చిల్లకూరు: నెల్లూరు నుంచి తిరుపతికి తరలిస్తున్న బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకుని చిల్లకూరు స్టేషన్కు తరలించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. చెన్నె– కోలకత్తా జాతీయ రహదారి, బూదనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో పలు గోల్డ్ షోరూంలకు చెందిన రూ 6.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వాహనం నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్నట్లు గుర్తించారు. అయితే వాహనంలో ఉన్న షోరూం ప్రతినిధులు బంగారు ఆభరణాలకు చెందిన అన్ని బిల్లులు ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు, ఆభరణాలకు చెందిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జీఎస్టీ అధికారులకు సమచారం ఇచ్చారు. దీంతో అధికారులు స్టేషన్కు వచ్చి వాహనంలో ఉన్న ఆభరణాలను బయటకు తీసి అందుకు సంబంధించిన బిల్లులు పరిశీలిస్తున్నారు. వస్తువులకు, బిల్లుల్లో ఉన్న బరువుకు ఏదైనా తేడా ఉందా..? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఆభరణాలకు చెందిన బిల్లులు ఉన్నప్పటికి వాటిని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment