయాత్ర రాత్రి వేళ ఆలస్యం కాకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తారన్నారు. శోభాయాత్రలో రాజకీయ చిహ్నాలు, రాజకీయ ప్రసంగాలు ఉండకుండా చూసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని చెప్పారు. టపాసులు కాల్చడం కానీ, కర్రలు, మారణాయుధాలు వెంట తెచ్చుకోవడం నిషేధమన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ తరపున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. శోభాయాత్ర మార్గం పర్యవేక్షణ శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే రూట్ను సీపీ శ్రీనివాస్రెడ్డి, అదనపు కమిషనర్ విక్రమ్ మాన్సింగ్, వి.సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవరాల్, డీసీపీలు ఉదయ్కుమార్రెడ్డి, రావుల గిరిధర్, ఏసీపీలు వెంకట్రెడ్డి, శంకర్, ఇన్స్పెక్టర్లు మహేష్ గౌడ్, లింగేశ్వర్రావు, బాలు చౌహాన్, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి నాయకులు డాక్టర్ భగవంతరావు, గోవింద్రాఠి, ఆనంద్సింగ్, కృష్ణ తదితరులు పర్యవేక్షించారు. సీతారామ్బాగ్ నుంచి పురానాపూల్ మీదుగా బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, గౌలిగూడ, చివరగా ముగిసే హనుమాన్ టేక్డీ వ్యాయామశాల వరకు పర్యవేక్షించారు. నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి -
గూగుల్ రివ్యూల పేరుతో ఐటీ ఉద్యోగినికి టోకరా
హిమాయత్నగర్: పార్ట్ టైం జాబ్గా గూగుల్ రివ్యూలు ఇస్తూ డబ్బు సంపాదించవచ్చని ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం..నగరానికి చెందిన ఐటీ ఉద్యోగినికి వాట్సాప్లో పార్ట్టైమ్ జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. అందులో పలు యాప్లకు (అప్లికేషన్) గూగుల్ రివ్యూలను ఇవ్వడానికి బాధితురాకి నేరగాళ్లు టాస్క్లు ఇచ్చారు. ఈ టాస్కులు పూర్తి చేస్తే ఒక్కో టాస్క్కు రూ.300 చెల్లిస్తామన్నారు. తనకు 21 టాస్క్ల డబ్బు డిపాజిట్ చేయడానికి బాధితురాలి బ్యాంక్, యూపీఐ వివరాలను అడిగారు. బాధితురాలిని నమ్మించడానికి ఆమె అకౌంట్కు కొంత డబ్బును పంపించారు. అనంతరం బాధితురాలిని పెట్టుబడులు పెట్టాలన్నారు. వారు చెప్పిన విధంగా మొదట కొంతమొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. అనంతరం తప్పుగా పెట్టుబడి పెట్టారని, దీంతో అకౌంట్ స్తంభించిపోయిందని, దాన్ని డీఫ్రీజ్ చేయడానికి మళ్లీ డబ్బు చెల్లించాలన్నారు. ఈ విధంగా బాధితురాలి వద్ద నుంచి మొత్తం రూ.3,57,335 సైబర్ కేటుగాళ్లు కాజేశారు. దీంతో బాధిరాలు నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆధార్ మొబైల్కు లింక్ చేయాలంటూ... మరో కేసులో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేసి తమ ఆధార్ కార్డ్ మొబైల్కు లింక్ అవ్వలేదని, వెంటనే లింక్ చేయాలని ఆమె ఫోన్కు ఓ లింక్ పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే బాధితురాలి ఫోన్ హ్యాంగ్ అయింది. దీంతో ఆమె తన భర్త ఫోన్ నుండి వారికి మళ్లీ కాల్ చేసి తన మొబైల్ హ్యాంగ్ అయిందని తెలిపింది. దీంతో కేటుగాళ్లు తన సిమ్ బ్లాక్ అయిందని చెప్పి, తన భర్త నంబర్కు ఓటీపీ వచ్చిందని అది చెప్పమన్నారు. ఓటీపీ చెప్పడంతో బాధితురాలి అకౌంట్తో పాటు ఆమె భర్త అకౌంట్ నుంచి రూ.1.28 లక్షలు డెబిట్ అయ్యాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. -
క్రికెట్తోపాటు ఇతర క్రీడలనూ ప్రోత్సహించాలి
బంజారాహిల్స్: మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ, ఆర్థిక తోడ్పాటు ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకరమని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీ సీవీ ఆనంద్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సీబీ రాజు మెమోరియల్ పురుషుల విభాగం టెన్నిస్ టోర్నమెంట్ బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ చాలా మంది టెన్నిస్, ఇతర క్రీడల్లో ఆర్థిక స్థోమత లేక రాణించలేకపోతున్నారని, దురదృష్టవశాత్తు చాలా మంది స్పాన్సర్లు క్రికెట్ క్రీడకు స్పందించినట్లు ఇతర క్రీడలకు స్పందించడం లేదని ఆయన అన్నారు. ఫుట్బాల్, టెన్నిస్ ఇలా పలు రకాల క్రీడలను, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన ఎఫ్ఎన్సీసీ నిర్వాహకులతో పాటు దాతలను ఆయన అభినందించారు. క్రీడాకారులకు ఆర్థిక భరోసా లేకపోతే చాలా క్రీడలు మరుగునపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్లో మరిన్ని పెద్ద టోర్నమెంట్లు నిర్వహంచాలని ఆయన కోరారు. అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లేందుకు డబ్బులు లేక కూడా చాలా మంది క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారని, దీని వల్ల విలువైన క్రీడాకారులు దేశానికి దూరమవుతున్నారని అన్నారు. వారం రోజుల పాటు జరిగిన టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్గా ఢిల్లీకి చెందిన రిక్కీ చౌదరి, ఒడిషాకు చెందిన కబీర్ హన్స్ విన్నర్గా గెలుపొందగా, సింగిల్స్ విభాగంలో రన్నరప్గా జె. విష్ణువర్ధన్, విన్నర్గా గుజరాత్కు చెందిన దేవ్ జాబియా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, స్పోర్స్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరినాథ్, సెక్రటరి ముళ్లపూడి మోహన్, మాజీ అధ్యక్షుడు కేఎల్.నారాయణ, కాజా సూర్యనారాయణ, స్పాన్సర్లు సువెన్ లైఫ్ సైన్సెస్, హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ -
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
ముషీరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వందలాది మంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యానగర్ బీసీ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్–1 సర్వీస్ కింద 503 పోస్టులు ప్రకటించాలని, కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600 పోస్టులు ఉన్నాయన్నారు. గ్రూప్–2 సర్వీస్ కింద 783 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారని కానీ వీటిని కూడా కరెక్టుగా లెక్కిస్తే 2200 లకుపైగా ఉన్నాయన్నారు. గ్రూప్ 3 పోస్టులు 1383 వాస్తవంగా 3 వేలకు పైగా ఉన్నాయన్నారు. గ్రూప్ 4 సర్వీస్ కోటా కింద 8500 పోస్టులు ప్రకటించారని ఇవి 25 వేలకు పైగా ఉన్నాయన్నారు. టీచర్ పోస్టులు 11 వేల ప్రకటిస్తే పీఆర్సీ రిపోర్టు ప్రకారం 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటన్నిటి శాసీ్త్రయంగా లెక్కించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ, విద్యార్థి నేతలు వేముల రామకృష్ణ, సి.రాజేందర్, మధుసూదన్, అనంతయ్య, నందగోపాల్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్లో డబుల్ కరెంట్ వాడకం.. మున్ముందు మరింత పెరిగే అవకాశం
నోముల శ్రీశైలం ●ఏసీలో కూర్చొంటే ఎవరికై నా వణుకు పుట్టాలి కానీ.. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం చూస్తే విద్యుత్ ఇంజినీర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో రికార్డు అవుతోంది. ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 55 ఎంయూలు(మిలియన్ యూనిట్లు) ఉండగా, మార్చి నాటికి 75 ఎంయూలు దాటింది. ఏప్రిల్లో 82 నుంచి 84 ఎంయూలు నమోదవుతున్నాయి. మే నాటికి 90 ఎంయూలకు చేరే అవకాశం ఉంది. ఒత్తిడిని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ.. మెజార్టీ సెక్షన్ల పరిధిలో ఇప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. రోజు రోజుకూ పుట్టుకొస్తున్న కొత్త కనెక్షన్లకు తోడు విద్యుత్ గృహోపకరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించిన ఏసీలు, గీజర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు.. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్ స్థాయికి చేరుకుంది. తలసరిలోనూ టాప్ ● 2006లో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా..1,538 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యేది. ఇక 2014 నాటికి వీటి సంఖ్య 38 లక్షలకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో 2200 మెగావాట్లకు చేరింది. ● 2019 నాటికి 50 లక్షలకు చేరగా, డిమాండ్ 3250 మెగావాట్లకు చేరింది. తాజాగా 3819 మెగావాట్లకు చేరుకోవడం గమనార్హం. 2021లో 53,95,903 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 61 లక్షలు దాటింది. ఏటా పెరుగుతున్న కనెక్షన్లతో పాటు డిమాండ్ కూడా భారీగా నమోదవుతోంది. ● పారిశ్రామిక వినియోగంతో పోలిస్తే గృహ వినియోగమే రెట్టింపైంది. అంతేకాదు 2014లో వేసవి పీక్ డిమాండ్ 2261 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 3819 మెగా వాట్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు.. సగటు కరెంట్ వినియోగంలోనూ భారీ తేడాలు నమోదవుతుండటం గమనార్హం. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2261 యూనిట్లకు చేరింది. -
డిమాండ్ పెరిగింది
ఏసీలు..గీజర్లు..ఓవెన్లు..వాషింగ్ మిషన్లు..రిఫ్రిజిరేటర్లు..ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. దీంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగంతో పాటు గృహ విద్యుత్ వినియోగం కూడా రెట్టింపైంది. కోర్సిటీతో పోలిస్తే.. రంగారెడ్డి జోన్ పరిధిలోని సైబర్సిటీ, సరూర్నగర్, రాజేంద్ర నగర్, మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనే డిమాండ్ పీక్ స్టేజికి చేరుకుంటోంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లలోని పీటీఆర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచుతున్నాం. అంతరాయాలకు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. – పి.ఆనంద్, సీజీఎం, రంగారెడ్డి జోన్ గ్రేటర్లో విద్యుత్ వినియోగం అలా... అంశం 2014 2024 తలసరి వినియోగం 1356 యూనిట్లు 2261 యూనిట్లు విద్యుత్ కనెక్షన్లు 38,16,211 61,40,795 400 కేవీ సబ్స్టేషన్లు 02 04 220కేవీ సబ్స్టేషన్లు 10 22 33/11కేవీ సబ్స్టేషన్లు 337480 డీటీఆర్లు 84,491 1,47,192 సర్కిళ్లు 6 9 డిమాండ్ (మెగావాట్లలో)విద్యుత్ కనెక్షన్లు ఇలా 2021 2022 2023 గృహ 44,26,472 46,28,067 50,99,190వాణిజ్య 7,31,441 7,61,938 8,22,821 పారిశ్రామిక 35,283 35,419 36,440 ఇతర కనెక్షన్లు 2,02,707 2,11,020 1,82,344 మొత్తం 53,95,903 56,36,444 61,40,795