గోడ పక్కన గుర్తు తెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

గోడ పక్కన గుర్తు తెలియని మృతదేహం

Published Mon, Apr 15 2024 1:20 AM | Last Updated on Mon, Apr 15 2024 1:20 AM

-

గూడూరురూరల్‌ : మండలంలోని గోగినేని పురం సమీపంలో సిట్రస్‌ ఫ్యాక్టరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు నాలుగు రోజుల క్రితం ఆ వ్యక్తి (55) మృతి చెంది ఉంటాడని, దేహం కుళ్లిపోవడంతో ఆనవాళ్లు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పుల్‌హ్యాండ్స్‌ బ్లాక్‌ షర్లు, బ్లాక్‌ ఫ్యాంటు ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలియవచ్చని చెప్పారు. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement