No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 13 2024 7:40 AM | Last Updated on Sat, Apr 13 2024 7:40 AM

- - Sakshi

లక్డీకాపూల్‌ : నగరంలోని నిమ్స్‌ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. శుక్రవారం అవుట్‌ పేషెంట్‌ విభాగాలు రోగులతో కిటకిటలాడాయి. ఓపీ కార్డు క్యూలైన్లలో రోగులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వరుసగా పండుగ సెలవులు వచ్చిన నేపథ్యంలో నిమ్స్‌ రోగుల తాకిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలు దాటినా ఓపీ కార్డుల కోసం రోగులు క్యూలైన్లలో బారులు తీరడం గమనార్హం. ఓపీ కార్డులు లభ్యం కాకపోవడంతో 30 శాతం రోగులు తిరుగుముఖంపట్టాల్సిన పరిస్థితి. ఆస్పత్రి వైద్యుల కొరత కూడా ఇందుకు కారణంగా నిమ్స్‌ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న వైద్యులు మధ్యా హ్నం రెండు గంటల వరకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా ఆస్పత్రికి నిత్యం 2,500 నుంచి 3000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, శుక్రవారం ఆ సంఖ్య రెట్టింపు అయిందని ఓ అధికారి చెప్పారు. అయినప్పటికీ నిర్ణీత సమయం వరకు క్యూ లైన్లలో ఉన్న వాళ్లందరికీ ఓపీ కార్డులను ఇవ్వడంతో పాటు అందరికీ వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement