బుచ్చినాయుడుకండ్రిగ: సిద్ధం సభలు, బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబునాయుడు ఉసిగొల్పి అల్లరిమూకల చేత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిపై రాళ్లదాడి చేయించారని సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ తెలిపారు. ఆయన బుధవారం తలారివెట్టు గ్రామంలో సీఎంపై రాళ్లదాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, కరపత్రాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు ఇటువంటి నీచమైన ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మండల వైఎస్సార్సీపీ కన్వీనరు అరణి విద్యానాథరెడ్డి, నాయకులు అరణిసుధాకర్రెడ్డి, మునిరెడ్డి, వేలూరురాకేష్, హరనాథరెడ్డి, గోపాల్రెడ్డి, మణినాయుడు, గురునాథం, వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, అజయ్కుమార్రెడ్డి, ప్రసాద్పాల్, సర్పంచ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడి
Published Tue, Apr 16 2024 1:35 AM | Last Updated on Tue, Apr 16 2024 1:35 AM
1/1
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement
Comments
Please login to add a commentAdd a comment