-
వేటకు విరామం!
వేకువ జామునే నిద్ర లేచి.. చద్దన్నం బాక్సు చేతపట్టుకుని .. పడవపై హైలో హైలెస్సా.. అంటూ సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడడం.. దొరికిన మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చి విక్రయించడం.. వచ్చిన సొమ్ముతో కుటుంబాలను పోషించుకోవడం.. ఇదీ మత్స్యకారుల నిత్య జీవనం. వేట సమయంలో చేపలు దొరక్కపోతే పూట గడవని పరిస్థితి ఎందరిదో. ఇలా బతుకు బండిని నడిపించే కడలి పుత్రులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో అండగా నిలిచింది. నాలుగేళ్లుగా వేట నిషేధ కాలంలో ముందస్తుగానే పరిహారం అందిస్తోంది. అలాగే బోట్లకు సబ్సిడీపై డీజిల్ పంపిణీ చేస్తోంది. సాగరంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు బీమా సొమ్మును రెట్టింపు చేసింది. ఈ క్రమంలో కడలి పుత్రుల అభ్యున్నతికి పూర్తి సహకారం అందిస్తోంది. గుమ్మళ్లదిబ్బ వద్ద వేట విరామం కారణంగా నిలిపి వేసిన బోట్లు చిల్లకూరు/వాకాడు : సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం చేపల సంతానోత్పత్తి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 61 రోజుల పాటు వేటకు విరామం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో మత్స్యకారులు చేపల వేట సాగించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ సమయంలో గంగపుత్రుల పొట్ట పోషణకు ప్రభుత్వం రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తోంది. నాలుగేళ్లుగా రూ.11,37,30,000లను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ పర్యాయం మాత్రం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలింగ్ అయిన తర్వాత గంగపుత్రులకు పరిహారం సొమ్ము అందించేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అన్నీ అవస్థలే..! టీడీపీ ప్రభుత్వం హయాంలో మత్స్యకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ సమయంలో వేటకు విరామం ప్రకటించినప్పుడు మత్స్యకారులు దినసరి కూలీలుగా మారాల్సిన దుస్థితి ఉండేది. ఒకప్పుడు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.1,800లు అందించేవి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ ఏడాది కాలం ఈ పథకాన్ని సైతం ఎగ్గొట్టింది. 2015–16లో కుటుంబానికి రూ.2వేలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంది. తర్వాత 2019లో ఎన్నికలు రావడంతో వేట విరామ పరిహారాన్ని రూ.4 వేలకు పెంచి కొంత మందికి మాత్రమే ఇచ్చి సరిపెట్టింది. బాసటగా నిలిచిన ప్రభుత్వం జిల్లాలోని 5 మండలాల్లో 75 కిలోమీటర్లు పొడవునా సముద్ర తీరం విస్తరించి ఉంది. వాకాడు, కోట, చిల్లకూరు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో 42 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 70 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సముద్రంపై వేటకు వెళ్లు మత్స్యకారులు 12 వేల మంది,1,022 బోట్లు ఉన్నాయి. 31 ఫిష్ లాండ్స్ ఉన్నాయి. వీరందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. వేట విరామ పరిహారాన్ని రూ.10 వేలకు పెంచారు. అదీ విరామం ప్రకటించిన సమయానికి ముందుగానే పరిహారం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మత్స్యకార ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంపుదల చేశారు. డీజిల్పై సబ్సిడీ రూ.9లకు పెంచారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గంగపుత్రుల జీవనానికి అన్ని విధాలుగా బాసటగా నిలిచారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో నాలుగేళ్లుగా అందించిన పరిహారం : రూ.11,37,30,000 డీజిల్ సబ్సిడీ కింద అందించిన మొత్తం : రూ.23,65,200 నేటి నుంచి జూన్ 14 వరకు ప్రకటించిన ప్రభుత్వం మత్స్య సంపద అభివృద్ధే లక్ష్యం కడలి పుత్రులకు పరిహారంతో ఉపశమనం కోడ్ కారణంగా ఎన్నికల తర్వాత ‘భరోసా’ పంపిణీకి అవకాశం -
క్రీడా స్ఫూర్తిని చాటేందుకే 5కే రన్
ఏర్పేడు : క్రీడా స్ఫూర్తిని చాటేందుకే 5కే రన్ నిర్వహించినట్లు ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఏర్పేడు సమీపంలోని ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో 5కే రన్ చేపట్టారు. జెండా ఊపి రన్ను ప్రారంభించిన అనంతరం డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఒక చోట చేర్చుతాయన్నారు. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తాయని వెల్లడించారు. వెల్నెస్, పోటీ స్ఫూర్తిని ప్రోత్సహించడంలో స్పాన్సర్లకు ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయని వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరుకావడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు పతకాలు, నగదు బహుమతులు పంపిణీ చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 82,139 మంది స్వామివారిని దర్శించుకోగా, 39,849 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. అందరికీ స్ఫూర్తి అంబేడ్కర్ తిరుపతి కల్చరల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ నిర్వహించిన అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షనకు అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి.రవి మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం వంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలను అంబేడ్కర్ చేపట్టినట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు గోవిందరాజన్, లక్ష్మణ్ నాయక్, దేవేంద్రబాబు, స్నేహలత పాల్గొన్నారు. ఘనంగా ఆరుద్ర పూజలు శ్రీకాళహస్తి: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిదంపతులు పట్టణ సమీపంలోని ఊరందూరులో వెలసిన శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లను చప్పరాలపై అధిష్టింపచేసి ఊరేగింపుగా నీలకంఠేశ్వరాలయానికి తీసుకెళ్లారు. అక్కడ పూజల అనంతరం స్వామి అమ్మవార్లు తిరిగి పానగల్, అగ్రహారం, సన్నిధివీధి, నాలుగు మాడ వీధుల మీదుగా ముక్కంటి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గోడ పక్కన గుర్తు తెలియని మృతదేహం
గూడూరురూరల్ : మండలంలోని గోగినేని పురం సమీపంలో సిట్రస్ ఫ్యాక్టరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు నాలుగు రోజుల క్రితం ఆ వ్యక్తి (55) మృతి చెంది ఉంటాడని, దేహం కుళ్లిపోవడంతో ఆనవాళ్లు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పుల్హ్యాండ్స్ బ్లాక్ షర్లు, బ్లాక్ ఫ్యాంటు ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలియవచ్చని చెప్పారు. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రూ.6.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
చిల్లకూరు: నెల్లూరు నుంచి తిరుపతికి తరలిస్తున్న బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకుని చిల్లకూరు స్టేషన్కు తరలించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. చెన్నె– కోలకత్తా జాతీయ రహదారి, బూదనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో పలు గోల్డ్ షోరూంలకు చెందిన రూ 6.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వాహనం నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్నట్లు గుర్తించారు. అయితే వాహనంలో ఉన్న షోరూం ప్రతినిధులు బంగారు ఆభరణాలకు చెందిన అన్ని బిల్లులు ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు, ఆభరణాలకు చెందిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జీఎస్టీ అధికారులకు సమచారం ఇచ్చారు. దీంతో అధికారులు స్టేషన్కు వచ్చి వాహనంలో ఉన్న ఆభరణాలను బయటకు తీసి అందుకు సంబంధించిన బిల్లులు పరిశీలిస్తున్నారు. వస్తువులకు, బిల్లుల్లో ఉన్న బరువుకు ఏదైనా తేడా ఉందా..? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఆభరణాలకు చెందిన బిల్లులు ఉన్నప్పటికి వాటిని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
No Headline
ఆదాయం కళ్లజూస్తున్నాం గత టీడీపీ ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో మా జీవనశైలి సమూలంగా మారింది. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేట నష్టాల్లో సాగడమే కాకుండా, వచ్చిన కొద్దిపాటి మత్స్యసంపదను అమ్ముకోవడానికి తిప్పలు పడ్డాం. అయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు రాయితీలు కల్పించడంతో వేటలో ఖర్చులు బాగా తగ్గాయి. ఇప్పుడు పెట్టుబడులు పోను ఆదాయం కళ్లజూస్తున్నాం. – పామంజి యర్నాపూర్, మత్స్యకారుడు, కొండూరుపాళెం, వాకాడు మండలం -
ఆరంభం.. అగస్తీశ్వరుని సంబరం
నారాయణవనం: మండలంలోని సముదాయంలో వెలసిని మరగదవళ్లీ సమేత అగస్తీశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేకువనే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకవచ్చారు. వేద మంత్రాల నడుమ నందీశ్వరుని చిత్రపటాన్ని ధ్వజస్తంభాన్ని అధిరోహింపజేశారు. ఈ క్రమంలోనే ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. దూప, దీప, నైవేధ్యాలను సమర్పించారు. అనంతరం ఉత్సవర్లను విశేషంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, కోలాటాల మద్య స్వామి వారు సముదాయం గ్రామ వీధుల్లో విహరిస్తూ హారతులను అందుకున్నారు. కార్యక్రమాల్లో టీటీడీ ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, అర్చకులు రమేష్ గురుకుల్, గౌతమ్ గురుకుల్ పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం అగస్తీశ్వరస్వామివారు సింహవాహనంపై ఊరేగనున్నారు. -
● కరోనా కష్టకాలంలో ప్రజాసేవకే అంకితమయ్యా ● తిరుమల తరహాలో శ్రీకాళహస్తిని అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం ● ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి
శ్రీకాళహస్తి: ‘కరోనా కష్టకాలం వచ్చినపుడు అందరూ భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సందర్భంలో నేను ప్రజల సేవలోనే తరించా. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడా’నని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తెలిపారు. తాను ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ఎవరికి ఏ ఆపదొచ్చినా పిలిస్తే పలుకుతున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మరో సారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం పట్టణంలోని 11, 12, 13, 14, 15 వార్డుల్లో ప్రజాశీర్వాద పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంతమైదానం నుంచి బయలుదేరి అంకమ్మ గుడి మీదుగా ముత్యాలమ్మ గుడివీధిలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఏడుగంగమ్మల గుడి, ముత్యాలమ్మగుడి మీదుగా పెండ్ది పండం వద్దకు చేరుకుని ఓటేరు కాలువ మీదుగా గాంధీవీధి, వినాయకుని గుడి వద్దకు చేరారు. అక్కడి నుంచి నగాచిపాళెం మీదుగా పాత బస్టాండు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కరోనా కష్ట కాలంలో సేవ చేశానన్నారు. తాను బతికినంత కాలం ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. మళ్లీ అవకాశమిస్తే వీటిని నెరవేర్చుతా ● ఆలయాన్ని రూ.100కోట్లతో మాస్టర్ప్లాన్లో భాగంగా అభివృద్ధి చేస్తా. ● రూ.20 కోట్లతో శివం టూ శివం రోడ్డుకు శంకుస్థాపన చేశా. అది పూర్తయితే శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ● స్కిట్ కళాశాలను జేఎనటీయూకు అనుసంధానం చేయడానికి అన్ని పత్రాలు సమర్పించా. ● రేణిగుంట వద్ద బాలాజీ మెడికల్ కళాశాలను తీసుకువచ్చా. శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా మరో మెడికల్ కళాశాల తీసుకొస్తా. ● పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నా. ● సమ్మర్స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచి పట్టణానికి మరింత మెరుగైన తాగునీరు ఇవ్వడానికి కృషి చేస్తా. ప్రచారానికి పోటెత్తిన జనం (ఇన్సెట్) ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిపార్టీలో చేరిక 14వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు కాపిరాల శ్రీనివాస్ జెట్టి ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, జనార్దన్రావు పవార్, పగడాల రాజు, వయ్యాల కృషారెడ్డి, జయగోపాల్, మల్లికార్జున్గౌడ్, మాబాషా, లత, హరినాయుడు, కంఠా ఉదయ్, సెన్నీచుకుప్పం శేఖర్, రమేష్, గురునాగరాజు, స్వర్ణమూర్తి, ప్రభాకర్, గరికపాటి చంద్ర, పాండు, మాలతి, రవి, కిరణ్, నాజర్, కమలమ్మ, కిషోర్, సుబ్బరాయులు, జయ, సుశీల, రూపేష్, సరళ, సున్ని, అబ్బయ్య, శ్రీనివాస్, శరవణ, పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీ, వివేకానంద కాలనీలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.ఇద్దరికి తీవ్ర గాయాలు సైదాపురం మండల సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024– 8లోజగనన్నపై దాడి పిరికిపంద చర్య బెజవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగనన్నపై చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ పిరికిపందలు దాడిచేశారు. బస్సు యాత్ర లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జగనన్నపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అందదండలు, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంతవరకు ఆయనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ ఇది రాక్షస చర్య చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అధికారం కోసం హత్యలకు కూడా వెనుకాడడు. జగనన్నకు లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే దాడులు చేయించారు. ఇవి మనుషులు చేసే చర్యలు కావు. జనం గుండెల్లో నిలిచిపోయిన జగనన్నకు హాని జరిగితే జనం బుద్ధి చెబుతారు. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తిరుపతి మంగళం : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై రాళ్లదాడిని అభిమానులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఖండించారు. శనివారం రాత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటించారు. జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్కల్యాణ్ ప్రోద్బలంతో అగంతకుల చేత రాళ్లదాడి చేయించినట్టు ఆరోపించారు. తిరుపతి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్లని బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ బ్యానర్లు దహనం చేశారు. రాష్ట్ర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీన్ని చూసి ఓర్వలేక రౌడీమూకలతో రాళ్ల దాడి చేయడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. సింహంలాగా సింగిల్గా వస్తు న్న జగనన్నను ఎదుర్కోలేక రాళ్ల దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పాకాల మండల కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్ కూడలి, దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద, శ్రీకాళహస్తిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఇది ముమ్మాటికీ టీడీపీ నాయకుల కుట్రతోనే జరిగిందని ఆరోపించారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, తిరుమలరెడ్డి, కోటూరు శశి, తాలూరి ప్రసాద్, మోహన్, శీను, సిద్దు, నాగరాజు, సింగిల్విండో చైర్మన్ మునీశ్వర్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మునీర్, డివిజన్ అధ్యక్షుడు కపిలేశ్వర్రెడ్డి, గుండ్లూరి సురేష్, డాక్టర్ శివకుమార్, రాయలసీమ మోహన్, ఎంపీటీసీ సురేష్, సర్పంచ్ వసంత, నంద, జేసీపీ బాబు, ప్రకాష్, బాను, గిరి, హరీష్, రాజు, మురళి, బేటా, రెహంతుల్లా పాల్గొన్నారు. – 8లో– 8లోన్యూస్రీల్సీఎం జగన్పై రాళ్ల దాడి అమానుషం చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలకు నిదర్శనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెల్లుబికిన నిరసనలు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
సైదాపురం: మండలంలోని తిప్పిరెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం.. మండలంలోని చాగణం రాజుపాళెం గ్రామానికి చెందిన పోట్లూరు సాయి వ్యక్తిగత పని నిమిత్తం శుక్రవారం రాత్రి సైదాపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అదేవిధంగా కంభం వెంక టేశ్వర్లు కూడా అదే సమయంలో రాపూరు నుంచి సైదాపురానికి వస్తున్నాడు. తిప్పిరెడ్డిపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్లు నుజ్జనుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో సాయి, వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ డీఎస్ విజయ్కుమార్ తెలిపారు. దేశ ఉన్నతికి ఎన్ఆర్ఐలు కృషి చేయాలి ● హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుపతి సిటీ : ఎన్ఆర్ఐలు దేశ ఉన్నతికి తమవంతు కృషి చేయాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి మహిళా వర్సిటీ సావేరీ సెమినార్ హాల్ వేదికగా ‘ఎంపవరింగ్ రూరల్ ఇండియా ఎకనమీ– ద రోల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్’ అనే అంశంపై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్, అమెరికన్ ప్రొగ్రెసీవ్ తెలుగు అసోసియేషన్ యూఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పట్ల ఎన్ఆర్ఐలకు ఉన్న ప్రేమ ఎనలేనిదని, ఎంతో మంది విదేశాల నుంచి వచ్చి మాతృ దేశానికి సేవ చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాలో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడాలన్నారు. అనంతరం మహిళా వర్సిటీ వీసీ డీ.భారతి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. తిరుపతి చాప్టర్ చైర్మన్ డాక్టర్ పార్థసారథి, తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు రాజాబ్రహ్మం, సింగపూర్ తెలుగు సమాజం మాజీ కార్యదర్శి హరీష్ రాయల్, ఎన్బీఆర్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్, లావణ్యకుమార్, వడ్లమూడి గుర్రప్ప, కే.పూర్ణచంద్రరావు, షేక్ మస్తక్, చైతన్యకుమార్రెడ్డి, రాధారాణి అధ్యాపకులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
రేణిగుంట: రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీ పరిధిలోని వివేకానందకాలనీ ఆనుకుని ఉన్న వాగుపోరంబోకు స్థలంలో కొంతకాలంగా నిర్మించుకున్న ఇళ్లను శనివారం తూకివాకం గ్రామానికి చెందిన యువకులు, మహిళలు వచ్చి జేసీబీ సాయంతో కూల్చివేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని తాము దశాబ్దాల తరబడి గ్రామ అవసరాల నిమిత్తం కాపాడుకుంటూ వస్తుంటే వివేకానంద కాలనీకి చెందిన కొందరు వామపక్షాల నాయకులు పేదల పేరుతో అక్రమ కట్టడాలను చేపట్టారని ధ్వజమెత్తారు. అయితే ఈ విషయమై తూకివాకం గ్రామస్తులు తరచూ ఇక్కడకు వచ్చి అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటూ వచ్చారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మూడు నెలలుగా వాగుపోరంబోకు స్థలంలో సుమారు 80 ఇళ్లను నిర్మించారు. అందులో కొందరు పేదలు కూడా ఆశపడి అప్పులు చేసి సిమెంటురాళ్లతో చిన్నపాటి రేకుల ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే తూకివకానికి చెందిన సుమారు 100మంది అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో ఇళ్లను కూల్చివేశారు. అడ్డువచ్చిన వారితో వాగ్వాదానికి దిగారు. తోపులాటలు జరిగాయి. ఈ దాడిలో హమీదా, పురుషోత్తం అనే వారికి గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. విషయం తెలుసుకున్న గాజులమండ్యం ఎస్ఐ సునీల్కుమార్ తమ పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న తూకివాకం సర్పంచ్ మునిశేఖర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని తమ గ్రామానికి చెందిన యువకులు, మహిళలకు సర్దిచెప్పి తీసుకెళ్లారు. -
వేడుకగా శ్రీకోదండరాముని చక్రస్నానం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శనివారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశా యి. ఉదయం శ్రీలక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకీలో కపిలతీర్థానికి వేంచేశారు. అక్కడ శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంచేపట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి స్వామివారు శ్రీగోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పీఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి తీర్థకట్టవీధి, కోటకొమ్మల వీధి మీదుగా శ్రీకోదండ రామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి నిర్వహించిన ధ్వజావ రోహణంతో శ్రీకోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగర త్న, ఏఈవో పార్థసారథి, కంకణభట్టర్ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ సోమశేఖర్ పాల్గొన్నారు. -
ముగ్గురు నిందితుల అరెస్టు
సత్యవేడు: మండలంలోని రంఘనాథపురం తెలుగు గంగ బ్రిడ్జి సమీపంలో జరిగిన దారిదోపిడీ, మల్లవారిపాళెం టౌన్షిప్ కాలనీలో జరిగిన చోరీ కేసులో నిందితులు కుప్పాని వంశీ(21), ఇరుగుళం గ్రామానికి చెందిన సంజయ్(20), విజయపురం మండలం, ఆలపాకం గ్రామానికి చెందిన దేవిప్రియ(19)ను అరెస్టు చేసినట్లు సీఐ దివాకర్రెడ్డి తెలిపారు. శనివారం నిందితులు, చోరీచేసిన రెండు ద్విచక్ర వాహనాలు, స్వాధీనం చేసుకుని, మూడు మొబైల్ఫోన్లు మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా సీఐ కథనం.. నాగలాపురం మండలం, రాజులకండ్రిగ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఫిబ్రవరి 23వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి ఒంటరిగా ద్విచక్ర వాహనంపై శ్రీసిటీకి బయలు దేరాడు. రంగనాథపురం గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి, బైక్పై ఉన్న వ్యక్తిని గాయపరిచారు. ఆపై అతని వద్ద నుంచి రూ.1,500 నగదు, మోబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐలు వీరాంజనేయులు(సత్యవేడు), ప్రతాప్(వరదయ్యపాళెం), పోలీసులు కుప్పారావు, సురేష్, సాయి, మహే ష్, ప్రత్యేక బృందంగా ఏర్పాటై నిందితులను శనివారం ఉదయం సత్యవేడు సమీపంలోని ఉలవచేను వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తాగుడుకు, గంజాయికి బానిసలై కొంత కాలంగా వీరు దారిదోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. -
వాటిని నోటీసు బోర్డులో ఉంచుతాం
సత్యవేడు: అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లను ఎప్పటి కప్పుడు ఆన్లైన్లోనూ, నోటీస్ బోర్డులోనూ ప్రజల పరిశీలనకు ఉంచుతామని సత్యవేడు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేపీ.నరసింహులు (డిప్యూటీ కలెక్టర్, ఏపీఐఐసీ తిరుపతి) తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో మండల నోడల్ అధికారులు, అఖిల పక్షం పార్టీ నాయకులకు నామినేషన్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 18 నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసే సాధారణ కేటగిరి అభ్యర్థి రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటల ముందు అభ్యర్థులు తప్పనిసరిగా వారి పేరిట, ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంక్లో ఖాతా తెరవాలని చెప్పారు. కార్యక్రమంలో చందు, పవన్(వైఎస్సార్సీపీ), ప్రతాప్, మురళీకృష్ణ(బీజేపీ), దిలీప్(టీడీపీ), రమేష్(సీపీఎం), బాలగురవం బాబు(కాంగ్రెస్), తహసీల్దారు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఎస్వీ ఆయుర్వేద కళాశాల వార్షికోత్సవం తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆయుర్వేద కళాశాల వార్షికోత్సవం శుక్రవారం రాత్రి మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఆయుర్వేదానికి సంస్కృతానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో ఆయుర్వేద వైద్యానికి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణుదీక్షిత్ మాట్లాడుతూ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి సహాయ సహకారాలతో కళాశాల దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం కళాశాలలో 6 విభాగాలు ఉన్నాయని 240 పడకల సౌకర్యంతో ఆసుపత్రి నడుస్తున్నదని, రోగులకు సరిపడా మందులు అందిస్తున్నామని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన విధ్యార్థులకు బహుమతులను అందజేశారు. నోడల్ ఆఫీసర్ కె.విజయభాస్కర్రెడ్డి, కె.శ్రీనివాసులు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర కీలకం చిత్తూరు అర్బన్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, రూట్ ఆఫీసర్ల పాత్ర కీలకమని చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గంలోని సెక్టార్, రూట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు, పోలింగ్ రోజు చేపట్టే విధులపై అవగాహన ఉండాలన్నారు. సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను ప్రతిరోజూ పరిశీలించాలన్నారు. అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని కమ్యూనికేషన్ ప్లాన్ను అమలు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. పోలింగ్ రోజున సమర్పించాల్సిన రిపోర్టులపై అవగాహన పెంచుకోవాలన్నారు. పీవో, ఏపీఓల హ్యాండ్ పుస్తకాలను చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనర్ సౌందర్రాజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ పనితీరు, ఆపరేట్ విధానం తదితరాలపై అవగాహన కల్పించారు. ఏఆర్వో, కమిషనర్ జె అరుణ, ఆర్డీవో చిన్నయ్య, పలమనేరు ఆర్డీవో మనోజ్ కుమార్ పాల్గొన్నారు. కాణిపాకంలో భక్తుల రద్దీ కాణిపాకం (చిత్తూరు రూరల్): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సెలవు కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉదయం నుంచే రద్దీ నెలకొంది. క్యూలు నిండాయి. వారికి అధికారులు శీఘ్ర దర్శనం కల్పించారు. రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. -
● సంక్షేమ పథకాలే ..జగనన్న గెలుపునకు సంకేతాలు ● తిరుపతిలో అభినయ్ని ఆశీర్వదించండి ● ఎన్నికల ప్రచారంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం: రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించి మోసగించేందుకు ఏర్పడిన చంద్రబాబు, పవన్కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడిద్దామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని 41, 43 డివిజన్లతో పాటు శెట్టిపల్లి గ్రామంలో శనివారం కార్పొరేటర్లు లడ్డూ భాస్కర్, రాధ, రాజేష్, బత్తినబాబు, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధే అజెండాగా ప్రతిపేదవాడికి మరింతగా సంక్షేమం ఎలా అందించాలన్న తపన జగనన్నదైతే, ప్రజలకు ఏ విధంగా మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలన్న దురాలోచన చంద్రబాబుదన్నారు. ఎన్నిక ల్లో ఒక్కడిగా వచ్చి పోటీచేసే దమ్ములేక పొత్తులు పెట్టుకున్న ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రాష్ట్ర ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారన్నారు. జగనన్న అందించిన సుపరిపాలనతో ప్రతి పేదవాడి జీవితాన్ని మార్చినట్టు వెల్లడించారు. అభినయ్ని ఆశీర్వదించండి చిన్న వయసులో పెద్ద ఆలోచనలు చేసి తిరుపతిని ఎంతో అభివృద్ధి చేసిన భూమన అభిన య్ని నగర ప్రజలంతా ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలంబాలాజీ, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, దుద్దేల బాబు, బొమ్మగుంట రవి, కొండ ముని రెడ్డి, ఎన్వీ సురేష్రాయల్, బెల్లం రమేష్, కంకణాల రమేష్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, శేఖర్రెడ్డి, వరికుంట్ల నారాయణ, దూ దికుమారి, వెంకటరెడ్డి, పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్రాయల్, పెరుగు బాబూయాదవ్, మురళీయాదవ్, పోలిరెడ్డి నాగిరెడ్డి, బాలిశెట్టి కిషోర్, మద్దాలి శేఖర్, బాలమురళీకృష్ణ, రాజు, మునిరామిరెడ్డి, గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. -
కురుగొండ జనసంద్రం
● అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ● వినాయక, నాగార్పమ్మ ఆలయాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు ● బాబు మాటలు నమ్మొద్దని హితవు ఓజిలి: సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఈశాన్య గ్రామమైన కురుగొండ జనసముద్రాన్ని తలపించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 2 వేల మందికి పైగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కిలవేటి సంజీవయ్య, మద్దెల గురుమూర్తి ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రా రంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మానమాల గ్రా మం వద్ద కురుగొండ మాజీ సర్పంచ్ ఆరణి దిలీప్కుమార్రెడ్డి, సేవాదళ్ జిల్లా కార్యదర్శి గెడి శ్రీధర్రెడ్డి 100 బైక్లతో ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. తర్వాత వినాయక, నాగార్పమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, నేత ముమ్మారెడ్డి ప్రభాకర్రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. జగన్నను అద్వితీయంగా గెలిపించుకోవాలి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత, పార్టీ, వర్గాలకు అతీతంగా అర్హతే ప్రామా ణికంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కు తుందన్నారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్లతో సంక్షేమ పథకాలు గడప వద్దకే చేర్చినట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్య ధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, చెంగాలమ్మ ట్రస్ట్బోర్డు చైర్మన్ బాలచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు శ్రీమంత్రెడ్డి, దీపిక, ఎంపీపీలు అరుణారెడ్డి, ఽఅనీల్రెడ్డి, ధనమ్మ, రఘురెడ్డి, శేఖర్రెడ్డి, గోపాల్రెడ్డి, జెడ్పీటీసీలు రవీంద్రరాజు, ప్రీస్కీళ్ల, జ్యోతమ్మ, రమేష్, మండల కన్వీనర్లు పాదర్తి హరనాథ్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరత్నం, కురుగొండ, కుందాం పీఏసీఎస్ అధ్యక్షలు శోభారాణి, రాజారామిరెడ్డి, ఏఎంసీ జనార్దన్రెడ్డి, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి, నాయకులు సర్పంచ్ శ్రీలక్ష్మి, ముమ్మారెడ్డి రవీందర్రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరణి దిలీప్కుమార్రెడ్డి, గెడి శ్రీధర్రెడ్డి, గెడి వేణురెడ్డి, వజ్జా గోపాల్రెడ్డి, శివారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఖాదర్బా షా, మధుసూదన్రెడ్డి, ఉచ్చూరు హరినాథ్రెడ్డి, కాకాణి రవి, బట్టా అనీల్, గోపాల్రెడ్డి, సుబ్బరావుయాదవ్, మహిళ, యూత్ అధ్యక్షరాలు ప్రవీణా, బట్టా ఫృద్వీకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్థి, సంక్షేమమే లక్ష్యం కురుగొండ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలన సా గించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నా లతో ప్రతి పేదవాడికి అండగా నిలిచారన్నారు. మేని ఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. పేదలు, మహిళల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీలో జోష్
తిరుపతి మంగళం: వైఎస్సార్సీపీలో జోష్ నెలకొంది. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతుండడంతో క్యాడర్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. శనివారం తిరుపతి పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో తిరుపతి 19వ డివిజన్కు చెందిన నవీన్కుమార్, దినేష్, రవితేజతో పాటు వందల మంది యువత టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మబ్బు నాదమునిరెడ్డి, పార్టీ యువజన విభాగం నాయకులు అరకాల సోమశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలను మోసగించి వంచించడానికి ఏర్పడిన చంద్రబాబు కూటమిని కూలదోయడానికే వైఎస్సార్సీపీలో చేరినట్టు వారు పేర్కొన్నారు. టౌన్బ్యాంక్ డైరెక్టర్లు బ్రహ్మనందరెడ్డి, మాకం చంద్ర, చిరంజీవి, అనీల్రెడ్డి పాల్గొన్నారు. పాకాలలో పది కుటుంబాలు చేరిక తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ గూటికి చేరుకుంది. శనివారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి సమక్షంలో పాకాల మండలం.. ఇరంగారిపల్లి పంచాయతీకి చెందిన 10 టీడీపీ కుటుంబాలు అధికార పార్టీలో చేరాయి. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ ఎస్సీ నాయకుడు ప్రకాష్, మురుగేష్, గణేష్, చిన్న, పవన్, ధనుష్, కార్తీక్, పూర్ణ ప్రసాద్, జగదీష్, విగ్నేష్ తదితరులు ఉన్నారు. తుడా చైర్మన్, వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారిని సాదరంగా స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ప్రజాసంక్షేమానికి సంకల్పించిన వైసీపీ ప్రభుత్వం, పార్టీ సిద్ధాంతాలు నమ్మి చేరే వారికి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మునీర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శివకుమార్, డివిజన్ అధ్యక్షుడు సురేష్, సర్పంచ్ వసంత, మండల ప్రచార కమిటీ అధ్యక్షులు రాయ లసీమ మోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. బాలాయపల్లిలో టీడీపీ ఖాళీ బాలాయపల్లి(సైదాపురం) : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన పనులకు ఆకర్షితులై టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని, దీంతో బాలాయపల్లి మండలంలో టీడీపీ ఖాళీ అవుతోందని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. బాలాయపల్లి మండలం, పిగిలాం ఎస్టీకాలనీ, వెంగమాంబపురం పంచాయతీలకు చెందిన సుమారు 150 కుటుంబాల వారు శనివారం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంగమాంబపురం, పిగిలాం సర్పంచ్లు బాపనపల్లి వెంకటసుబ్బయ్య, గాలగంధ లక్ష్మి, ఉప సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, అలిమిలి ఎంపీటీసీ కంటిపల్లి మాధవి, గుర్రం రామ్మూర్తి యాదవ్, మల్లెల బాలాజీ, తుపాకుల శ్రీనివాసులు, మావిళ్లపల్లి మస్తాన్, శ్రీహరి, రామకృష్ణనాయుడు, అక్కూర్తి పెంచలయ్య, వెంకటరామయ్య పాల్గొన్నారు. -
పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ
తిరుపతి అర్బన్: మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయపార్టీల నేతల సమక్షంలో తొలి ర్యాండమైజేషన్ను చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఈవీఎం, వీవీప్యాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా పూర్తిచేశామన్నారు. డీఈఓ లాగిన్ నుంచి ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈవీఎంలు, వీవీప్యాట్స్ల మొదటి ర్యాండమైజేషన్ను చేపట్టినట్టు వెల్లడించారు. డీఆర్ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓలు అదితిసింగ్, నిషాంత్ రెడ్డి, చంద్రముని, కిరణ్కుమార్, రామ్మోహన్, నరసింహులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రశేఖర్రెడ్డి, టీడీపీ నుంచి మనోహరాచారి, కాంగ్రెస్ పార్టీ నుంచి రవి, ఆమ్ఆద్మీ పార్టీ ప్రతినిధి హాజరయ్యారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీసీ వద్దకు చేరింది. గురువారం అర్ధరాత్రి వరకు 62,633 మంది స్వామివారిని దర్శించుకోగా, 29,633 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఇంటర్ ఫలితాల్లో సీకాం ప్రతిభ
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సీకాం జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభ చాటారని ఆ కళాశాల చైర్మన్ డాక్టర్ టీ.సురేంద్రనాథరెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో కె.హర్షద్ పర్వేజ్ 974, ఎంపీసీలో ఎస్.ఫాహిమ 966, సీఈసీలో బి.చైతన్యకుమార్ 940, బైపీసీలో ఎస్.ధరణి 928 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే జూనియర్ ఇంటర్ ఎంఈసీలో డీ.తక్షిత్రెడ్డి 467, సీఈసీలో ఎన్.విజయ్కుమార్ 469, ఎంపీసీలో టీ.వర్ష 438 మార్కులు సాధించినట్లు తెలిపారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల జోరు
సూళ్లూరుపేట: వైఎస్సార్సీపీలోకి వలస జోరు కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పలువురు అభిమానులు, నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో శుక్రవారం సూళ్లూరు, నాగరాజుపురం, బొగ్గుల కాలనీకి చెందిన టీడీపీ నాయకులు సుమారు వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డి ఇటీవలే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తరువాత ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ టీడీపీ మహిళా నాయకురాలు కుప్పంపాటి రాజేశ్వరితో పాటు సుమారు 25 మంది మహిళలు, విశ్రాంత ఎంఈఓ పిట్ల సోక్రటీస్, వారితో పాటు సూళ్లూరు యువత చరణ్ ఆధ్వర్యంలో సుమారు 75 మంది పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారన్నారు. వారికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య గెలుపు ఖాయమన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా 175కి 175 సీట్లు సాధించి రెండోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం కూడా ఖరారైపోయిందన్నారు. టీడీపీ నుంచి మరికొంతమంది నాయకులు పార్టీలో చేరే అవకాశం వుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో వేనాటి అనే ఇంటిపేరుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆ గుర్తింపుతోనే ఈ రోజున వంద మంది మంచి నాయకులు పార్టీలో చేరారని అన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరాలయం చైర్మన్ చెన్నారెడ్డి స్వామిరెడ్డి, వాయిలూరు వెంకటేశ్వర్లు, పండ్లూరు రాఘవ, వరాలబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో 80 కుటుంబాలు డక్కిలి: లింగసముద్రం పంచాయతీ, చాకలపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు, సంగనపల్లి పంచాయతీలో మరో 30 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరాయి. వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి సమక్షంలో వారంతా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. చాకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, సంగనపల్లి సర్పంచ్ రాపూరు చిరంజీవి ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పీ.జగన్మోహన్రెడ్డి, జేసీఎస్ మండల ఇన్చార్జ్ సీహెచ్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి పలువురు టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం, చిలకావారికండ్రిగ గ్రామానికి చెందిని పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యేబియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోచేరిన వారిలో మనోహర్, ముని, వెంకటయ్య, బాబు, శ్రీనివాసులు, పురుషోత్తం, వెంకటేష్, తిరుపాల్, కృష్ణయ్య, సుందరరాజు, వెంకటరమణయ్య, వారి అనుచరులు ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నాయకులు వాసుదేవనాయుడు, భాస్కర్, చెంగల్రాయులు, మణినాయుడు, సుబ్బయ్య, గంగాధరం పాల్గొన్నారు. బీజేపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి ఏర్పేడు: మండలంలోని మడిబాక గ్రామానికి చెందిన పలువురు జీజేపీ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. ఇందులో బీజేపీ చెందిన మద్దు సుబ్రమణ్యం యాదవ్, ఆయన అనుచరులు ఉన్నారు. వీరికి శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జ్ గున్నేరి కిషోర్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రమణయ్య యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకులు గంగయ్యయాదవ్, రవియాదవ్, గోపీయాదవ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెద్దమసీద్ మొత్తువల్లి అక్రమ్బాయ్, వసీం వారి అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీకి ఆహ్వానించారు. ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, జనార్దన్రావు పవార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తి మండలం, యలంపాడు, ఆంజనేయపురం గ్రామాలకు చెందిన సుమారు 200మంది టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ ఫిజీషియన్ ● ఇంటివద్దే వైద్య సేవలు ● మందులు, మాత్రలు ఉచితం ● దీర్ఘకాలిక వ్యధిగ్రస్తులకు వరం ● హర్షం వ్యక్తం చేస్తున్న అవ్వాతాతలు
నెలనెలా వైద్య సేవలు విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం వల్ల డాక్టర్లు నేరుగా ఇంటివద్దకే వచ్చి నెలనెలా పరీక్షలు చేస్తున్నారు. మొదటి నెల నుంచి క్రమంతప్పకుండా వైద్య సేవలందిస్తున్నారు. గతంలో నాయుడుపేటలోని ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లేదాన్ని. అక్కడ డబ్బులిచ్చి పరీక్షలు చేయించుకుని, మందులు కొనుక్కోవాల్సి ఉండేది. ప్రతినెలా పరీక్షలకు వెళితే కనీసం రెండు మూడు వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ బాధలేదు. జగనన్న ఆదుకుంటున్నారు. – సిద్ధప్పరెడ్డి కోటమ్మ, గర్భిణి, తాళ్వాయిపాడు గిరిజన కాలనీ మా మామ ప్రాణం నిలబెట్టారు మా మామయ్య మద్దూరు రమణయ్యకు జబ్బు చేసి మూడేళ్లయ్యింది. పక్షవాతంతో మంచంపైనే ఉన్నారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇంటికి వచ్చి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. డాక్టర్ ఇంటికే వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసి సూచనలు సలహాలు అందిస్తున్నారు. సుదూర ప్రాంతమైన పట్టణాలకు మా మామను తీసుకుని వెళ్లలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు పెట్టి మంచి పనిచేశారు. ఇలాంటి వైద్యులు గతంలో ఎప్పుడూ చూడలేదు. – మద్దూరు అనిత, జువ్వలపాళెం, నాయుడుపేట గ్రామంలోనే మంది వైద్యం నాకు వయస్సు పైబడింది. కొంత కాలంగా శ్వాససంబంధిత వ్యాధితో పాటు మోకాళ్లు నొప్పులు, కీళ్ల వ్యాధితో బాధపడుతున్నా. ఆర్థిక స్థోమత లేదు. కూలి పనులు చేయలేను. వృద్ధాప్య పింఛనే ఆధారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్ సెంటర్లు, ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది. వృద్ధాప్య సమస్యల వల్ల అనారోగ్యం కారణాలతో ఆస్పత్రికి కూడా వెళ్లలేని నిస్సహాయస్థితిలో ఉన్న నాకు ఫ్యామిలీ ఫిజీషియన్ ఏర్పాటు చేయడంతో డాక్టర్ నేరుగా ఇంటి వద్దకు చేరుకొని రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సరైన వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టిపెట్టారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. – బండి అంకయ్య, చిల్లకూరు వడ్డిపాళెం, పెళ్లకూరు మండలం -
వేధింపులు తాళలేక రాజీనామా
రేణిగుంట: మండలంలోని గురవరాజుపల్లి, కరకంబాడి పరిధిలోని 20 మంది గ్రామ వలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. మండలంలోని గురవరాజుపల్లి పంచాయతీ పరిధిలో 9మంది, కరకంబాడి–3 సచివాలయ పరిధిలో 11మంది గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేశారు. వారు సచివాలయానికి చేరుకుని రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రూ.10వేలు గౌరవ వేతనం ఇస్తామన్నా నమ్మే అవివేకంలో వలంటీర్లు లేరన్నారు. పోస్టల్ బ్యాలెట్కు 22న ఆఖరు తిరుపతి అర్బన్: ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతోపాటు అత్యవసర సేవలు అందిస్తున్న విభాగాలకు చెందిన వారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్ను వాడుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. నిబంధనల మేరకు 18ఏ ప్రకారం ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారికి 12డీ ఫామ్ను సమర్పించాలని సూచించారు. 300 సెల్ఫోన్ల అప్పగింత చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలువురు పోగొట్టుకున్న సెల్ఫోన్లను ‘చాట్బాట్’ యాప్ ద్వారా పోలీసుశాఖ రికవరీ చేసింది. సుమారు రూ.65 లక్షల విలువైన 300 సెల్ఫోన్లను బాధితులకు అప్పగించింది. శుక్రవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. -
ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఓ.మధుమిత 989, కేపీ.మోక్షిత, టీ.లోహిత్, పీ.గురుపవన్ 987, జీబీ.కీర్తి, ఎం.బిందు 986, సీ.లిఖిత, బీ.సాయిస్వరూప, ఎం.సాయి నవనీత, ఏ.రాఘవి, టీ.అమృతవర్షిని, బీ.సాయికీర్తన, జీ.భార్గవి, షేక్ షమీర్ అహ్మద్, ఎంవీ.కల్పన, బీ.దివ్య 985మార్కులు, బైపీసీ విభాగంలో కే.ప్రియదర్శిని 986, బీ.దివ్య 985, టీ.కల్పన 984, ఎం.హిమవర్ష 983 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు ఎం.కీర్తన, ఎం.మహేశ్వరి, జె.మహేష్, వి.సందీప్లు 466 మార్కులు, పీ.జ్ఞానదీక్షిత, పీ.పవన్కుమార్, టీ.నాగసారిక, ఎండీ.జావీద్ 465, బైపీసీ విభాగంలో 440మార్కులకు ఎన్.హరిత, ఈ.భువనహాసిని, టీ.శారదాదేవి, ఎం.గీతిక 433మార్కులు సాధించారు. వీరిని ఆ విద్యాసంస్థ ఏజీఎం బీవీ.ప్రసాద్, డీన్లు కేఎల్జీ.ప్రసాద్, రామమోహన్రావు, కుమార్, భాస్కర్ అభినందించారు. -
22న ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణం
తిరుపతి(అలిపిరి): వైఎస్ఆర్ కడప జిల్లా, ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 22న శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి శుక్రవారం ఆయ న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పీఏసీలోని సమావేశ భవనంలో ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్షించారు. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు జరిగే శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ 15వ తేదీ లోపు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గణేష్కుమార్, కడప మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో నటేష్బాబు పాల్గొన్నారు. -
No Headline
సదుం : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటమి తథ్యమని, వైఎసా్స్ర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం సదుం మండలంలోని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, తమ హయాంలో ఈప్రాంతం రైతుల కోసం మూడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అనంతరం న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి ఒక్క సంవత్సరంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. కూటమి గెలిస్తే మైనార్టీలకు సమస్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగారని, ఆయనపై పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు చెపితే అమ్మ ఒడి లాంటి ఎన్నో పథకాలు గుర్తుకువస్తాయన్నారు. సీఎం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో అలాంటి పథకం ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. పేదలను సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఘనత జగన్దని, జన్మభూమి కమిటీలతో దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అమలు కాని హామీలతో మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి కూటమి పార్టీల అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సీఎం కిరణ్ దుర్మార్గ ఆలోచనలతో రాష్ట్రం విడిపోయిందన్నారు. ‘కూటమి’కి ఓటమి తథ్యం -
ఇంటి స్థలాలు ఇవ్వడమే నేరమా?
● ఓట్లు కోసం చంద్రబాబులా నీచరాజకీయాలు చేయడం నాకు చేతకాదు ● టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు, జీతాలు పెంచడం తప్పా? ● తిరుపతిలో అభినయ్ని ఓడించడానికి కూటమి ఇన్ని కుట్రలా? ● తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన ఆగ్రహం తిరుపతి మంగళం : పాతికేళ్లుగా టీటీడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే నేరమా..? అంటూ టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. నగరంలోని 26, 27, 50 డివిజన్లలో శుక్రవారం ఆయన మేయర్ డాక్టర్ శిరీష ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓట్లు కోసం చంద్రబాబులా నీచరాజకీయాలు చేయడం తనకు చేతకాదన్నారు. గతంలో తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీ చరిత్రలో నిలిచిపోయేలా భక్తిచానల్, లలితగోవిందం, దళితవాడల్లో శ్రీనివాస కల్యాణాలు వంటి మహోత్తర కార్యక్రమాలను చేశానని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సహకారంతో రెండోసారి టీటీడీ చైర్మన్గా అవకాశం లభించిందన్నారు. టీటీడీలో పనిచేస్తూ గత 25 ఏళ్లుగా ఇంటి స్థలాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేర్చడం నేరమా..? అని ప్రశ్నించారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పోటు కార్మికులకు జీతాలు పెంచడమే తాను చేసిన నేరమా? అని నిలదీశారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు, పెంచిన జీతాలు రానివ్వకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్ని ఓడించడానికి టీటీడీ ఉద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడం సమంజసం కాదన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు, పెంచిన జీతాలను ఆపేయాలని కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యా దు చేయడం బాధాకరమన్నారు. అభినయ్ చేసిన అభివృద్ధితో తిరుపతి నగర ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, కొండ మునిరెడ్డి, కేఎం.సత్య, వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, తలారి రాజేంద్ర, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదం రాధాకృష్ణారెడ్డి, బోకం అనీల్కుమార్, తాజిన్ ఉదయ్ వంశీ, శేఖర్రెడ్డి, దూదికుమారి, సింగిల్విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు కుప్పయ్య, బాబూయాదవ్ పాల్గొన్నారు.