No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Apr 14 2024 8:00 AM | Last Updated on Sun, Apr 14 2024 8:00 AM

-

సాక్షి, సిటీబ్యూరో: విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఫైర్‌ సర్వీసెస్‌ వీక్‌ జరగనుంది. ఈమేరకు ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో శనివారం రాచకొండ కమిషనర్‌ తరుణ్‌ జోషి పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement