సాక్షి, సిటీబ్యూరో: విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఫైర్ సర్వీసెస్ వీక్ జరగనుంది. ఈమేరకు ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No Headline
Published Sun, Apr 14 2024 8:00 AM | Last Updated on Sun, Apr 14 2024 8:00 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు జూమ్
- నిరుద్యోగ భారత్
- బయోసిమిలర్స్పై డాక్టర్ రెడ్డీస్ ఫోకస్
- ‘నిఘా’కు నిధులివ్వండి
- సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం
- వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
- నాకు భద్రతను పునరుద్ధరించండి
- Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్తో పొత్తు లేనట్టే!
- సర్వర్లు డౌన్.. ప్రవేశాలకు ఆటంకం!
- 40 శాతమే అయితే ఎలా?
Advertisement
Comments
Please login to add a commentAdd a comment