ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిగల ద్రోహి | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిగల ద్రోహి

Published Mon, Apr 15 2024 6:50 AM | Last Updated on Mon, Apr 15 2024 6:50 AM

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ  - Sakshi

కవాడిగూడ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పట్ల ఏమాత్రం గౌరవం లేదని మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం ఆయన లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఉదయం 8గంటల్లోగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలలో పాల్గొనేవారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 11.40 వరకు అంబేడ్కర్‌కు నివాళులర్పించకపోవడం ఆయనకు అంబేడ్కర్‌ పై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి మాదిగలను చిన్నచూపు చూస్తూ వారు రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని మందకృష్ణ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం మాదిగలపై కాంగ్రెస్‌ పార్టీ వివక్షకు నిదర్శనమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement