గూడూరురూరల్ : మండలంలోని గోగినేని పురం సమీపంలో సిట్రస్ ఫ్యాక్టరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు నాలుగు రోజుల క్రితం ఆ వ్యక్తి (55) మృతి చెంది ఉంటాడని, దేహం కుళ్లిపోవడంతో ఆనవాళ్లు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పుల్హ్యాండ్స్ బ్లాక్ షర్లు, బ్లాక్ ఫ్యాంటు ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలియవచ్చని చెప్పారు. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గోడ పక్కన గుర్తు తెలియని మృతదేహం
Published Mon, Apr 15 2024 1:20 AM | Last Updated on Mon, Apr 15 2024 1:20 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement
Comments
Please login to add a commentAdd a comment