-
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నెంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్రన్ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్లోనూ... కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
హోదా ఉన్నా.. నిఘా సున్నా!
టాస్క్ఫోర్స్ కార్యాలయంసాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. కస్టోడియల్ మరణాలకు చెక్ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్, సైబర్ క్రైమ్ పీఎస్ల్లోనూ ఇవి ఉన్నాయి. 28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్ హోదా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అధీనంలో పని చేసే కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్ మాదిరిగా కేవలం ఆపరేషనల్ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు సైతం పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయాలు (సికింద్రాబాద్లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.హైదరాబాద్ టాస్క్ఫోర్స్కు పోలీసుస్టేషన్ హోదా 1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి.. టాస్క్ఫోర్స్ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్ఫోర్స్ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్ఫోర్స్ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది. -
షకీల్ ఆరోపణలు అవాస్తవం
● నగర కొత్వాల్ శ్రీనివాసరెడ్డి వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బుధవారం విడుదల చేసిన వీడియోలో పోలీసులపై చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం అని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని అంశాలు ఇలా ఉన్నాయి. ‘2023 డిసెంబర్ చివరి వారంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తులో అప్పటి పంజాగుట్ట పీఎస్ ఇనన్స్పెక్టర్ అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది. నిందితులతో కుమ్మకై ్క క్రైమ్ వాహనం అసలు డ్రైవర్ను రక్షించడానికి దర్యాప్తు రికార్డులు తారుమారు చేసినట్లు తేలింది. ఆ కేసులో సాక్ష్యాధారాల ఆధారంగా షకీల్ కుమారుడు రహీల్ అమీర్ కారును నడుపుతున్నాడని, నేరం చేసి, పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని, నేరం జరిగిన కొన్ని గంటల్లోనే దుబాయికి పరార్ అయినట్లు తెలిసింది. ఈ కేసులో షకీల్ కూడా దర్యాప్తును తారుమారు చేసి తన కొడుకును రక్షించుకోవడానికి పోలీసు అధికారులను ప్రభావితం చేసినట్లు కూడా వెల్లడైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే 2022లో జూబ్లీహిల్స్లో నమోదైన ఘోర రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తులోనూ ఇలాంటి అవకతవకలు జరిగాయని సమాచారం అందింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒక వ్యక్తి లొంగిపోయాడని, పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడని అప్పటి దర్యాప్తు అధికారి చార్జిషీటు దాఖలు చేశారు. ఆ కేసు కోర్టు విచారణలో ఉంది. ఇంతకుముందు జరిపిన దర్యాప్తులో, అనేక వాస్తవాలు, పరిస్థితులను మరుగుపచినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఆ కేసును సంబంధిత న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన తర్వాత చట్ట ప్రకారం తదుపరి దర్యాప్తు జరుగుతోంది. చట్ట ప్రకారం జరుగుతున్న తదుపరి విచారణలో కారు అసలు డ్రైవర్ గతంలో అభియోగాలు మోపిన వ్యక్తి కాదని, మరో వ్యక్తి అని సంఘటన జరిగిన మరుసటి రోజునే అతను విదేశాలకు వెళ్లాడనే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈలోగా పంజాగుట్ట కేసులో ప్రధాన నిందితుడైన రహీల్ అమీర్ను అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదనుగుణంగా మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. ఈలోగా బుధవారం రహీల్ తండ్రి ఎండీ షకీల్ తను విడుదల చేసిన ఒక వీడియోలో దర్యాప్తు పోలీసు అధికారులపై కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలో చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేసి పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులపై నిరాధారమైన, ఊహాజనిత ఆరోపణలు ఆపాదించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు గమనించడమైనది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధం. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. దర్యాప్తు పురోగతిలో ఉంది. నేరానికి పాల్పడిన వ్యక్తులందరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దురుద్దేశంతో దర్యాప్తును వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కూడా తగిన చట్టపరమైన చర్యలు పోలీసు శాఖ తీసుకుంటుంది’ అని నగర కొత్వాల్ పేర్కొన్నారు. -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
రూ.70 లక్షల విలువైన నగలు మాయం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త డీవీఎస్ సోమరాజు నివాసంలో భారీ చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–62లోని ప్లాట్నెంబర్ 1242 (బి)లో సోమరాజుతో పాటు ఆయన తల్లిదండ్రులు శివరామరాజు, అన్నపూర్ణ, భార్య పద్మసూర్య కుమారి, కుమారులు యశ్వంత్ వర్మ, శివ మితీష్వర్మ ఉంటున్నారు. ఈ నెల 4న వీరంతా ఓ వివాహానికి హాజరై సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆభరణాలను బెడ్రూంలోని అల్మరాలో భద్రపరిచారు. ఈ నెల 15న రాత్రి మరో శుభకార్యానికి వెళ్లే క్రమంలో ఆభరణాలు కోసం చూడగా అల్మరాలో కనిపించలేదు. ఇందులో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్తో పాటు బంగారు గాజులు, చంద్రహారం, డైమండ్ నెక్లెస్, మరో మూడు గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.70 లక్షలు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో నలుగురు పని మనుషులు ఉంటారని, ఇందులో ఇద్దరు బయటి నుంచి వస్తారని, మరో ఇద్దరు సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపైనే అనుమానం ఉందన్నారు. చోరీకి గురైన ఆభరణాల పక్కనే ఉన్న రూ.40 లక్షల విలువ చేసే నగలు భద్రంగానే ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య జీడిమెట్ల: కుటుంబ కలహాల కారణంగా ఎస్పీఓ పోలీస్ డ్రైవర్ ఉరి వేసుకుని మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వరనగర్లో ఉండే గుంటి శ్రీనివాస్ ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్లో ఎస్పీఓ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్కు భార్య భార్గవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన రాత్రి శ్రీనివాస్ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం 17వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలను బెడ్రూంలోకి పంపించి బయట నుంచి గడియపెట్టాడు. అనంతరం బయట గదిలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్గవి తలుపులు తీయాలని ఎంత పిలిచినా పలకలేదు. కిటికీలోంచి చూడగా శ్రీనివాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో భార్గవి పక్కింటి వారికి ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తీయగా శ్రీనివాస్ అప్పటికే మృతిచెంది ఉన్నాడు. భార్గవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంపాపేట్లో లారీ బీభత్సం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంతోష్నగర్: చంపాపేట్ ప్రధాన రహదారిపై లారీ బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్ను ఢీకొట్టి రెండు కిలో మీటర్ల మేర నెట్టుకుంటూ వెళ్లింది. అనంతరం మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ద్విచక్ర వాహనదారు ఫిర్యాదు మేరకు ఐ.ఎస్.సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని లారీని సీజ్ చేశారు. డ్రైవర్ను రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈదిబజార్కు చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ మాజీద్ (60) ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి తన హోండా ట్విస్టర్ ద్విచక్ర వాహనంపై చంపాపేట్ లక్ష్మీ గార్డెన్ దగ్గర వెళుతుండగా వెనుక నుంచి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టడంతో అతను రహదారికి ఎడమవైపు పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ అతని ద్విచక్ర వాహనాన్ని లారీ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. చంపాపేట్ టి–జంక్షన్ వద్ద అదే లారీ మరో కారును కూడా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐ.ఎస్.సదన్ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీని సీజ్ చేసి డ్రైవర్ను రిమాండ్కు తరలించారు. మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు సాక్షి, సిటీబ్యూరో: తమిళనాడు రాజధాని చైన్నె పల్లవరం ప్రాంతానికి చెందిన యువకుడు (35) స్కిజోఫేనియా అనే మానసిక వ్యాధి ప్రభావంతో 2020లో కుటుంబానికి దూరమయ్యాడు. ఎలా వచ్చాడో ఏమో కానీ అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో సంచరిస్తూ రోడ్లపై జీవించాడు. అతడిని చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చలించిన మదర్ థెరిస్సా చారిటీ సంస్థకు సమాచారం ఇచ్చారు. అతడికి అక్కున చేర్చుకున్న ఆ సంస్థ ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ అనిత రాయిరాల సహకారంతో వైద్యం చేయించారు. ఎట్టకేలకు కోలుకున్న ఆ యువకుడు తన వివరాలు చెప్పడంతో అతికష్టమ్మీద కుటుంబీకుల వివరాలు సేకరించి సమాచారం ఇచ్చారు. బుధవారం సికింద్రాబాద్లోని చారిటీ కార్యాలయానికి రప్పించి యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. చారిటీ కార్యాలయంలో కోలుకున్న స్థితిలో ఉన్న తమ కుమారుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ఆ కార్పొరేటర్ ఆచూకీ దొరికేనా? నాగోలు: కార్పొరేటర్, ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలవర్ధన్ కేసులో నిందితులను నాగోలు పోలీస్లు గతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఏ3గా ఉన్న గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డిపై కేసు నమోదయినప్పటినుంచి పరారీలో ఉన్నాడు. ఈ నెల 1 వ తేదీ నుంచి కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో నాగోలు పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు పై స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చారు. నాగోలు పోలీసులుతో పాటు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను, ఇతర స్నేహితుల ద్వారా కార్పొరేటర్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5.41 లక్షల ఓట్ల తొలగింపా? సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితాల నుంచి సుమారు 5.41 లక్షల ఓటర్లను తొలగించామని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు. నకిలీ చిరునామాలతో ఉన్నవారు, చనిపోయిన వారు, డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగించి ప్రక్షాళన చేస్తే మంచిదే. కానీ ప్రక్షాళన సాకుతో జాబితాలో అసలు ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జాబితాలో తమ పేరు పరిశీలించుకోని లేకుంటే ఎన్నికలకు ముందు నమోదు చేసుకునే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. ఎన్నికల రోజున ఎదురయ్యే గందరగోళానికి ఎన్నికల సంఘం బాధ్యత వహించాలన్నారు. ఓయూలో టెక్నోస్మానియా సందడి ఉస్మానియా యూనివర్సిటీ: టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో టెక్నోస్మానియా–2024 జాతీయ స్థాయి టెక్నోకల్చరల్ ఫెస్ట్తో ఓయూ క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం వర్సిటీ ప్రవేశ ద్వారం ఎన్సీసీ గేటు వద్ద ‘నీటి చుక్కను పొదుపుగా వాడదాం.. ప్రొటెక్ట్ ఎర్త్స్ ప్రిషియస్ వాటర్’ నినాదంతో ఏర్పాటు చేసిన 3కే రన్ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు, టెక్నోస్మానియా కన్వీనర్ ప్రొ.శ్రీనునాయక్ జెండా ఊపి ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన జూక్ బాక్స్ మ్యూజిక్కు ఒకేసారి వందలాది మంది విద్యార్థులు సామూహిక నృతంతో అలరించారు. అనంతరం కాలేజీ ఎదుట విద్యార్థులు చేసిన బైక్ స్టంట్ అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.రమేష్కుమార్, ప్రొ.వీవీ బసవరావు, ప్రొ.రాజం, కోర్డినేటర్ డా.పరశురామ్, డా.సాదం ఐలయ్య, డా.వి భాస్కర్, డా.శ్రీనివాసులు, స్టూడెంట్స్ కోఆర్డినేటర్లు శ్యామ్ సుందర్, మాధవి, ఆకాష్, అఖిల, ముఖేష్, పాహిత్య, సూరిదుర్గ, అరవింద్ పాల్గొన్నారు. రోగాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించాలి డాక్టర్ నాగేశ్వర్రెడ్డి శంషాబాబాద్: ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షల ద్వారా ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే సరైన చికిత్సతో మేలు జరుగుతుందని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సీఐఎస్ఎఫ్ డీజీపీ శ్యామల ఆధ్వర్యంలో సుమారు 200 మంది సీఐఎస్ఎఫ్ ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంతో వైద్యపరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీర్ణ సంబంధిత వ్యాధులను ఎలా గుర్తించాలనే విషయాలను వివరించారు. జీవనశైలితో వచ్చే కాలెయ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే మంచి చికిత్స అందుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు పాల్గొన్నారు. శోభాయాత్రలో జేబు దొంగల చేతివాటం ● పలువురి భక్తుల సెల్ఫోన్లు, బంగారు నగలు దొంగతనం ● మంగళ్హాట్ పోలీస్స్టేషన్లో దాదాపు 30 ఫిర్యాదులు అబిడ్స్: శ్రీరామ నవమి శోభాయాత్రలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తులు భజనలు, భక్తిగీతాలు, నృత్యాలు చేస్తుంటే దొంగలు తమ పని తాము చేసుకున్నారు. ధూల్పేట్ నుంచి పురానాపూల్ వరకు ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో జేబుదొంగలు పెద్ద ఎత్తున సెల్ఫోన్లు, బంగారు చైన్లు కొట్టివేశారు. కొద్దిసేపటి తర్వాత భక్తులు చూసుకుని లబోదిబోమంటూ మంగళ్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురానాపూల్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్రలో నృత్యాలు చేస్తుండగా ఓ భక్తుడి గొలుసును దొంగిలిస్తుండగా రెడ్హ్యాండ్గా పట్టుకుని అతడిని చితకబాదారు. వెంటనే మంగళ్హాట్ పోలీసులకు అప్పగించారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తన ఫోన్ పోయిందంటూ, బంగారు గొలుసు పోయిందంటూ దాదాపు 30 మంది మంగళ్హాట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళ్హాట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి కేసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రాళ్ల దాడులతో వ్యాపారుల బెంబేలు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని బిర్లా గ్రూప్ ఫ్యాషన్ లిమిటెడ్ వ్యాన్ హుజన్ బట్టల షోరూం గ్లాస్ అద్దాలు ధ్వంసం చేసిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... వ్యాన్ హుజన్ షోరూంలో గత నెల 20న, 21న రాత్రి 7.45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై నుంచి అద్దాలపై రాళ్లతో దాడి చేయడంతో పెద్ద సౌండ్తో విరిగిపడ్డాయని, కస్టమర్లకు ప్రమాదం తప్పిందని షోరూం స్టోర్ మేనేజర్ కె.మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అద్దాలు ఎవరిౖపైనెనా పడి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ షోరూం పక్కనే ఉన్న అండర్ అర్మర్ షోరూం అద్దాలు కూడా రాళ్లతో విసిరి ధ్వంసం చేశారంటూ స్టోర్ మేనేజర్ మహ్మద్ అబ్రార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఆర్కే సినీ ఫ్లెక్స్ పీవీఆర్ మాల్ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి ధ్వంసం చేశారంటూ జనరల్ మేనేజర్ సర్వేశ్వర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే రోడ్డులో ఉన్న ఏఎంపీఎం స్టోర్ అద్దాలపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయని, పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించిందంటూ స్టోర్ మేనేజర్ షేక్ మహ్మద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాళ్లు విసిరిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా షోరూంల నిర్వాహకులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లో వరుస ఘటనలతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. రాళ్లు విసురుతున్న వారిని గుర్తించే పనిలో పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 308 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లో షోరూంలపై రాళ్లతో దాడులు అద్దాలను ధ్వంసం చేస్తున్న దుండగులు పెద్ద ఎత్తున ఆస్తినష్టం నిందితుల కోసం గాలింపు -
పాకిస్థాన్లోనూ హిందూ జెండా ఎగరవేస్తాం
ఎమ్మెల్యే రాజాసింగ్ అబిడ్స్: భవిష్యత్తులో పాకిస్థాన్లోనూ హిందూ జెండాను ఎగరవేస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అఖండ భారత్ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతామన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే రాజాసింగ్ విశాల్ శోభాయాత్ర నిర్వహించారు. బేగంబజార్, ఛత్రి చౌరస్తాల్లో అడ్డ యాదవ్ ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ.. మొగలులు దేశంలోని 40 వేల మందిరాలను కూల్చివేశారని, తాము కేవలం మూడు మందిరాలను మాత్రమే ఇవ్వాలని చట్టప్రకారం కోరుతున్నామన్నారు. ఎప్పటికీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగదని, ఊహించుకున్న వారిని అయోధ్య రామ మందిర నిర్మాణం, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వారికి చెంపపెట్టు అన్నారు. 2027 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్తులో పాకిస్థాన్లో కూడా హిందూవుల జెండాను ఎగరవేస్తామన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ పాటతో అందరిని ఆకట్టుకున్నారు. -
రౌడీ షీటర్ల బైండోవర్
సాక్షి, సిటీబ్యూరో: గత ఎన్నికల సమయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లతో పాటు సస్పెక్ట్, హిస్టరీ షీట్లు ఉన్న వారిని ముందస్తుగానే బైండోవర్ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అధికారులను ఆదేశించారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో విధిగా పర్యటిస్తూ నిఘా పెట్టాలని సూచించారు. త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. అక్రమం డబ్బు, మద్యం తరలింపు, ఉచితాలపై నిఘా పెట్టాలని, అవసరమైన చోట మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. సమావేశంలో జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవీస్, డీసీపీలు జీ వినీత్, నితికా పంత్, నారాయణరెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, కే ప్రసాద్, సృజన కర్ణం, నర్సింహా కొత్తపల్లి, సాయిశ్రీ, డీవీ శ్రీనివాసరావు, డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ● అధికారులకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు -
వెళ్లగొట్టుడే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసులు నిర్ణయించారు. వీరు చిక్కినప్పుడు అరెస్టు చేస్తే వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) విధానానికి శ్రీకారం చుట్టారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో మొరాకో జాతీయుడిపై ఈ తరహా అనుమతి పొందారు. అతగాడిని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి స్వదేశానికి పంపినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాల్ మంగళవారం పేర్కొన్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఇన్స్పెక్టర్లు కే శ్రీనివాస్, జీఎస్ డానియేల్లతో కలిసి బషీర్బాగ్లోని పాత కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. అరెస్టు చేస్తే నేరాలకు ఊతమే... నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు, మొరాకో తదితర దేశాల నుంచి అనేకమంది వివిధ రకాల వీసాలపై హైదరాబాద్కు వస్తున్నారు. వీరిలో కొందరు వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవారు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. అలాగే బెయిల్పై బయటకు వస్తున్న ఈ విదేశీయులు జైల్లో ఏర్పడిన పరిచయాలతో సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేపట్టడంతో కొత్త తల నొప్పులు వచ్చేవి. ఇలాంటి వారిలో కొందరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఉన్న కొంతమంది యువతులతో సహజీవనం చేస్తూ వారి ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డులు పొందడం చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక వ్యక్తులైన వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఈ పరిణామాలను గమనించిన నగర పోలీసులు డిపోర్టేషన్కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హెచ్–న్యూ అధికారులు డ్రగ్స్ ఆచూకీ కోసం అనుమానిత విదేశీయులపై నిఘా ముమ్మరం చేశారు. ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో డిపోర్టేషన్... హెచ్–న్యూ అధికారులతో కూడిన బృందాలు రెండు వారాల క్రితం పంజగుట్టలో సోదాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అక్రమంగా నివసిస్తున్న మొరాకో దేశస్తుడు అచిబిలీ అమేనీ చిక్కాడు. 2018లో మూడేళ్ల కాలపరిమితి ఉన్న స్టడీ వీసాపై వచ్చిన ఇతడు ఇక్కడే అక్రమంగా ఉండిపోయాడు. మాదకద్రవ్యాలకు అలవాటుపడి పెడ్లర్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడి వివరాలు ఎఫ్ఆర్ఆర్ఓకు పంపి మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ పొందిన అధికారులు సీసీఎస్లోని డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఆ దేశ ఎంబసీకి సమాచారం ఇచ్చి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందారు. ఇతడికి విమాన టికెట్ ఖరీదు చేసిన సిటీ పోలీసులు సెక్యూరిటీ క్లియరెన్స్, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్నారు. వీటి ఆధారంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిపోర్ట్ చేశారు. ‘సరుకు’తో చిక్కితే కటకటాలే... అక్రమంగా నిసిస్తున్నా, సక్రమంగా ఉంటున్నా మాదకద్రవ్యాలతో చిక్కితే మాత్రం అరెస్టు చేయాలని అధికారులు నిర్ణయించారు. అచిబిలీ అమేనీతో పాటు హెచ్–న్యూ అధికారులకు పాలస్తీనా దేశీయుడు సయీద్ అలీ మహ్మద్ అల్ ఖఫ్రీతో పాటు గోవాకు చెందిన రోమై భరత్ కళ్యాణి చిక్కారు. కళ్యాణిపై గతంలో ముంబై, గోవాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీరిని తనిఖీ చేసిన నేపథ్యంలో ఎక్స్టసీ పిల్స్, ఎండీఎంఏ డ్రగ్, గంజాయి లభించాయి. దీంతో వీరిని అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. డీసీపీ రష్మి పెరుమాల్ మాట్లాడుతూ... ‘ఇళ్ల యజమానులు ఎవరికై నా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వివరాలు, పూర్వాపరాలు ఆరా తీయాలి. విదేశీయుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ రవాణా, విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. దీనిపై నిఘా ఉంచాం. సరైన పత్రాలు లేకుండా ఉంటున్న విదేశీయుల పైనా దృష్టి పెట్టాం’ అని అన్నారు. అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ఉక్కుపాదం ఎఫ్ఆర్ఆర్ఓ సహాయంతో వారి డిపోర్టేషన్ ప్రక్రియ మొరాకో జాతీయుడిని పంపించిన హెచ్–న్యూ టీమ్ మాదకద్రవ్యాలతో దొరికిన వారు మాత్రం కటకటాల్లోకి -
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులతో పాటు విద్యాధికులకూ టోకరా వేస్తూ, భారీ మొత్తాలు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు. ఈ విభాగంతో పాటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఆధీనంలోని సీసీఎస్, షీ–టీమ్స్, భరోసా తదితర వింగ్స్కు చెందిన అధికారులతో సోమవారం ఆయన భేటీ అయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి సీపీ నగదు రివార్డులు అందించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న నిందితులను పట్టుకోవడంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన కృషిని అభినందించారు. 2023లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రారంభమైనప్పటి నుంచి గృహ హింస బాధితులకు సహాయం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తోందని సీపీ అన్నారు. ఈ సందర్భంలో కొత్వాల్ భరోసా కేంద్రాన్ని సందర్శించారు. -
శోభాయాత్రకు వేళాయే
అబిడ్స్: నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారామ్బాగ్ ఆలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, ధూల్పేట్ గంగాబౌలి నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మంగళ్హాట్ మాగ్రా నుంచి ఆనంద్సింగ్ల ఆధ్వర్యంలో మూడు శోభాయాత్రలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రలో శ్రీరాముడి విగ్రహాలతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలు, దేశభక్తిని చాటే మహానేతల విగ్రహాలు ప్రదర్శించనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శోభాయాత్ర ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. ఈ శోభాయాత్రను తిలకించేందుకు నగరవాసులే కాక ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. రూట్ మ్యాప్ ఇదే.. సీతారామ్బాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర బోయిగూడ కమాన్, మంగళ్హాట్ పోలీస్స్టేషన్, ధూల్పేట్ అనిత టవర్, జాలి హనుమాన్, పురానాపూల్ మీదుగా వెళ్తుంది. అనంతరం ధూల్పేట్ గంగాబౌలి నుంచి రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర, ధూల్పేట్ మాగ్రా నుంచి ఆనంద్సింగ్ శోభాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ మూడు యాత్రలు కలిసి ఒకదాని వెనుక ఒకటి పురానాపూల్ నుంచి జుమ్మెరాత్బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్బజార్, సిద్దిఅంబర్ బజార్, మహారాజ్ గంజ్, గౌలిగూడ, కోఠి ఆంధ్రాబ్యాంక్, కోఠి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగుతుంది. హనుమాన్ టేక్డీ వ్యాయామశాలలో రాత్రి ముగింపు సమావేశం నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా... శ్రీరామ నవమి శోభాయాత్రకు ఉత్తర భారత దేశం నుంచి శ్రీ చైతన్యానంద మహారాజ్ పాల్గొంటున్నట్లు భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు, ప్రధాన కార్యదర్శి గోవింద్రాఠిలు తెలిపారు. బేగంబజార్ ఛత్రి, కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాల్లో భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. 500 మంది పోలీసులతో బందోబస్తు శ్రీరామ నవమి శోభాయాత్రకు దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్వెస్ట్జోన్ డీసీపీ డి.ఉదయ్కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక ఏసీపీలు ఇన్చార్జిలుగా ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తారన్నారు. యాత్ర సాగే రహదారులపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచామన్నారు. పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. కాగా సీతారామ్బాగ్, బేగంబజార్ ఛత్రి, పురానాపూల్, ధూల్పేట్, గంగాబౌలి ప్రాంతాల్లో మంగళవారం డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. సీతారామ్బాగ్, ధూల్పేట్ గంగాబౌలి, మంగళ్హాట్ ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు -
ఏం చేద్దాం?
ప్రజా రవాణాపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయంలీ అసోసియేషన్కు బాధ్యతలుముంపు ముప్పును ఎదుర్కొందాం: దానకిశోర్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా చేపట్టవలసిన వివిధ రకాల ప్రజా రవాణా వ్యవస్థలపైన అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ లీ అసోసియేషన్కు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం నగర జనాభా, వ్యక్తిగత వాహనాల వినియోగం, రానున్న 2050 నాటికి పెరుగనున్న జనాభా, నగర విస్తరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రధాన ప్రాంతాల మధ్య కనెక్టివిటిని పెంచేందుకు ఏ విధమైన రవాణా వ్యవస్థలు అవసరమనే అంశంపైన ఈ అధ్యయనంలో నిపుణులు దృష్టి సారించనున్నారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)లో భాగంగా ఈ అధ్యయనం కొనసాగనుందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఏడాది పాటు ఈ అధ్యయనం కొనసాగనుంది. అనంతరం లీ అసోసియేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సిటీబస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు, మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. మెట్రో రెండోదశ విస్తరణకు సైతం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో భవిష్యత్తులో మెట్రో విస్తరణతో పాటు ఇతర ప్రజా రవాణా వ్యవస్థల ప్రాధాన్యతపైన కూడా నిపుణులు దృష్టి సారిస్తారు. ఔటర్ రింగ్రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో లీ అసోసియేషన్ అధ్యయనం ప్రధానం కానుందని అధికారులు తెలిపారు. జంక్షన్ల విస్తరణ, కొత్త రవాణా సదుపాయాల ఏర్పాటు, వివిధ రవాణా వ్యవస్థల మధ్య కనెక్టివిటీ వంటి అంశాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అదే విధంగా లాస్ట్మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల నగరవాసులు మెట్రో సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఈ మేరకు లీ అసోసియేషన్ అధ్యయనంలో ఇది కూడా ఒక ప్రధాన అంశం కానుందని ఉమ్టా అధికారి ఒకరు తెలిపారు. ఇంటింటి సర్వే సైతం... ● లీ అసోసియేషన్ అధ్యయనంలో భాగంగా గ్రేటర్లో ఇంటింటి సర్వే చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి రవాణా అవసరాలను. ప్రస్తుతం వారు వినియోగిస్తున్న వాహనాల వివరాలను సేకరిస్తారు. అలాగే కొన్ని చోట్ల వ్యక్తిగత వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల సెవెన్ సీటర్ ఆటోలు, బస్సుల వినియోగం ఎక్కువగా ఉండవచ్చు. లేదా ఎంఎంటీఎస్ వినియోగించేవారు ఉండవచ్చు. ఇలా ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజల రవాణా అవసరాలు, సదుపాయాలపైన సమగ్రమైన అధ్యయనం చేయనుంది. విస్తరణకు తగిన రవాణా వ్యవస్థ లేదు.. ● బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6000 బస్సులు అందుబాటులో ఉంటే గ్రేటర్లో 2550 బస్సులు మాత్రమే ఉన్నాయి.ఎంఎంటీఎస్ రెండో దశలో ఆరు కొత్తలైన్లను ఏర్పాటు చేసినప్పటికీ రైళ్లు పూర్తిస్థాయిలో లేవు. ప్రస్తుతం 70 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే తిరుగుతున్నాయి. మరో 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడవలసి ఉంది. ఇక మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్లతోనే నడుస్తున్నాయి. రోజుకు 5 లక్షల మందికి పైగా మెట్రో సేవలను వినియోగించుకుంటున్నా కోచ్ల సంఖ్య పెరగడం లేదు. దీంతో రోజుకు 1000 ట్రిప్పులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా ప్రణాళికలను ప్రభుత్వం ముందు ఉంచనుంది. -
ఈవీ వాహనాలపై అపోహలను తొలగించాలి
లక్డీకాపూల్ : ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే బైయింగ్ అసిస్టెంట్ యాప్ ’’జూయి యాప్‘ మంగళవారం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ దాదాపు అన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ–వీలర్ బ్రాండ్లతో పని చేస్తుంది. ఫైనాన్స్ కోసం యాక్సిస్ బ్యాంక్, లోన్ టాప్, బీమా అవసరాల కోసం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, చోలా ఏంఎస్, కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లతో భాగస్వామ్యమైందని జూయి యాప్ వ్యవస్థాపకులు మహంత్ మల్లికార్జున, ప్రణయ్ కొమ్ములు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ యాప్ను ఆవిష్కరించడం విశేషమన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఈవీ, బ్యాటరీ వాహనాలు విస్తరిస్తున్నప్పటికీ కొనుగోలుదారుల్లో ఈవీ వాహనాలపై అపోహలు ఉన్నాయన్నారు. జాయి ఈ అపోహలను పరిష్కరించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు దగ్గర చేయడంలో సహాయం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఈవీ వాహనాల కొనుగోళ్ల కోసం జూయి యాప్ ఆవిష్కరణ.. యాప్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి. డి. శ్రీధర్ బాబు -
తీరుపై ఆరా
నీటి సరఫరాసాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో క్షేత్ర స్థాయి తాగునీటి సరఫరా తీరును జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి ఆరా తీశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘నల్లా ..డొల్ల! నీళ్లెలా?’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన..మంగళవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ల వారీగా ట్యాంకర్ల బుకింగ్స్, డెలివరీ, పెండెన్సీ, పర్యవేక్షణ, అదనపు ట్యాంకర్లు, రోజువారీ, రాత్రి వేళల్లో సరఫరా చేసే ట్రిప్పులు, నీటిసరఫరాను సమీక్షించడంతోపాటు స మగ్ర వివరాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. నీటి సరఫరా, లోప్రెషర్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. ట్యాంకర్ డెలివరీలో ఆలస్యం లేకుండా చూడాలని, ఆలస్యమైతే వినియోగదారులకు సందేశం పంపించాలన్నారు. అంతకు ముందు నారాయణగూడ, చిలకలగూడలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ను పరిశీలించారు. లాగ్బుక్స్, నీటి సరఫరా వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. సాక్షి ఎఫెక్ట్ -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జరగరానిది జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘మాన్సూన్ యాక్షన్ప్లాన్’పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) అన్నివేళలా అప్రమత్తమై ఉండాలన్నారు. ఫైర్, వాటర్వర్క్స్, జీహెచ్ఎంసీ, పోలీస్ తదితర శాఖలన్నీ కలిసి మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. వరద ముంపు సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా చేపట్టిన పనుల్లో 52 శాతమే పూర్తయినట్లు గుర్తించిన ఆయన మిగతా పనుల్ని పూర్తిచేయాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ లొకేషన్స్ సైతం 125లో 22 ప్రాంతాల్లో మాత్రమే శాశ్వతంగా పరిష్కరించారని, మిగతావి కూడా పరిష్కరించాలన్నారు. వాటిల్లో 40 లొకేషన్లలో పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. జూన్ మొదటి వారంలోగా నాలాలు నీరుపారేలా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్, వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్, సీఈలు దేవానంద్, కిషన్, జోనల్ కమిషనర్లు స్నేహశబరీష్, రవి కిరణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
సాహిత్య, సాంస్కృతిక, సంప్రదాయ సంరంభంమండు వేసవి. నిప్పులు చెరిగే ఎండలే కాదు ఆహ్లాదభరితమైన ఉదయ సంధ్యలు కూడా పలకరించనున్నాయి. కొత్త దృక్పథాలు, సరికొత్త ఆలోచనలు రూపుదిద్దుకొనే ఒక విలువైన సమయం. ఏడాది పొడవునా చదువులు, పరీక్షలు అంటూ పరుగులు తీసే విద్యార్థులకు వేసవి ఒక విహారాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే విలువైన సమయం. పటిష్టమైన కెరీర్ నిర్మాణానికి, ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి బాటలు పరుచుకోవచ్చు. అభిరుచులను ఆవిష్కరించుకోవచ్చు. నృత్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి నచ్చిన కళలకు రంగులద్దుకునే తీరిక సమయం ఈ వేసవి కాలమే. ఈ క్రమంలోనే పలు విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వేసవిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పిల్లల అభిరుచికి తగిన విధంగా వాటిని రూపొందిస్తున్నాయి. చిన్నారులూ.. ఇక ఆలస్యమెందుకు మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు ఈ వేసవిలో సిద్ధం కండి. – సాక్షి, సిటీబ్యూరో ‘చదువుకుందాం’ కార్యక్రమంలో... సంగీత సాధనపై.. ఎంతోమంది గానగంధర్వులను సినీరంగానికి పరిచయం చేసిన ప్రముఖ లలిత సంగీత శిక్షణ సంస్థ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ తన రెగ్యులర్ విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అకాడమీ వ్యవస్థాపకులు కె.రామాచారి తెలిపారు. నెల రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణనివ్వనున్నామని పేర్కొన్నారు. మే ఒకటో తేదీ నుంచి 31 వరకు రవీంద్రభారతిలోని మినీ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు లలిత సంగీతం, సినిమా సంగీతం, అన్నమాచార్య సంకీర్తనలు తదితర అంశాలలో శిక్షణనిస్తారు. సంస్కారమే ఆభరణం.. స్థితప్రజ్ఞత ఒక అద్భుతమైన వరం వంటిది. ఎంపిక చేసుకొన్న రంగంలో విజయతీరాలను చేరుకొనేందుకు, తమను తాము ఉన్నతమైన వ్యక్తులుగా రూపొందించుకొనేందుకు ఒక గొప్ప సాధనం. ఇదే లక్ష్యంగా రామకృష్ణమఠం ‘సంస్కార్–2024’ నిర్వహిస్తోంది. ఈ నెల 28న ఇది ప్రారంభం కానుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణనిస్తారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంప్రదాయ విలువలను బోధిస్తారు. భజనలు, శ్లోకాలు నేర్పిస్తారు. ఽయోగా, ప్రాణాయామం, ధ్యానం తదితర అంశాల్లోనూ శిక్షణ ఉంటుంది. నైతిక విలువలను అలవరుస్తారు. ఉత్తమ చేతిరాతలో తర్ఫీదు ఉంటుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు ఈ అంశాలన్నింటితో పాటు స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవడం, ఆత్మస్థ్యైర్యాన్ని పెంపొందించుకోవడం, తమను తాము ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దుకొనేందుకు పాటించాల్సిన పద్ధతులు, దైనందిన జీవితంలో కాలం విలువ తెలుసుకోవడం, కెరీర్ను నిర్మించుకోవడం వంటి అంశాలపైన ఈ ‘సంస్కార్–24’ శిక్షణనిస్తుంది. ఈ నెల 29 నుంచి మే 10 వరకు 12 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ అంశాల్లో ఈ శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు సంజీవ్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 91772 32696. మొక్కలు చెప్పే పాఠాలు విందామా.. ఏపుగా పెరిగిన ఆకుపచ్చ మొక్క ఒకటి కొమ్మలను గాలిలో ఊపుతూ సృష్టిలో తన ఉనికిని, ప్రత్యేకతను చాటుకుంటుంది. ఆ కొమ్మలపై వాలిన పక్షులు, చుట్టూ పరుచుకున్న ప్రకృతి, పర్యావరణం జీవవైవిధ్యాన్ని ప్రబోధిస్తాయి. అక్కడ ప్రతి మొక్క, చెట్టు, కొమ్మ, రెమ్మ ప్రతి ఒక్కటీ పాఠాలు చెబుతాయి. మనిషికి, ప్రకృతికి ముడిపడిన బంధాన్ని, అనుబంధాన్ని వివరిస్తాయి. తరగతి గదుల్లో, నాలుగు గోడల మధ్య టీచర్లు బోధించే అంశాలను సమున్నతంగా ఆవిష్కరించేందుకు బొటానికల్ గార్డెన్ చిన్నారులను ఆహ్వానిస్తోంది. ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు, ఆసక్తిని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రత్యేక కార్యక్రమాలతో పాటు వర్క్షాపులను నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ సుమన్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా ఇక్కడ గడపవచ్చు. నిర్వాహకులే మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, టీ అందజేస్తారు. ఈ నెల 20, 27, మే నెలలో 4, 11, 18, 25, 31 తేదీల్లో బొటానికల్ గార్డెన్ టూర్ నిర్వహించనున్నారు. వివరాలకు 94935 49399ను సంప్రదించవచ్చు. చదువుకుందాం ‘డియర్’... సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ ‘చదవడాన్ని’ ఒక పాఠ్యాంశంగా పరిచయం చేస్తోంది. ప్రతి నెలా మొదటి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నర్సరీ నుంచి ప్రాథమిక, మాధ్యమిక స్థాయి పిల్లల వరకు ప్రతి ఒక్కరిలో పఠనాభిలాష, ఆసక్తి పెంపొందేవిధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులతో పాటు పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం పాఠశాల ఆవరణ మొత్తాన్ని రీడింగ్ జోన్గా మార్చినట్లు పేర్కొన్నారు. బొటానికల్ గార్డెన్లో చిన్నారులకు పర్యావరణ పాఠాలుఉత్తమ వ్యక్తిత్వ వికాసానికి ‘సంస్కార్’ ‘చదువే’ ప్రామాణికంగా పఠనాభిలాష -
నాలుగు నెలల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స
బంజారాహిల్స్: నాలుగు నెలల వయస్సున్న శిశువుకు సంక్లిష్టమైన ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సను బంజారాహిల్స్లోని అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. పుట్టుకతో వచ్చే పల్మనరీ ఎయిర్వే మాల్ఫార్మేషన్తో బాధపడుతున్న శశివుకు పీడియాట్రిక్ యూరాలజీ చీఫ్ సర్జన్ డాక్టర్ వీవీఎస్ చంద్రశేఖరం నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం డాక్టర్ చంద్రశేఖరం వెల్లడించారు. థొరాకోస్కోపిక్ లోబెక్టమీ సహా అధునాతన సాంకేతికతలను ఉపయోగించి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు అతి తక్కువ కోత పద్ధతుల ద్వారా ఊపిరితిత్తుల్లో వ్యాధి భాగాన్ని తొలగించారు. లక్ష మంది శిశువుల్లో 30–42 మందికి మాత్రమే ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఈ సమస్యలను సకాలంలో గుర్తించడం వల్ల పెద్దయ్యాక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కేన్సర్ల నుంచి చిన్నారులను రక్షించవచ్చునని తెలిపారు. -
నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈనెల 18న నోటిఫికేషన్ వెలువడనుందని, ఈ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ తెలిపారు. ఆదివారం సెలవురోజు మినహా 18 నుంచి 25 వరకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులుంటే వాటి వివరాలను తప్పనిసరిగా పత్రికలు, చానెళ్ల ద్వారా వెల్లడించాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ జరిగిన 75 బూత్ల పరిధిలో సర్వే చేశామని, పోలింగ్ పెంచేందుకు తగిన వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికీ స్టిక్కర్ క్యాంపెయిన్లతో పాటు వీడియోల ద్వారా, కమ్యూనిటీల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లను చైతన్య పరిచేలా రూపొందించిన 10 బెస్ట్ వీడియోలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. పోలింగ్రోజున కూలీలు ఓటు వేసేలా అడ్డాల వద్ద కూలీలుండకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఉమెన్, యూత్ తదితర మోడల్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని పోలింగ్బూత్లలో తాగునీటితో సహా అన్ని కనీస సదుపాయాలు కల్పిస్తామని, సెలవులున్నందున ఊర్లకు వెళ్లకుండా ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శిక్షణకు హాజరుకాని పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే రెండు సార్లు నోటీసులిచ్చామని, త్వరలో వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయడంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని, తగిన చర్యల కోసం ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వ వాహనాలనూ తనిఖీలు చేస్తామన్నారు. ఆయా రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయన్నారు. నామినేషన్ల స్వీకరణ ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో, కంటోన్మెంట్ అసెంబ్లీకి కంటోన్మెంట్ సీఈఓ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ అదనపు కలెక్టర్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, తదితరులు పాల్గొన్నారు. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ పోలింగ్ శాతం పెంచేందుకు కృషి ఓటర్లను చైతన్యపరిచే వీడియోలకు అవార్డులు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ 8 ఫిబ్రవరి వరకు జిల్లాలో ఓటర్లు పురుషులు :23,30,574 మహిళలు :22,39,240 థర్డ్జెండర్ :324 మొత్తం :45,70,138. వీరిలో 18–19 ఏళ్ల యువ ఓటర్లు :65,595 కొత్తగా దరఖాస్తుచేసుకున్న వారి వివరాలతో ఓటర్ల అనుబంధ జాబితా ఈనెల 25న వెలువరిస్తారు. పోలింగ్ లొకేషన్లు :1675 పోలింగ్ కేంద్రాలు : 3986 -
టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో (నిథమ్ కళాశాల) టూ రిజం కోర్సు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పర్యాటకశాఖ సంచాలకులు కె. నిఖిల తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఆమోదిత నిథమ్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ ,బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసు కోవాల్సిందిగా కోరారు. ఎంబీఏ రెండేళ్లు, బీబీఏ నాలుగేళ్లు, బీఎస్సీ మూడేళ్ల కోర్సులను అందజేయనున్నారు. ఇంటర్న్షిప్ కోసం విదేశాలకు పంపిస్తారు. ఇందులో మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ఎంట్రెన్స్ తో పాటు దేశ విదేశాల్లో చక్కటి అవకాశాలు లభించనున్నాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నిథమ్ కోర్సులను అందజేస్తోంది. అడ్మిషన్లు, ఇతర వివరాల కోసం జిల్లా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పర్యాటక అధికారి ఫోన్ : 9440 81 60 71, హారతి పాటిల్ ఫోన్: 784 24 55 5 81 : 955 37 000 35 నెంబర్లను సంప్రదించవచ్చు. -
25 నుంచి జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రతియేటా జరిగే జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఈనెల 25 నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ శిబిరాల్లో 44 క్రీడాంశాల్లో బాలబాలికలకు శిక్షణనివ్వనున్నారు. 6–16 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులకు ఉదయం 6.15 గంటల నుంచి 8.15 గంటల వరకు రెండు గంటలపాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిస్తారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల ఫీజులు ఆయా క్రీడాంశాలను బట్టి రూ.10, రూ.50, రూ.100 లుగా ఉన్నాయి. ఇతర వివరాలకు స్థానిక జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కేంద్రాల్లో సంప్రదించవచ్చు. జీహెచ్ఎంసీ వేసవి శిక్షణ శిబిరాలకు ఎంతో కాలంగా ఆదరణ ఉంది. ఫీజులు నామమాత్రం కావడంతోపాటు అనుభవజ్ఞులైన కోచ్లు ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యతనిస్తారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు స్పోర్ట్స్కు సంబంధించిన క్విజ్ల నిర్వహణ, ఎంపిక చేసిన క్రీడాంశాల్లో ఇంటర్సెంటర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను శిబిరాలకు ఆహ్వానిస్తారు. 25వ తేదీన ఖైరతాబాద్జోన్లో శిక్షణ శిబిరాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. చార్మినార్ జోన్లో 26వ తేదీన, సికింద్రాబాద్ జోన్లో 27న, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో 30న, ఎల్బీనగర్ జోన్లో మే ఒకటో తేదీన ప్రాంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంప్లో క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, కబడ్డీ. హాకీ, టెన్నిస్, తైక్వాండో, క్యారమ్స్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్ ఉప్పల్: ఇతర రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రం, జోద్పూర్ ప్రాంతానికి చెందిన మనోజ్ వైష్ణోయి, కరీంనగర్లో గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు బుద్దారామ్ అలియాస్ శివ్జీ ట్రక్ డ్రైవర్గా పని చేసేవాడు. ఇద్దరు కలిసి నల్లమందు, ఎండీఎంఏ తదితర మత్తు పదార్థాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బుద్దారామ్ రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్నారు. వీరిపై గతంలో మీర్పేట పోలీసులు ఇదే తరహా కేసులు నమోదు చేశారు. అయినా పోలీసుల కళ్లు కప్పి దందా చేస్తూనే ఉన్నారు. వీరి కదలికలపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు సోమవారం ఉప్పల్ భగాయత్ లే అవుట్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 500 గ్రాముల నల్లమందు, 100 గ్రాముల ఎండీఎంలే, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి మత్తు పదార్థాలు సరఫరా చేసే వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శాండ్స్టోన్ ఇన్ఫ్రా యాజమాన్యం అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో స్ప్రింగ్ సిటీ ఫేజ్–1, స్ప్రింగ్ సిటీ ఫేజ్–2 ప్రాజెక్టుల్లో పెట్టుబడి పేరుతో భారీ మొత్తం వసూలు చేసి మోసం చేసిన కేసులో సిటీ సీసీఎస్ పోలీసులు శాండ్స్టోన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. వీరు అనేక మంది నుంచి రూ.86.75 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు డీసీపీ ఎన్.శ్వేత మంగళవారం వెల్లడించారు. శాండ్స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు మలికిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా, ఆయన భార్య ఎరువ శ్రీలక్ష్మి డైరెక్టర్గా ఉన్నారు. వీరు సుల్తాన్పూర్లో రెండు ఫేజులలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో ప్లాట్స్ ఖరీదు చేసి పెట్టుబడి పెట్టాలని, భారీ మొత్తాలు లాభాలు వస్తాయనంటూ నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన అనేక మంది పెట్టుబడులు పెట్టి మోసపోయారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్లో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు మంగళవారం నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. చెల్లని చెక్కులిచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ సాక్షి,సిటీబ్యూరో: చెక్ ‘బౌన్సర్ల’పై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఆస్తిపన్ను చెల్లింపుల కోసం చెల్లని చెక్కులిచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరానికి(2023–24) జీహెచ్ఎంసీకి మొత్తం రూ.1921 కోట్లు ఆస్తిపన్నుగా వసూలైంది. అందులో చెక్కుల ద్వారా జరిగిన చెల్లింపుల్లో రూ.11 కోట్ల మేర చెక్కులు బౌన్సయినట్లు అధికారులు గుర్తించారు. సర్కిళ్ల వారీగా అలాంటి చెక్కులిచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు కమిషనర్ రోనాల్డ్రాస్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్లో 5, శేరిలింగంపల్లిలో 4, చందానగర్లో 13, యూసుఫ్గూడలో 8, కుత్బుల్లాపూర్లో 4, కూకట్పల్లిలో 1, మూసాపేటలో 4 ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. జీహెచ్ఎంసీకి చెల్లని చెక్కులిచ్చిన వారు బౌన్సయిన చెక్ తాలూకు నగదును వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఎఫ్ఐఆర్లు దాఖలు చేయనున్నట్లు హెచ్చరించారు. ఇకపై ఆస్తిపన్ను చెల్లించే వారు చెక్బౌన్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆస్తిపన్ను బకాయిలున్న వారు వాటిని చెల్లించి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎర్లీబర్డ్ ద్వారా 5 శాతం రాయితీకి ఈనెల 30 వరకు గడువు ఉంది. -
ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ షురూ
లక్డీకాపూల్: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలపై అమర్చే బ్యాలెట్ పత్రాలను నగరంలోనే ముద్రించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఆ దిశగా ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణకు సన్నాహాలు చేపట్టారు. మే 2వ తేదీలోగా బ్యాలెట్లను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ముద్రణ ప్రక్రియ అంతా ఆయా జిల్లాల్లోనే జరగనున్నది. సాధారణ పోలింగ్కు నాలుగు రోజుల ముందుగానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. నామినేషన్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ సాక్షి, సిటీబ్యూరో: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం లక్డీకపూల్లోని కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆయా కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధిస్తూ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం ఈ పరిధుల్లో అనుమతి లేకుండా నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. ఈ నెల 29 వరకు అమలులో ఉండే నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. -
ఆ కారు నడిపింది రహీలే!
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’లో ఇటీవల అరైస్టెన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ మరో కేసులో నిందితుడిగా మారాడు. 2022లో జూబ్లీహిల్స్ ఠాణా పరిఽధిలో చోటు చేసుకున్న ‘మహేంద్ర థార్ యాక్సిడెంట్’కు ఇతడే కారణమని అధికారులు తేల్చారు. ఈ కేసులోనూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అప్పట్లో జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేసిన, పర్యవేక్షించిన అధికారుల చుట్టూ ఉచ్చుబిగుస్తోందని సమాచారం. ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదం కేసులో రహీల్, ఇద్దరు పోలీసులు సహా 15 మంది అరెస్టు అయిన విషయం విదితమే. ఆ ప్రమాదంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ తెరపైకి తెచ్చింది. ప్రాణాలు కోల్పోయిన రెండు నెలల చిన్నారి.. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో 2022 మార్చి 17వ తేదీ రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ చౌహాన్ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు రఘువీర్ (రెండు నెలలు) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ వాహనంపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో రహీల్పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సదరు కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో వెళుతుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని పేర్కొన్నాడు. అప్పట్లో పోలీసులూ క్లీన్చిట్ ఇచ్చేశారు... అదే నెల 19న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు రహీల్కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆ వాహనాన్ని తానే నడుపుతున్నట్లు షకీల్ బంధువు సయ్యద్ అఫ్మాన్ అహ్మద్ లొంగిపోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతడి పక్కన సీటులో రహీల్ కూర్చోగా... వెనుక సీటులో స్నేహితుడు మహ్మద్ మాజ్ ఉన్నట్లు వెల్లడించారు. వాహనంలో సేకరించిన వేలిముద్రలు సైతం అఫ్మాన్ ఫింగర్ ప్రింట్స్తో సరిపోలినట్లు చెప్పుకొచ్చారు. ఇలా ఈ ప్రమాదంలో రహీల్ పాత్ర లేనట్లు తేల్చేశారు. అయితే ప్రజాభవన్ వద్ద ప్రమాదం కేసు దర్యాప్తులో భాగంగా నాటి కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీళ్లు నాటి రికార్డులను పరిశీలించగా అనేక లోపాలు కనిపించాయి. కాజల్ వాంగ్మూలంలో ఎక్కడా ప్రమాద సమయంలో డ్రైవింగ్ ఎవరు చేశారనే ప్రస్తావన లేదు. ఆమెతో ఆఫ్మాన్కు టెస్ట్ ఐడెంటికేషన్ పెరేడ్ నిర్వహించిన దాఖలాలు లేవు. మరోపక్క అప్పట్లో పోలీసుల ప్రకటించిన వేలిముద్రల రికార్డులు కోర్టుకు సమర్పించలేదు. అదే ఏడాది నవంబర్లో దాఖలు చేసిన చార్జిషీట్ లోపభూయిష్టంగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యవహారం వెనుక షకీల్–రహీల్ పాత్రను అనుమానించిన వెస్ట్జోన్ పోలీసులు ఆ ఫైల్ను రీ–ఓపెన్ చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి... ‘జూబ్లీహిల్స్ ప్రమాదం’ కేసు దర్యాప్తులో భాగంగా వెస్ట్జోన్ పోలీసులు ఫిర్యాది, ఇతర బాధితురాళ్లను విచారించారు. నిందితుడిగా ఉన్న అఫ్మాన్ను సైతం ప్రశ్నించగా రహీల్ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో నాటి దర్యాప్తు అధికారి విచారణలోనూ ఆరోపణలకు బలాన్నిచ్చే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా ముందుకెళ్లిన పోలీసులు రహీల్ను నిందితుడిగా చేర్చారు. ప్రజాభవన్ వద్ద ప్రమాదంతో దుబాయ్ పరారైన ఇతడు ఇటీవలే వచ్చి అరైస్టె బెయిల్ పొందాడు. రహీల్ను జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు. అలా వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. అప్పట్లో ఈ కేసు సెటిల్ చేయడంలో ఓ పోలీసు ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అతడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.5 లక్షలు ఇప్పించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో ఆయనతో పాటు మరో అధికారీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రహీల్ విచారణ తర్వాతే షకీల్ పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.