![ఆర్ట్స్ కాలేజీ వద్ద సందర్శకులు - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/13/12sec104-160061_mr_0.jpg.webp?itok=GEMttFG5)
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 7 నుంచి ప్రారంభమైన వరుస సెలవులతో ఓయూకు సందర్శకుల తాకిడి పెరిగింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సందర్శకులతో యూనివర్సిటీ క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. స్టడీ టూర్లో భాగంగా యాదాద్రి– భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని నలంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఓయూ క్యాంపస్ను సందర్శించారు. ఆర్ట్స్ కాలేజీ, ఇటీవల నిర్మించిన 100 సంవత్సరాల పైలాన్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పైలాన్ వద్ద సెల్ఫీలు దిగుతూ విద్యార్థులు, అధ్యాపకులు ఎంతగానో ఆనందించారు. ఓయూ చరిత్ర విభాగం విద్యార్థి వలిగొండ నర్సింహ సందర్శకులకు గైడ్గా వ్యవహరిస్తూ ఆర్ట్స్ కాలేజీ విశిష్ట, పైలాన్ నిర్మాణం, ఇతర విషయాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment