-
ప్రాణం తీసిన ఈత సరదా
నాయుడుపేట టౌన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన మండల పరిధిలోని మర్లపల్లి జాతీయ రహదారి కూడలి సమీపంలో స్వర్ణముఖి నది వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, కడియనల్లూరు గ్రామానికి చెందిన కుమార్రాజేష్(31) ఓజిలి మండలం, పెదపరియ గ్రామ సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పరిశ్రమలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. పరిశ్రమ వద్దే నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం రాజేష్ అదే పరిశ్రమలో పనిచేస్తున్న తన స్నేహితులు శ్రీనివాస్, శశికుమార్తో కలిసి మండల పరిధిలోని మర్లపల్లి జాతీయ రహదారి కూడలి సమీపంలో స్వర్ణముఖి బ్రిడ్జి కింద నదిలో సరదగా ఈత కొట్టేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు నది వద్దే ఉన్నారు. శ్రీనివాసన్, శశికుమార్ ఇద్దరూ అక్కడి నుంచే వచ్చేశారు. రజేష్ మాత్రం ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. సోమవారం రాత్రి నైట్డ్యూటీకి సైతం రాకపోవడంతో స్నేహితులు మంగళవారం ఉదయం స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి చూడగా రాజేష్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ గోపి స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి రమేష్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆపై మృతుడి తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
నామినేషన్లకు సర్వం సిద్ధం
● రేపు ఎన్నికల నోటిఫికేషన్ ● ఆ రోజు నుంచే నామినేషన్ల ఘట్టం ● ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ నామినేషన్లను స్వీకరించు రిటర్నింగ్ ఆఫీసర్లు తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ను తూచాతప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మార్చి 16వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జూన్ 6వ తేదీ వరకు కోడ్ నిబంధనలు వర్తిస్తాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అదే రోజు ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25 వరకు గడువు ఉందని చెప్పారు. 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువు ఉంటుందని వెల్లడించారు. మే 13న పోలింగ్ ఉంటుందని, జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం–2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం–2బీ సమర్పించాలని, నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్లు స్వీకరించమని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి చేస్తున్న ఖర్చులు అతని ఖాతాలో లెక్కిస్తామన్నారు. తిరుపతి పార్లమెంట్కు ప్రవీణ్కుమార్–కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటగిరి హెచ్ఎం.ధ్యానచంద్ర–జాయింట్ కలెక్టర్ తిరుపతి అదిత్ సింగ్–కార్పొరేషన్ కమిషనర్ చంద్రగిరి ఏ.నిషాంత్రెడ్డి–తిరుపతి ఆర్డీఓ గూడూరు కిరణ్కుమార్–గూడూరు ఆర్టీఓ సూళ్లూరుపేట ఆర్.చంద్రముని, సూళ్లూరుపేట ఆర్డీఓ శ్రీకాళహస్తి ఎన్.రవిశంకర్రెడ్డి–శ్రీకాళహస్తి ఆర్డీఓ సత్యవేడు నరసింహాలు–స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఏపీఐఐసీ, సత్యవేడు -
ప్రాణం తీసిన ఈత సరదా
ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన నాయుడుపేట మండలంలో విషాదాన్ని నింపింది. ●బాబు నట్టేట ముంచాడు శ్రీకనకదుర్గా మహిళా పొదుపు సంఘంలో నేను సభ్యురాలిని. మేము డ్వాక్రా సంఘం ద్వారా 2014లో రూ.3లక్షలు బ్యాంకు రుణం తీసుకుని 10 మంది సభ్యులు ఒక్కొక్కరికీ రూ.30వేలు చొప్పున పంచుకున్నాము. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తానని మమ్మల్ని నమ్మించి ఓట్లేయించుని అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నట్టేట ముంచేశాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ పేరుతో అక్క, చెల్లెమ్మలను మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూశాడు. పసుపు–కుంకుమ పేరుతో ఇచ్చిన ముష్టి రూ.3 వేలు కూడా కొందరికే ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జగనన్న ‘వైఎస్సార్ ఆసరా’ పేరుతో డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని నవరత్నాల్లో చేర్చి ఇప్పటికే నాలుగు విడతల్లో వడ్డీతో సహా మాఫీ చేశారు. లోను రీపేమెంట్ పూర్తి కావడంతో మళ్లీ మాకు బ్యాంకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున మొత్తం మా ఒక్క గ్రూపునకే రూ.20లక్షలు రుణం ఇచ్చారు. ఆ రుణ సాయంతో నేను సొంతంగా ఇంటి దగ్గర చిన్నపాటి షాపు పెట్టుకున్నాను. షాపులో అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10వేలు ఆదాయం వస్తోంది. జీవనం సాఫీగా సాగుతోంది. చంద్రబాబు అధికారం కోసం ఎంతటి వంచనకై నా దిగజారుతాడు. ఆయన ఎన్ని హామీలిచ్చినా మళ్లీ నమ్మి మోసపోయేందుకు మేము సిద్ధంగా లేము. ఈ సారి జగనన్నను గెలిపించుకుంటాం. – జ్యోతిరామేశ్వరి, పద్మనగర్, రేణిగుంట మండలం– 8లో– 8లో -
నమ్మించి.. వంచించిన బాబు
2014 ఎన్నికలకు ముందు మెనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు అబద్ధాలు చెప్పి మహిళల చేత ఓట్లు వేయించుకున్నారు. బ్యాంకుల్లో ఎవ్వరూ అప్పు కట్టొద్దు.. నేనొస్తా.. తీర్చేస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఐదేళ్లు పట్టించుకోలేదు. నా అప్పు బ్యాంక్లో వడ్డీతో కలిపి రూ.2 లక్షలు పేరుకుపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ పేరుతో మహిళలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పాదయాత్రగా వస్తున్న జగనన్నకు మా బాధలు చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ రుణ మాఫీ చేయడంతోపాటు బ్యాంక్ ద్వారా కొత్త రుణాలను ఇచ్చారు. దీంతో నేను చిన్నపాటి టీ స్టాల్ పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాను. జగనన్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబానికి ఏడాదికి రూ.1.92 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. ఈ సారి నా ఓటు జగనన్నకే. – ఎంబేటి నాగభూషణమ్మ, నెల్లిపూడి జగనన్న మాటంటే మాటే గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబునాయుడు మోసం చేశాడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదు. ప్రశ్నించిన గొంతులు నొక్కాడు. మహిళలను అవమానించాడు. ఎన్నికల ముందు పసుపు– కుంకుమ పేరుతో మోసం చేయాలని చూశాడు. ప్రస్తుతం చంద్రబాబును ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు ఇక ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా నమ్మము. ఆయన్ను నమ్మి మోసపోయింది చాలు. ప్రతీసారీ మోసపోవడానికి సిద్ధంగా లేము. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రక్రారం జగనన్న రుణమాఫీ చేశాడు. వైఎస్సార్ ఆసరా పేరుతో నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేశాడు. వచ్చే సార్వత్రి ఎన్నికల్లో కూడా జగనన్న వెంటే ఉంటాం. ఆయన గెలుపునకు కృషి చేస్తాం. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాం. – పీ.రోజారమణి, లక్ష్మీగణపతి డ్వాక్రా సంఘం, పాకాల మండలంనిన్ను నమ్మలేం బాబూ గత ఎన్నికలకు నెల ముందు పసుపు, కుంకుమ అంటూ.. ఖాతాలలో 10 వేల నగదు వేసినట్టు నమ్మ బలికాడు. తీరా ఎన్నికలు అయినాక చూస్తే నా ఖాతాలో నగదు జమకాలేదు. ప్రస్తుత ఎన్నికల సమయంలో మళ్లీ ఆరు గ్యారెంటీలంటూ ప్రచారాలలో ఊదరగొట్టే మాటలు చెబుతున్నారు. గతంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు.. మళ్లీ ఆయన చెబుతున్న గ్యారెంటీలపై మాకు నమ్మకం లేదు. ప్రజలు ఎవ్వరూ ఆయన్ని నమ్మలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. నాకు ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 నాలుగు విడతలు అందింది. అలాగే వితంతు పింఛన్ నెలకు రూ.3వేలు ఇస్తున్నారు. హామీలు నెరవేర్చిన ప్రభుత్వానికి మా మద్దతు తెలియజేస్తున్నాం. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుంటాం. – లక్ష్మమ్మ , చిన్నపాండూరు అరుంధతివాడ, వరదయ్యపాళ్యం మండలం -
వేధింపులు తాళలేక మూకుమ్మడి రాజీనామా
పెళ్లకూరు: టీడీపీ, జనసేన నాయకుల వేధింపులకు నిరసనగా మండలంలోని 13 సచివాలయాలకు చెందిన 216 మంది వలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను ఇన్చార్జ్ ఎంపీడీవో అన్నపూర్ణరావుకు అందజేశారు. వారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సొంత వారే పట్టించుకోని సమయంలో వలంటీర్లు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. తక్కువ గౌరవ వేతనం ఇస్తున్నా అంకితభావంతో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అయినా టీడీపీ, జనసేన నాయకులు వారిని కించపరుస్తూ మాట్లాడడం తగదన్నారు. రాజీనామా చేసిన వలంటీర్లకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. అనంతరం రాజీనామా చేసిన వలంటీర్లతో కలిసి సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పాలూరు మహేంద్రరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రఘునాయుడు, నాయకులు హరిబాబురెడ్డి, మోహన్, ప్రసాద్, వీరకుమార్, బాలసుబ్రమణ్యం, రమణారెడ్డి, కృష్ణయ్య, వినోద్కుమార్రెడ్డి, చంద్రయ్య, మునిరాజ, లింగమనాయుడు, చంద్రయ్యనాయుడు, కుమారస్వామి, సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా రాజీనామా పాకాల: పాకాల మండలంలో పలువురు వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ నాగేంద్రబాబుకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో ఉప్పరపల్లి–16, చెన్నుగారిపల్లి –07, పంటపల్లి–10, వల్లివేడు–08, సామిరెడ్డిపల్లి–09, రమణయ్యగారిపల్లి–05, పెద్దగోర్పాడు–11, పదిపుట్లబైలు–13, మొగరాల–10, మద్దినాయనపల్లి–02, కావలివారిపల్లి–05, కె.వడ్డేపల్లి–07, గానుగపెంట–11 మంది వలంటీర్లు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము రాజీనామాలు చేయడానికి ప్రధాన కారణం టీడీపీ నాయకుల ఆగడాలు, వారు చేస్తున్న ఆరోపణలేనన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు మంచి అవకాశం కల్పించారని, టీడీపీ నాయకుల కుట్రపూరిత వాఖ్యలు, ఫిర్యాదులతో ప్రజలకు సేవ చేసే అవకాశం, అదృష్టం లేకుండా పోయిందని వాపోయారు. పదవుల కోసం ఇష్టమొచ్చినట్లుగా వలంటీర్లపై విమర్శలు చేయడం బాదాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో 40 మంది రాజీమానా గూడూరు రూరల్: పట్టణంలోని 40 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ డీఈ శ్రీనివాసమూర్తికి తమ రాజీనామా పత్రాలను అందించారు. అనంతరం కార్యాలయం ఎదుట వారు మాట్లాడుతూ చదువుకుని పేదలకు సేవ చేస్తున్న తమను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చులకనగా మాట్లాడుతూ హేళన చేయడం బాధకలిగించిందన్నారు. అందుకే తమ పదవులకు రాజీనామా చేసినట్టు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ను కలిశారు. ఇక నుంచి జగన్న సైనికులగా పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. మేరిగతో పాటు, జేసీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చేవూరు విజమోహన్రెడ్డి వారిని అభినందించారు. కోటలో 14 మంది రాజీనామా కోట: మండలంలోని వెంకన్నపాళెంకు చెందిన 14 మంది వలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవో శంకరయ్యకు అందజేశారు. రాపూరులో 22 మంది.. రాపూరు: మండలంలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న 22 మంది వలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన నేతలు తమపై చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా రాజీనామా చేసినట్టు తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. జగనన్నను మళ్లీ సీఎం చేసుకుంటామని ప్రతినబూనారు. ఎవ్వరి ప్రమేయం లేదు వలంటీర్ల రాజీనామాలో ఎవరి ఒత్తిడీ లేదు. మేమంతా స్వచ్ఛందంగా రాజీనామా చేశాం. భవిష్యత్లో జగనన్న కోసం జన సైనికుల్లా పని చేయడానికే రాజీనామా చేశాం. జగనన్న గెలుపునకు కృషి చేస్తాం. – రోజా, వలంటీర్, ఉప్పరపల్లి సచివాలయం, పాకాల మండలం ఏర్పేడు మండలంలో ముగ్గురు రాజీనామా ఏర్పేడు: టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని కొత్తవీరాపురం సచివాలయ పరిధిలోని ముగ్గురు వలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సోమవారం కొత్తవీరాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్, పద్మ, లత స్వచ్ఛందంగా తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ గిడ్డయ్యను కలిసి అందజేశారు. టీడీపీ అండ్ కో వలంటీర్ల సేవలపై అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. -
ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడి
బుచ్చినాయుడుకండ్రిగ: సిద్ధం సభలు, బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబునాయుడు ఉసిగొల్పి అల్లరిమూకల చేత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిపై రాళ్లదాడి చేయించారని సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ తెలిపారు. ఆయన బుధవారం తలారివెట్టు గ్రామంలో సీఎంపై రాళ్లదాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, కరపత్రాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు ఇటువంటి నీచమైన ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మండల వైఎస్సార్సీపీ కన్వీనరు అరణి విద్యానాథరెడ్డి, నాయకులు అరణిసుధాకర్రెడ్డి, మునిరెడ్డి, వేలూరురాకేష్, హరనాథరెడ్డి, గోపాల్రెడ్డి, మణినాయుడు, గురునాథం, వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, అజయ్కుమార్రెడ్డి, ప్రసాద్పాల్, సర్పంచ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
మున్సిపల్ మాజీ చైర్మన్ వైఎస్సార్సీపీలో చేరిక
గూడూరు రూరల్ : గూడూరు మున్సిపల్ మాజీ చైర్మన్, టీడీపీ నేత కొట్టు ఉదయ్కుమార్ సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గూడూరులోని సనత్ నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉదయ్కుమార్కు మేరిగ మురళీధర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ కౌన్సిల్లో ఆయన మూడు పర్యాయాలు కౌన్సిలర్గా, చైర్మన్గా, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చేరికతో ఆ మూడు వార్డుల్లో మంచి పట్టు లభించినట్టయ్యింది. ఈ సందర్భంగా కొట్టు ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయిలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతోగానో ఆకర్షించాయన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవాలని నిశ్చయించుకున్నట్టు స్పష్టం చేశారు. అనంతరం మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగనన్న మీద అభిమానంతో గూడూరులో అండగా ఉండేందుకు సోదరుడిలా ఉదయ్కుమార్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గూడూరు మున్సిపాలిటీ ప్రజలకు రెండు పూటలా తాగునీరు సరఫరా చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, అలాగే గూడూరు ప్రజలకు అత్యంత అవసరమైన 9 అంశాలతో కరపత్రాలను విడుదల చేసి ప్రజల ముందుకు వెళనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులుకు చెందిన వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి జగనన్నకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జేసీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చేవూరు విజయమోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, నాశిన నాగులు, నారాయణరెడ్డి, వాయిగండ్ల నాగరాజు, రాఘవరెడ్డి, అల్తాఫ్, రఫీ పాల్గొన్నారు. -
వలంటీర్ల రాజీనామా
జిల్లాలో వలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. పలువురు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అర్హతే ప్రామాణికం.. అర్హతే ప్రామాణికం, సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన కొనసాగిందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024– 8లోసాక్షి, తిరుపతి: ‘సీఎం జగన్మోహన్రెడ్డిపై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనని టీడీపీలో ఆందోళన మొదలైంది. అందుకే ఇప్పు డు చంద్రబాబు తనమీద తానే రాళ్లు విసిరించుకుని సింపతీ పొందా లని చూస్తున్నారు’అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాళ్లు వేయించుకున్నంత మాత్రాన సింపతీ రాదని చంద్రబాబుకు చురకలు అంటించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి పేరు కోసం టీడీపీ వారే సీఎం వైఎస్ జగన్పై రాళ్లు విసిరారని మండిపడ్డారు. ఒకే రాయి.. సీఎంకు తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందని గుర్తుచేశారు. ఆయన కూడా కంటికి చికిత్స తీసుకుంటున్నారన్నారు. ఇవేమీ చంద్రబాబు అండ్ కోకు కనిపించవా? అని ప్రశ్నించారు. అయినా కూడా తనపై రాళ్ల దాడి జరిగిందని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి కానీ.. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై చంద్రబాబు, లోకేష్ నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా రాళ్లు వేసినట్టు చంద్రబాబు డ్రామా ఆడారని గుర్తుచేశారు. అలిపిరి ఘటన తర్వాత సింపతీతో ఎన్నికలు గెలుద్దాం అని ముందస్తుకు వెళ్లి ఓడిపోయారని గుర్తుచేశారు. సింపతీతో ప్రజలు ఓటు వేయరని, చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని సూచించారు. సింపతీతో జనాలు ఓట్లేయరనే విషయం చంద్రబాబుకు అనుభవపూర్వకంగా తెలుసునంటూ చురకలంటించారు. తండ్రి నీచంగా మాట్లాడుతుంటే, తనయుడు లోకేష్ మరింత నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అండగా ఉంటే.. ప్రజలు నేతలపై నమ్మకం ఉంచుతారని తెలిపారు. అందుకే సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి ఘటనను ఇప్పుడు ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే కనీసం మర్యాదపూర్వకంగా పరామర్శకు రావాల్సింది పోయి.. నీఛ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – 8లో– 8లోన్యూస్రీల్రాళ్లు వేయించుకుంటే.. సింపతీ రాదు బాబూ! తిరుపతి ఉప ఎన్నికల్లోనూ రాళ్లు వేసినట్లు డ్రామా ఆడారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం -
No Headline
వైఎస్సార్సీపీలోకి టీడీపీ యువత సూళ్లూరుపేట : వైఎస్సార్ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీకి చెందిన నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. వేనాటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం దొరవారిసత్రం మండలం తుంగమడుగుకు చెందిన సుమారు 50 మంది యువకులు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తామని వారు తెలిపారు. -
వినూత్న ప్రచారం
నాయుడుపేట టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనల మేరకు సోమవారం ఆ పార్టీ నాయకులు వినూత్నంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. జువ్వలపాళెం రోడ్డు సమీపంలో ఉన్న ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద నుంచి వందలాది మంది ప్రచార ర్యాలీ చేపట్టారు. మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, మధుసూదన్రెడ్డి, టీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత తంబిరెడ్డి మోహన్రెడ్డి, సురేష్ రెడ్డి తదితరుల సారధ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నవరత్న పథకాల చిహ్నాలు ఉన్న చీరలు ధరించి ఆకట్టుకున్నారు. ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. -
అర్హతే ప్రామాణికం..సంక్షేమమే లక్ష్యం
శ్రీకాళహస్తి: అర్హతే ప్రామాణికంగా.. సంక్షేమ మే లక్ష్యంగా సీఎం జగనన్న పాలన సాగిందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తెలిపారు. ప్రజాశీర్వాద పాదయాత్రలో భాగంగా ఆయన పట్టణంలోని 20, 21, 22, 23, 24 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. మొదట తెలుగుగంగ గేటు నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచా రం దేవరమిట్ట, మంచినీళ్లగుంట, మసీదు, వెలంపాళెం సెంటర్, వినాయకుడు వీధి, ఎగు వ కొండమిట్ట, తొండంలేని వినాయకుడు, కొండమిట్ట సెంటర్, ఆలయ మొదటి గేటు గుండా బయటకు వచ్చారు. ఆయా వార్డుల్లో ప్రజలు హారతులుపట్టి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దగకోరు రాజకీయాలకు ప్రతీక అన్నారు. పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామను వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. జగన్ మీద జరిగిన దాడిని తానే చేసుకున్నాడంటూ తనపై కూడా రాళ్లు పడ్డాయంటూ మాట్లాడే విధానం చూస్తుంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారా..? అనిపిస్తోందన్నారు. నాడు అలిపిరి ఘటన తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి బాబును పరామర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అంజూరు తారక శ్రీనివాసులు, మిద్దెల హరి, లోకేష్యాదవ్, పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి, జయగోపాల్, మల్లికార్జునగౌడ్, నాని, శివకుమార్, జిలానీబాషా, బావాజీ గౌస్బాషా, సుమతి, ధనలక్ష్మి, పెరుమాల్, నాగేశ్వరరావు, కంచి గురవయ్య, బాలా, షఫీ, జబ్బా ర్, ప్రసాద్, చంద్ర, సిరాజ్బాషా, మున్నా చంద్రశేఖర్, గోరా, పఠాన్ ఫరీద్, హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. నా ఓటు నీకే మనవడా! -
వ్యక్తి అనుమానాస్పద మృతి
గూడూరు రూరల్ : గూడూరు పట్టణం చర్చి వీధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందండం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం.. పట్టణంలోని చర్చి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవంతి వద్ద మనుబోలు మండలం, కొండూరు సత్రంకు చెందిన మస్తానయ్య(65) నెల రోజలుగా వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విధి నిర్వహణ నిమిత్తం వచ్చిన వ్యక్తి ఉదయం నిద్ర లేచి చూసే సరికే రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఒకటవ పట్టణ సీఐ పాపారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
‘మేలు చేయకపోయినా పర్వాలేదు.. కీడు మాత్రం చేయకూడదు’ అన్న జ్ఞానం కూడా టీడీపీ, జనసేన కూటమికి లేదు. టీటీడీ ఉద్యోగుల పట్ల వారు చేస్తున్న కుట్రలు చూస్తుంటే బాధేస్తోంది. సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నిస్తే వారికి కడుపుమంట కలిగింది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం నేరమా?’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుపతి నగరంలోని 3, 5, 6, 7 డివిజన్లలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు
శ్రీకాళహస్తి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని సూరావారిపల్లెకు చెందిన 47 టీడీపీ కుటుంబాలు, సుమారు 200 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వయ్యాల కృష్ణారెడ్డి, రమేష్యాదవ్, సురేంద్రయాదవ్, నాగరాజురెడ్డి, మనోహర్రెడ్డి, వెంకటేశ్వర్లుయ యాదవ్, నాగభూషణం, సుబ్రహ్హన్యంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన 21వ వార్డు టీడీపీ సీనియర్నేత మెహబూబ్ఖాన్ కూడా వైఎస్సార్సీపలో చేరారు. -
రేపటి నుంచి కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు
చంద్రగిరి: స్థానిక చంద్రగిరి శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం హనుమంత వాహన సేవ ఉంటుందని తెలిపారు. అలాగే ఏప్రిల్ 23న శ్రీసీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నట్టు వెల్లడించారు. రూ.750 చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,057 మంది స్వామివారిని దర్శించుకోగా 27,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. జిల్లా ఓటర్లు 18,03,211 తిరుపతి అర్బన్: జిల్లాలో మొత్తం 18,03,211 మంది ఓటర్లు ఉన్నట్టు కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. ఇందులో పురుషులు 8,78,708, సీ్త్రలు 9,24,321, ట్రాన్స్ జెండర్లు 182 మంది ఉన్నట్టు వెల్లడించారు. అందులో 36,162 మంది కొత్త ఓటర్లుకాగా మిగిలినవారంతా పాత ఓటర్లే. తాజాగా సోమవారం నాటికి మరో ఐదువేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరికి వారం పది రోజుల్లో కొత్త ఓటర్ కార్డు రానుంది. వీరంతా మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. 25న ఓటర్ల జాబితా సిద్ధం తిరుపతి అర్బన్: ఓటర్ల జాబితాకు సంబంధించి ఈనెల 14వ తేదీ వరకు వచ్చిన ఫారం –6, ఫారం – 8లో చిరునామాల మార్పునకు సంబంధించిన కై ్లయిములను ఈనెల 22వ తేదీలోపు పరిష్కరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సోమవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన ఆర్వోలు, ఏఈఆర్వోలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 25 నాటికి ఇంటిగ్రేటెడ్ ఓటర్ల జాబితా సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పారు. బంగారు తిరుచ్చిపై విహారం చంద్రగిరి: శ్రీనివాసమంగాపుంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి అనుబంధంగా వెలసిన శ్రీరామచంద్ర, అమ్మవారితో కలసి సోమవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందంగా అలంకరించారు. సాయంత్రం శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీరామల వారు అయన బంటు హనుమంతులవారితో కలసి బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆలయ ఏఈఓ గోపీనాథ్, ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, ఆర్జితం ఇన్స్పెపెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు. పుత్తూరు డీవైఈఓగా ప్రభాకర్రాజు పుత్తూరు: పుత్తూరు డీవైఈఓగా హెచ్.ప్రభాకర్రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణవనం ఎంఈఓగా పనిచేస్తున్న ఆయనకు డీవైఈఓగా ఎఫ్ఏసీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ సందర్భంగా ప్రభాకర్రాజుకు డివిజన్లోని ఎంఈఓలు, హెచ్ఎంలు అభినందలు తెలిపారు. బంగారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీసీతారామలక్ష్మణ హనుమంతుల వారు -
పోటెత్తిన ప్రజాభిమానం
చంద్రగిరి(తిరుచానూరు): తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజాభిమానం వెల్లువెత్తింది. మా కోసం.. మా ఊరికి.. మా మోహిత్రెడ్డి విచ్చేసారంటూ హోరెత్తింది. సోమవారం తిరుచానూరు పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగునా గజ మాలలు వేస్తూ.. పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం మోహిత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం్ఙ బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అనిపిస్తోందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వలంటీర్ వ్యవస్థ ముందుకు వస్తే.. కుట్ర పూరితంగా ప్రతిపక్ష కూటమి ఫిర్యాదులతో ప్రజలను ఇబ్బందులకు గురుచేశారని ఆరోపించారు. నేడు వలంటీర్లు ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జూన్ 4 తర్వాత వలంటీర్ల పునఃనియామక ప్రక్రియపై తొలి సంతకం చేస్తానని ఇప్పటికే సీఎం జగనన్న స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదాకు చంద్రబాబు నాయుడు అనర్హుడని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో కన్నెత్తి కూడని ప్రతిపక్ష నాయకుడు నేడు ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. మన పార్టీ వైఎస్సార్సీపీ.. మన గుర్తు ఫ్యాన్ గుర్తు అంటూ ప్రజలకు తెలియజేశారు. మన ప్రాంత మరింత అభివృద్ధికి కృషి చేస్తానని.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ యశోద, శ్రీపరాశరేశ్వర ఆలయ చైర్మన్ శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీ నరేష్రెడ్డి, శంకర్, బుజ్జిరెడ్డి, మునీంద్ర, వాసు, లోకేష్ రెడ్డి, నాయక్, రాజేంద్ర, గుణ, విజయలక్ష్మీ, తిరుచానూరు, యోగిమల్లవరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. మా కోసం.. మా ఊరికి.. మా మోహిత్ అడుగడుగునా నీరాజనం తిరుచానూరులో ఆత్మీయ స్వాగతం -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు
తిరుపతి మంగళం: తిరుపతి 6, 7 డివిజన్లకు చెందిన టీడీపీ నాయకుడు సుబ్రమణ్యంరాయల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ.వేణుగోపాల్రాయల్తో పాటు వందల మంది నాయకులు, కార్యకర్తలు టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, 7వ డివిజన్ అధ్యక్షులు చిమట రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు ఉదయ్రాయల్, సాయిరాయల్, మూర్తిరాయల్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్, భాను, జ్ఞానశేఖర్, గల్లా సుధీర్రాయల్, గల్లారెడ్డి నరిసింహులు, గల్లా సుమంత్, ఈశ్వరి తదితరులు ఉన్నారు. -
సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా ఈవీఎం, వీవీప్యాట్లు
● వీటిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న యంత్రాంగం ● అంధుల కోసం ప్రత్యేక గుర్తులు ● చెల్లని ఓట్లకు చెల్లు చీటీ తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. ఓటర్ల సందే హాలను నివృత్తి చేస్తోంది. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెల్లని ఓట్లకు చెక్ పడింది. భారీ ఎత్తున కాగితం వినియోగమూ తగ్గింది. సమయం ఆదా అవుతోంది. జిల్లాలో తిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతోంది. అందులో భాగంగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) ద్వారా ఓటర్లు ఓటువేయడానికి వీలుగా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. మరోవైపు పోలింగ్ రోజున ఈవీఎంల వినియోగంపై ఇప్పటికే రిటర్నింగ్్ (పీవో), అసిస్టెంట్ రిటర్నింగ్(ఏపీవోలు)శిక్షణ ఇచ్చింది. ఈ మేరకు గ్రామాల్లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. పేపర్ బ్యాలెట్ నుంచి ఈవీఎంల వరకు.. స్వతంత్ర భారతావనిలో ఎన్నికలను మొదటిగా పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించేవారు. అభివృద్ధిలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఎన్నికల పారదర్శకత కోసం ఈవీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పోలింగ్ సమయం ఆదాతోపాటు ఓట్ల లెక్కింపు శరవేంగా పూర్తిచేస్తున్నారు. ఈవీఎంల్లో 2006 కంటే ముందు ఎం1, ఆ తర్వాత ఎం2 ఈవీఎంలు ఉండేవి. ఆ తర్వాత వాటికి నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేశారు. దీంతో గరిష్టంగా 64 మంది(నోటాతో కలిపి) అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఎం3 ఈవీఎంలను తయారు చేయగా 24 బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేశారు. దీంతో గరిష్టంగా నోటాతో కలిపి 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించవచ్చు. వీటన్నింటికీ ఒకే కంట్రోల్ యూనిట్ అవసరమవుతుంది. 1982లో తొలిసారిగా కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 1982–83లో జరిగిన ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 1984 ఆగస్టులో ఈవీఎంలను వాడరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 1988 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 81ఏను ప్రజాప్రాతినిథ్య చట్టంలో చేర్చింది. ఈ సవరణ అనంతరం పరిశీలన తర్వాత ఈవీఎంలతో ఓటింగ్ ప్రక్రియకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. 1990లో సాంకేతిక నిపుణుల కమిటీ ఈవీఎంల వాడకానికి సిఫార్సు చేసింది. 1998లో ఈవీఎంల వాడకానికి ప్రజామోదం లభించింది. ఈ క్రమంలో 1999–2004లో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. ఇదే క్రమంలో 2013లో నాగాలాండ్లోని నాక్సెస్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో వీవీప్యాట్లను(ఓటర్ వెరిఫయేబుల్ పేపర్ అడిట్ ట్రయల్) మొదటిసారిగా వినియోగించారు. 2013లో సుప్రీంకోర్డు దశలవారీగా వీవీప్యాట్లను వినియోగంలోకి తేవాలని ఆదేశించింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా వీవీప్యాట్లు సైతం వాడుకలోకి వచ్చేశాయి. కంట్రోల్ యూనిట్తోకూడిన బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ యూనిట్ టైప్ పార్లమెంట్కు అసెంబ్లీకి మొత్తం బ్యాలెట్ యూనిట్ 3210 3248 6458 కంట్రోల్ యూనిట్ 2575 2574 5149 వీవీప్యాట్లు 3129 3162 6291 ఓటును చూపే వీవీప్యాట్ ఎన్నికల్లో ఈవీఎంలపై మరింత నమ్మకాన్ని పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఎన్నికల సంఘం వీవీప్యాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2017 తర్వాత అన్ని ఎన్నికల్లో వీటిని వాడుతున్నారు. ఓటరు తాను ఓటు వేసిన వ్యక్తికే పడిందా లేదా పరిశీలించుకోవడానికి అనుకూలంగా తయారుచేసిన యంత్రం వీవీప్యాట్. నీలి బటన్ నోక్కి ఓటు వేసిన తర్వాత పక్కనున్న వీవీప్యాట్లో ఒక చీటీ ముద్రించి కనిపిస్తోంది. ఈ చీటీలో ఓటరు వేసిన అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తు ఉంటాయి. ఈ చీటీ కేవలం ఏడు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది. అనంతరం ఆ చీటీకట్ అయ్యి వీవీ ప్యాట్లోని పెట్టెలో పడిపోతుంది. పీవో వద్ద కంట్రోల్ యూనిట్ ఈవీఎంలో ముఖ్యంగా రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, రెండోది బ్యాలెట్ యూనిట్. ఈ రెండింటినీ ఐదు మీటర్ల కేబుల్ అనుసంధానం చేస్తుంది. పీఓ వద్ద కంట్రోల్ యూనిట్ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ను ఓటర్ ఓటు వేయడానికి వీలుగా నిర్దేశించిన ప్రదేశంలో ఉంచుతారు. కంట్రోల్ యూనిట్లోని బ్యాలెట్ బటన్ ద్వారా పీఓ అనుమతి తర్వాత ఓటరు బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి వీలవుతుంది. ఈ క్రమంలో ఒక ఓటర్ ఒక ఓటు మాత్రమే వేయగలరు. ఓటు వేసిన వెంటనే కంట్రోల్ యూనిట్లోని బ్యాలెట్ బటన్ లాక్ అవుతుంది. అంధుల కోసం ప్రత్యేకం బ్యాలెట్ యూనిట్లో అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపితో కూడిన గుర్తులు ఉంటాయి. ఓటు వేసే నీలి రంగు బటన్ పక్కన బ్రెయిలీ లిపితో సంఖ్య ఉంటుంది. చేతి వేళ్లతో తడిమితే స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. తాను ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పరుస సంఖ్య ఆధారంగా అంధులు సులభంగా ఓటు వేయవచ్చు. -
వారికి ఇళ్ల స్థలాలు, పెంచిన వేతనాలు రానీయకుండా అడ్డు
● టీడీపీ, జనసేన ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదు ● 3, 5, 6, 7 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన తిరుపతి కొర్లగుంట మెయిన్రోడ్డులో అశేష జనవాహిని మధ్య ఎమ్మెల్యే భూమన ఎన్నికల ప్రచారంతిరుపతి మంగళం: టీటీడీ ఉద్యోగులపై కపట కూటమి కుట్రపన్నిందని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని 3, 5, 6, 7 డివిజన్లలో సోమవారం కార్పొరేటర్లు తమ్ముడు గణేష్, పుల్లూరు అమరనాథ్రెడ్డి, కేతం జానకి, కేతం జయచంద్రారెడ్డి, చిమట రమేష్ ఆధ్వర్యంలో ఆయన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి అడుగడుగునా మహిళలు హారతులు పట్టి పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో టీటీడీ చైర్మన్గా రెండవ సారి అవకాశం కల్పించారన్నారు. దాంతో టీటీడీలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతా ల పెంపును పరిష్కరించడం టీడీపీ, జనసేన కూటమికి ఇష్టంలేనట్లుందని మండిపడ్డారు. శ్రీవారి భక్తులకు సేవ చేసే భాగ్యం, టీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే అవకాశం లభించినందుకు వారికి సేవ చేస్తున్నానే తప్ప తన స్వలాభం, స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. టీడీపీ, జనసేన కూటమి నాయకుడు ఓట్లు కోసం తన కుటుంబంపై అనేక ఆరోపణలు చేస్తున్నాడే తప్ప ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పడం లేదని దుయ్యబట్టారు. తిరుపతి నగరంలో నిర్మించిన మాస్టర్ప్లాన్ రోడ్ల కోసం ఇచ్చిన భూములన్నీ వారికి తిరిగి ఇప్పిస్తాడంట, అంటే రోడ్లు నిర్మించడం ఆయనకు ఇష్టం లేదా, రోడ్లు పగులగొట్టి వారి భూములు వారికి ఇస్తారా? అని ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ధిపైన టీడీపీ, జనసేన కూటమి ఎన్ని ఆరోపణలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని, తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధిని ఆపే ధమ్ము, ధైర్యం కూటమికి ఉందా..? అని సవాల్ విసిరారు. తన కుమారుడు భూమన అభినయ్ తిరుపతి నగర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, తిరుపతిలో చేసిన అభివృద్ధితో అభినయ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, గోపాల్రెడ్డి, కొండ మునిరెడ్డి, వెంకటరెడ్డి, కంకనాల రమేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, తిరుత్తణి శైలజ, కో–ఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి, నాయకులు వెంకటేష్రాయల్, నాదమునిరెడ్డి, నారాయణరెడ్డి, బాలాజీ, శివప్రసాద్రాయల్, రాము, వెంకటేష్, సుధ, శ్రీనుయాదవ్, లోకి, విజయారాయల్, విజయలక్ష్మి, కిరణ్ పాల్గొన్నారు. -
గోడ పక్కన గుర్తు తెలియని మృతదేహం
గూడూరురూరల్ : మండలంలోని గోగినేని పురం సమీపంలో సిట్రస్ ఫ్యాక్టరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు నాలుగు రోజుల క్రితం ఆ వ్యక్తి (55) మృతి చెంది ఉంటాడని, దేహం కుళ్లిపోవడంతో ఆనవాళ్లు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పుల్హ్యాండ్స్ బ్లాక్ షర్లు, బ్లాక్ ఫ్యాంటు ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలియవచ్చని చెప్పారు. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
● సీఎం వైఎస్ జగన్పై దాడిని ఖండించిన నేతలు ● కొవ్వొత్తుల ర్యాలీలు.. నల్లబ్యాడ్జీలతో ప్రదర్శనలు ● కూటమి పార్టీలపై వెల్లువెత్తిన నిరసనలు ● హత్యా రాజకీయాలు మానుకోవాలంటూ ఆందోళనలు
జగన్పై రాళ్ల దాడి ప్రతి పేద గుండెకూ తగిలింది! ‘సంక్షేమ సారథి, ప్రజాసేవకుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై చేసిన రాళ్ల ప్రతి పేదవాడి గుండెకూ తగిలింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకే చంద్రబాబు, పవన్కళ్యాణ్ రాళ్లదాడి చేయించారు. వాళ్లిద్దరూ నిర్వహించే ప్రతి సభలోనూ జగన్ను అంతమొందిస్తామని చెప్పడం వెనుక వారి హత్యారాజకీయాలు అర్థమవుతున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో కుట్రపూరిత, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, పవన్లు జగనన్నను రాళ్లతో కొట్టించారు.. వారిని రాష్ట్ర ప్రజలు ఓట్లుతో కొడతారు’. అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శనివారం విజయవాడలో జరిగిన రాళ్లదాడిపై జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఆదివారం ఈమేరకు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శ్రీకాళహస్తి : ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పట్టనంలోని 16వ వార్డు నుంచి 20వ వార్డుల్లో నల్లబ్యాడ్జీలతోనే ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ కమిటీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, నేతలు సిరాజ్బాషా, గోరా పాల్గొన్నారు. చంద్రగిరి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవేడు : నియోజకవర్గంలోని నారాయణవనంలో వైఎస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూతతోటి రాజేష్ నిరసన తెలిపారు. కార్యక్రమంలో నేతలు దివాకర్రెడ్డి, సొరకాయలు, వెంకటరమణ, అన్నాదొరై పాల్గొన్నారు.వరదయ్యపాళెంలో పార్టీ మండల కన్వీనర్ దయాకర్రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు. సూళ్లూరుపేట : ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నిరసన చేపట్టారు.చంద్రబాబు నీచమైన రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సత్యనారాయణరెడ్డి, బాలచంద్రారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కూటమి నేతలు హింసాత్మక రాజకీయాలు మానుకోవాలని కోరారు. గూడూరు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరు రూరల్లోని రామలింగాపురంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతల వైఖరిపై పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ముస్లింలు నిరసన తెలిపారు. బాబు, పవనే కారకులు సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడికి కారకులు చంద్రబాబు, పవన్కళ్యాణే అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే వారు చేసిన రెక్కీ మాత్రమే ఇది అన్నారు. విజయవాడలో శనివారం రాత్రి సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జీవకోన వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. భూమన కరుణాకరరెడ్డి నల్ల కండువా కప్పుకుని, భూమన అభినయ్ నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే... వైఎస్ జగన్మోహన్రెడ్డి పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ హత్యారాజయాలు నశించాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలల నుంచి జగన్ మోహన్రెడ్డిని అంతం చేస్తాం అని వీళ్లిద్దరూ అంటున్నారని గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా రాజకీయల్లో ఎదుర్కొనే శక్తి లేక, భౌతికంగా అంతమొందించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవే అని, వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడూ జగన్మోహన్రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారని అన్నారు. ఈ హత్య రాజకీయాలను ఖండిస్తూ తిరుపతిలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల గుండెల్లో కొలువైన మహా నాయకుడు వైఎస్ జగన్కు ఏదైన ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలంతా భయపడుతున్నారని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కిందట చంద్రబాబు పై అలిపిరిలో దాడి జరిగితే.. కనీసం తెలుగుదేశం వాళ్లు కూడా నిరసన చేయలేదన్నారు. దివంగత వైఎస్సార్, తాను మాత్రమే అప్పట్లో తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పాల్గొన్నారు. -
షార్లో ఘనంగా అంబేడ్కర్ జయంతి
సూళ్లూరుపేట : అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ పిలుపునిచ్చారు. ఆదివారం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని బ్రహ్మప్రకాష్ హాలులో అంబేద్కర్ 133 జయంతిని ఘనంగా నిర్వహించారు. షార్లోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నిశాళులర్పించారు. అనంతరం షార్ డైరెక్టర్ రాజరాజన్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆ రోజుల్లో అంటరానితనాన్ని భరిస్తూనే ఉన్నతంగా చదువుకుని ప్రపంచ మేధావి అనిపించుకున్నారని కొనియాడారు. చదువుకు ఎంత గౌరవం వుందో ఆయన ఈ సమాజానికి చూపించారని తెలిపారు. కార్యక్రమంలో షార్ కంట్రోలర్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్కుమార్, అధికారులు సయీద్ ఆమీద్, ఎస్.శంకరన్, పి.సునీల్ పాల్గొన్నారు. -
క్రీడా స్ఫూర్తిని చాటేందుకే 5కే రన్
ఏర్పేడు : క్రీడా స్ఫూర్తిని చాటేందుకే 5కే రన్ నిర్వహించినట్లు ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఏర్పేడు సమీపంలోని ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో 5కే రన్ చేపట్టారు. జెండా ఊపి రన్ను ప్రారంభించిన అనంతరం డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఒక చోట చేర్చుతాయన్నారు. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తాయని వెల్లడించారు. వెల్నెస్, పోటీ స్ఫూర్తిని ప్రోత్సహించడంలో స్పాన్సర్లకు ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయని వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరుకావడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు పతకాలు, నగదు బహుమతులు పంపిణీ చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 82,139 మంది స్వామివారిని దర్శించుకోగా, 39,849 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. అందరికీ స్ఫూర్తి అంబేడ్కర్ తిరుపతి కల్చరల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ నిర్వహించిన అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షనకు అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి.రవి మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం వంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలను అంబేడ్కర్ చేపట్టినట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు గోవిందరాజన్, లక్ష్మణ్ నాయక్, దేవేంద్రబాబు, స్నేహలత పాల్గొన్నారు. ఘనంగా ఆరుద్ర పూజలు శ్రీకాళహస్తి: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిదంపతులు పట్టణ సమీపంలోని ఊరందూరులో వెలసిన శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లను చప్పరాలపై అధిష్టింపచేసి ఊరేగింపుగా నీలకంఠేశ్వరాలయానికి తీసుకెళ్లారు. అక్కడ పూజల అనంతరం స్వామి అమ్మవార్లు తిరిగి పానగల్, అగ్రహారం, సన్నిధివీధి, నాలుగు మాడ వీధుల మీదుగా ముక్కంటి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
No Headline
ఆదాయం కళ్లజూస్తున్నాం గత టీడీపీ ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో మా జీవనశైలి సమూలంగా మారింది. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేట నష్టాల్లో సాగడమే కాకుండా, వచ్చిన కొద్దిపాటి మత్స్యసంపదను అమ్ముకోవడానికి తిప్పలు పడ్డాం. అయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు రాయితీలు కల్పించడంతో వేటలో ఖర్చులు బాగా తగ్గాయి. ఇప్పుడు పెట్టుబడులు పోను ఆదాయం కళ్లజూస్తున్నాం. – పామంజి యర్నాపూర్, మత్స్యకారుడు, కొండూరుపాళెం, వాకాడు మండలం -
అలసత్వం లేకుండా విధులు
రాపూరు : అలసత్వం లేకుండా విధులు నిర్వహించాలని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్ స్పష్టం చేశారు. ఆదివారం రాపూరు పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను బోర్డుపై తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెక్పోస్టులు, టోల్ప్లాజాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రౌడీ షీటర్లను బైండవర్ చేసి వారిపై నిఘా పెట్టాలలని తెలిపారు. ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా భరోసా కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ మాల్యాద్రి పాల్గొన్నారు. ఇంట్లో చోరీ బుచ్చినాయుడుకండ్రిగ : స్థానిక గ్రామ సచివాలయం సమీపంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. సమారు 48 గ్రాముల బంగారు నగలను అపహరించాడు. వివరాలు.. చెంచురెడ్డి, ఆయన భార్య ఇంటి బయట నిద్రిస్తున్నాడు. ఇంటికి తాళం వేయకపోవడంతో దుండగుడు సులువగా లోపలికి ప్రవేశించాడు. డ్రస్సింగ్ టేబుల్ డ్రాలో పెట్టిన ఆభరణాలను చోరీ చేశాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ విషయాన్ని బాధితులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహం, ఏఎస్ఐ రమేష్బాబు తెలిపారు.